breaking news
nagireddy peta
-
ప్రేమిస్తావా.. యాసిడ్ పోయాలా!
సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్) : ప్రేమిస్తావా లేక యాసిడ్ పోయాలా అంటూ ఓ యువకుడు నాగిరెడ్డిపేట మండలానికి చెందిన ఓ మైనర్ బాలికను నిత్యం వేధించడంతో పాటు బుధవారం రాత్రి ఇంట్లోకి దూరి బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు. ఆ యువకుడిపై స్థానిక పోలీసులు గురువారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నాగిరెడ్డిపేట ఎస్సై మోహన్ కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికను జలాల్పూర్ గ్రామానికి చెందిన ఎర్ర రవి అనే యువకుడు తనను ప్రేమించాలని నిత్యం వేధిస్తున్నాడు. తనను ప్రేమించకపోతే ముఖంపై యాసిడ్ పోస్తానని బెదిరించేవాడు. ఈ క్రమంలో బాలిక ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న రవి బుధవారం రాత్రి గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి సదరు బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న ఇతర కుటుంబసభ్యులతోపాటు గ్రామస్తులు వచ్చి రవిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక ఫిర్యాదు మేరకు రవిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా బాలిక ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. రవి ఇదివరకే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. -
ఊరు ఖాళీ!
నాగిరెడ్డిపేట: కరువు ప్రభావంతో చెరువులు, పంట పొలాలే కాదు.. ఊళ్లు కూడా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వర్షాభావం, అడుగంటిన భూ గర్భ జలాలు, ఎండిన ప్రాజెక్టులు.. వెరసి సాగునే నమ్ముకున్న పల్లెలు వలస పోతున్నాయి. పని కోసం పట్నానికి తరలి వెళ్తున్నాయి. రెండేళ్లుగా వానల్లేక రైతు బతుకు బరువైంది. ఇన్నేళ్లు ఆధారంగా ఉన్న సాగు భారమైంది. ఉపాధి ‘కరువైం ది’. దీంతో పని కోసం వలస పోవడం తప్పనిసరైంది. మూట ముల్లె సర్దుకొని భార్య, పిల్లలతో పట్నం బాట పట్టారు నాగిరెడ్డిపేట గ్రామస్తు లు. తీవ్ర కరువు నేపథ్యంలో ఊరు దాదాపు ఖా ళీ అయింది. ఏ వీధికెళ్లినా కొన్నిళ్లకు తాళాలు కనిపిస్తుంటే, వృద్ధులు కాపలాగా ఉన్న ఇళ్లు కొ న్ని దర్శనిస్తున్నాయి. నాగిరెడ్డిపేట గ్రామంలో సుమారు 1,100 కుటుంబాలుండగా, సగం కుటుంబాలు వలస వెళ్లాయి. కాలువ, చెరువుల కింద వ్యవసాయ భూములున్నప్పటికీ కరువు కారణంగా చెరువులు, కుంటల్లోకి నీరు రాలేదు. వేసిన పంటలు ఎండిపోయాయి. పంటల సాగుకు వెచ్చించిన పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తప్పనిసరై పొట్టచేత బట్టుకొని హైద్రాబాద్, ఆర్మూర్ ప్రాంతాలకు వలస వెళ్లారు. కొంతమంది ఇళ్లకు తాళాలు వేసి వలస వెళ్లగా.. మరికొందరు వృద్ధాప్యంలో ఉన్న తల్ల్లిదండ్రులను ఇంటికి కాపలాగా ఉంచి వెళ్లారు. చిన్నపిల్లలను, వృద్ధులను ఇంటి వద్దనే ఉంచి భార్య, భర్త మాత్రమే వెళ్లిన వారున్నారు. అయితే, హైదరాబాద్లో వలసవాదుల తాకిడి ఎక్కువ కావడం, సరైన పని దొరకక పోవడంతో కొంత మంది తిరిగి వస్తున్నారు. వారంలో 3-4 రోజులకు మించి పని దోరకడం లేదని, దొరికిన పనితో వచ్చిన రుక్కం పట్నంలో ఖర్చులకు సరిపోక తిరిగి వచ్చేశామని వలస వెళ్లొచ్చిన వారు చెబుతున్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇల్లు నాగిరెడ్డిపేటకు చెందిన మ్యాకల సాయిలుది. ఆయన కుటుంబం రెండేళ్ల క్రితం వలస వెళ్లడంతో ఊడ్చేవారు సైతం లేక ఇల్లు, వాకిలి చిన్నబోయింది. సాయిలుకు ఉన్న కొద్దిపాటి భూమి కరువు కారణంగా రెండేళ్లుగా పడావుగా మారింది. తప్పనిసరి పరిస్థితుల్లో సుమారు ఇల్లు, జాగా వదిలి భార్య, కొడుకు, కూతురుతో కలిసి హైదరాబాద్కు వలస వెళ్లాడు. కుటుంబ సభ్యులందరూ అక్కడే పని చేసుకుంటూ బతుకుతున్నారు. పండగలకు ఇంటికి వచ్చి వెళ్తున్నారు. ఈ వృద్ధురాలి పేరు ఎరుపుల అనసూయ. గ్రామం నాగిరెడ్డిపేట. ఈమెకు కొడుకు గోపాల్, కోడలు మమత, కూతురు నిర్మల ఉన్నారు. వీరికి కొద్దిపాటి భూమి కూడా ఉంది. కానీ రెండేళ్లుగా వర్షాలు కురవక సాగు చేయలేదు. దీంతో అనసూయ కొడుకు, కోడలు, కూతురు ఆర్నెళ్ల కిత్రం హైదరాబాద్కు వలస వెళ్లారు. అక్కడి ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇంటి వద్ద ఉన్న అనసూయకు వితంతు పింఛన్ రావడం లేదు. వలస వెళ్లిన కొడుకు, కోడలు, కూతురు అప్పుడప్పుడూ పంపుతున్న డబ్బులతోనే నెట్టుకొస్తుంది. పని దొరకక వచ్చేశాం.. కుటుంబ సభ్యులంద రం కలిసి సుమారు మూడేళ్ల క్రితం షాపూర్కు వలస వెళ్లాం. కొ న్నిరోజులుగా హైద్రాబాద్కు చాలా మంది బతకడానికి రావడంతో మాకు పని దొరకడం కష్టమయింది. వారంలో మూడు రోజులే పని దొరుకుతుంది. దీంతో చేసేదేమి లేక ఇంటికి వచ్చేశాం. ఇక్కడే ఏదో ఒక పని చేసుకొని బతుకుదామనుకుంటున్నాం. - రుక్కవ్వ, నాగిరెడ్డిపేట మస్తు తిప్పలైతుంది ఊర్లే సరైన పనిలేక, పంటలు పండక మేమందరం ఏడాది కింద పట్నంకు వలస పోయినం. అక్కడ వారానికి 4 రోజులకు మించి పని దొరకడం లేదు. మేస్త్రీ చేతి కింద పనికి వెళితే రోజుకు రూ.200-250ఇస్తున్నారు. పట్నంలో బతకడానికి ఆ డబ్బులు సరిపోక ఇంటికి చేరుకున్నాం. - చంద్రకళ, నాగిరెడ్డిపేట అయ్య, అవ్వలను సూడనికొచ్చిన... కాలం కాకపోవడంతో పాటు ఊర్లే పని దొరకక తప్పనిసరై పట్నం పోయినం. ఇంటికాడ అయ్య, అవ్వను కాపాలాగా ఉంచి నా భార్య, పిల్లలతో రెండేళ్ల కింద హైద్రాబాద్ వెళ్లా. నెలకోమారు ఇంటి కి వచ్చి మా అయ్య, అవ్వను సూశిపోతున్నా. పట్నంల ఎంత పనిచేసినా పైస మిగుల్తలేదు. కానీ పని కోసం తప్పనిసరై పట్నం బాట వట్టినం. - తెనుగు రమేశ్, నాగిరెడ్డిపేట -
జోరుగా నకిలీ నోట్ల చలామణి
నాగిరెడ్డిపేట,న్యూస్లైన్ : నాగిరెడ్డిపేట మండలక ేంద్రంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో కొన్ని రోజులుగా రూ 500, రూ 1000 నకిలీనోట్లు జోరుగా చలామణి అవుతున్నాయి. రైతులు, అమాయకులను టార్గెట్ చేసుకొని దుండగులు దొంగనోట్లను చలామణి చేస్తున్నారు. ఇటీవల రైతులు పండించిన ధాన్యం చేతికి రావడంతో వారు వ్యాపారులకు విక్రయించారు. కాగా ధాన్యం విక్రయించగా వచ్చిన డబ్బులలో కోన్ని నకిలీనోట్లు రైతుల చేతికి వస్తున్నాయి. కాగా నకిలీనోట్లను గుర్తించని రైతులు సాధారణంగా వివిధ వస్తువుల కొనుగోలు కిరాణా దుకాణాలకు, ఇతర షాపులకు వెళ్తున్నారు. దుకాణాల్లోని వ్యాపారులు రైతులు, అమాయకులు తెచ్చిన నోట్లను పూర్తిస్థాయిలో పరిక్షించాకే వాటిని తీసుకుంటున్నారు. నోట్లపై ఏమాత్రం అనుమానం కలిగినా వాటిని దుకాణదారులు తిరస్కరిస్తున్నారు. దీంతో తెలియక నకిలీనోట్లు వచ్చినవారు నోరెల్ల బెడుతున్నారు. పోలీసులకు తెలిస్తే ఏం జరుగుతుందోనని కొందరు బయపడి గుట్టుచప్పుడు కాకుండా వాటిని కాల్చివేయడం లేదా చింపేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. కాగా ఇటీవల పక్కనే ఉన్న లింగంపేట మండలంలో పెద్దమొత్తంలో నకిలీనోట్లను చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేశారు. దీంతో మండలంలోనూ నకిలీనోట్లు కొంతకాలంగా జోరుగా చలామణి అవుతున్నాయి. నోటులోని ఆకుపచ్చ, తెలుపురంగులో ఉండే త్రెడ్పై ఉండే ఆర్బీఐ అనే అక్షరాలలోని తేడాను బట్టి నకిలీ, ఒరిజినల్ నోట్లను గుర్తిస్తున్నారు. ఏదిఏమైనా అమాయకులను, రైతులను టార్గెట్ చేసుకొని నకిలీనోట్లను చలామణి చేస్తున్నవారి ఆట కట్టించాలని వారు పోలీసులను కొరుతున్నారు.