breaking news
mental cases
-
హై పవర్ ట్రాన్స్మిషన్ తీగపై వేలాడుతూ.. స్వీట్లు, మొబైల్ కావాలంటూ..
Mentally unstable man climbs electricity tower: మానసిక స్థితి సరిగా లేని వ్యక్తులు చేసే పనులు చాలా భయానకంగానూ, ఒక్కొసారి వికృతంగా కూడా ఉంటాయి. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి స్వీట్లు, మొబైల్ ఫోన్ కావలంటూ ఏకంగా విద్యుత్ టవర్ పైకి ఎక్కేశాడు. (చదవండి: ఏకంగా పామునే హెయిర్ బ్యాండ్గా చుట్టుకుంది!! వైరల్ వీడియో) అసలు విషయంలోకెళ్లితే.....బీహార్లో ముజఫర్పూర్ జిల్లాలోని బర్మత్పూర్ గ్రామంలో మానసిక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి హై ట్రాన్స్మిషన్ విద్యుత్ టవర్పైకి ఎక్కాడు. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. పైగా వ్యక్తి పైనుంచి మొబైల్ ఫోన్, స్వీట్లు కావాలని కోరడం ఆశ్చర్యంగా కల్గించింది. విద్యుత్ శాఖ, పోలీసులు, అగ్నిమాపక శాఖ ఎంతగా ప్రయత్నించినా అతను కిందకు వచ్చేందుకు నిరాకరించాడు. అంతేకాదు ఆ వ్యక్తి హై పవర్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రిసిటీ టవర్లో కూర్చొని అంత ఎత్తు నుంచి కింద పడిపోతానేమో అనే భయం లేకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. చలి తీవ్రంగా ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం లెక్కచేయకుండా టవర్ ఎక్కాడు. ఆ వ్యక్తిని రక్షించేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎప్)ని పిలిపించారు. అయితే స్థానికులు మాత్రం ఆ వ్యక్తి మానసిక వికలాంగుడని ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలానే చేశాడని చెబుతున్నారు. అయితే అతన్ని కిందకు రప్పించేందుకు ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి. (చదవండి: ఫోన్ కొట్టేశాడని ఏకంగా తలకిందులుగా వేలాడదీశారు...ఐతే చివరికి!!) -
మానసిక సమ్యసల భారత్
న్యూఢిల్లీ: భారత్లో అంతకంతటికీ పెరిగిపోతున్న మానసిక ఆరోగ్య సమస్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్ధ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్ఓ తాజాగా విడుదల చేసిన అంశాలు విస్మయం కలిగిస్తున్నాయి. 2015లో దాదాపు ఐదు కోట్ల మందికి పైగా భారతీయులు మానసిక ఒత్తిడితో కుంగిపోయారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. మధ్య, దిగువ తరగతి దేశాల్లోనే ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పింది. 2005 నుంచి 2015ల మధ్య మానసికంగా క్షోభకు గురవుతున్న జనాభా శాతం 18.4కు పెరిగింది. ఒక్క 2015లో ఇండియాలో ఏడు లక్షల ఎనభైఎనిమిది వేల మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇంతకంటే పెద్ద సంఖ్యలో ఆత్మహత్యకు పాల్పడ్డారని.. అదృష్టవశాత్తు వారందరూ ప్రాణాలు నిలబెట్టుకోగలిగారని చెప్పింది. 15-29 మధ్య వయసు కలిగిన వారు మరణించాడానికి గల కారణాల్లో ఆత్మహత్య రెండో స్ధానంలో ఉంది. 2012లో ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలకు పాల్పడిన వారిలో భారత్ మొదటి స్ధానంలో ఉంది.