-
మూడు వెబ్ సిరీస్లకు శ్రీకారం
‘ఎన్కౌంటర్, శ్రీరాములయ్య, జయం మనదేరా, ఆయుధం, భద్రాచలం, జై బోలో తెలంగాణ’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు ఎన్ . శంకర్ చారిత్రాత్మక కథాంశాలతో మూడు వెబ్ సిరీస్లు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్ . శంకర్ టీవీ అండ్ ఫిల్మ్ స్టూడియో బ్యానర్లో ఆయన నిర్మాతగా, దర్శకత్వ పర్యవేక్షణలో ఈ వెబ్ సిరీస్లు రూ΄÷ందనున్నాయి. ఈ సందర్భంగా ఎన్ . శంకర్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ సాయిధ ΄ోరాటం నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు మొదటి వెబ్ సిరీస్ నిర్మించనున్నాను. అక్టోబర్లో చిత్రీకరణ మొదలవుతుంది. అలాగే మహాత్మ జ్యోతీరావు ఫూలేగారి స్ఫూర్తితో రెండో వెబ్ సిరీస్ నిర్మిస్తాను. అయితే ఇది ఆయన బయోగ్రఫీ కాదు. జ్యోతీరావు ఫూలేగారి అనుభవాలు, ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, సంఘర్షణలు వంటివి ఈ వెబ్ సిరీస్లో ఉంటాయి. అదే విధంగా బాబా సాహెబ్ అంబేద్కర్గారిపై మూడో వెబ్ సిరీస్ ఉంటుంది. అయితే ఇది ఆయన బయోగ్రఫీ కాదు. అంబేద్కర్గారు ఇచ్చిన గొప్ప రాజ్యాంగ స్ఫూర్తిని, వ్యక్తి నుండి వ్యవస్థగా మారడానికి మధ్య జరిగిన సంఘర్షణల ఇతివృత్తంగా ఈ సిరీస్ సాగుతుంది. ఈ మూడు వెబ్ సిరీస్లను తెలుగు, హిందీ భాషల్లో నిర్మిస్తాం. పూర్తి వివరాలు త్వరలో చెబుతాను’’ అన్నారు. -
టాలీవుడ్ దర్శకుడికి భూ కేటాయింపు.. సమర్థించిన హైకోర్టు
ప్రముఖ సినీ దర్శకుడు ఎన్.శంకర్కు ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిల్ల గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయించడాన్ని హైకోర్టు సమర్థించింది. సినిమా, టీవీ స్టుడియో నిర్మాణంతో పలువురికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది. స్టూడియో నిర్మాణం కోసం శంకర్ వినతిపత్రం అందజేసిన తర్వాతే రాష్ట్ర కేబినెట్ భూ కేటాయింపుపై నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది. ప్రభుత్వం నేరుగా భూమి కేటాయించిందన్న పిటిషనర్ వాదనను తప్పుబట్టింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 75 సబబేనని తీర్పు వెలువరించింది. (ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) భూ కేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయని.. ఈ క్రమంలోనే సినీ రంగానికి, క్రీడాకారులకు కేటాయిస్తుందని చెప్పింది. గతంలోనూ పలువురు ప్రముఖులకు భూములు కేటాయించిన సందర్భాలు ఉన్నాయని వెల్లడించింది. సుప్రీంకోర్టు కూడా సినీ, క్రీడా.. తదితర రంగాల ప్రముఖులకు ఆయా రంగాల అభివృద్ధి కోసం భూమి కేటాయించడాన్ని సమర్థించినట్లు గుర్తుచేసింది. మోకిల్ల గ్రామం సర్వే నంబర్ 8లో ఎకరం రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలను ప్రభుత్వం శంకర్కు కేటాయిస్తూ 2019లో జీవో నంబర్ 75 జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ కరీంనగర్కు చెందిన జె.శంకర్ 2020లో హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ పూర్తి కావడంతో బుధవారం తీర్పును రిజర్వు చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మా సనం శుక్రవారం తుది ఉత్తర్వులు వెలువరించింది. సినీ పరిశ్రమను ప్రోత్సహించే సదుద్దేశంతోనే స్టూ డియో నిర్మాణం కోసం శంకర్కు ప్రభుత్వం భూమి కేటాయించింది. ఇతర ఏ పనులకు వినియోగించ కూడదన్న నిబంధన కూడా విధించింది. బలహీన వర్గానికి చెందిన శంకర్ 40 ఏళ్లుగా సినీ పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయనకు భూమి కేటాయించే నాటికి అక్కడ ఎకరం మార్కెట్ విలువ రూ.20 లక్షలు మాత్రమే ఉంది. స్టూడియో నిర్మాణంతో పలువురు కళాకారులను సినీ రంగానికి అందించిన వారమవుతాం. చట్ట ప్రకారమే అన్ని నిబంధనలను పాటిస్తూ భూ కేటాయింపు జరిగిందని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. స్టుడియో నిర్మాణానికి భూమి కేటాయించడాన్ని సమర్థించింది. (ఇది చదవండి: సరిగ్గా 127 ఏళ్ల క్రితం.. భారత్లో అడుగు పెట్టిన 'సినిమా') -
సన్మార్ గ్రూపు చైర్మన్ శంకర్ అస్తమయం
చెన్నై: సన్మార్ గ్రూపు చైర్మన్ ఎన్.శంకర్ (77) అనారోగ్య కారణాలతో ఆదివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శంకర్ సోదరుడు ఎన్.కుమార్ కంపెనీకి వైస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. శంకర్ కుమారుడు విజయ్ శంకర్ డిప్యూటీ చైర్మన్గా పనిచేస్తున్నారు. అసోచామ్ ప్రెసిడెంట్, ఇండో–యూఎస్ జాయింట్ బిజినెస్ కౌన్సిల్, మద్రాస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇలా ఎన్నో సంఘాల్లో శంకర్ పనిచేశారు. ఎన్నో సామాజిక, సేవా కార్యక్రమాలకు ఆయన మద్దతుగా నిలిచారు. శంకర్ మృతి పట్ల ప్రముఖ పారిశ్రామికవేత్తలు సంతాపం తెలియజేశారు. ఆధునిక యాజమాన్య విధానాలను చాలా ముందుగా అందిపుచ్చుకున్న వ్యక్తి శంకర్ అని టీవీఎస్ గ్రూపు గౌరవ చైర్మన్ వేణు శ్రీనివాసన్ చెప్పారు. సన్మార్ గ్రూపు ఇండస్ట్రియల్ కెమికల్స్లో ప్రముఖ కంపెనీగా ఎదిగింది. భారత్ సహా అమెరికా, మెక్సికో, ఈజిప్ట్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
లాక్డౌన్లో అందరూ అలా ఫీలయ్యారు: దర్శకుడు ఎన్. శంకర్
శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, రవిప్రకాశ్, రవిబాబు, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ రెడ్డి ఎర్రా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హౌస్ అరెస్ట్’. కె. నిరంజన్రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ – ‘‘కరోనా కారణంగా విధించబడిన లాక్డౌన్స్తో ప్రజలందరూ చెప్పలేని హౌస్ అరెస్ట్ను ఫీలయ్యారు. కరోనా టైమ్లో స్క్రిప్ట్ను ఓకే చేయించుకుని శేఖర్ సినిమాను పూర్తి చేయడం విశేషం’’ అన్నారు. (చదవండి: మహేశ్ బాబు బ్యాక్ టూ హైదరాబాద్) ‘‘పిల్లలతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసి హిట్ చేయాలి’’ అన్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ‘‘చిన్న పిల్లలతో చేసిన హిలేరియస్ ఎంటర్టైనరే ఈ చిత్రం’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. ‘‘పిల్లలంటే దేవుళ్లతో సమానం. వారికోసమైనా ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అన్నారు సప్తగిరి. ‘‘ఈ జనరేషన్లో పిల్లలు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారు? ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారనే విషయాన్నే ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు శేఖర్. ఈ కార్యక్రమంలో కౌశిక్, సోహైల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ శంకర్ విడుదల చేసిన ‘తెరవెనుక’ ఫోస్టర్
హైదరాబాద్: ప్రముఖ స్టార్ హీరోయిన్ టాలీవుడ్లో రకుల్ ప్రీత్ సింగ్ అగ్రస్థానంలో కొనసాగుతున్న విజయం తెలిసిందే. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా ‘తెరవెనుక’ అనే చిత్రం రూపొందుతుంది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ దర్శకుడు ఎన్. శంకర్ గురువారం విడుదల చేశారు. ఈ చిత్రానికి మురళీ జగన్నాథ్ మచ్చ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ప్రవీణ్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం పై ఎన్. శంకర్ మాట్లాడుతూ ప్రవీణ్ చంద్ర టాలెంట్ ఉన్న దర్శకుడని, విభిన్న కాన్సెప్ట్తో రాబోతున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తెరవెనుక సినిమాకు పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఎన్. శంకర్ ధన్యవాదాలు తెలిపారు. తెరవెనుక చిత్రంలో అమన్తో పాటు విశాఖ ధిమాన్, దీపిక రెడ్డి తదితరులు నటిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
త్వరగా నిద్రలేవమన్నందుకు చెరువులో దూకి ఆత్మహత్య
జిల్లా ఉండన్నా? పోవన్నా..?
రేపు బాన్సువాడకు రాజ్నాథ్సింగ్ రాక
దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్సే
సకాలంలో పనులు పూర్తి చేయాలి
నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
తప్పనిసరిగా ఓటు వేయాలి
11న ప్రియాంకా గాంధీ సభ
పరిస్థితి విషమించి యువకుడు..
అవినీతి ‘కాలువ’
తప్పక చదవండి
Advertisement