-
క్లీన్లీనెస్పై బీజేపీకే చిత్తశుద్ధి లేదు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ్భారత్పై బీజేపీ నాయకులకే చిత్తశుద్ధిలేదని, అందుకే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోవడం లేదని డీపీసీసీ అధికార ప్రతినిధి ముఖేష్ శర్మ ఆరోపించారు. క్లీన్లీనెస్ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించాల్సిన బీజేపీ నాయకులు ఫొటోల కోసం ఫోజులు ఇస్తూ కాలం గడుపుతున్నారని అన్నారు. ఇటీవల కొన్ని కార్యక్రమాల్లో ఫొటోల కోసం నాయకులు పోటీలు పడిన దృశ్యాలు కన్పించాయని అన్నారు. బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ ఇటీవల ఇస్లామిక్ సెంటర్ వద్ద ముందుగా వ్యర్థాలను వెదజల్లి మీడియా వచ్చిన తర్వాత శుభ్రం చేస్తున్నట్లు ఫొటోలకు ఫోజులు ఇచ్చారని ఎద్దేవ చేశారు. సీనియర్ నాయకుడే ఇలా చేస్తే, ఈ కార్యక్రమాన్ని కిందిస్థాయి కార్యకర్తలు ఎట్లా విజయవంతం చేస్తారని ప్రశ్నించారు. పార్కులు పచ్చదనాన్ని కోల్పోతే ఆ బాధ్యత బీజేపీదేనని అన్నారు. క్లీన్నెస్ క్యాంపెయిన్ను ఆజామాషిగా నిర్వహించరాదని, నిత్యం ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అన్నారు. -
ఎన్నికలకు బీజేపీ భయపడుతోంది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికల తేదీలను ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ బీజే పీ తీరుపై విరుచుకుపడింది అయితే ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. మేము అన్నివిధాలా సిద్ధమే ‘ఉప ఎన్నికల ప్రకటనతో శాసనసభ రద్దుకు బీజేపీ జంకుతోందనే విషయం స్పష్టమైంది. శాసనసభ ఎన్నికల విషయంలో ఆ పార్టీ పలాయనం చిత్తగించింది. మేము ఉప ఎన్నికలకు అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నాం. మోడీ వేవ్ అంటూ ఒకవైపు బలంగా వాదిస్తూనే మరోవైపు ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు బీజేపీ జంకడం నాకు బాగా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉప ఎన్నికల ప్రకటనతో శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీజేపీ సుముఖంగా లేదని తేలిపోయింది. శాసనసభను తక్షణమే రద్దు చేయాలి. ప్రజాస్వామ్యానికి భిన్నంగా ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తే సహించబోం. ఢిల్లీ శాసనసభకు తక్షణమే ఎన్నికలు జరపాల్సిందే. రాజకీయ అనిశ్చితి తొలగిపోవడానికి ఇంతకుమించి మరో మార్గమే లేదు’ అని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ పేర్కొన్నారు. -
ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధమే
న్యూఢిల్లీ: ఓవైపు దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు జోరుగా వీస్తుంటే మరోవైపు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఢిల్లీ సెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. నరేంద్రమోడీ హవాతోనే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందని ఆ పార్టీ నేతలు చెప్పుకోవడంపై ఢిల్లీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ స్పందించారు. ‘మోడీ హవా మాట నిజమే అయితే ఢిల్లీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించండి. రాజధానిలో మోడీ మంత్రం పనిచేయదని బీజేపీ నేతలు భయపడుతున్నారు. అందుకే శాసనసభను రద్దు చేయకుండా కాలాయాపన చేస్తున్నారు. మోడీపై ఆ పార్టీ నేతలకు అంత నమ్మకమే ఉంటే ఢిల్లీలో ఎందుకు ఎన్నికలు నిర్వహించరు? మేం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం. దేశంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే రాజధాని ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నంగా ఉన్నాయి. వాటిని ఎత్తిచూపడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందే ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో మేం తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాం. ఎన్నికలకే వెళ్లాలనుకుంటున్నాం. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నికలకే సిద్ధమవుతున్నారు. అన్ని పార్టీలు ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నా ఎల్జీ మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానిస్తున్నారు. తాజా పరిస్థితిని అంచనా వేశాక కూడా ఎల్జీ అదే అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపారు. ఒకవేళ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినా మరో ఐదారుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరముంటుంది. పూర్తి మెజార్టీ లేని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఎలా ఆహ్వానిస్తార’ని ప్రశ్నించారు. -
దమ్ముంటే అసెంబ్లీ రద్దు కోరండి
న్యూఢిల్లీ: మోడీ గాలిపై అంత నమ్మకం ఉంటే ఢిల్లీ శాసనసభను రద్దు చేయించాల్సిందిగా కోరాలని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) డిమాండ్ చేసింది. ఢిల్లీ విశ్వవిద్యాయం విద్యార్థి సంఘానికి (డూసూ) జరిగిన ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) గెలుపొందిన నేపథ్యంలో పైవిధంగా స్పందించింది. ఈ విషయమై డీపీసీసీ ప్రధాన అధికార ప్రతినిధి ముఖేశ్ శర్మ శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మోడీ వేవ్పై అంత నమ్మకం ఉంటే తక్షణమే ఢిల్లీ విధానసభను రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. డూసూ ఎన్నికల్లో ఏబీవీపీ విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎట్టి పరిస్థితుల్లో వర్తింపజేయకూడదని అన్నారు. ఎన్ఎస్యూఐ ఓడిపోయినంత మాత్రాన బీజేపీ సంబరపడిపోనవసరం లేదన్నారు. ఎన్ని కల్లో గెలుపు, ఓటములు అత్యంత సహజమ న్నారు. అయినప్పటికీ ఎన్నో ఏళ్ల విరామం తర్వా తనే ఏబీవీపీ గెలిచిందని ఆయన పేర్కొ న్నారు. ఎఫ్వైయూపీపై విద్యార్థులకు తప్పుడు సమాచారం ఇచ్చిన కారణంగానే ఏబీవీపీ ఈ ఎన్నికల్లో విజ యం సాధించగలిగిందన్నారు. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలే దు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజులపాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్లోక్పాల్ బిల్లును సభ లోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
చార్జీలకు వ్యతిరేకంగా రైల్రోకో
న్యూఢిల్లీ: పెంచిన రైలు చార్జీలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డీపీసీసీ) ఆధ్వర్యంలో మంగళవారం రైల్ రోకో నిర్వహించారు. డీపీసీసీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు నైరుతి ఢిల్లీలోని పాలం రైల్వే స్టేషన్లో కొద్దిసేపు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. పెంచిన రైలు చార్జీలను వెంటనే ఉపసంహరించాలని ఢిల్లీ కాంగ్రెస్ ప్రతినిధి ముఖేశ్ శర్మ డిమాండ్ చేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు రైల్వే మంత్రి సదానంద గౌడ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పెరిగిన రైల్వే చార్జీలు బుధవారం నుంచి అమలులోకి రానున్నాయి.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రజినీకాంత్ టీజర్పై అలాంటి పోస్ట్.. వివాదంలో డైరెక్టర్!
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement