breaking news
mla eswari
-
పరామర్శించేందుకు తీరికలేదా?
మంత్రి కామినేనిపై ఎమ్మెల్యే ఈశ్వరి మండిపాటు కొయ్యూరు: కిడ్నీ మరణాలతో కొయ్యూరు మండలంలోని దూసరి కొత్తూరు గ్రామం వల్లకాడుగా మారుతున్నా ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావుకు అక్కడి గిరిజనులను పరామర్శించేందుకు తీరుకలేదా అని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. నర్సీపట్నం వరకు వచ్చిన కామినేనికి దానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తూరు వచ్చేందుకు తీరిక లేకపోవడం దారుణమన్నారు. గిరిజన మరణాలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి ఇదే తార్కణమన్నారు. గ్రామంలో 12 మంది వరకు మరణించినా ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని మండిపడ్డారు. మంగళవారం ఆమె కొత్తూరులో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇంటి పెద్దలు కిడ్నీలు పాడై మరణించడంతో ఆ కుటుంబాలు వీధినపడ్డాయని.. ప్రతి కుటుంబానికి రూ.రెండు లక్షల పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. కిడ్నీ సంబంధిత రోగులకు ఉచిత వైద్యసేవలు అందించాలని సూచించారు. గ్రామంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్న కంఠారం వైద్యురాలు సునీతతో ఎమ్మెల్యే మాట్లాడారు. వెరుు్య మందిలో ఒకరికి కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే వీలుందని..ఇక్కడ ఎక్కువ మందికి కిడ్నీలు పాడైపోతున్నాయని, పురుషులు ఎక్కువగా చనిపోతున్నారని, ఇష్టానుసారంగా పెరుున్ కిల్లర్స్ వాడడంతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయని సునీత వివరించారు. అలాగే మహిళలు చనిపోవడంపై ఇటీవల ఆంధ్రా మెడికల్ కళాశాల నుంచి వచ్చిన వైద్య నిపుణుల బృందం అన్ని కోణాల్లో పరిశీలన చేపట్టిందన్నారు. గ్రామంలో బోరుకు మోటారు అమర్చి రివర్స్ ఆజ్మసిస్(ఆర్వో)ప్లాంట్ను ఏర్పాటు చేయడాన్ని ఎమ్మెల్యే తప్పుపట్టారు. తాండవ నీటిని ఇక్కడకు మోటారు ద్వారా తరలించి ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. కలెక్టర్ దృష్టిలో ఉంచి గ్రామస్తులకు న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు. మండల అధ్యక్షులు టీఎస్ రాందాస్, ముఖ్యకార్యకర్తలు జి.సత్తిబాబు, మామిడి రమణ, సీహెచ్ శ్రీను, కె రాంబాబు, గోవర్దనగిరి, సోమాగాంధీ పాల్గొన్నారు. -
నిరసన సెగ
బాక్సైట్ తవ్వకాలకు అనుమతులపై అఖిల పక్షాల నిరసన ఐక్య ఉద్యమానికి సమాయత్తం నేడు మన్యం బంద్ ఉద్రిక్తత నేపథ్యంలో సీఆర్పీఎఫ్ అధికారుల పర్యటన శీతాకాలం ఆరంభంలో ఏజెన్సీ ఒక్కసారిగా వేడెక్కింది. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో మన్యంలో నిరసనాగ్ని రగులుకుంది. సర్కారు వైఖరికి వ్యతిరేకంగా మన్యం బందుకు సిద్ధమైంది. ప్రాణాలు పణంగా పెట్టయినా ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటామని పాడేరులో అఖిలపక్షాలన్నీ ఒకతాటిపైకి వచ్చి తేల్చి చెప్పాయి. ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ప్రతిన బూనాయి. వైఎస్సార్సీపీతో సహా వామపక్షాలు.. ఇతర రాజకీయ పార్టీలు ఇందులో పాల్గొన్నాయి. పాడేరు : విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో అఖిలపక్షాల్లో నిరసన పెల్లుబికింది. శుక్రవారం పలు మండలాల్లో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. జీకేవీధి, చింతపల్లి, పాడేరు, పెదబయలు మండలాల్లో విపక్షాలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలను నిర్వహించాయి. జి.మాడుగుల మండలంలో శుక్రవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేసి అనంతరం సభను బహిష్కరించి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ధర్నా, ర్యాలీ నిర్వహించారు. పాడేరులో అఖిలపక్షాలు నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. రాజకీయ పార్టీలు, పీసా, విద్యార్థి కమిటీలు సమావేశమై బంద్కు పిలుపునిచ్చాయి. బాక్సైట్ ఉద్యమంలో అందరి భాగస్వామ్యం: ఎమ్మెల్యే ఈశ్వరి మన్యంలో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకోవడానికి ఐక్య ఉద్యమం చేపట్టాలని, ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని వ్యతిరేకిస్తూ గిరిజన భవన్లో శుక్రవారం నిర్వహించిన అఖిలపక్షాల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏజెన్సీ 11 మండలాల్లో ఆదివాసీ ప్రజలను సంఘటితం చేసి ఉమ్మడి పోరుతోనే బాక్సైట్ను అడ్డుకోగలమన్నారు. ఆదివాసీలంతా వ్యతిరేకిస్తున్నా, పర్యావరణానికి గిరిజనుల మనుగడకు విఘాతమని తెలిసినా ప్రభుత్వం నిరంకుశంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతిచ్చిందని ధ్వజమెత్తారు. ప్రకృతి సంపదపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెగబడుతున్నాయని, మన్యంలో బాక్సైట్ తవ్వకాలు చేపడితే ప్రజా ప్రతిఘటన తప్పదని మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు హెచ్చరించారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఏపీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అప్పలన వెల్లడించారు. ఈ సమావేశంలో ఏపీ గిరిజన సంఘం, సీపీఎం నాయకులు ఆర్.శంకరరావు, ఎంఎం శ్రీను, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పాలికి అప్పారావు, సీపీఐ నాయకుడు కూడా భూషణరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాంగి సత్తిబాబు, బీజేపీ నాయకులు ఉమా మహేశ్వరరావు, వేమనబాబు, సల్ల రామకృష్ణ, బీఎస్పీ నాయకులు సుర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నిర్ణయం మార్చుకోకుంటే టీడీపీకి గుడ్బై విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం ఇచ్చిన 97 జీఓను ఉపసంహరించాలని మాజీ మంత్రి మణికుమారి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ వి.కాంతమ్మ, అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ, టీడీపీ నాయకులు బొర్రా నాగరాజు, ఎంవిఎస్ ప్రసాద్, శెట్టి లక్ష్మణుడు, పాంగి రాజారావు, జి.మాడుగుల జెడ్పీటీసీ సభ్యుడు ఆదినారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పీఓ హరినారాయణన్కు వినతిపత్రం అందజేసి ఐటీడీఏ వద్ద నిరసన తెలియజేశారు. మన్యంలో ఆదివాసీలంతా వ్యతిరేకిస్తున్న బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతివ్వడం భావ్యం కాదన్నారు. ఈనెల 13న తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగే సమావేశానికి హాజరై బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన జీఓను ఉపసంహరించాలని కోరనున్నట్లు తెలిపారు. బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం పూనుకుంటే పార్టీ నుంచి వైదొలుగుతామని పేర్కొన్నారు. -
మే-10 నుంచి మోదకొండమ్మ తల్లి జాతర
పాడేరు(విశాఖపట్టణం): ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం మోదకొండమ్మ తల్లి జాతర మే నెల 10 నుంచి 12 వరకు జరగనుంది. గురువారం జరిగిన సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పాడేరు ఎమ్మెల్యే గిద్ది ఈశ్వరీ ఆధ్వర్యంలో గ్రామస్తులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.