breaking news
Million jobs
-
మూడు రెట్ల వృద్ధి:2.6 కోట్ల ఉద్యోగాలు
సాక్షి,న్యూఢిల్లీ: 2022 నాటికి ఆయుష్ రంగంలో మూడు రెట్ల పెరుగుదలను కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆయుష్ పరిశ్రమ భవిష్యత్తులో రెండంకెల వృద్ధిని సాధించనుందని, తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు లభింస్తాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. 2020 నాటికి 26 మిలియన్ల మందికి పరోక్ష ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఢిల్లీ నేటి (డిసెంబర్4) నుంచి మూడు రోజులపాటు జరగనున్న మొట్టమొదటి అంతర్జాతీయ వెల్నెస్, ఆరోగ్య 2017 సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలో ఆయుష్ రంగం ప్రగతి దిశగా పయనిస్తోందని.. ఈ రంగంలో మున్ముందు కోట్ల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని సురేశ్ ప్రభు అన్నారు. 2020 నాటికి ఈ రంగం ప్రత్యక్షంగా 10లక్షల మందికి, పరోక్షంగా 2.5 కోట్ల మందిని ఉపాధి కల్పిస్తుందని చెప్పారు. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధా, హోమియోపతి కలిసి ఉన్న ఆయుష్రంగం ద్వారా దేశీయంగా రూ. 500కోట్లను ఎగుమతుల ద్వారా రూ.200 వందలకోట్లను సాధిస్తుందని అంచనా వేసినట్టు చెప్పారు. సంప్రదాయ ఔషధాలపై అవగాహన కల్పించేందుకు భారత్తో కలిసి అనేక దేశాలు పనిచేస్తున్నాయని, అందుకు చాలా ఆనందంగా ఉందని కేంద్రమంత్రి ప్రభు వెల్లడించారు. దాదాపు 6,600 ఔషధ మొక్కల సంపదతో ప్రపంచంలోని ఆయుష్ మరియు ఔషధ ఉత్పత్తుల ఎగుమతిలో భారత్ రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉందన్నారు. అలాగే ఆయుష్లో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. వైద్యరంగంలో స్టార్టప్లు పెట్టాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు ఈ రంగంలో అనేక అవకాశాలున్నాయని ప్రభు తెలిపారు.వచ్చే ఐదేళ్లలో ఆయుష్ రంగం మూడు రెట్ల పరిమాణాన్ని పెంచేందుకు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని ఆయుష్ మంత్రిత్వ శాఖ సెక్రటరీ వైద్య రాజేష్ వెల్లడించారు. -
రోడ్డున పడనున్న కోట్ల మంది ఉద్యోగులు
న్యూఢిల్లీ: రోబోలు, ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని వింటుంటాం. కానీ దాని గురించి అంతపెద్దగా పట్టించుకోం. కానీ సమస్య అనుకున్నంత చిన్నదిగా మాత్రం లేదు. రోబోలు, ఆటోమేషన్ కారణంగా ఎంత మంది ఉపాధి కోల్పోతారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!! వీటి వల్ల ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఏకంగా 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ మెకిన్సే తాజాగా తన సర్వేలో పేర్కొంది. ఈ సంఖ్య ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం కార్మిక సిబ్బందిలో ఐదో వంతుకు సమానం కావడం గమనార్హం. అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలు రెండూ కూడా ప్రతికూల ప్రభావం ఎదుర్కొవలసి ఉంటుందని హెచ్చరించింది. ఆటోమేషన్ త్వరితగతిన విస్తరిస్తే మెషీన్ ఆపరేటర్లు, ఫాస్ట్ ఫుడ్ వర్కర్లు, బ్యాక్–ఆఫీస్ ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతారని, వారికి కష్టకాలం తప్పదని పేర్కొంది. ఒకవేళ రోబోలు, ఆటోమేషన్ అనుకున్నంత వేగంగా విస్తరించకపోతే అప్పుడు వచ్చే 13 ఏళ్లలో 40 కోట్ల మంది మాత్రం కొత్త ఉద్యోగాలను వెతుక్కోవలసి ఉంటుందని తెలిపింది. మెకిన్సే 46 దేశాల్లో ఈ సర్వే చేసింది. భారత్లో 12 కోట్ల ఉద్యోగాలకు ఎసరు!! రోబోలు, ఆటోమేషన్ వల్ల మనకూ ప్రమాదం పొంచి ఉంది. భారత్లో 11–12 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి రావొచ్చని మెకిన్సే అంచనా వేసింది. ఇక ఎక్కువ ఉద్యోగాల కోత చైనాలో ఉండొచ్చని పేర్కొంది. ఇక్కడ దాదాపు 20 కోట్ల మందిపైగా ఉపాధి కోల్పోనున్నారని తెలిపింది. ఇక అమెరికాలో 5–8 కోట్ల మంది ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. చైనా, భారత్, అమెరికా దేశాల తర్వాత జపాన్, మెక్సికో, జర్మనీ దేశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని అభిప్రాయపడింది. -
శిక్షణ ‘క్యూ’
లక్ష ఉద్యోగాలు వస్తాయని సంతోషం కోచింగ్ సెంటర్లకు పోటెత్తుతున్న అభ్యర్థులు కొత్త రాష్ట్రంలో ఉద్యోగాలపై కోటి ఆశలు ఫంక్షన్ హాళ్లకు మారిన తరగతి గదులు సాక్షి, సిటీబ్యూరో/ముషీరాబాద్: హైదరాబాద్ ఆశావహుల కేంద్రంగా మారింది. ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోన్న వేలాది మంది నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు కోచింగ్ సెంటర్లకు పోటెత్తుతున్నారు. ఒకటి, రెండు నెలల్లో సుమారు లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడవచ్చునన్న వార్తల నేపథ్యంలో తెలంగాణలోని వివిధ జిల్లాల నిరుద్యోగ అభ్యర్ధులు భారీ సంఖ్యలో నగరానికి తరలిస్తున్నారు. దీంతో గ్రూప్స్, సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్లు కళకళలాడుతున్నాయి. కోచింగ్ సెంటర్లకు నెలవైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, రాంనగర్ తదితర ప్రాంతాల్లో పంక్షన్ హాళ్లు తరగతి గదులుగా మారాయి. ఒక్కొక్క సెంటర్లో వేలాది మంది శిక్షణ కోసం పేర్లు నమోదు చేసుకోవడంతో నిర్వాహకులు తరగతి గదులను పంక్షన్ హాళ్లలోకి మార్చారు. ఈ ప్రాంతాల్లోని అన్ని ఫంక్షన్ హాళ్లు మరో 6 నెలల వరకు కోచింగ్ సెంటర్ల కోసమే బుక్ అయ్యాయి. కొన్ని చోట్ల కమ్యూనిటీ హాళ్లు, సాంస్కృతిక కేంద్రాలు సైతం కోచింగ్ కేంద్రాలకు వేదికలవుతున్నాయి. కళలకు, సాంస్కృతిక ప్రదర్శనలకు కేంద్రమైన త్యాగరాయ గానసభ సైతం కోచింగ్ సెంటర్గా మారింది. అక్కడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అభ్యర్థులకు శిక్షణనిచ్చేందుకు ఓ విద్యా సంస్థ 6 నెలల పాటు బుక్ చేసుకుంది. ఆర్టీసీ క్రాస్రోడ్స్ చుట్టూ ఉన్న ఫంక్షన్ హాళ్లు కోచింగ్లకు వచ్చే అభ్యర్ధులతో కిటకిటలాడుతున్నాయి. ఒక్కొక్క తరగతిలో 1000 నుంచి 1500 మంది విద్యార్థులకు ఒకేసారి బోధిస్తున్నారు. బంగారు భవిత కోసం నిరీక్షణ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కోటి ఆశలతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ నాటికి వరుసగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఉపాధ్యాయ నియామకాలు, పోలీసు కానిస్టేబుళ్ల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కోచింగ్ సెంటర్లకు డిమాండ్ పెరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్నగర్, తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఉన్న కోచింగ్ సెంటర్లలో సుమారు 50 వేల మంది శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం అశోక్నగర్లోని ఓ కోచింగ్ సెంటర్లో 1200 మందితో కొత్త బ్యాచ్ను ప్రారంభిం చేందుకు దర ఖాస్తులు విక్రయించగా, 4 వేల మందికి పై గా పోటీ పడ్డారు. దరఖాస్తుల కోసం అశోక్నగర్ చౌరస్తా నుంచి ఇందిరా పార్కు వరకు బారులు తీరారు. అభ్యర్థుల తాకిడితో కొన్ని కోచింగ్ సెంటర్లు శిక్షణ కాలాన్ని 3 నుంచి 4 నెలలకు కుదిస్తున్నాయి. సాధారణంగా కరెంట్ అఫైర్స్, మెం టల్ ఎబిలిటీ, పాలిటీ, తదితర అంశాలలో ఆరు నెలల శిక్షణతో పాటు, స్టడీ మెటీరియల్ను అందించే శిక్షణ సంస్థ లు డిమాండ్ దృష్ట్యా స్టడీ మెటీరియల్ను అందజేయలేకపోతున్నాయి. వారం రోజుల్లో ప్రస్తుత బ్యాచ్లను ముగించి, కొత్త బ్యాచ్ల కోసం కోచింగ్ సెంటర్లు సన్నద్ధమవుతున్నాయి. ఉద్యోగం వదులుకొని వచ్చాను గచ్చిబౌలీలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయనే ఉద్దేశంతో ఆ ఉద్యోగాన్ని వదులుకొని వచ్చాను. ఎలాగైనా సరే గ్రూప్-2 సాధించాలనే పట్టుదలతో ఉన్నాను. - బాలకృష్ణ, ఎంబీఏ, మెదక్ ఆడపిల్లలకు మంచి అవకాశం కొత్త రాష్ట్రంలో ఎలాగైనా ఉద్యోగా లు వస్తాయనే నమ్మకం ఉంది. ము ఖ్యంగా అమ్మాయిలకు ఇది మంచి అవకాశం. ఎంటెక్ చదువుతున్నాను. ప్రైవేట్ ఉద్యోగాల కంటే ప్రభుత్వ ఉద్యోగాల్లోనే మంచి భవిష్యత్తు ఉంటుందని పట్టుదలగా చదువుతున్నాను. - వనిత, ఎంటెక్, నల్లగొండ లక్ష ఉద్యోగాల పైనే ఆశలు లక్ష ఉద్యోగాలొస్తాయనే వార్తలు ఎంతో ఆశ కలిగిస్తున్నాయి. కష్టపడి చదివితే తప్పనిసరిగా ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉంది. కోచింగ్ తీసుకోవడం వల్ల మరింత అవగాహన పెరుగుతుంది. - సోమేష్, పీజీ, నల్లగొండ నమోదు కేంద్రాల్లోనూ రద్దీ.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్లకు ఉద్యోగార్థులు తరలి వస్తున్నారు. వివిధ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం పేర్లు నమోదు చేసుకుంటున్నారు. దీంతో మెహిదీపట్నంలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉపాధి కల్పన కార్యాలయాల వద్ద రద్దీ బాగా పెరిగింది. ఈ ఏడాదిలోనే ఉద్యోగార్ధులు భారీ సంఖ్యలో తరలివచ్చినట్లు అధికారులు చె ప్పారు. తె లంగాణ ఆవిర్భావం తరువాత ఉద్యోగాలపై అందరిలోనూ ఆశలు పెరిగాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 29వ వరకు హైదరాబాద్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 12,204 మంది, రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 18,021 మంది పేర్లు నమోదు చేసుకున్నారు.