breaking news
Manasunu Maaya Seyake
-
‘మనసును మాయ సేయకే’ పాటలు
‘‘మేం నిర్మించిన ‘నీకు నాకు డాష్ డాష్’ ద్వారా హీరోగా పరిచయమైన ప్రిన్స్ వరుసగా సినిమాలు చేయడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం అతను నటించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ఆనంద్ప్రసాద్. ప్రిన్స్, రిచా పనయ్, దిశా పాండే, సేతు ముఖ్య తారలుగా ఫుల్హౌస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రం ‘మనసును మాయ సేయకే’. సురేష్ పి. కుమార్ దర్శకత్వంలో జైసన్ పులికొట్టిల్, విన్స్ మాంగ్డన్ నిర్మిస్తున్నారు. మణికాంత్ కద్రి స్వరపరిచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ వేడుకలో నవదీప్, సందీప్కిషన్, నవీన్చంద్ర, రమేష్ పుప్పాల, తిరుమలరెడ్డి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఆడియో సీడీని నవదీప్, సందీప్కిషన్, నవీన్ ఆవిష్కరించారు. అతిథులందరూ ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రిన్స్ మాట్లాడుతూ - ‘‘నా మొదటి సినిమా నుంచి యువహీరోలందరూ సహకరించడం ప్రోత్సాహకరంగా ఉంది. మంచి కథ, పాటలు కుదిరాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ఇలాంటి మంచి చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని రిచా, దిశా తెలిపారు. ఇంకా ఈ వేడుకలో దర్శక, నిర్మాతలతో పాటు యూనిట్ సభ్యులు పలువురు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సంపత్. -
ప్రేమలోకంలో విహారించే ‘మనసును మాయ సేయకే’
ఆ ఇద్దరి చూపులు కలిశాయి. మనసులు కూడా కలిశాయి. ఇంకేముంది? ప్రేమలోకంలో విహరించడం మొదలుపెట్టారు. ఆ ప్రేమను మూడు ముళ్ల బంధంతో సఫలం చేసుకోవాలనుకున్నారు. కానీ, కథ వేరే మలుపు తిరిగింది. ఆ మలుపు ఎలాంటిది? దానివల్ల ఆ యువతీయువకుల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘మనసును మాయ సేయకే’. ప్రిన్స్, రిచా పనయ్, దిశా పాండే, సేతు ముఖ్య తారలుగా ఫుల్హౌస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సురేష్ పి. కుమార్ దర్శకుడు. జైసన్ పులికొట్టిల్, విన్స్ మాంగడన్ నిర్మాతలు. మణికాంత్ కద్రి స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఈ నెల 14న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘పగ, ప్రతీకారాల నేపథ్యంలో సాగే కథ ఇది. ఇప్పటివరకు ప్రిన్స్ నటించిన అన్ని సినిమాల్లోకల్లా ఈ చిత్రానికి శాటిలైట్ హక్కులను మంచి ఆఫర్ రావడం ఆనందంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: సవ్యసాచి శ్రీనివాస్, కెమెరా: వెంకట్ హనుమ.