-
హైదరాబాద్ మెట్రోకు అయిదేళ్లు.. తీరని నష్టాలు.. తప్పని సవాళ్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రో నేటితో అయిదేళ్లు పూర్తిచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2017 నవంబరు 28న మియాపూర్ – నాగోల్ (30 కి.మీ) మార్గంలో జెండా ఊపి మెట్రోను ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు నగర మెట్రో ఎన్నో మైలురాళ్లు అధిగమించినప్పటికీ ఎన్నో సవాళ్లు.. నష్టాలను ఎదుర్కొంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత అయిదేళ్లుగా మెట్రో అధిగమించిన మైలురాళ్లను ఒకసారి సింహావలోకనం చేసుకుంటే.. ►ప్రస్తుతం నాగోల్– రాయదుర్గం, ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో నగరంలో 69.2 కిలోమీటర్ల మార్గంలో మెట్రో అందుబాటులో ఉంది. నిత్యం 4 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. మొత్తం మూడు రూట్లలో 57 స్టేషన్లున్నాయి. ►ఈ ఏడాది అక్టోబర్ 3న డిజిటల్ ఇండియాకు అనుగుణంగా దేశంలోనే మొదటిసారిగా మెట్రో రైల్ సేవల్లో సమగ్రమైన డిజిటల్ చెల్లింపు ఆధారిత మెట్రో టికెట్ బుకింగ్ సేవలను వాట్సాప్ ఈ –టికెటింగ్ సదుపాయంతో ప్రారంభించింది. ►ఇదే సంవత్సరం జూన్ 15న ప్యాసిజర్ ఎంగేజ్మెంట్, సీఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ మెట్రో రైల్ వినూత్నమైన మెట్రో బజార్ కాన్సెప్ట్ , షాపింగ్ ఆన్ ద గో నేపథ్యంతో వచ్చింది. మెట్రో ప్రయాణికులకు అనుభవపూర్వక షాపింగ్ అవకాశాలను ఇది అందించింది. ►ఇదే ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్ మెట్రో రైల్కు సీఎంఆర్ఎస్ అనుమతి లభించింది, దీని ద్వారా మెట్రో రైళ్లను పూర్తి వేగంతో నడపవచ్చు. రైళ్ల వేగం గంటకు 70 కిలోమీటర్ల నుంచి 80 కేఎంపీహెచ్ పెరిగింది. దీంతో పలు కారిడార్లలో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గింది. ► మార్చి 31న సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు విడుదల చేసింది. దీంతో అపరిమితంగా నగరంలోని 57 మెట్రో స్టేషన్లు, మూడు కారిడార్లలో తిరిగే అవకాశం లభిస్తుంది. ఇది సంవత్సరంలో 100 సెలవు దినాలలో అందుబాటులో ఉంటుంది. ► 2021 ఫిబ్రవరి 2న హైదరాబాద్ మెట్రో రైల్ ఓ రోగిని బతికించడం కోసం గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేసింది. అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగి కోసం హెచ్ఎంఆర్ 21 కిలోమీటర్ల ప్రత్యేక గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా నాగోల్, జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ స్టేషన్ల మధ్య నాన్స్టాప్గా ప్రయాణించి రోగి ప్రాణాలను కాపాడింది. ► ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకుని కార్బన్ ఫుట్ప్రింట్ తగ్గిస్తుంది. మెట్రో రైల్ 8.35 మెగావాట్ల క్యాప్టివ్ సోలార్ ప్లాంట్లను బహిరంగ ప్రదేశాలలో, మెట్రో రైల్ డిపోల వద్ద, రూప్టాఫ్ల మీద 28 మెట్రో స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసింది. ఈ సోలార్ సామర్థ్యంతో హైదరాబాద్ మెట్రో రైల్ తమ విద్యుత్ అవసరాలలో 15 శాతం తీర్చుకుంటోంది. ► మెట్రో రైళ్ల వినూత్నమైన రీజనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్ధల ద్వారా సుమారు 40 శాతం విద్యుత్ను పునర్వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. నిత్యం మెట్రో రైళ్లలో స్మార్ట్ కార్డ్లతో జర్నీ చేసే వారికి లాయల్టీ బోనస్ అందించేందుకు మెట్రో వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. కేవలం ఎంపిక చేసిన సిరీస్ నంబర్లున్న వినియోగదారులకే ఈ బోనస్ అందుతుందని మెట్రో వర్గాలు తెలిపాయి. ఈ ఆఫర్పై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నాయి. -
మెట్రోకు సమాంతరంగా కొత్త ఫ్లైఓవర్లు
* మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో ఎనిమిది చోట్ల నిర్మాణం * జాతీయ రహదారుల విభాగానికి రూ.300 కోట్లు చెల్లించనున్న హెచ్ఎంఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో మెట్రో కారిడార్లో కొత్తగా ఫ్లైఓవర్లు రూపుదిద్దుకోనున్నాయి. అసలే ట్రాఫిక్ చిక్కులతో సతమతమవుతున్న ప్రజలు మెట్రో రైలు మార్గం నిర్మాణంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ఆయా మార్గాల్లో అవసరమైన చోట రైల్వే కారిడార్లకు సమాంతరంగా ఫ్లైఓవర్లు నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ప్రధాన కారిడార్ అయిన మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో 8 ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు నిర్మించాలని మెట్రో రైలు ప్రాజె క్టు సంస్థ నిర్ణయించింది. బుధవారం రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి రూ.300 కోట్లను జాతీయ రహదారుల విభాగానికి హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు సంస్థ వెంటనే చెల్లించాలని సూచించారు. పనులు ఎప్పుడు మొదలుపెట్టాలనే విషయంలో జాతీయ రహదారులు, జీహెచ్ఎంసీ, మెట్రోరైలు, ట్రాఫిక్ పోలీసు విభాగాల అధికారులు సంయుక్తంగా ఈ నెల 26న పర్యటించి తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెట్రోరైలు ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, జాతీయ రహదారుల విభాగం చీఫ్ ఇం జనీర్ గణపతిరెడ్డి, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసు విభాగం ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement