breaking news
	
		
	
  Metaphorical dance program
- 
      
                   
                                                     
                   
            బీజింగ్లో రామాయణ నృత్య రూపకం
బీజింగ్: ప్రముఖ చైనా పండితుడు, దివంగత ప్రొఫెసర్ జి.జియాన్లిన్ అనువదించిన రామాయణం ఆధారంగా రూపొందించిన ‘ఆది కావ్యం–మొదటి కవిత’అనే నృత్య రూపకాన్ని చైనా కళాకారులు అద్భుతంగా ప్రదర్శించారు. భారత నాట్యంలో నిపుణురాలైన చైనా కళాకారిణి జిన్ షాన్షాన్ దర్శకత్వంలో, 50 మందికి పైగా ప్రతిభావంతులైన స్థానిక కళాకారులతో కూడిన బృందం ఈ నాటకాన్ని శనివారం ఇక్కడి భారత రాయబార కార్యాలయంలో ప్రదర్శించింది. ఇది ‘అద్భుతమైన సాంస్కృతిక సమ్మేళనం’.. అని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్లో అభివరి్ణంచింది. ఈ ప్రదర్శనను పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించారు. ఈ నృత్య రూపకాన్ని బీజింగ్లో ప్రదర్శించడం ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో మొదటిసారి ప్రదర్శించారు. గత నెలలో, రాయబార కార్యాలయం ’సంగమం–భారతీయ తాతి్వక సంప్రదాయాల సమ్మేళనం’ అనే అంశంపై ఒక సదస్సును నిర్వహించింది. ఇందులో ప్రముఖ చైనా పండితులు భగవద్గీత, భారతీయ నాగరికతా విలువలపై ప్రసంగించారు. - 
      
                   
                               
                   
            7న ‘అంతరం’ నృత్యరూపకం

 తమిళసినిమా: తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో ప్రాచుర్యం పొందిన భరతనాట్యం, కూచిపూడి, మోహినీ ఆట్టం, తమిళనాట బహుళ ప్రాచుర్యం పొందిన కన్నగి ఇతివృత్తాలతో అంతరం పేరుతో బ్రహ్మాండమైన నృత్యరూపక కార్యక్రమం జరగనుంది. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన ప్రముఖ వాణిజ్య సంస్థ ప్రిన్స్ జ్యువెలరీ ఆధ్వర్యంలో ఈ నెల 7న స్థానిక రాయపేటలో గల మ్యూజిక్ అకాడమీలో జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి సుహాసిని, నృత్య కళాకారిణులు గోపిక వర్మ, యామినిరెడ్డి, కృతిక సుబ్రమణియన్ నర్తించనున్నారు.
 
 నాలుగు భాషల్లో నిర్వహించనున్న ఈ నృత్య రూపకానికి నటి సుహాసిని నేపథ్య సంభాషణలను ఆయా భాషలతోపాటు ఆంగ్లాన్ని కలిసి అందించనున్నట్లు ఆమె మంగళవారం సాయంత్రం స్థానిక రాయపేటలోని ప్రిన్స్ జ్యువెలరీ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడిం చారు. ఆమె మాట్లాడుతూ ఒకసారి ప్రముఖ నృత్య కళాకారిణి గోపికా వర్మ కలిసినప్పుడు నాట్య కళారంగం మరుగున పడిపోతోందని, దాన్ని బతికించుకోవడానికి కృషి చేయాలన్న ఆలోచనకు రూపకల్పన ఈ అంతరం నృత్యరూపకమే అని పేర్కొన్నారు.
 
 మొత్తం 1.45 గంటల పాటు సాగే ఈ నృత్య రూపకంతో యామిని రెడ్డి, కృతిక సుబ్రమణియన్, గోపిక వర్మ నృత్యం 20 నిమిషాలు తాను నటించి నర్తించే ఓ కన్నగి ఇతివృత్తం సాగుతుందని తెలిపారు. తన నృత్యానికి ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించడం విశేషంగా పేర్కొన్నారు. ఇంతకుముందు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిన ప్రిన్స్ జ్యువెలరీ సంస్థ ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తోందని సుహాసిని చెప్పారు. ఈ సమావేశంలో యామినిరెడ్డి, కృతిక సుబ్రమణియన్, గోపిక వర్మ తదితరులు పాల్గొన్నారు. 


