breaking news
mixed reaction
-
బెంగాల్ బంద్ హింసాత్మకం
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటనతోపాటు మంగళవారం జరిగిన ‘నబన్నా అభియాన్’పై పోలీసుల దాడికి నిరసనగా ప్రతిపక్ష బీజేపీ బుధవారం తలపెట్టిన 12 గంటల రాష్ట్ర బంద్ హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీసులతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో జనాన్ని చెదరగొట్టడానికి లాఠీచార్జి చేయాల్సి వచి్చంది. బీజేపీ కార్యకర్తలు రైలు పట్టాలపై నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రమంతటా ర్యాలీలు నిర్వహించారు. ఉదయం రోడ్లపై బైఠాయించిన బీజేపీ మాజీ ఎంపీలు రూపా గంగూలీ, లాకెట్ చటర్జీ, రాజ్యసభ సభ్యుడు సమిక్ భట్టాచార్య, ఎమ్మెల్యేల అగ్నిమిత్ర పాల్తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ‘బంగ్లా బంద్’కు మిశ్రమ స్పందన లభించింది. వ్యాపార, విద్యా సంస్థలు, కార్యాలయాలు పాక్షికంగా మూతపడ్డాయి. రోడ్లపై ఘర్షణలు జరుగుతాయన్న అనుమానంతో ప్రజలు చాలావరకు ఇళ్లకే పరిమితమయ్యారు. రాజధాని కోల్కతాలో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. బలవంతంగా దుకాణాలు మూసివేయిస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై కాల్పులు! ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భాత్పారాలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై కాల్పులు జరిగాయని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అయితే, ఇందులో నిజం లేదని, ఆ ఇద్దరు కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులు చెప్పారు. ఈ దాడిలో గాయపడిన బాధితులను చికిత్స కోసం ఆసుపత్రిలో చేరి్పంచామని తెలిపారు. తమ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు తుపాకీతో కాల్పులు జరిపారని బీజేపీ మాజీ ఎంపీ అర్జున్ సింగ్ పేర్కొన్నారు. బంద్పై పిటిషన్ కొట్టివేత బీజేపీ తలపెట్టిన 12 గంటల బంగ్లా బంద్ చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ సంజయ్ దాస్ అనే లాయర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కలకత్తా హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఇదే కోర్టులో ఇష్టారాజ్యంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయకుండా గతంలోనే ఆయనపై నిషేధం విధించామని న్యాయస్థానం తేలి్చచెప్పింది. నిషేధం అమల్లో ఉండగా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించలేమని స్పష్టం చేసింది. పిటిషనర్ సంజయ్ దాస్కు రూ.50 వేల జరిమానా విధించింది. ఈ సొమ్మును 10 రోజుల్లోగా పశి్చమ బెంగాల్ స్టేట్ లీగల్ సరీ్వసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. డిమాండ్లు నెరవేర్చేదాకా ఉద్యమిస్తాం పశ్చిమ బెంగాల్లో గత 20 రోజులుగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్ హత్యకు ఖండిస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఆందోళనలు విరమించి, విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరగా జూనియర్ డాక్టర్ల ఫోరమ్ అందుకు నిరాకరించింది.నిందితుడితో సంబంధం ఉన్న ఏఎస్ఐకి పాలిగ్రాఫ్ టెస్టు జూనియర్ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్తో సంబంధాలున్న ఏఎస్ఐ అనూప్ దత్తాకు సీబీఐ అధికారులు బుధవారం పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు. ఈ కేసులో అనూప్ దత్తాను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. ఇప్పటిదాకా ఎనిమిది మందికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. అనూప్ దత్తా కోల్కతా పోలీసు వెల్ఫేర్ కమిటీలో పనిచేస్తున్నాడు. వైద్యురాలిపై అఘాయిత్యం జరిగాక నిందితుడు సంజయ్ రాయ్ ఈ విషయాన్ని అనూప్ దత్తాకు తెలియజేసినట్లు సీబీఐ అధికారులు భావిస్తున్నారు. -
ఆమె షాకింగ్ సర్ప్రైజ్ మాములుగా లేదుగా! ఉబ్బి తబ్బిబైన ఫ్యామిలీ
ఒక్కోసారి అనుకోని పరిస్థితుల కారణంగా మనవాళ్లే అయిన వాళ్ల ఫంగ్షన్లకి అటెండెంట్ కాలేకపోతాం. ఆ బాధ మాములగా ఉండదు. బిజీ పరిస్థితులు ఒక కారణమైతే చాలా దూరంలో ఉండటం కారణంగా ఖర్చుతో కూడి ప్రయాణం అవ్వడంతో అటెండెంట్ కాలేకపోతాం. ఏ చిన్న అవకాశం దొరికినా చాలు వెళ్లిపోదాం అని వేయికళ్లతో ఎదురు చూస్తాం కూడా. అచ్చం అలాంటి సమస్యనే ఇక్కడొక మహిళ కూడా ఎదుర్కొంది. ఐతే తాను తన కుటుంబమే తన మొదటి ప్రయారిటీ అంటూ చాలా దూరంలో ఉన్న లెక్కచేయకుండా వచ్చేసింది. శ్రద్ధా షెలార్ అనే మహిళ తన కుటుంబంతో సహా రీసెంట్గా యూకేకి వెళ్లింది. ఐతే ఇంతలో తన తమ్ముడి మ్యారేజ్ కుదరడం, జరిగిపోవడం జరిగింది. ఐతే ఆమెకు ఆ పెళ్లికి అటెండెంట్ కాలేని పరిస్థితి. దీంతో కుటుంబసభ్యులు ఒకింత బాధ కలిగినా సరిపెట్టుకున్నారు. ఐతే ఆ మహిళ మాత్రం ఊహించని విధంగా తన తమ్ముడి పెళ్లి వచ్చి అందర్నీ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇక ఆ కుటుంబం ఆనందం అంత ఇంత కాదు. ఆ మహిళ అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేగాదు ఎక్కడ ఉన్న మన కుటుంబం తర్వాతే ఏదైనా అంటూ అలాంటి అరుదైన సందర్భాన్ని మిస్ చేయొద్దు అంటూ ఒక క్యాప్షన్ జోడించి మరి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టిట తెగ హల్చల్ చేస్తోంది. View this post on Instagram A post shared by Shraddha Shelar (@shraddha.shellar) (చదవండి: వరుడుకి డబ్బులు లెక్కించడం రాదని..పెళ్లికి నిరాకరించిన యువతి) -
మిశ్రమంగా ముగిసిన స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు మిశ్రమంగా ముగిసాయి. లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ, మిడ్ సెషన్ తరువాత మరింత డీలాపడ్డాయి. 169 పాయంట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ చివరికి సెన్సెక్స్ 8 పాయింట్లు లాభపడి 40,802.17 వద్ద ముగియగా, నిఫ్టీ 8 పాయింట్లు క్షీణించి 12,048 వద్ద స్థిరపడింది. వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో ఆటో కంపెనీలు నష్టపోగా, ప్రముఖ టెలికం సంస్థలు కాల్, డేటా ఛార్జీలను పెంచుతున్నట్లు చేసిన ప్రకటన కారణంగా ఆయా కంపెనీల షేర్లు మాత్రం పరుగులు పెట్టాయి. భారతి ఎయిర్టెల్ అత్యధిక లాభాలను ఆర్జించింది. ఇంకా రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, కోటక్ బ్యాంక్. ఇండస్ఇండ్ బ్యాంక్ లాభపడ్డాయి. యస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫ్రాటెల్, ఓఎన్జీసీ, మారుతి సన్ఫార్మా షేర్లు నష్టపోయాయి. మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయల 9 పైసలు ఎగిసి 71.65 వద్ద ముగిసింది. -
12 గంటల బెంగళూరు బంద్