breaking news
mercy plea
-
గవర్నర్ను క్షమాభిక్ష కోరవచ్చు
న్యూఢిల్లీ: కాబోయే భర్తను హత్య చేసిన కేసులో దోషిగా తేలిన కర్ణాటక మహిళ శుభాకు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. కర్ణాటక గవర్నర్ నుంచి క్షమాభిక్ష కొరేందుకు ఆమెకు అనుమతి ఇచ్చింది. సామాజిక పరిస్థితులు, ఒత్తిళ్ల కారణంగా మహిళలు కొన్ని సందర్భాల్లో నేరాలకు పాల్పడుతున్నారని న్యాయస్థానం పేర్కొంది. శుభా 20 ఏళ్ల వయసులో కాలేజీలో చదువుకుంటున్న సమయంలో నిశ్చితార్థం జరిగింది. ఈ పెళ్లి ఆమెకు ఎంతమాత్రం ఇష్టంలేదు. కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలొగ్గాల్సి వచ్చింది. కాబోయే భర్తను హత్య చేస్తే తనకు ఈ పెళ్లి తప్పుతుందని భావించింది. తన మిత్రులైన అరుణ్ వర్మ, వెంకటేశ్, దినేశ్తో కలిసి అతడిని హత్య చేసింది. శుభాపై నేరం రుజువైంది. అయితే, బలవంతంగా పెళ్లి చేసేందుకు పెద్దలు ప్రయత్నించడంతో విధిలేని పరిస్థితుల్లో అతడిని చంపాల్సి వచ్చిందని శుభా మొరపెట్టుకుంది. గవర్నర్ను క్షమాభిక్ష కొరేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. శుభా వినతి పట్ల సానుకూలంగా స్పందించింది. -
తొలి క్షమాభిక్షకు కోవింద్ నో...!
న్యూఢిల్లీ : రాష్ట్రపతి అయిన తర్వాత మొదటి క్షమాభిక్ష పిటిషన్ను రాంనాథ్ కోవింద్ తిరస్కరించారు. ఐదుగురు చిన్నారులతో సహా ఏడుగురు కుటుంబ సభ్యులను అతికిరాతంగా సజీవదహనం చేసిన ఓ నిందితుడికి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. 2006లో బిహార్కు చెందిన విజేంద్ర మహతో, ఆయన కుటుంబ సభ్యులను జగత్రాయ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధించగా.. తనకు క్షమాభిక్ష పెట్టాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 23న దోషి జగత్రాయ్ రాష్ట్రపతి కోవింద్కు విజ్ఞప్తి చేసుకున్నాడు. అయితే ఏడుగురిని హతమార్చి, దహనం చేసిన వ్యక్తికి క్షమాభిక్ష ఇవ్వడానికి రాష్ట్రపతి అయిష్టత చూపించారు. జగత్రాయ్ అభ్యర్థనను తిరస్కరించినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. -
క్షమాభిక్ష తీర్పును పునఃసమీక్షించం: సుప్రీం
న్యూఢిల్లీ: క్షమాభిక్ష పిటిషన్లపై ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేది లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న క్షమాభిక్ష పిటషన్లకు సంబంధించి మరణశిక్షలను జీవిత ఖైదుగా మారుస్తూ ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఉరిశిక్ష పడ్డ 15 మంది ఖైదీలకు శిక్షను జీవిత ఖైదుగా మార్చడాన్ని రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది.