breaking news
Mohammed Salim
-
191 ఎట్ 52!
అతడి పేరు మహ్మద్ సలీం... మారుపేరు సునీల్శెట్టి... సొంత దుకాణం నుంచే చోరీలు ప్రారంభించాడు. 52 ఏళ్ల వయస్సున్న ఇతగాడు 34 ఏళ్ల నేర ప్రస్థానంలో 191 చోరీలు చేశాడు... ఇప్పటివరకు 26 సార్లు పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్లాడు... ‘పీడీ’కి దొరక్కుండా జాగ్రత్తపడుతున్న ఇతగాడిని హైదరాబాద్లోని బండ్లగూడ పోలీసులు డిసెంబర్ 2న మరోసారి పట్టుకున్నారు. చోరీల ద్వారా వచ్చిన సొమ్మును ఇతగాడు ఉత్తరాదిలో జల్సాలతో పాటు హెలీటూరిజానికి వెచ్చిస్తుంటాడు. హైదరాబాద్లోని ఫతేదర్వాజా సమీపంలో ఉన్న కుమ్మరివాడికి చెందిన సలీం పూర్తి నిరక్షరాస్యుడు. బతుకుతెరువు కోసం తొలినాళ్లల్లో కిరోసిన్ లాంతర్లు తయారు చేసే కర్మాగారంలో పనివాడిగా చేరాడు. ఆపై తన తండ్రి నిర్వహిస్తున్న కిరాణా దుకాణంలోనే పని చేయడం మొదలెట్టాడు. ఇలా తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్న సలీంకు 16వ ఏట ఓ అమ్మాయితో పరిచయమైంది. అక్కడ నుంచి అతడి జీవితం మలుపులు తిరగడం మొదలైంది. ఈ పరిచయం కాస్తా కొన్నాళ్లకు ప్రేమకు దారి తీసింది. ఆమెతో కలిసి షికార్లు చేయడానికి అవసరమైన ఖర్చుల కోసం చోరుడిగా మారాడు. తొలుత తమ దుకాణంలోనే చిన్న చిన్న చోరీలు చేయడం మొదలెట్టాడు. కొన్నాళ్లు గుట్టుగానే సాగినా, చిరవకు విషయం బయటకు పొక్కేసరికి ఇల్లు వదిలి పారిపోవాల్సి వచ్చింది. దీంతో గత్యంతరం లేక చాదర్ఘాట్లోని ఓ హోటల్లో కార్మికుడిగా చేరాడు. ఈ పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న గృహోపకరణాలు తస్కరించేవాడు. 1991లో ఇతడి 18వ ఏట ఇత్తడి వస్తువుల చోరీ కేసులో తొలిసారిగా చాదర్ఘాట్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. జైల్లో పరిచయమైన ‘సీనియర్ల’ వద్ద తాళాలు పగులకొట్టడంతో మెలకువలు నేర్చుకున్నాడు. ఈ చోరుడు ప్రధానంగా పాతబస్తీలోని ఓ వర్గానికి చెందిన వారి ఇళ్లనే టార్గెట్గా చేసుకునేవాడు. అందుకే గడిచిన మూడుసార్లూ బండ్లగూడ పోలీసుస్టేషన్లో నమోదైన కేసుల్లోనే అరెస్టు అయ్యాడు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు సాధారణంగా తెల్లవారుజాము 3 గంటల వరకు మెలకువగానే ఉంటారు. అందుకే ఇతగాడు తెల్లవారుజాము 4 గంటల తర్వాతే రంగంలోకి దిగుతాడు. అప్పటి వరకు నిద్రరాకుండా ఉండేందుకు తన స్మార్ట్ఫోన్లో లూడో, క్రికెట్ ఆడుతూ టైమ్పాస్ చేస్తాడు. చిన్న టార్చ్లైట్, కటింగ్ ప్లేయర్తో ఫీల్డ్లోకి వచ్చే ఇతగాడు ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన ఇళ్లనే ఎంచుకుంటాడు. తాళం వేసున్న ఇంటిని టార్గెట్ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ పగులకొట్టడు. గోడ దూకి సజ్జ ద్వారా ఇంటి పైకి చేరతాడు. అక్కడ నుంచి ఇంట్లోకి చేరే మార్గం వెతుక్కుని ప్రవేశిస్తాడు. ఇతగాడు చోరీ చేసే సమయంలో పెట్రోలింగ్ వాహనాలు ఆ ప్రాంతానికి వచ్చినా ఇంటి తాళం యథాతథంగా ఉండటంతో వారు ఆ ఇంటిపై దృష్టిపెట్టరనే ఉద్దేశంతో ఇలా చేస్తుంటాడు. టార్గెట్ చేసిన ఇంటి లోపలకు వెళ్లాక అక్కడ దొరికే చెంచాలు తదితరాలతోనే అల్మారాలు పగులకొట్టి సొత్తు స్వాహా చేస్తాడు. ఇతగాడు 1998లో ముగ్గురు సంతానం ఉన్న ఓ వితంతువును వివాహం చేసుకున్నాడు. సునీల్శెట్టి ప్రస్తుతం ఏడుగురి పిల్లలకు తండ్రి. ఈ సొత్తు విక్రయించగా వచ్చిన సొమ్ముతో ముంబై, అజ్మీర్ సహా ఉత్తరాదిలో జల్సాలు చేస్తుంటాడు. సైట్ సీయింగ్తో పాటు హెలీకాఫ్టర్లో సంచరించే హెలీటూరిజం కోసం భారీగా ఖర్చు చేస్తాడు. సెక్స్వర్కర్ల వద్దకు వెళ్ళే అలవాటు ఉన్న సలీం ఓసారి రూ.12 లక్షల చోరీ సొత్తుతో ముంబైలోని ఓ మహిళ వద్దకు వెళ్లాడు. ఇతడు నిద్రపోతున్న సమయంలో ఆ సొత్తు కాజేసిన ఆమె అక్కడ నుంచి ఉడాయించింది. బాలీవుడ్ నటుడు సునీల్శెట్టి అంటే అమితంగా ఇష్టపడే సలీం తన పేరునూ అలానే మార్చుకున్నాడు. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆ హీరో ఇంటి వద్దకు అనేకసార్లు వెళ్లినా కలవడం సాధ్యం కాలేదు. ఇప్పటి వరకు 191 నేరాలు చేసి 26 సార్లు అరెస్టు అయినా, శిక్షలు పూర్తయ్యే వరకు జైలు నుంచి బయటకు రాని నేపథ్యంలోనే ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగం అనేక సందర్భాల్లో సాధ్యం కాలేదు. పోలీసులకు చిక్కిన ప్రతిసారీ ఐదారు చోరీలు అంగీకరిస్తున్నా, ఇన్నేళ్లల్లో కేవలం రెండుసార్లే ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగం సాధ్యమైంది. -
విభజించి పాలిస్తున్న బీజేపీ
సాక్షి, నెల్లూరు రూరల్: ప్రజల్లో అసంతృప్తిని చల్లార్చడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ.. విభజించు..పాలించు విధానంలో పాలన సాగిస్తోందని ఆలిండియా డీవైఎఫ్ఐ (డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) మాజీ ప్రధాన కార్యదర్శి, పశ్చిమ బెంగాల్ ఎంపీ మహ్మద్ సలీం ఆరోపించారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు ఆదివారం నెల్లూరులో ప్రారంభమయ్యాయి. తొలుత నెల్లూరు నగరంలో వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నర్తకి సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, 16 లక్షల కోట్ల నల్లధనాన్ని వెలికితీసి పేదల అకౌంట్లలో వేస్తామనే హామీలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. మూడున్నరేళ్లు అయినా ఇప్పటికీ ఉద్యోగాలు కల్పించలేదని విమర్శించారు. నిరుద్యోగం పెరగడానికి బీజేపీ అవలంబిస్తోన్న ఆర్థిక విధానాలే కారణమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు మోసం చేసిందన్నారు. ఆర్ఎస్ఎస్.. సంఘ్పరివార్కు త్రిశూలాలు, కరవాలాలు అందజేసి భయానక వాతావరణం కల్పిస్తోందని చెప్పారు. వామపక్షవాదులుగా బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకుంటామని తెలిపారు. ఈ సభలో డీవైఎఫ్ఐ ఆలిండియా అధ్యక్షుడు మహమ్మద్ రియాజ్, ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, యండ్లపల్లి శ్రీనివాసులురెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు పాల్గొన్నారు. -
అవేం మాటలు.. మానవత్వం లేదా?
ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై మండిపడ్డ విపక్షాలు న్యూఢిల్లీ: కశ్మీర్లో డర్టీ వార్ కొనసాగుతోందని, ఈ యుద్ధంలో వినూత్న పద్ధతుల్లో పోరాడాలని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడ్డాయి. ఆయన దేశ అంతర్గత భద్రతపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించాయి. సీపీఐ నేత డి.రాజా మాట్లాడుతూ.. ఆర్మీ చీఫ్ రాజకీయ వివాదాలకు కేంద్రం కావడం దురదృష్టకరమన్నారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించాల్సింది సైన్యం కాదని, రాజకీయ నాయకత్వమని తేల్చిచెప్పారు. రావత్ వాడుతున్న భాష తాను చిన్నప్పటి నుంచి వింటున్న భారత సైన్యానిది కాదని సీపీఐ(ఎం) నేత మహ్మద్ సలీం విమర్శించారు. రావత్ మాటలు వింటే ఆయన మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందని వ్యాఖ్యనించారు. రావత్ రాజకీయ వ్యాఖ్యల్ని చేయడం మానుకోవాలని జనతాదళ్ యునైటెడ్ నాయకుడు కె.సి.త్యాగీ తెలిపారు. వేర్పాటువాద సంస్థ హురియత్తో కాకపోయినా సాధారణ కశ్మీరీలతో సైన్యం సత్సంబంధాలను ఏర్పాటు చేసుకోవాలని త్యాగీ సూచించారు. కశ్మీర్ సమస్యను కేవలం శాంతి భద్రతల కోణంలో మాత్రమే చూడలేమని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ ఝా స్పష్టం చేశారు. నిరంతరం చర్చలు జరపడంతో పాటు కశ్మీరీ యువత పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సి ఉందని తెలిపారు. కశ్మీరీ యువత భద్రతా బలగాలపై రాళ్లు విసరడమన్నది చాలా తీవ్రమైన సమస్యని ఝా అభిప్రాయపడ్డారు. మరోవైపు రావత్ వ్యాఖ్యల్ని కేంద్ర పట్టాణాభివృద్ధి మంత్రి వెంకయ్య నాయుడు సమర్థించారు. ‘కశ్మీర్లో పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి చర్యనైనా తీసుకుంటామని రావత్ చెప్పారు. నేను దాన్నే సమర్థిస్తున్నాను’ అని వెంకయ్య ట్విటర్లో తెలిపారు. -
భూస్వామి భార్యపై అత్యాచారం కేసులో నిందితునికి జైలు శిక్ష
భూస్వామి భార్యను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు మహ్మద్ సలీంకు న్యూఢిల్లీ కోర్టు ఏడేళ్ల కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు అడిషనల్ సెషన్స్ జడ్జి టి.ఆర్.నావల్ శనివారం ఆదేశించారు. అంతేకాకుండా రూ. 24 వేలు జరిమాన విధించారు. అయితే నిందితుడు టీబీ వ్యాధితో బాధపడుతున్నాడు అతని తరపు న్యాయవాదులు జడ్జికి తెలపడంతో జరిమానాను రూ. 15 వేలకు తగ్గించారు. ఆ మొత్తాన్ని అత్యాచారానికి గురైన బాధితురాలికి అందజేయాలని సూచించారు. 2011, జులై 22న కూరగాయలు కొనుగోలు చేసేందుకు భూస్వామి భార్య మార్కెట్కు బయలుదేరింది. ఆ క్రమంలో తాను తోడు వస్తానని వారి వద్ద పని చేసే సలీం అడగడంతో ఆమె సరే అంది. దాంతో మార్గం మధ్యలో ఆమెకు మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు. దాంతో ఆమె సృహ కోల్పొయింది. దీంతో ఆమెపై ఘజియాబాద్ తీసుకువెళ్లాడు. అనంతరం ఓ గదిలో బందీగా ఉంచి ఆమెపై వరుసగా ఆరురోజులు అత్యాచారం జరిపాడు. భార్య ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో భాగంగా ఆమె ఘజియాబాద్లో ఉన్నట్లు భర్త తెలుసుకుని, ఆమెను న్యూఢిల్లీ తీసుకు వచ్చారు. అనంతరం భూస్వామి పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాప్ ఆపై అత్యాచారం కేసులో సలీం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతడికి శిక్షను ఖరారు చేశారు.


