breaking news
misconceptions
-
స్మార్ట్ మీటర్లపై అపోహలు సృష్టించొద్దు: విజయానంద్
సాక్షి, విజయవాడ: స్మార్ట్ మీటర్లపై ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించొద్దని ఏపీ ఎనర్జీ స్పెషల్ సీఎస్ విజయానంద్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైందన్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, స్మార్ట్ మీటర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘వ్యవసాయంలో విద్యుత్ వినియోగం స్మార్ట్ మీటర్ల ద్వారా తెలుస్తుంది. స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు. విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విప్లవాత్మక నిర్ణయం. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా స్మార్ట్ మీటర్లని ఏర్పాటు చేస్తున్నాం. మంచి టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పుడు పది సంవత్సరాల క్రితం టెక్నాలజీని ఇపుడు ఎలా వాడతాం’’అని విజయానంద్ ప్రశ్నించారు. వాస్తవిక దృక్పథంతో పరిశీలించిన తర్వాతే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకి నిర్ణయం తీసుకున్నాం. వ్యవసాయ రంగంతో పాటు గృహావసరాలకి, పరిశ్రమలకి కూడా స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయి. కేంద్ర ప్రభుత్వ సూచనలకి అనుగుణంగా 2025 లోపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకి చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ వినియోగంపై స్మార్ట్ మీటర్ల ద్వారా దాదాపు కచ్చిత సమాచారం లభిస్తుంది. స్మార్ట్ మీటర్ల ద్వారా రైతులపై భారం ఉండదు’ అని విజయానంద్ స్పష్టం చేశారు. ‘‘రైతు అకౌంట్లలోనే వారి సబ్సిడీ నేరుగా వేస్తాం. బ్యాంకు అకౌంట్లు ఉన్నవారిలో 11.95 లక్షల మంది రైతులు సార్ట్ మీటర్లకి అంగీకరించారు. బ్యాంకు అకౌంట్లు ఉన్నవారిలో దాదాపు 99 శాతం స్మార్ట్ మీటర్లకి మద్దతు తెలిపారు. ఫిబ్రవరి నాటికి శ్రీకాకుళం జిల్లా పైలట్ ప్రాజెక్ట్ లో 83.16 శాతం స్మార్ట్ మీటర్లు పనిచేస్తున్నాయి. దాదాపు 50 శాతం మీటర్లు పనిచేయడం లేదనేది వాస్తవం కాదు’’ అని అన్నారు. చదవండి: మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏపీ ప్రభుత్వ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే.. ‘‘స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్ చాలా పారదర్శకంగా చేస్తున్నాం. తప్పుడు వార్తలు పదే పదే రాస్తే లీగల్ గా చర్యలు తీసుకుంటాం. స్మార్ట్ మీటర్ల టెండర్లపై పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం. ప్రయాస్ రిపోర్ట్ వృధా.. తప్పు అని అనలేదు. సగటు విద్యుత్ ధర, కొనుగోలు ధరలని లెక్క వేయడంలో పొరపాట్లు వచ్చాయి. యూనిట్ రేట్లో వ్యత్యాసం వేయడం వలనే వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో 25 వేల నుంచి 30 వేల మీటర్లని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని పరిశీలన చేశాం. ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం తర్వాత మిగిలి జిల్లాలలో మళ్లీ పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు?. స్మార్ట్ మీటర్ల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని తెలియాల్సిన అవసరం ఉంది’’ అని విజయానంద్ అన్నారు. -
ఈ అపోహలు వాస్తవమేనా..?
ఇన్వెస్టర్లు గతంతో పోలిస్తే నేడు కాస్త అవగాహనతోనే ఉంటున్నారు. విస్తృత మీడియా కవరేజీ, డిజిటల్ సాధనాలు, డేటా అందుబాటు, టెక్నాలజీ పట్ల అవగాహన ఇవన్నీ కూడా ఇన్వెస్టర్లలో అవగాహనను పెంచుతున్నాయి. కానీ, అదే సమయంలో ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడులకు సంబంధించి కొన్ని తప్పుడు అభిప్రాయాలు, అపనమ్మకాలు చాలా మందిలోనే ఉంటున్నాయి. ఇవి వారి ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం లేకపోలేదు. కనుక ఈ తరహా దురభిప్రాయాలు, నమ్మకాల్లో వాస్తవమెంతన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఎంతో అవసరం. దీర్ఘకాల రుణాలను ముందుగా తీర్చేయాలి.. దీర్ఘకాల రుణాలను ముందుగా తీర్చివేయడం ద్వారా వడ్డీని ఆదా చేసుకోవాలన్న సలహా సాధారణంగా వినిపిస్తుంటుంది. దీన్ని నమ్మి దీర్ఘకాలంపై తీసుకున్న గృహ రుణాన్ని ముందుగా తీర్చివేసి, స్వల్ప కాలం కోసం తీసుకున్న పర్సనల్ లోన్ను కొనసాగించడం చేయవచ్చు. కానీ, ఇది ఫండమెంటల్గా తప్పిదమే అవుతుంది. ఎందుకంటే పర్సనల్ లోన్పై వడ్డీ రేటు అధికం. గృహ రుణంపై వడ్డీ రేటు తక్కువ. పైగా దీనిపై ఆదాయపన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ‘‘పన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే, గృహ రుణం అసలు వ్యయం 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి 6 శాతం లోపే ఉంటుంది. దీంతో అధిక ఖర్చుతో కూడిన పర్సనల్ లోన్ కాకుండా గృహ రుణాన్ని ముందస్తుగా తీర్చివేయడం తప్పిదమే అవుతుంది’’ అని ఫిన్కార్ట్ సీఈవో తన్వీర్ఆలమ్ సూచించారు. ఆర్థిక సలహాదారే చూసుకుంటారు.. ఆర్థిక పరిజ్ఞానం అంతగా లేని వారు, ఫైనాన్షియల్ అడ్వైజర్ల సాయం తీసుకోవడం మంచి నిర్ణయమే. ఒక్కసారి ఇలా ఆర్థిక సలహాదారుని కలిస్తే చాలు తమ పెట్టుబడుల ప్రణాళికలన్నీ వారే చూసుకుంటారని భావించడం పొరపాటే అవుతుంది. ప్రణాళిక అన్నది ఆరంభమే కానీ, అంతం కాదని అర్థం చేసుకోవాలి. అలాగే, అడ్వైజర్లను గుడ్డిగా నమ్మేయడం కూడా అన్ని సంద ర్భాల్లోనూ సరైనది అనిపించుకోదు. ‘‘ఆర్థిక లెక్కలకు సంబంధించి అంశాలను అడ్వైజర్లకు అప్పగించడం మం చిదే. కాకపోతే నిర్ణయం తీసుకునే బాధ్యత ఇన్వెస్టర్లపైనే ఉంచుకోవాలి’’ అని ప్లాన్రూపీ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అమోల్ జోషి సూచించారు. పెట్టుబడి నిర్ణయాలకు మీరే బాధ్యులు కానీ, ఫైనాన్షియల్ అడ్వైజర్లు కాదు. సిప్తో రిస్క్ ఉండదు క్రమానుగత పెట్టుబడుల విధానం (సిప్/సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈక్విటీ కొనుగోలు సగటు ధర తగ్గుతుందని (అధిక ధర, తక్కువ ధరలో కొనుగోలు వల్ల), దాంతో రిస్క్ తగ్గుతుందని ఆర్థిక నిపుణులు సాధారణంగా చెబుతుంటారు. కొందరు అయితే రిస్క్ను పూర్తిగా దూరం పెట్టేందుకు సిప్ చక్కని సాధనంగా పేర్కొంటారు. ‘‘సిప్ అన్నది రిస్క్ను తీసివేయలేదు. ఇదొక పరికరం మాత్రమే, సాధనం కాదు’’ అని ప్లాన్రూపీ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అమోల్ జోషి సూచించారు. సిప్ కారణంగా కొన్ని సంవత్సరాల్లో రాబడులు పేలవంగా ఉన్నప్పటికీ, కొన్ని సంవత్సరాల్లో మంచి పనితీరు కారణంగా మొత్తం మీద మంచి రాబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలి. మరో ముఖ్య విషయం.. సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ.. స్టాక్ మార్కెట్లు ఏళ్ల తరబడి బేర్స్ గుప్పిట్లో ఉండిపోతే అప్పుడు నష్టాలు చవిచూడాల్సి ఉంటుందని తెలుసుకోవాలి. బడ్జెట్ సవివరంగా ఉండాలి.. ప్రతీ కుటుంబానికి సవివరమైన ఆర్థిక ప్రణాళిక ఉండాలన్న దురభిప్రాయం కూడా ఒకటి ఉంది. ‘‘బడ్జెట్ అంటే ప్రతీ ఒక్కటి రాయాలని ఏమీ లేదు. ఖర్చులను మూడు రకాల బకెట్లుగా వర్గీకరించాలి. ఖర్చులు, చెల్లింపులు, పొదుపు’’ అని అమోల్ జోషి సూచించారు. వ్యక్తుల ఆదాయ స్థాయిలు, జీవితంలో వారు ఏ దశలో ఉన్నారన్నదాని ఆధారంగా ప్రతీ బకెట్లో ఏవి ఉండాలన్నది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అధిక ఆదాయం ఉన్న వారికి ఖర్చులు మూడింట ఒక వంతు మించకూడదు. అలాగే, ఎటువంటి రుణాలు లేని వారికి చెల్లింపుల విభాగం అవసరం లేదు. ప్రతీ విభాగంలో ఎంత, ఏవి ఉండాలన్నది వారి అవసరాలు, ఖర్చులను బట్టే ఉంటుంది. ‘‘భార్యా భర్తలు కూర్చుని చర్చించుకుంటే తమ ఖర్చులపై 15–20 నిమిషాల్లోపే స్పష్టతకు రావచ్చు. విచక్షణారహిత ఖర్చులైన రెస్టారెంట్లో విందు, సినిమాలు.. అలాగే, ప్రయాణ ఖర్చులపై స్పష్టతకు రావాలి’’ అని పేర్కొన్నారు సెడగోపన్. ఇక రూపొందించుకున్న బడ్జెట్ను దాటిపోతున్నారేమో కూడా చూసుకోవాలి. అలా జరిగితే దీర్ఘకాల లక్ష్యాలు ప్రభావితం అవుతాయి. ఏ విభాగంలో అధికంగా ఖర్చులు వస్తున్నదీ పరిశీలించాలి. ఉదాహరణకు స్మార్ట్ఫోన్ దెబ్బతినడం వల్ల వెంటనే ఫోన్ కొనుగోలు చేయాల్సి వచ్చిందనుకుంటే.. అప్పుడు వార్షిక పర్యటన కోసం పక్కన పెట్టిన పొదుపును వినియోగించుకుంటే నష్టం లేదు. దీనికి బదులు ముఖ్యమైన మీ పిల్లల ఫీజులు లేదా రిటైర్మెంట్ జీవితం కోసం చేస్తున్న పొదుపులను త్యాగం చేస్తే ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి.. మధ్యతరగతికి రిస్క్ సరికాదు.. మధ్యాదాయ వర్గాల వారు రిస్క్ తీసుకోకూడదన్నది మరొక తప్పుడు నిర్వచనం. అన్ని విషయాల్లోనూ కాకుండా కేవలం కొన్నింటికే ఇది వర్తిస్తుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. అవగాహనలేమితో రిస్క్కు పూర్తి దూరంగా ఉండిపోవడం వల్ల కావాల్సిన ఫలాలను అందుకోలేకపోవచ్చు. ఈ వర్గం వారికి ఆదాయం మధ్యస్థంగా ఉంటుంది. రిస్క్కు వెరసి తమ జీవిత లక్ష్యాల కోసం తక్కువ రిస్క్ ఉండే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే... తక్కువ రిస్క్ ఉండే సాధనాల్లో పెట్టుబడులు ఏ మాత్రం ఆశాజనకంగా ఉండవు. చాలా తక్కువ రాబడి వల్ల తమ లక్ష్యాలను చేరుకునే స్థాయిలో నిధిని సమకూర్చుకోలేకుండా ఉండిపోవాల్సి వస్తుంది. నిజానికి ఈ తరహా వర్గీయులు తప్పకుండా కొంత మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తద్వారా దీర్ఘకాలంలో అధిక రాబడులను సమకూర్చుకోవచ్చు. ‘‘పరిమిత ఆదాయ వనరులు ఉన్న వారు ఈక్విటీలను విస్మరించకూడదు. అదే జరిగితే వారి పెట్టుబడిని ద్రవ్యోల్బణం మింగేస్తుంది. అయితే, ఈక్విటీలకు ఎంత కేటాయించుకోవాలన్నది ప్రశ్నించుకోవాలి’’ అని లాడర్7 ఫైనాన్షియల్ అడ్వైజరీస్ వ్యవస్థాపకుడు సురేష్ సెడగోపన్ సూచించారు. రిటైర్మెంట్ ప్రణాళిక అంటే డబ్బు గురించే.. పదవీ విరమణ తర్వాతి జీవితానికి ప్రణాళిక వేసుకోవడం అంటే పొదుపు చేయడం ఒక్కటేనన్న దురభిప్రాయంతో కొందరు ఉంటుంటారు. విశ్రాంత జీవన ప్రణాళికలో నిధితో పాటు ఇతర అంశాలకు కూడా చోటు ఉండాలి. ‘‘రిటైర్మెంట్ జీవితం అన్నది 30–40 సంవత్సరాల వరకు ఉంటుంది. డబ్బు, ఇతర కార్యకలాపాల మధ్య సమన్వయం అవసరం. ఖాళీ సమయాన్ని తమ హాబీల కోసం, స్నేహితులతో సంబంధాల పునరుద్ధరణకు వెచ్చించాలి. సామాజిక బాధ్యతపై కొంత సమయం వెచ్చించడం కూడా ఆనందాన్నిస్తుంది’’ అని అమోల్ జోషి సూచించారు. రిటైర్మెంట్ ప్రణాళికను రెండు విభాగాలుగా రూపొందించుకోవాలి. మొదటిది మీరు ఆరోగ్యంగా ఉండే కాలానికి సంబంధించినది. రెండోది ఆ తర్వాత కాలానికి ఉద్దేశించినది. రెండో విభాగంలో మరొకరి సాయం మీకు అవసరపడొచ్చు. పిల్లల సహకారం ఉంటుందన్న భరోసా లేని వారు ఆ సమయంలో ఎలా వ్యవహరించాలో ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిదని నిపుణుల సూచన. -
నా కాషాయం చూసి అపోహ పడొద్దు: యోగి
-
నా కాషాయం చూసి అపోహ పడొద్దు: యోగి
తాను కాషాయ దుస్తులు వేసుకుంటాను కాబట్టి తనపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, అయితే తాను అన్ని వర్గాలకు చెందినవారి హృదయాలను గెలుచుకుంటానని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇన్నాళ్లుగా లౌకికవాదం పేరుతో భారతీయ సంప్రదాయాలను అవమానిస్తున్న వాళ్లు తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత భయపడుతున్నారని చెప్పారు. తాను కాషాయం వేసుకుంటానని, దేశంలో చాలామందికి అసలు కాషాయం అంటే ఇష్టం లేదని ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక 'ఆర్గనైజర్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. తన పనితీరుతో అన్ని వర్గాలను మెప్పిస్తానని, అందరికీ సంతోషం పంచుతానని చెప్పారు. పెద్ద పెద్ద పదవులు చేపట్టడం కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, ఇంతకుముందులాగే సేవ చేయాలనే వచ్చానని యోగి చెప్పారు. దేశాన్ని కాపాడటమే తన ప్రభుత్వ ప్రధాన ధర్మమని స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్లో అవినీతి రహిత ప్రభుత్వ యంత్రాంగాన్ని అందిస్తామని, సమాజం నుంచి గూండా రాజ్యాన్ని తరిమేస్తామని తెలిపారు. రాబోయే రెండు నెలల్లోనే ప్రభావం స్పష్టం కనిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని అమలులోకి తెస్తామని, ఏ పరిశ్రమలోనైనా ఇక నుంచి 90 శాతం మంది ఉద్యోగులు ఉత్తరప్రదేశ్ వాళ్లే అయ్యేలా చూస్తామని చెప్పారు. చెరుకు రైతుల బకాయిలను 14 రోజుల్లోగా చెల్లిస్తామని, రాబోయే ఆరు నెలల్లో కొత్తగా ఐదారు చక్కెర కర్మాగారాలు నెలకొల్పుతామని అన్నారు. -
వాస్తవాలతో భ్రమలకు చెల్లుచీటీ
జాతిహితం మీరు అర్థరహితంగా మాట్లాడుతున్నారూ అంటే, మీ బుర్రను పరీక్ష చేయిం చుకోవాల్సిందేనని ఎవరైనా చెబుతారు. అయితే అసలా అవసరమే రాని సమయాలూ ఉంటాయి. సబ్సిడీలు లేకుండా కూడా వ్యవసాయరంగం మన గలుగుతుందని మీరు విశ్వసించేట్టయితే పిచ్చివాడని ముందుగానే మీకు ఓ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఈ వారం జాతిహితంలో గణాంకాల ఆధారంగా కొన్ని భ్రమలను బద్ద లుకొడతామని వాగ్దానం చేశాం. వ్యవసాయానికి చాలా అధికంగా సబ్సిడీ ఇస్తున్నారనే విస్తృతాభిప్రాయాన్ని సవాలు చేయడానికి బదులుగా మనం దాన్ని ఎందుకు సమర్థిస్తున్నాం? బహుశా మన బుర్రలను పరీక్ష చేయించుకోవాల్సి ఉండి ఉంటుంది. అయితే వాస్తవాలను ముందు చూద్దాం. జపాన్లో మొత్తం వ్యవసాయ ఆదా యంలో వ్యవసాయ సబ్సిడీల వాటా 56 శాతంగా, యూరోపియన్ యూని యన్లో 19 శాతంగా, అమెరికాలో కేవలం 7.1 శాతంగా ఉంది. ఇవి ఆర్గనై జేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) గణాం కాలు. జపాన్ విషయం నిజానికి ప్రత్యేకమైనదే అయినా, అదే ఎక్కువ చర్చ నీయాంశంగా ఉంది. బియ్యం దిగుమతులపై 778 శాతం, గోధుమ దిగుమ తులపై 252 శాతం సుంకాలను విధించి జపాన్ కూడా తన రైతాంగాన్ని కాపాడుతోంది. కాబట్టి మీరు మీ రైతుల పరిరక్షణకు కూడా అడ్డు చెప్పొద్దు. ప్రతి దేశమూ ఆ పని చేయాల్సిందే. అయితే మన దేశంలోలాగా ఇతర మరే పెద్ద ఆర్థిక వ్యవస్థలోనైనా రైతు ఇలా ఆకలిగా అర్థనగ్నంగా ఉంటాడా? మన ఎరువుల సబ్సిడీలు రూ.70,000 కోట్లకు మించి పోయాయి. మన రాష్ట్రాలు వ్యవసాయ రంగానికి చెల్లించే మొత్తం విద్యుత్ సబ్సిడీ కూడా ఇంచు మంచు రూ.70,000 కోట్లుంటుంది. వీటికి విత్తనాలు, వ్యవసాయ సాధ నాలు, డీజిల్ (ఇటీవలి వరకు), ఉచిత నీరు, బోసస్ వగైరా ఉత్పత్తి కార కాలపై ప్రత్యక్ష సబ్సిడీలను కూడా కలుపుకుంటే.. మొత్తం వ్యవసాయ సబ్సిడీలు ఎంత తక్కువగా చూసినా రూ. 2,00,000 కోట్లకు దాటి పోతాయి. అయినా రైతు దయనీయ స్థితిలోనే ఉన్నాడు. మన ఆర్థిక వ్యవస్థలో వ్యవ సాయం నిరాదరణకు గురైనది, కాబట్టి దానికి మరిన్ని సబ్సిడీలను ఇవ్వాలనే గగ్గోలు ఎప్పుడూ ఉంటుంది. మేం సవాలు చేస్తున్నది ప్రధానంగా వ్యవసాయం దరిద్రపుగొట్టుదనే భ్రమను. మన దేశానికి కావాల్సింది ఇంకా ఎక్కువ వ్యవసాయ సబ్సిడీలు కావు, వివేచనాయుతమైన సబ్సిడీలు. సబ్సిడీలలో అత్యధిక భాగం బడా రైతులకే దక్కుతున్నాయనేది ప్రపంచవ్యాప్త వాస్తవం. మన దే శంలో అందుకు విరుద్ధంగా అవి బడా వ్యాపార రంగానికి చేరుతున్నాయి. మొత్తంగా ఎరు వుల పరిశ్రమే ఆ సబ్సిడీల చుట్టూ విస్తరించి ఉన్న సిగ్గు చేటైన వ్యవహారం. ఎరువుల శాఖ నేరుగా ఉత్పత్తిదారులకు రూ.70,000 కోట్ల సబ్సిడీని పంచి పెడుతోంది. అది వారికి ఒక పెద్ద ఏటీఎమ్గా మారింది. ఇదిలా ఉంటే, రైతు ఎరువుల కోసం బిచ్చగాడిలా దేబిరించాల్సి ఉంటుంది. సబ్సిడీల వల్ల ధరలు తగ్గి యూరియా అనే ఎరువు కోసం శాశ్వతంగా కొరత ఎలా ఏర్పడిందో, దాని కోసం ఎలా అల్లర్లు సైతం జరుగుతున్నాయో మరోసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. సబ్సిడీ వల్ల భారత్లో యూరియా ధర దాని అసలు ధరలో మూడో వంతుకంటే కూడా చౌకగా మారింది. దీంతో దాన్ని పొరుగు దేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారు. సబ్బులు, పేలుడు పదార్ధాలు మొదలు పాల కల్తీ వరకు ఇతర పరిశ్రమలకు యూరియాను మరలించేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏ చైనా నుండో యూరియాను ‘‘దిగుమతి’’ చేసుకొని మన ప్రాదేశిక జలాలకు ఆవలి అంతర్జాతీయ సముద్రం ద్వారా తిరిగి ఆ దేశానికే ‘‘ఎగుమతి చేయడం’’ సైతం జరుగుతోంది. సబ్సిడీని ఇరు పక్షాలూ పంచుకుంటాయి. ఈ చెడంతా చాలదన్నట్టు ఈ అధిక సబ్సిడీ ఆవశ్యకమైన ఎన్పీకే (నైట్రోజన్, ఫాస్పేట్, పొటాషియం) మిశ్రమంలో ఇతర రెండింటినీ వదిలి యూరియా లేదా నైట్రోజన్ను మన రైతులు ఎక్కువగా వాడే స్థితికి నెడుతోంది. ఫలితంగా కోట్ల హెక్టార్ల అత్యంత సారవంతమైన భూములు నాశనమైపోతున్నా యి. రైతులకు భూసార పరీక్ష కార్డులు ఇవ్వడం మంచి ఆలోచన. కానీ కుళ్లి కంపుకొడుతున్న ఎరువుల సబ్సిడీ ఆర్థికశాస్త్రం దాన్ని ఓడించేస్తుంది. బ్రహ్మాం డమైన స్వార్థ ప్రయోజనాలు, లాభాలు చేసుకునే మాఫియా ఈ ఎరువుల సబ్సిడీల చుట్టూ నిర్మితమై ఉంది. అనాలోచితమైన వ్యవసాయ సబ్సిడీలు, వివేకరహితమైన ఆహార ఆర్థిక వ్యవస్థతో కలసి భారత వ్యవసాయ రంగాన్ని గందరగోళంగా మార్చింది. కాబట్టి మేం కూల్చివేయనున్న రెండవ అతి పెద్ద భ్రమ నయా-ఉదారవాద సంబంధమైనది. అది, పన్ను మినహాయింపులున్న రైతుకు అధిక సేకరణ ధరలను చెల్లిస్తూ ప్రభుత్వం అతిగా గారం చేస్తోంది; తద్వారా అది పన్ను చెల్లింపుదారులకు నష్టం కలిగించడమే గాక, ఆహార ద్రవ్యోల్బణానికి కూడా దారితీస్తోందనే భ్రమ. వ్యవసాయరంగంపై శాంతా కుమార్ కమిటీ ఇటీవలే వీటిలో కొన్ని అంశాలను వివరంగా పరిశీలించింది. చాలా గణాంకాలకు గానూ నేను నా రచయితలకు కృతజ్ఞుడిని. మన దేశంలో గోధుమ సేకరణ, లేదా కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పీ) టన్నుకు 226 డాలర్లు. అదే పాకి స్తాన్లో 320 డాలర్లు, చైనాలో 385 డాలర్లు. వ్యవసాయం బాగా తెలిసిన ఏ రైతూ, ప్రపంచంలో ఎక్కడా తన సాగు ఏమీ బాగా లేదని అనడు. కానీ మనతో పోల్చి చూసుకునే దేశాలలో అత్యధికం మనకు భిన్నంగా తమ వ్యవసాయాన్ని సంస్కరించుకున్నాయనేది వాస్తవం. పాకిస్తాన్, చైనాలు రెండూ ఆదాయ మద్దతు రూపంలో ప్రత్యక్ష వ్యవసాయ సబ్సిడీలను అమలుచేస్తున్నాయి. రెండూ ప్రజా పంపిణీ వ్యవస్థను (పీడీఎస్) రద్దు చేశాయి. మనం మాత్రం మితవాద ధోరణితో రైతులకు ‘‘మద్దతు’’ను ఇస్తున్నాం. ఆ తక్కువ ధరకు సైతం ప్రభుత్వ సంస్థలకు తమ ఉత్పత్తులను అమ్ముకోగలిగేది. కేవలం 6 శాతం మంది రైతులు మాత్రమే. కన్నాల్లోంచి ఎక్కడికక్కడ కారిపోయే, తేలిగ్గా వచ్చి పడే డబ్బు రూపేణా వ్యవసాయ సబ్సి డీలను చెల్లాచెదురు చేసేస్తాం. ఆ మీదట ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా విని యోగదారులకు సబ్సిడీ ధరలకు అమ్మడం కోసం భారీగా ఆహార ధాన్యాల నిల్వలను పోగుచేస్తాం. ఈ పీడీఎస్ను నేను ప్రజా దౌర్భాగ్య వ్యవస్థ అని అం టాను. అందువలన మనం మన ఆహార/వ్యవసాయ ఆర్థికశాస్త్రాన్ని మొత్తం మూడు అంశాల్లోనూ వక్రీకరించాం. వికృతపరచాం: ఉత్పత్తికారకాలు (ఇన్ పుట్స్), ఉత్పత్తులను రైతే నేరుగా అమ్ముకోవడం, వినియోగం. విపరీతంగా విస్తరించిన ధరల హెచ్చు తగ్గులన్నింటి ప్రయోజనాలు చివరికి అవాంఛనీ యమైన జేబుల్లోకి, మధ్యవర్తులు, ఇన్స్పెక్టర్లు, ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) అనే బ్రహ్మాండమైన వ్యవస్థకు చేరుతాయి. అందువలన, మన దేశ ఆహార భద్రతకు మరీ మరీ ఎక్కువగా ఆహార ధాన్యాలు అవసరమేనేది తదుపరి మా హిట్లిస్ట్లో ఉన్న భ్రమ. క్షామ పరిస్థితులను స్థిరీకరించడం కోసం దేశానికి అవసరమయ్యే బఫర్ స్టాక్ కేవలం కోటి టన్నులు మాత్రమేనని, అందులో భౌతికంగానూ, మిగతా సగం అంతర్జాతీయ ఆహార ధాన్యాల ఫ్యూచర్స్, ఆప్షన్ల రూపంలోనూ ఉంటే సరిపో తుందని శాంతా కుమార్ కమిటీ తెలిపింది. కానీ వార్షిక ఆహార ధాన్యాల ఉత్పత్తిలో 15-20 శాతం (3.2 కోట్ల టన్నులు) అనే కాలం చెల్లిన ప్రమాణం అమల్లో ఉన్న దేశంలో అలాంటి ఆలోచన మరీ విప్లవాత్మకమైనది. మన ఆహారధాన్యాల ఉత్పత్తి 2014-15లో 25.1, 2013-14లో రికార్డు స్థాయిలో 26.5 కోట్ల టన్నులు. ఆహార భద్రతా చట్టం వల్ల పీడీఎస్ అదనపు అవసరాలను కూడా చేర్చితే మన బఫర్ స్టాక్ 4.2 కోట్ల టన్నులకు చేరుతుంది. కానీ నేడు మనం 6 కోట్ల టన్నులకు పైగా నిల్వలను పెట్టుకున్నాం. వాస్తవానికి మనం అతి సులువుగా కోటి టన్నుల ఆహార ధాన్యాలను ఎగుమతి చేసుకోవచ్చు. అలా అని రెండేళ్ల క్రితం నిర్ణయించినా, నాటి కాగ్, సీవీసీ, సీబీఐల కాలంలో ఆహా రశాఖ అందుకు జంకింది. ఈ అదనపు నిల్వల వ్యయం రూ. 45,000 కోట్లకు పైగానే, ఫలితాలు మాత్రం శూన్యం. ఎఫ్సీఐ రైతులకు చెల్లింపులు చేసిన తర్వాత ధాన్యాన్ని తరలించడానికి టన్నుకు రూ. 4.75 ఖర్చవుతుంది. ఈ అదనపు ధాన్య నిల్వల రవాణాకే రూ.7,500 కోట్లు అదనపు ఖర్చు. ఈ అంకెలను దయచేసి గుర్తుంచుకోండి, మరో నిమిషంలో మనం వాటి వద్దకే మళ్లీ రానున్నాం. ఇది, విస్తృతంగా ప్రచారంలో ఉన్న మన ఆహారభద్రత ప్రమాదకర స్థితిలో ఉన్నదనే భ్రమను తుత్తునియలు చేస్తుంది. ఇది ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే క్రిస్టోఫ్ జఫర్లోట్ వంటి అత్యంత జాగరూకత గల అద్భుత విద్యావేత్త సైతం ఆ మాయలో పడిపోయారు. ఇటీవల ఓ పత్రిక కాలమ్లో ఆయన, గత ఏడాది మనం ‘‘80,000 టన్నుల’’ గోధుమలను దిగుమతి చేసుకోవడాన్ని ఆహార భద్రతకు తలెత్తనున్న ముప్పుగా అభివర్ణించారు. గంగా-జమునీ అలంకారిక భాషలో చెప్పాలంటే, 6 కోట్ల టన్నుల గోధుమ, బియ్యం నిల్వలు ఉండగా 80 వేల టన్నుల దిగుమతి ఒంటె నోట్లోని జీలకర్ర గింజంత. ఈ గోధుమ దిగుమతులపై పరిశోధనాత్మక దర్యాప్తు జరిపిన దరిమిలా అవి మాగీలాంటి కొన్ని బ్రాండెడ్ వస్తువుల తయారుదారులు విభిన్నమైన జిగురు, పీచు అవసరాల కోసం దిగుమతి చేసుకున్న కొద్ది మొత్తాలనీ, లేక పోతే ఉత్తర భారతంలోని ఎఫ్సీఐ గోడౌన్ల నుంచి తెచ్చుకునే కంటే ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకోవడమే చౌకనుకున్న కొన్ని పిండి మిల్లుల దిగుమతులనీ తేలింది. ఇలాంటి ముక్కలు చెక్కల అర్థశాస్త్రం మీకు పిచ్చి అనిపిస్తోందా? మీకు మరిన్ని విషయాలు చెబుతాను. ఎఫ్సీఐ కోసం ఆహార ధాన్యాల సేకరణను ఎక్కువగా చేసేవి పంజాబ్, హర్యానా రాష్ట్రాలే. అవి కనీస సేకరణ ధరపై 15 శాతం సెస్ను కేంద్రంపై విధిస్తాయి. ఆహారధాన్యాలను ఎక్కువగా పండిస్తున్నందుకు కేంద్రం వాటికి నేరుగా చెల్లిస్తున్న బహుమతే ఇది. ఇక మీరు హరిత విప్లవం సాధించిన రైతు విపత్కరమైన గోధుమ/వరి విషవలయంలో చిక్కుకుపోయాడని ఫిర్యాదు చేస్తారు. గోధుమ/వరి వల యం ఆ రాష్ట్రాల బడ్జెట్లకు డబ్బులు రాల్చేది అయినప్పుడు అవి రైతును క్యాబేజీ, బెండ, గోబి, క్యాలిఫ్లవర్ లేదా దోస వేయమని ఎందుకు ప్రోత్స హిస్తాయి? భారత వ్యవసాయాన్ని చక్కదిద్దాలంటే పంజాబ్, హర్యానాలు వ్యాపార పంటలకు, మద్దతు ధరతో మొక్కజొన్నకు మారమని చెప్పాలి. బాస్మతి వరి వేస్తే మామూలు వరితో పోలిస్తే టన్నుకు మూడు రెట్లు ఆదాయా న్నిస్తాయి, మూడో వంతు తక్కువ నీటిని వినియోగిస్తాయి. మామూలు వరిని ఈశాన్య రాష్ట్రాలకు, నర్మదా నదీ జలాలతో శక్తివంతమైన మధ్య ప్రదేశ్కు బదలాయించవచ్చు. ఎంపీ రైతులు దాదాపు 20 శాతం వృద్ధిని నమోదుచేస్తున్నారు. పరిశ్రమలు, పట్టణీకరణల కోసం భూమిని సేకరిస్తే దే శంలో సాగు భూమికి కొరత ఏర్పడి ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతోందనేది తదుపరి కూల్చి పారేయాల్సిన భ్రమ. మరో మారు వాస్తవాలనే చూద్దాం. మన దేశం దాదాపు 20 కోట్ల హెక్టార్ల సాగుయోగ్యమైన భూమిలో వ్యవ సాయం చేస్తోంది. ఇంచుమించు సాలీన 26 కోట్ల టన్నుల ఆహారధాన్యాలను ఉత్పత్తి చేస్తోంది. చైనా సాగుచేస్తున్నది 15.6 కోట్ల హెక్టార్లు. కాగా, ఉత్పత్తి చేస్తున్నది (ఊపిరి బిగబట్టి వినండి!) 60 కోట్ల టన్నులు. ఎందువల్ల? దానికి సాగునీరుంది. అక్కడి వరిలో 63 శాతం సంకర వంగడాలు. కాగా, మన దేశంలో అది కేవలం 3 శాతమే. ఎందుకు? ఆ విషయాన్ని మీరు వామపక్ష, మితవాద ‘‘సేంద్రియ వ్యవసాయ’’ లుడ్డైట్లను (19వ శతాబ్దపు యంత్ర విధ్వంసకులు-అను.) అడగండి. స్థూలంగా పైన ఇచ్చిన గణాంకాలన్నీ వ్యవ సాయ ఆర్థిక శాస్త్రవేత్త అశోక్ గులాతీ నుంచి సేకరించినవే. మీరు వ్యవసాయరంగాన్ని చక్కదిద్దగలగాలంటే ఏమేం చేయాలో స్వల్ప జాబితా ఇది. ఒకటి, సబ్సిడీల మొత్తానికంతటికీ సువ్యవస్థితం చేసి, వాటిని నేరుగా రైతుకే భూకమతం ఆధారంగా చెల్లించండి. రెండు, వ్యవ సాయ ఉత్పత్తుల ధరలను స్వేచ్ఛగా మార్కెట్లో నిర్ణయం కానివ్వండి. మూడు, మద్దతు ధరను నగదు రూపంలో చెల్లించి, విద్యుత్తు సహా అన్ని ఉత్పాదితాలకు మార్కెట్టు ధరలను వసూలు చేయాలి. నాలుగు, పొదుపులు, అదనపు మదుపులన్నీ నీటి పారుదల, సాంకేతికత ఉన్నతీకరణ, నూతన విత్తనాలు, జీఎమ్ సహా పరిశోధనపై పెట్టాలి. నీటిపారుదల మధ్యప్రదేశ్లో ఎలాంటి అద్భుతాన్ని చేసిందో చూడండి. అయితే, మహారాష్ట్రలో నీటిపారుదలపై 2000-01 నుంచి 2010-11 మధ్య రూ.81,206 కోట్లు ఖర్చు చేసినా నీటి వసతి ఉన్న పత్తి సాగు 5.1 శాతానికి మించలేదని కూడా విస్మరించరాదు. అందులో సగం ఖర్చుతో గుజ రాత్లో 67 శాతం సాగు అదనంగా పెరిగింది. దీన్ని మీరు విదర్భ, గుజరాత్ పత్తి రైతుల పరిస్థితులను పోల్చి చూడటం ద్వారా చూడవచ్చు. ఐదు, దుర్భిక్షం అనివార్యం అని, అలాగే వాతావరణ మార్పుల వల్ల విపరీత వాతావరణ పరిణామాలు చోటు చేసుకుంటాయని అంగీకరించాలి. భారత్లో ప్రతి నాలుగైదు ఏళ్లకు ఒకసారి దుర్భిక్షం ఏర్పడుతుందని గత వందేళ్ల గణాంక సమాచారం చెబుతోంది. కాబట్టి మనకు నిజమైన వ్యవ సాయ బీమా వ్యవస్థ, దేశంలోని 70 శాతం సాగుకంతటికీ పూర్తి బీమాను కల్పించే వ్యవస్థ. కానీ దానికి ఏటా రూ.15,000 కోట్లు అవసరం. ఎఫ్సీఐ ఆ మిగులు ఆహారధాన్యాల బరువు మోయకుండా ఉంటే చాలు అందులో సగం మొత్తం లభిస్తుంది. ఇంతకు ముందు చెప్పిన ఆ రూ.7,500 కోట్ల అంకెను గుర్తు తెచ్చుకోండి. ఎలాంటి బీమా? అందుకు అమలులో ఉన్న చాలా నమూనాలే ఉన్నాయి. నిజంగానే అద్భుతమైన నమూనా పీకే మిశ్రా (ప్రధాని కార్యాలయం ప్రస్తుత అదనపు ప్రధాన కార్యదర్శి) నేతృత్వంలోని పంటల బీమా పథకాల సమీక్ష, అమలు కమిటీ వద్ద సిద్ధంగా ఉంది. స్మార్ట్ ఫోన్లు, జీపీఎస్, ద్రోన్ల సమ్మేళనంతో సత్వర చెల్లింపులు చేయడంపై ఇతర నిపుణులు కూడా ఆ విష యంలో చాలా కృషే చేశారు. గులాతీ అన్నట్టు, కెన్యా చేయగా, మనం చేయ లేమా? అంతకంటే ముందుగా రైతును బిచ్చగాడిగా దిగజార్చి, అతనికి బిచ్చం వేస్తూ, దాన్ని కూడా ఆకలితో కాక దురాశతో నకనకలాడుతున్న వంచ కులు కాజేస్తున్నా బూటకపు సంతృప్తిని కలిగిస్తున్న ఈ భ్రమలను చెత్త బుట్టలో వేయాలి. - శేఖర్ గుప్తా shekhargupta653@gmail.com