breaking news
Micheal
-
మీకు తెలుసా..? 'మిస్టర్ ఈట్ ఆల్' తను ఒక అద్భుతం!
ఈ సృష్టి ఓ అద్భుతం అనుకుంటే మనిషి అంతకుమించి అద్భుతాలు చేసి ఔరా! అనిపించుకుంటున్నాడు. ఇంతవరకు ఎన్నో వింతలు విశేషాలు చేసి ఉంటాం. అంతకు మించిన వింతలు, విడ్డూరాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంతకీ అవేంటంటే..? ► మిస్టర్ ఈట్ ఆల్.. ఫ్రాన్స్కు చెంది మైఖేల్ లోటిటోకు ‘మిస్టర్ ఈట్ ఆల్’ అని పేరు. ఇతడు ఐరన్, రబ్బరు, గాజులాంటివి కూడా తినేవాడు. ఈ వింత అలవాటుతో గిన్నిస్ వరల్డ్ బుక్లో చోటు సంపాదించాడు. ఇనుమును ఎలక్ట్రిక్ పసర్ సా తో చిన్న చిన్న ముక్కలు చేసి తినేవాడు. పదహారు సంవత్సరాల వయసులో తొలిసారిగా గాజు గ్లాస్ను పగలగొట్టి తిన్నాడు. తన యూనిక్ టాలెంట్తో ప్రపవచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. 2007లో చనిపోయాడు. ► బ్రెజిల్ కారాగారాలలో ఖైదీలకు ఎక్సర్ సైజ్ బైక్లను తొక్కే అవకాశం ఇస్తారు. ఈ బైక్లు కరెంట్ను ఉత్పత్తి చేస్తాయి. ► ‘ఫేస్ బుక్’ వచ్చాక ‘అన్ఫ్రెండ్’ అనే మాట ప్రాచుర్యం పొందింది. అయితే 1659లో వచ్చిన ‘ది అపీల్ ఆఫ్ ఇన్జ్యుర్డ్ ఇనోసెన్స్’ పుస్తకంలో ఈ పదాfన్ని కాయిన్ చేశారు. -
'రెండేళ్లుగా నా కొడుకుతో సంబంధాలు లేవు'
పోరుమామిళ్ల : అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్న కానిస్టేబుల్ ఓబులేసు తండ్రి మైకేల్ను గురువారం పోరుమామిళ్ల పోలీసులు విచారించారు. పోలీసులు విచారణలో మైకేల్.... తన కుమారుడితో రెండు సంవత్సరాల నుంచి సంబంధాలు లేవని వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా కాల్పుల కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తి ...తన కుమారుడా కాదా అనేది తనకు తెలియదని మైకేల్ ...పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ఓబులేసు స్వస్థలం వైఎస్ఆర్ జిల్లా జీ.పోరుమామిళ్ల మండలం తిరువెంగళాపురం. మరోవైపు ఓబులేసు గురించి మాట్లాడేందుకు గ్రామస్తులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.