-
లాక్డౌన్: నిత్యావసర సరుకుల రవాణాపై చర్యలు
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశమంతట లాక్డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు నిత్యావసర సరుకులకు ఇబ్బంది పడకుండా వాటిని అందుబాటులోకి తెచ్చే విషయంలో పర్యవేక్షణ కోసం కమాండ్ కట్రోల్ను ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్నా తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యావసర సరుకుల విషయంలో జిల్లాల్లో కూడా జేసీల అధ్వర్యంలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సరుకుల రవాణ, అధిక ధరలపై ఏమైనా ఫిర్యాదులు ఉంటే కంట్రోల్ నెంబర్ 1902కు డయల్ చేయాలని చెప్పారు. సరుకుల రవాణకు ఇబ్బంది లేకుండా ఈ-పాస్ సిస్టమ్ను ప్రవేశపెట్టామని, పంటలను మార్కెట్టుకు తెచ్చే విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. (రేషన్' ఫ్రీ') అంతేగాక నిత్యావసరాలకు సంబంధించి ప్రైవేటు రంగంలో పని చేసే ఉద్యోగులకు, సిబ్బందికి ఈ-పాస్ అందచేస్తున్నామని ఆయన తెలిపారు. సరుకులను ప్రజలకు అందజేసే విషయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, ఇందుకోసం రైతు బజార్లను వికేంద్రీకరించామన్నారు. రాష్ట్రంలో మొత్తం 101 రైతు బజార్లు ఉంటే.. మరో 350 రైతు బజార్లను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. అంతేగాక 130 మొబైల్ రైతు బజార్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 753 మంది మాత్రమే డోర్ డెలివరీని వివియోగించుకుంటున్నారని, ఈ సంఖ్యను పెంచాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కిరాణా షాపుల యజమానులు డోర్ డెలివరీకి సిద్దంగా ఉన్నారని, సప్లై చైన్ బ్రేక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నమని తెలిపారు. ఉల్లి, అరటి వంటి పంటలకు మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా పొరుగు రాష్ట్రాల అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. (కరోనా చికిత్సకు కొత్త పరికరం) -
చిరుధాన్యాల కేంద్రంగా ‘కదిరి’
= ‘సాక్షి’తో మార్కెటింగ్శాఖ కమిషనర్ మల్లికార్జునరావు = అమరాపురంలో 10 ఎకరాల్లో వక్క యార్డు ఏర్పాటు అనంతపురం అగ్రికల్చర్ : కదిరిలోని వ్యవసాయ మార్కెట్ యార్డును చిరు, నవధాన్యాల కేంద్రంగా మార్చనున్నట్లు మార్కెటింగ్శాఖ కమిషనర్ మల్లికార్జునరావు తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో మంగళవారం మాట్లాడుతూ... జిల్లాలో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, చిరుధాన్యాలు, నవధాన్యాల పంటలకు ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పండించే చిరు, నవ ధాన్యాల వ్యాపార లావాదేవీలకు అనుకూలంగా ఉండేలా కదిరిలోని మార్కెట్ యార్డ్ను మార్పు చేయనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా కదిరి యార్డ్ పరిధిలో చిరుధాన్యాలకు రైతు బంధు పథకం (ఆర్బీపీ) అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అమరాపురం మండలంలో 10 ఎకరాల్లో కేవలం వక్క రైతులకు వెసులుబాటు కల్పించేలా కొత్తగా సబ్యార్డు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎక్కడా లేని విధంగా ‘అనంత’ వక్క రైతులకు రైతుబంధు పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతపురం నడిబొడ్డున నిరుపయోగంగా ఉన్న రైతు బజార్లో ఇకపై పూర్తిగా సేంద్రియ పంట ఉత్పత్తులు, కషాయాలు విక్రయాలను ప్రోత్సహించేలా ఆర్గానిక్ బజార్గా మార్చనున్నట్లు చెప్పారు. కక్కలపల్లి సమీపంలో ఉన్న టమోటా మండీల ద్వారా రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించేలా చూస్తామన్నారు. మదనపల్లి, చింతామణి, కోలార్ తదితర ప్రాంతాల్లో పలికే ధరలకు సంబంధించి డిజిటల్ బోర్డుల ఏర్పాటు, మండీలకు లైసెన్సులు ఉండేలా, అక్కడ సమాచార కేంద్రం, మైకు సిస్టమ్ ఏర్పాటుతో పాటు మార్కెటింగ్ శాఖ పర్యవేక్షణ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాయలసీమ జిల్లాలలో ఏడు టమోటా మార్కెట్యార్డుల్లో ఈ–మార్కెటింగ్ వ్యవస్థ అమలులోకి తెస్తున్నట్లు తెలిపారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- వైఎస్సార్సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement