-
ఢిల్లీ ఎమ్మెల్యేలపై వేటుతో ఓరుగల్లులో గుబులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: పార్లమెంటరీ కార్యదర్శి పోస్టు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వంతో ఈ పదవులు చేపట్టిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ప్రభావం వరంగల్ ఉమ్మడి జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటరీ కార్యదర్శి పదవులు నిర్వహించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. 2014 సాధారణ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మంత్రివర్గం కొలువుదీరింది. మంత్రివర్గ సంఖ్యకు పరిమితి ఉండడంతో పలువురికి పార్లమెంటరీకార్యదర్శి పోస్టులను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. రాష్ట్రం లో ఆరుగురు ఎమ్మెల్యేను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది. ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్కు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్బాబుకు పార్లమెంటు కార్యదర్శి పదవులు దక్కాయి. రా జ్యంగ విరుద్ధంగా ఈ పదవువులను ఇచ్చారంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. పదవులు రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటరీ కార్యదర్శి పదవులు రద్దు చేసింది. ఈసీ నిర్ణయంతో... ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ ప్రభుత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు పార్లమెంటరీ కార్యదర్శి హోదాలో కొనసాగి లాభదాయ పదవి నిర్వహించారనే అభియోగంపై వీరి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈసీ గడప తొక్కేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో గతంలో పార్లమెంటరీ కార్యదర్శి పదవిలో కొనసాగిన ఆరుగురు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సోమవారం ఈ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్లమెంటరీ కార్యదర్శి పదవులు నిర్వహించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. మన రాష్ట్రంలో పార్లమెంటరీ కార్యదర్శి పదవి నిర్వహించిన ఎమ్మెల్యేలు ఢిల్లీ ఎమ్మెల్యేలపై వచ్చిన నిర్ణయంతో ఆందోళన చెందుతున్నారు. దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. వివిధ సమీకరణల వల్ల మంత్రి పదవి దక్కలేదు. ఆ తర్వాత పార్లమెంటు కార్యదర్శి పదవి చేపట్టినా ఎక్కువ కాలం లేదు. మరోవైపు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వొడితెల సతీశ్బాబుకు పార్లమెంటరీ కార్యదర్శి పదవి చేపట్టారు. కొద్దిరోజులకే ఈ పదవికి దూరమయ్యారు. తాజాగా కాంగ్రెస్ తీసుకుంటున్న రాజకీయ నిర్ణయంతో వీరిద్దరికి ఎలాంటి పరిస్థితి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
కేంద్రానిది పనికిమాలిన నిర్ణయం
♦ మిర్చి కొనుగోళ్ల ప్రకటనపై మంత్రి హరీశ్రావు ధ్వజం ♦ కేంద్రం ప్రకటించిన పథకం మిలీనియం జోక్ అని ఎద్దేవా సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మిర్చి కొనుగోళ్లకు సంబంధించి అస్పష్ట నిర్ణయంతో రైతులకు శఠగోపం పెట్టిందని మంత్రి టి.హరీశ్రావు మండిపడ్డారు. సమస్యను కేంద్రం అర్థం చేసుకోలేదని, ఫలితంగా మిర్చి రైతులకు ఏమాత్రం మేలు చేయని, పనికిమాలిన నిర్ణయం తీసుకుందని ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ సుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్లతో కలసి హరీశ్ విలేకరులతో మాట్లాడారు. మిర్చి కొనుగోళ్లపై కేంద్రం ప్రకటించిన పథకం ఓ మిలీనియం జోక్ అని ఆయన ఎద్దేవా చేశారు. మిర్చికి క్వింటాలుకు రూ. 5 వేల ధర ప్రకటించి నాణ్యత ఉన్న వెరైటీనే కొంటామనడం, అదీ 3 లక్షల 37వేల క్వింటాళ్లనే కొనుగోలు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరి రైతుల దగ్గర మిగిలిన 35 లక్షల క్వింటాళ్ల మిర్చి సంగతేమిటని హరీశ్ ప్రశ్నించారు. తేజ రకం మిర్చికి మార్కెట్లో ఇప్పటికే రూ. 6 వేల నుంచి రూ. 6,500 దాకా ధర పలుకుతోందని, మరి కేంద్రం ఇచ్చే రూ. 5 వేలు రైతును ఆదుకోవడానికా లేక ముంచడానికా అని నిప్పులు చెరిగారు. మిర్చిని రూ. 10 వేలకు కొనాలని స్థానిక బీజేపీ నేతలు ధర్నాలు చేస్తుంటే కేంద్రం మాత్రం రూ. 5 వేలే ఇస్తానంటోందని ఎద్దేవా చేశారు. అడిగింది రూ.7 వేలు.. ఇస్తానన్నది రూ. 5 వేలు ‘‘ప్రభుత్వం తరఫున క్వింటాలుకు రూ. 7 వేలు అడిగితే కేంద్రం ఇస్తామన్నది ముష్టి రూ. 5 వేలు. మిర్చి ధరపై కేంద్రానికి రాష్ట్రం నుంచి ఎలాంటి వినతులు ఇవ్వలేదని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అనడం దారుణం. మార్చి 30న ఎంపీ బి.వినోద్ కుమార్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలసి వినతిపత్రం ఇచ్చారు. అదే నెల 31న వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పార్ధసారథి కేంద్రానికి లేఖ రాశారు. ఏప్రిల్ 1న నేను స్వయంగా లేఖ రాశా. ఈ లేఖల్లో స్పష్టత లేదని దత్తాత్రేయ తాజాగా అనడం మరో అబద్ధం. ఏ అంశంలో స్పష్టత లేదో కేంద్రం రాష్ట్రాన్ని ఎందుకు వివరణ అడగలేదు? ఈ లేఖలపై స్పందించడానికి కేంద్రానికి నెల రోజులుగా తీరిక లేకుండా పోయిందా..’’ అని మంత్రి హరీశ్రావు నిలదీశారు. కేంద్రం స్పందన దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రకటించిన పథకమే అస్తవ్యస్తంగా ఉందని, కొనుగోళ్లకు డబ్బులు ఇవ్వబోమని, రాష్ట్రమే కొనుగోళ్ల భారం మోయాలనడం, చివర్లో ఏదో ఇస్తామనడం విచిత్రంగా ఉందన్నారు. చివరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ. 20 కోట్లకు మించి రావని వివరించారు. కేంద్రం నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. దేశాన్ని 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, పదేళ్లు పాలించిన ఎన్డీయే మిర్చికి ఎందుకు మద్దతు ధరలు ఇవ్వలేదని హరీశ్రావు ప్రశ్నించారు. కోల్డ్ స్టోరేజీ అనుమతుల కోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నా అతీగతీ లేదని, విపక్షాలు రైతు సమస్యలను రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. రూ.7 వేలు ధర ప్రకటించండి రాష్ట్రంలోని మిర్చి రైతులను ఆదుకునేందుకు క్వింటాల్కు రూ.ఏడు వేల ధర ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ప్రతి క్వింటాల్కు అదనపు ఖర్చుల కింద రూ.1,500 ఇస్తేనే రైతుకు గిట్టుబాటు ఉంటుందని పేర్కొంది. గురువారం ఈ మేరకు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్రావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్కు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద క్వింటాల్ మిర్చిని రూ.5 వేల చొప్పున కొనుగోలు చేస్తామని చేసిన ప్రకటనతో తెలంగాణ రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారని లేఖలో ప్రస్తావించారు. ఇప్పటికే వరంగల్, ఖమ్మం వంటి పెద్ద మార్కెట్లలో నాణ్యమైన మిర్చి క్వింటాల్కు రూ.5 వేల పైనే ధర పలుకుతోందని తెలిపారు. కేంద్రం రూ.ఏడు వేలు చెల్లిస్తేనే రైతుకు గిట్టుబాటుగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని రైతుల వద్ద ఇంకా 3 వేల మెట్రిక్ టన్నుల మిర్చి నిల్వలున్నాయని, కేంద్రం కేవలం 33,700 మెట్రిక్ టన్నుల కొనుగోలుకు మాత్రమే అనుమతిచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ రైతులకు న్యాయం చేసేలా మొదటి, రెండో రకం మిర్చి మొత్తం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రత్నగిరిపై కుండపోత
షెల్టర్ శ్లాబు కూలి యువకుడి మృతి
ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
పిడుగు పడి మేకల కాపరి మృతి
జగన్తోనే సంక్షేమం
కోనసీమలో పలుచోట్ల అకాల వర్షం
హమ్మయ్య చల్లబడింది
IPl 2024: శాంసన్ ఇన్నింగ్స్ వృథా.. రాజస్తాన్పై ఢిల్లీ ఘన విజయం
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement