breaking news
monthly fee
-
28 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వెనక మతలబు ఇదే!
సాక్షి,ముంబై: సాధారణంగా ఏ మొబైల్ ఫోన్ రీచార్జ్ చేసుకోవాలన్నా 28రోజుల వాలిడిటీ ఉంటుంది గమనించారా? నెలలో 30, 31 రోజులుంటే టెలికాం కంపెనీలు లెక్క మాత్రం 28 రోజులే. అలాగే 56 లేదా 84 రోజులు మాత్రమే ఎందుకు? ఉంటాయి. దీనికి వెనుక బిజినెస్ ప్లాన్గురించి ఒకసారి ఆలోచిస్తే.. కస్టమర్లు సంవత్సరానికి 12 నెలలకు 12 సార్లకు బదులుగా 13 సార్లు రీఛార్జ్ చేసు కోవాలనేది ఎపుడైనా గుర్తించారా? అదే కంపెనీ దోపిడీ మంత్ర. ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఇలా ఆయా కంపెనీల ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్లో అనేక రకాల ప్లాన్లను అందిస్తాయి. ఈ రకమైన ప్లాన్ కారణంగా వినియోగదారులు సంవత్సరానికి 12 రీఛార్జ్లకు బదులుగా 13 రీఛార్జ్లు చేయాల్సి ఉంటుంది. 28 రోజుల ప్లాన్ కారణంగా 30 రోజులు ఉన్న నెలలో 2 రోజులు మిగిలిపోతాయి. నెలలో 31 రోజులు ఉంటే 3 రోజులు మిగిలి పోతాయి. (పీకల్లోతు మునిగిన వొడాఫోన్ ఐడియా: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్) ఫిబ్రవరి నెల 28/29 రోజులు మాత్రమే ఆ సంవత్సరం మరికొన్ని రోజులు అదనంగా మిగులుతాయి. దీని కారణంగా మీరు అదనపు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కంపెనీలు ప్రతి సంవత్సరం గరిష్టంగా ఒక నెల రీఛార్జ్ ప్రయోజనాన్ని కంపెనీలు దండుకుంటున్నాయి. అయితే ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం 30 రోజుల ప్లాన్ ఇప్పటికీ అందిస్తోంది. (డ్రోన్ కెమెరా ఆర్డర్ చేస్తే...ప్యాకేజీ చూసి కస్టమర్ షాక్!) ట్రాయ్ కీలక ఆదేశాలు వినియోగదారుల ఫిర్యాదుమేరకు 28 రోజుల ప్రణాళికను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తప్పుబట్టింది. 28 రోజులకు బదులు 30 రోజుల ప్లాన్ ఇవ్వాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ మార్గదర్శకం జారీ చేసింది.దీని ప్రకారం నెల చెల్లుబాటయ్యేలా జియో రూ. 259 ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. అలాగే ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాకూడా మొత్తంగా కాకగాపోయినా కొన్ని ప్లాన్లను లాచ్ చేసింది. -
మీ ఇంటి భద్రత మాదే..
• కెమెరాల వ్యయం మేమే భరిస్తాం • ప్రతి నెల రుసుము చెల్లిస్తే చాలు • జైకామ్ ఎండీ ప్రమోద్ రావ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇల్లు, అపార్ట్మెంట్, ఆఫీస్, స్కూల్.. ప్రదేశమేదైనా ప్రతి నెలా నిర్దేశిత ఫీజు చెల్లిస్తే చాలు. 24 గంటలూ నిఘా సేవలు అందిస్తామంటోంది జైకామ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ సిస్టమ్స్. కస్టమర్లు ఎటువంటి పెట్టుబడి పెట్టక్కర లేదని ఈ కంపెనీ చెబుతోంది. కెమెరాల నిర్వహణ బాధ్యత కూడా తమదేనని కంపెనీ ఎండీ ప్రమోద్ రావ్ తెలియజేశారు. ‘మేక్ యువర్ సిటీ సేఫ్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా గురువారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘వ్యయంతో కూడుకున్న అంశం కాబట్టి కెమెరాల ఏర్పాటుకు చాలా మంది ఆసక్తి కనబరచటం లేదు. ఇటువంటి వారికి జైకామ్ అత్యుత్తమ పరిష్కారాలను అందిస్తోంది. దేశవ్యాప్తంగా 10 లక్షలకుపైగా కస్టమర్లు మాతో చేతులు కలిపారు’’ అని ఆయన వివరించారు. ముంబైలోని జైకామ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిఘాను పర్యవేక్షిస్తామన్నారు. యాప్కు 46 వేల మంది...: జైమాన్ పేరుతో కంపెనీ అభివృద్ధి చేసిన భద్రతా యాప్కు 46 వేలకుపైగా చందాదారులున్నారు. ఆపదలో బటన్ నొక్కగానే కమాండ్ కంట్రోల్ సిబ్బంది ఫోన్లో అందుబాటులోకి వస్తారు. స్మార్ట్ఫోన్లో పరిసరాల వాయిస్తోపాటు లొకేషన్ మ్యాప్, చిత్రాలు, వీడియో వెంటనే రికార్డు అవుతాయి. పోలీసులకూ సమాచారం వెళ్తుంది. ఒకవేళ ఉపకరణం దొంగతనానికి గురైతే వ్యక్తిగత సమాచారం తొలగిస్తారు. ఫ్యాక్టరీ రీసెట్, ఫార్మాట్కు అవకాశం లేదు. దొంగిలించిన వ్యక్తి తన సిమ్ను ఫోన్లో పెట్టినట్టయితే సమాచారం తెలిసిపోతుంది. ఫోన్ అన్లాక్ చేసే ప్రయత్నం చేస్తే అతని ఫోటోను తీస్తుంది. జైమాన్ సేవలకుగాను ఒక్కో ఫోన్కు ఆరు నెలలకు రూ.499 చార్జీ చేస్తున్నట్టు జైకామ్ కేర్ వైస్ ప్రెసిడెంట్ విశాల్ శ్రీవాస్తవ తెలిపారు. నిఘా నీడన ఏటీఎంలు... ‘‘దేశవ్యాప్తంగా 2 లక్షల పైచిలుకు ఏటీఎంలున్నాయి. బ్యాంకులు ఒక్కో ఏటీఎం భద్రతకు నెలకు రూ.40 వేల దాకా ఖర్చు చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్ నిఘాకు రూ.3–4 వేలు మాత్రమే వ్యయం అవుతుంది’’ అని ప్రమోద్ రావ్ వెల్లడించారు. 20 వేల ఏటీఎంలు ఎలక్ట్రానిక్ నిఘా (కెమెరాలతో పర్యవేక్షణ) నీడన ఉన్నాయని, 6 వేల ఏటీఎంల భద్రతను జైకామ్ పర్యవేక్షిస్తోందని తెలియజేశారు. ‘‘ఏటీఎంను పగలగొట్టే ప్రయ్నతం చేసినా, షట్టర్ మూసినా అక్కడి సెన్సర్లు గుర్తిస్తాయి. వాయిస్, వీడియో రికార్డవుతుంది. అలారమ్ మోగడంతో పాటు భద్రతా సంస్థలకు వెంటనే సమాచారం వెళ్తుంది’’ అని తెలిపారు. 2019 నాటికి అన్ని బ్యాంకుల ఏటీఎంలు ఎలక్ట్రానిక్ నిఘా కిందకు వస్తాయన్న అంచనా ఉందన్నారు. కంపెనీ మేక్ యువర్ సిటీ సేఫ్ కింద నివాస సముదాయాలు, ఆసుపత్రులు, పాఠశాలలకు సేవలను విస్తృతం చేస్తోంది.