Munger district
-
Bihar: మళ్లీ పోలీసులపై దాడి
బీహార్: బీహార్లో పోలీసులపై దాడులు ఆగడం లేదు. ముంగేర్ జిల్లాలో ఏఎస్ఐ సంతోష్ కుమార్ సింగ్ హత్యోదంతం మరువకముందే డయల్ 112 విభాగంలో పనిచేస్తున్న మరో పోలీసు కానిస్టేబుల్పై దాడి జరిగింది. ఈ ఘటనలో మరో కానిస్టేబుల్ గాయపడ్డారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం హవేలీ ఖడంగ్ర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫసియాబాద్లో ఆదివారం రాత్రి దొంగతనం ఆరోపణతో ఇద్దరు యువకులను స్థానికులు పట్టుకుని పంచాయతీ భవనంలో బంధించి, ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకుని, ఆ యువకులను తమతో పాటు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే గ్రామీణులు పోలీసులను అడ్డుకుంటూ, వాగ్వాదానికి దిగారు. ఈ నేపధ్యంలో పోలీసులపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో బబ్లూ రజక్ అనే పోలీసు గాయపడ్డారు. పరిస్థితి కాస్త సద్దుమణిగాక పోలీసులు ఆ ఇద్దరు యువకులను తమతోపాటు పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్లారు. పోలీసులపై రాళ్లు రువ్విన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రాజధానిలో మహిళల రక్షణకు యాంటీ ఈవ్ టీజింగ్ స్క్వాడ్ -
ప్రసాదం తిని 170 మందికి అస్వస్థత
పాట్నా: దైవ ప్రసాదం తిని 170 మంది అస్వస్థతకు గురైన ఘటన బిహార్ రాష్ట్రం ముంగర్ జిల్లా కోత్వన్ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహేశ్ కోడా అనే వ్యక్తి సోమవారం సాయంత్రం సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు. ఈ వ్రతానికి దాదాపు 250 మందిని ఆహ్వానించాడు. పూజాది కార్యక్రమాల అనంతరం అతిధులకు స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ప్రసాదం తిన్న గ్రామస్తుల్లో చాలా మంది కడుపునొప్పి, తలతిరగడం, వాంతులు వంటి లక్షణాలతో బాధపడ్డారు. ఒక్కసారిగా ఇంత మందిలో లక్షణాలు బయటపడటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇద్దరు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, మూడు అంబులెన్స్లను ఆ గ్రామానికి పంపింది. ప్రాధమిక చికిత్స అనంతరం బాధితుల్లో చాలా మంది కోలుకున్నట్లు జిల్లా కలెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. మరో 80 మందికి చికిత్స కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు. అయితే, ఎవరూ ప్రాణాపాయ స్థితిలో లేరని ప్రకటించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రసాదమే అనారోగ్యానికి కారణంగా పేర్కొన్న అధికారులు ప్రసాదం శాంపిల్స్ను పరీక్ష నిమిత్తం లేబోరేటరీకి పంపారు. -
గంగనదిలో పడవ మునక: నలుగురు గల్లంతు
ముంగేర్ జిల్లాలో ఈ రోజు ఉదయం గంగానదిలో బోటు బోల్తా పడిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారని జిల్లా ఉన్నతాధికారి ఆదివారం వెల్లడించారు. సీతాచరణ్ నది ప్రాంతం నుంచి 24 మంది ప్రయాణీకులతో వస్తున్న బోటు బాబువా ఘాట్ వద్ద అదుపు తప్పి బోల్తా పడిందని చెప్పారు. అయితే గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. అందుకోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపినట్లు చెప్పారు. గల్లంతైన వారిలో ఏడాది వయస్సు గల చిన్నారి కాకుండా మరో నలుగురు ఉన్నారని ఉన్నతాధికారి వెల్లడించారు. వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని చెప్పారు. అయితే ఆ మహిళలు పడవ మునిగిపోతుందన్న భయంతో నదిలో దూకారని తోటి ప్రయాణీకులు తెలిపారని ఉన్నతాధికారి వివరించారు.