breaking news
Minerals development Organization
-
గోల్ ‘మాల్స్’పై కొరడా.!
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్టీప్లెక్స్, థియేటర్ల చేతివాటంపై తూనికల కొలుతల శాఖ కన్నెర చేసింది. మల్టీప్లెక్స్, థియేటర్లలో ప్యాకేజ్డ్ కమోడిటీస్ చట్టం (ఎమ్మార్పీ) అమలు ఉల్లంఘనపై గురువారం ‘సాక్షి’ దిన పత్రికలో ‘ఆగని గోల్ మాల్స్’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై తూనికలు, కొలుతల శాఖ స్పం దించింది. ఎంఆర్పీ కంటే అధిక ధరలు వసూలు చేస్తున్న పలు మల్టీప్లెక్స్లపై గురువారం మూకు మ్మడి దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసి ంది. నగరంలోని 20 మల్టీప్లెక్స్లపై తూనికలు, కొలుతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్లు భాస్కర్రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, విజయసారథి, నిర్మల్ కుమార్, రాజేశ్వర్, శివానంద్ ఆధ్వర్యంలో సుమా రు 30 మందితో కూడిన ఏడు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. నిబంధనలు పాటించకుండా వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్న 18 మల్టీప్లెక్స్లలో 54 కేసులు నమోదు చేశాయి. కేసులు నమోదైన మాల్స్ ఇవే... ఈ సందర్భంగా అధికారులు ఐమాక్స్, పీవీఆర్ గెలీలియో, పీవీఆర్ ఐకాన్ మాదాపూర్, జీవీకే వన్ బంజారాహిల్స్, బిగ్ సినిమా కాచిగూడ, మహాలక్ష్మి కొత్తపేట, బీబీకే మల్టీప్లెక్స్ ఎల్బీనగర్, ఏషియన్ సినిమా స్క్వైర్ ఉప్పల్, ఏషియన్ రాధిక ఈసీఐఎల్, సినీపోలీస్ మల్కాజిగిరి, తాళ్లూరి ఈసీఐఎల్, స్పెషల్ సినిమా ప్రై.లి. మల్లాపూర్, ఏషియన్ ముకుంద మేడ్చల్, ఏషియన్ సినీ ప్లాంట్ కొంపల్లి, సుజనా ఫోరం మాల్ కూకట్పల్లి, మంజీరా మాల్ జేఎన్టియూ, సినీపోలీస్, శంషాబాద్, ఏషియన్ సినిమా టౌన్, మియాపూర్ మల్టీప్లెక్స్లపై కేసులు నమోదు చేశారు. కూకట్పల్లిలో ఇలా... సుజనా ఫోరం మాల్లోని పీవీఆర్ సినిమాలో తనిఖీలు నిర్వహించిన అధికారులు కూల్ డ్రింక్స్ కప్లపై లార్జ్, స్మాల్ అనే సంకేతాలు తప్ప ఎంత పరిమాణం(లీటర్లలో) పేర్కొన లేదని గుర్తించారు. పీవీఆర్ మఖానా ప్యాక్పై కస్టమర్ కేర్కు సంబంధించిన సమాచారం లేదు. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. ఎమ్మార్పీ ధరల అమలుకు సంబంధించి జారీచేస్తున్న బిల్లులను సైతం సరిపోల్చుకున్నారు. మంజీ రా ట్రినిటీ మాల్లో గల సినీపోలీస్లోనూ తినుబండారాల విక్రయ కేంద్రా ల వద్ద సరైన సమాచారం లేకపోవడం, పాప్కార్న్ ప్యాక్లు, కూల్ డ్రింక్ కప్లపై పరిమాణం తెలిపే వివరాలు లేకపోవడాన్ని గుర్తించా రు. వేయింగ్ మెషిన్లపై అధికారిక ముద్ర, సీల్ లేకపోవడాన్ని గుర్తించి మూడు కేసులు నమోదు చేశారు. కొత్తపేటలోని మహాలక్ష్మీ, మిరాజ్ సినిమా మల్టీప్లెక్స్ హాళ్లను తనిఖీ చేసిన అధికారులు మహాలక్ష్మీ థియేటర్ నిర్వాహకులపై మూడు కేసులు నమోదు చేశారు. కాచిగూడలో.. సుల్తాన్బజార్: కాచిగూడ క్రాస్రోడ్స్లోని ఐనాక్స్ మల్టీప్లెక్స్లో సమోసాలు, పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ధరలను చూసి అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అధిక ధరలకు విక్రయిస్తున్న పాప్కార్న్ ఇతర ఆహార పదార్థాలను స్వాధీనం చేసు కుని నోటీసులు జారీ చేశారు. అదే విధంగా ఏఎస్రావునగర్లోని ఆసియా సినిమా(రాధిక మల్టీప్లెక్స్), తాళూరి ధియేటర్ల క్యాంటిన్లలో నిబ ంధనలకు విరుద్దంగా తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తుండటమేగాక నిర్ణీత పరిమాణానికి తక్కువగా తినుబండరాలను, కూల్డ్రింకులను వి క్రయిస్తున్నట్లు గుర్తించి మూడు కేసులు నమోదు చేశారు. మాల్స్లో బిల్లింగ్ మెషిన్లు సీజ్ తూనికలు, కొలతల శాఖ అధికారులు మాల్కాజిగిరి సినీపోలీస్, ఐమాక్స్ ప్రసాద్, తాళ్లూరి, స్పెషల్ సినిమాక్స్, ఐనాక్స్ కాచిగూడ, శంషాబాద్ సినీపోలీస్ మల్టీప్లెక్స్లలో బిల్లింగ్ మెషిన్లు సీజ్ చేశారు. ధరల పట్టికల ఏర్పాటు... చిక్కడపల్లి: ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని దేవి, సుదర్శ న్ థియేటర్లో ధరల సూచిక బోర్డు చేశారు. సూచిక బోర్డు కింద తూనికలు కొలతల శాఖకు ఫిర్యాదు చేయాల్సిన నంబర్లను సైతం అందుబాటులో ఉంటారు. టోల్ ఫ్రీ నంబర్ 1800450033, వాట్సప్ నంబర్ 7330774444 నంబర్లు అందుబాటులో ఉంచారు. ప్రధానంగా సినిమా హాల్స్, మల్టీఫ్లెక్స్లలో అధిక ధరలకు అమ్ముతున్నట్లు తూనికల కొలతల శాఖకు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో శాఖ అదేశాల మేరకు థియేటర్ యాజ మానులు స్పందించి సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. -
సీమాంధ్రకు అన్యాయం!
ఏపీఎండీసీ ఆస్తుల పంపకం ప్రతిపాదనలపై ఉద్యోగుల్లో అసంతృప్తి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీపీ) ఆస్తుల పంపకం ప్రతిపాదనలు సీమాంధ్ర కు అన్యాయం కలిగించేలా ఉన్నాయని ఆ ప్రాంత ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంస్థ ఆదాయంలో 95 శాతం వాటా కలిగిన సీమాంధ్రకు అప్పులు వదిలేసి ఆదాయాన్ని మాత్రం సీమాంధ్ర (ఆంధ్రప్రదేశ్), తెలంగాణలకు 52 : 48 నిష్పత్తిలో పంచాలంటూ సంస్థ చేసిన ప్రతిపాదనలపై అసహనంతో ఉన్నారు. ‘ఏపీఎండీసీకి రూ. 700 కోట్ల డిపాజిట్లు, ఇతరత్రా నగదు నిల్వలు ఉన్నాయి. ఇందులో సుమారు రూ. 200 కోట్లు పల్వరైజింగ్ మిల్లుల వారు బెరైటీస్ ఖనిజం కోసం చెల్లించిన అడ్వాన్సులకు సం బంధించినవి. భవిష్యత్తులో వారికి రూ. 200 కోట్ల విలువైన ఖనిజాన్ని ఇవ్వాల్సి ఉంది. అంటే ఈ రూ. 200 కోట్లు అప్పు కింద తొలగించాల్సి ఉంది. అప్పు కింద రూ. 200 కోట్లు మినహాయించి మిగిలిన రూ. 500 కోట్లు 52 : 48 నిష్పత్తిలో రెండు రాష్ట్రాలకు పంచాల్సి ఉండగా అప్పును వదిలేసి నగదు నిల్వలు మాత్రమే పంచేలా సంస్థ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇది కచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు అన్యాయమే’ అని ఆ ప్రాంత ఉద్యోగులు పేర్కొంటున్నారు. అమీర్పేట భవనంలో వాటా ఉంచండి.. ఏపీఎండీసీకి వస్తున్న ఆదాయంలో మొదటి నుంచి 95 శాతం సీమాంధ్రలోనిదే. కాగా మంగంపేట బెరైటీస్, చీమకుర్తి గ్రానైట్స్ ద్వారా వచ్చిన ఆదాయంతోనే అమీర్పేటలో ఏపీఎండీసీకి భవనాన్ని కొనుగోలు చేశారు. దీనిని కూడా రెండు రాష్ట్రాలకు 52:48 నిష్పత్తిలో పంచాలని అధికారులు భావిస్తున్నారు. ఇలా పంచి విక్రరుుంచడం ద్వారా తమ వాటా ఇవ్వకుండా భవనాన్ని అలాగే ఉంచాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. అది హైదరాబాద్లో అలాగే ఉంటే తమకు అతిథి గృహంగానైనా ఉపయోగపడుతుందనే అభిప్రాయూన్ని వ్యక్తం చేస్తున్నారు. బొగ్గు గనులివ్వాలి ఏపీఎండీసీకి మధ్యప్రదేశ్లోని సిలిగురి, ఒడిశాలోని నొవగాం-తెలిసాహిలో బొగ్గు గనులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి సింగరేణి బొగ్గు గనులు ఉన్నందున ఏపీఎండీసీకి ఉన్న రెండు కోల్బ్లాకులను ఆంధ్రప్రదేశ్కే వదిలేయాలని సంస్థ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆ గనుల కోసం ఏపీఎండీసీ వెచ్చించిన మొత్తమంతా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి వచ్చినదేనని ఆ సంస్థ ఉద్యోగులు అంటున్నారు.