-
లెక్కలు ఈజీ గురూ...!
గణితానికీ మానవ జీవితానికి విడదీయరాని బంధం వుంది. ప్రతీ విషయానికీ లెక్కలే. పుట్టింది మొదలు చచ్చేంత వరకూ అన్నింటికీ లెక్కలే. అయినా గణితమంటే చిన్నతనం నుంచి ప్రతీ ఒక్కరిలోనూ తెలియని భయం. కానీ ఇష్టపడి చదివి, సాధన చేస్తే లెక్కలంత సులువైన పాఠ్యాంశం లేదని చాటి చెబుతున్నారు సాలూరుకు చెందిన రామానుజన్ గణిత క్లబ్ నిర్వాహకులు. గడచిన 18ఏళ్లగా మున్సిపల్ బంగారమ్మపేట ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రజనీకాంత్, పిల్లల్లో గణితం పట్ల నెలకొన్న తెలియని భయాన్ని పోగొట్టేందుకు కృషి చేస్తున్నారు. గణితశాస్త్ర పితామహుడైన శ్రీనివాస రామానుజన్ పేరున 2001లో రామానుజన్ గణిత క్లబ్ను స్థాపించారు. అప్పటి నుంచి గణితంపై కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. విజయనగరం, సాలూరు: జిల్లాలో మరెక్కడా లేని విధంగా రజనీకాంత్ గణిత క్లబ్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. ఉత్తరాంధ్ర స్థాయిలో కూడా ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తూ గణితం పట్ల ఆసక్తి పెంచేందుకు కృషి చేస్తున్నారు. జిల్లా స్థాయిలో సాలూరు రామానుజన్ గణిత క్లబ్ 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఏటా ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏటా వేలాది మంది విద్యార్థులు ప్రతిభా పరీక్షలో పాల్గొనెలా చేస్తున్నారు. గణితం పట్ల ఆసక్తిని పిల్లల్లో పెంపొందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞాణాన్ని కూడా అందిపుచ్చుకున్నారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రామానుజన్మేథ్స్క్లబ్.ఆర్గ్ అనే వెబ్సైట్ను 2015లో క్లబ్ నిర్వాహకులు ప్రారంభించారు. అవార్డు తెచ్చిపెట్టిన సేవలు రామానుజన్ గణిత క్లబ్ ద్వారా అందిస్తోన్న సేవలతో పాటు విద్యావ్యాప్తికి రంభ రజనీకాంత్ చేస్తోన్న సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మాస్టారు చేస్తోన్న సేవలకు గుర్తింపుగా 2007లో కలెక్టర్ కిషోర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో గౌరవించారు. 2010లో ఉత్తరాంధ్ర స్థాయిలో రోటరీ ఎక్సలెన్స్ అవార్డ్ను కోలగట్ల వీరభద్రస్వామి అవార్డ్ను అందించారు. మిత్రుల సహకారం మరవలేనిది గడచిన 18ఏళ్లగా రామానుజన్ గణిత క్లబ్ సేవలు ఉత్తరాంధ్ర స్థాయిలో విస్తరించడం వెనుక తనకు మిత్రులు అందిస్తోన్న సహాయసహకారాలు ఎంతో కీలకమని రజనీకాంత్ చెప్పారు. ముఖ్యంగా ఎంవి.గౌరీశంకర్, బి.వీరభద్రరావు, ఎన్.అశోక్కుమార్ తదితరుల వెన్నంటి వుండి తోడ్పాటు అందిస్తున్నారు. నా వద్ద చదువుకున్న పూర్వ విద్యార్థులు కూడా ప్రతిభా పరీక్ష పరీక్ష నిర్వహణలో స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. గణితంలో దిట్ట యాళ్ల విజయనగరం, బొబ్బిలి రూరల్: పూసల చట్రాలు....క్యాలిక్యులేటర్లు...కంప్యూటర్లు...రోబోలు ఎన్ని వచ్చినా అవన్నీ మానవ మేధస్సుతో వచ్చినవే. మానవ మేధస్సు ముందు ఇవన్నీ తీసికట్టు అని గతంలో ఆర్యభట్ట, శకుంతలాదేవి, లక్కోజు సంజీవరాయశర్మ, శ్రీనివాసరామనుజం వంటి వారు అనేక మంది నిరూపించారు. గణితంలో మరో అధ్యాయం వేదగణితం..దీనికి ఈ ప్రాంతంలో బీజం వేసిన నేరళ్ల నారాయణమూర్తి మాస్టారు వంటి వారు ఉన్న ఈ ప్రాంతంలోనే గణితంలో ఎన్నో సులభ ప్రక్రియలకు శ్రీకారం చుట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు యాళ్ల శ్రీనివాసరావు. సీతానగరం మండలం జానుమళ్లువలసకు చెందిన శ్రీనివాసరావు బొబ్బిలి సంస్థానం పాఠశాలలో బాలసాహిత్య రచయిత ఎన్వీఆర్ సత్యనారాయణమూర్తి శిష్యరికంలో గణితంలో పలు కీలకాంశాలు నేర్చుకున్నారు. ఎంఎస్సీ, బీఈడీ చదివిన శ్రీనివాసరావు బొబ్బిలిలో ఉంటూ ప్రైవేటు ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు. గణితంలో తన ప్రతిభతో ఇండియా బుక్ ఆఫ్ రికారŠుడ్సలో స్థానం సాధించారు. -
లెక్కలు రావడంలేదని..
సాక్షి, చల్లపల్లి: గణితం, విద్యార్థులకో అదో పెద్ద చిక్కులెక్క. అర్థం అయిన వారికి ఇది చాలా ఈజీ అంటారు. అర్థం కాని వాళ్లు మాత్రం తలలు పట్టుకుంటారు. అలా లెక్కలు రావడం లేదని ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం ఉల్లిపాలెంకు చెందిన పాలంకి సరిత(13) స్వతంత్రపురం హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నది. బాలిక తల్లిదండ్రులు గతంలోనే చనిపోవడంతో మేనమామ రాధాకృష్ణ ఆమెను చదివిస్తున్నారు. సరిత గణితంలో వెనుకబడి ఉండేది. లెక్కలు రావడం లేదని ఆందోళన చెందిన ఇంటి దగ్గర పొలానికి చల్లే విష గుళికలు తిని తరగతికి వచ్చింది. నీరసంగా ఉండడంతో వెనుక బెంచిలో కూర్చోబెట్టారు. కొద్దిసేపటికి నోటి నుంచి నురుగు వస్తుండడంతో వెంటనే కోడూరు పీహెచ్సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అవనిగడ్డ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు విడిచింది. -
ఇంగ్లిష్, లెక్కలు లేని విద్య వృధా ప్రయాసే..!
ఎక్కువ మంది విద్యార్థులను ఫెయిల్ చేస్తున్న ఇంగ్లిష్, గణితాన్ని సబ్జెక్టులుగా తొలగించి ఐచ్చికాంశాలుగా మాత్రమే కొనసాగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధికి సంబంధించి అత్యంత కింది స్థాయి ఉద్యోగాలకు మాత్రమే ప్రజారాసులను సిద్ధం చేసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాఠశాల విద్యను ప్రోత్స హించే లక్ష్యం కోసం భారత్లో విచిత్రమైన పరిణా మాలు జరుగుతున్నాయి. దీని కోసం త్రిభాషా సూత్రాన్ని తీసుకొచ్చారు. కొద్ది సంవత్స రాలు పాస్ కాకున్నా పై తర గతిలో చేరేందుకు అనుమతించారు. బాలికలకు ఉచిత విద్యను అందించారు. బాలికలు బడి మానకుండా చేయ డానికి టాయ్లెట్లను నిర్మించే ప్రయత్నం చేశారు. విద్యా హక్కును కూడా తీసుకొచ్చారు. వీటిలో ఏ ఒక్కటీ ఫలి తాలను ఇవ్వలేదు. విద్యావ్యాపారంలో ప్రైవేట్ రంగా నికి ప్రభుత్వమే తలుపులు బార్లా తెరుస్తున్నందున, పాఠశాలకు బాలికలను తీసుకురావడం ఖరీదైన వ్యవ హారంగా మారిపోయింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్, గణితాన్ని స్కూల్ సబ్జెక్టులుగా తొలగించి వాటిని ఐచ్ఛికాంశాలుగా కొనసాగించాలని భావిస్తోంది. ఎందుకంటే ఈ రెండు సబ్జెక్టుల వల్లే పాఠశాలల్లో అనేకమంది ఫెయిల్ అవు తున్నారు. రాష్ట్ర విద్యామంత్రి వినోద్ తావ్డే సైతం విద్యాబోధన స్థాయి, పాఠశాలల పర్యవేక్షణను పక్కన బెట్టి, ఈ రెండు సబ్జెక్టులే విద్యా ప్రమాణాల వినాశ కారులని చూపిస్తున్న సమాచార పత్రాల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ నియంత్రణ పరిధికి వెలు పల పాఠశాలలు ‘అంతర్జాతీయం’ అయిపోతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిపుణత గురించి కేంద్రంతో చర్చిస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ చర్య సీరియస్ వ్యవహా రంగా కనిపిస్తోంది. పరీక్షల్లో తక్కువ మార్కులు సాధిం చిన లేదా తమ పరీక్షల్లో నెగ్గని విద్యార్థులకు పాస్ అయ్యారు అని, నిపుణతలకు తగినవారుఅని సర్టిఫికెట్ రూపొందించడం ద్వారా పదవ తరగతిలో ఏ విద్యార్థినీ ఫెయిల్ చేయని తరహా వ్యవస్థ రూపకల్పనపై రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ప్రశ్నించదగిన ప్రమాణాలు కలిగిన వ్యవస్థలో కనీస కొలబద్దను కూడా ఇప్పుడు ఇంకాస్త తక్కువ స్థాయికి దించుతున్నారన్నమాట. దేశవ్యాప్తంగా పంచాయతీల నుంచి పురపాలక సంస్థలకు సంబంధించి, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులలో సగంమంది మూడో తరగతిలో నేర్చుకున్న పాఠాలను కూడా చదవలేకపోతున్నారని మనందరికీ తెలుసు. అంటే అన్ని రాష్ట్రాలూ తమకు గర్వ కారణంగా భావిస్తున్న మాతృభాషలో కూడా వీరు పదా లను, వాక్యాలను రాయలేకపోతున్నారు. అదే క్రమంలో వీరు లెక్కలు కూడా చేయలేరు. అంటే భావ వ్యక్తీకరణ లోనూ, మార్పులను గణించడంలోనూ వీరంతా పేలవ మైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని అర్థం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే,. ఆధునిక ప్రపంచానికి తలుపులు తెరుస్తున్నట్లు తాము భావిస్తున్న ఇంగ్లిష్ మీడియం విద్యవైపు తల్లిదండ్రులు పరుగులు పెడుతున్న దశలో ఇది వెలుగు చూస్తోంది. ప్రభుత్వం లేక వ్యవస్థను నడిపిస్తున్న రాజకీయ నేతల్లా కాకుండా, ప్రపంచంతో తమ పిల్లలను అనుసంధానించడంలో ఉన్న ప్రాధాన్యతను తల్లిదండ్రులు గ్రహిస్తున్నారు. అదే సమ యంలో ప్రభుత్వం.. మాతృభాషను ఇంగ్లిష్పై ఉన్న భ్రమలకు సహజ నివారణగా భావిస్తూ దాని పట్ల అనురక్తిని ప్రదర్శిస్తున్నట్లు కనబడుతోంది. విద్య విషయంలో దేశంలోనే తీవ్ర నేరస్తురాలిగా పక్కన పెట్టనప్పటికీ, మహారాష్ట్ర ఈ కొత్త పరిణామానికి ఉదాహరణగా నిలుస్తోంది. వార్షిక స్థిర విద్యా నివేదికలు విద్యలో అల్ప ప్రమాణాల గురించి ఒకేరకమైన వివరణ లను పదే పదే వెలువరిస్తున్న నేపథ్యంలో... తగిన మానవ వనరుల పునాదిని అభివృద్ధి చేయడంలో తోడ్పాటు నందించే కొన్ని విలువైన సవరణలను కొన్ని రాష్ట్రాలు తీసుకొచ్చాయి. అయితే ఉపాధికి సంబంధించి అత్యంత కింది స్థాయి ఉద్యోగాలకు మాత్రమే ప్రజా రాసులు సిద్ధమవుతున్నారా అనిపించేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశం విద్యారంగంలో ఎంత చక్కగా పనిచేస్తోంది అనే అంశాన్ని నిర్ధారించడానికి, పాఠశాలల్లో ప్రవేశం అనేది కొలబద్ద కాదు. చక్కటి విద్యా బోధనా స్థాయి, నేర్చుకోవ డానికి సంబంధించి విద్యార్థులకు తోడ్పాడు నందించడంలో దాని సానుకూల ప్రభావం అనేవి పాఠశాల ప్రవేశంతోటే సిద్ధించవు. మీకు విద్యా హక్కు ఉండవచ్చు కానీ, ఏక గది పాఠశాలలు, విజ్ఞానాన్ని అందించడంలో సందేహాస్పదమైన సామర్థ్యం కలిగిన ఉపాధ్యాయుల గైర్హాజర్ అనేవి విద్యాబోధనను మొత్తంగా అపహాస్యం చేస్తున్నాయి. విద్యకోసం కేటా యించే బడ్జెట్ల కంటే అది తీసుకువస్తున్న ఫలితమే నిజమైన కొలబద్ద. అయితే ప్రమాణాలను తగ్గించడం ద్వారా గోల్ పోస్టును మార్చడానికి దేశంలో కనీసం ఒక రాష్ట్రమైనా ఇప్పుడు సంసిద్ధతను ప్రదర్శిస్తున్నట్లు కన బడుతోంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేష్ విజాపుర్కార్ ఈ మెయిల్ : mvijapurkar@gmail.com
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement