breaking news
Manasuki Nachindi
-
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘మనసుకి నచ్చింది’
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకొని ‘యు/ఎ’ సర్టిఫికెట్ అందుకొంది. ఫిబ్రవరి 16న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్రెష్ & రొమాంటిక్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా మనసుకి నచ్చింది తెరకెక్కింది. సెన్సార్ పూర్తయ్యింది, యు/ఎ సర్టిఫికేషన్ సొంతం చేసుకుంది. రాధన్ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలుస్తుంది. ప్రేక్షకులకి ఒక మంచి సినిమా చూశామనే భావన కలిగించే చిత్రం మనసుకు నచ్చింది’ అన్నారు. -
మంచి ఫీల్
సూపర్స్టార్ కృష్ణ తనయ మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా పరిచయమవుతోన్న చిత్రం ‘మనసుకు నచ్చింది’. సందీప్ కిషన్ హీరోగా, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి హీరోయిన్లుగా మంజుల దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్–ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్–పి.కిరణ్ నిర్మించారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఫిబ్రవరి 16న విడుదల చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఫ్రెష్, రొమాంటిక్ యూత్ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. డైరెక్టర్గా మంజులకు తొలి చిత్రమైనా అనుభవం ఉన్నవారిలా చక్కగా తెరకెక్కించారు. ఒక మంచి సినిమా చూశామనే భావన ప్రేక్షకులకు కలిగించేలా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రధన్ మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్గా నిలుస్తుంది’’ అన్నారు. ప్రియదర్శి, పునర్నవి భూపాలం, నాజర్, అరుణ్ ఆదిత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రవి యాదవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా. -
మహేశ్ మాంజా తయారు చేసేవాడు – మంజుల
సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘మనసుకు నచ్చింది’ త్వరలో విడుదల కానుంది. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా పి. కిరణ్, సంజయ్ స్వరూప్ నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా మంజుల, సందీప్ పంచుకున్న విశేషాలు. మీ చిన్నప్పటి సంక్రాంతిని గుర్తు చేసుకుంటారా? మంజుల: మా అమ్మమ్మ భోగి రోజు పిల్లలందరికీ నూనె రాసి, స్నానం చేయించేది. పిండి వంటలు బాగా వండేవాళ్లు. ముఖ్యంగా గారెలు, పాయసం అయితే తెగ లాగించేవాళ్లం. తెల్లవారు జాము భోగి మంటలు వేసేవాళ్లం. సంక్రాంతి పండగ విశేషం గురించి అప్పట్లో ఏమీ తెలియకపోయినా ఆ సెలబ్రేషన్ చాలా బాగా అనిపించేది. మీ నాన్న సొంతూరు బుర్రిపాలెంలో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్న సందర్భాలేమైనా? మా చిన్నప్పుడు కంటిన్యూస్గా మూడు సంవత్సరాలు సంక్రాంతి పండగకి బుర్రిపాలెం వెళ్లాం. అక్కడ మా నాన్నమ్మ బాగా సెలబ్రేట్ చేసేది. విలేజ్లో పండగలంటే ఓ సెపరేట్ కళ ఉంటుంది. పెద్ద పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు... చాలా సందడిగా ఉంటుంది. ఇప్పుడు లేదని కాదు.. ఇప్పుడూ మా ఇంట్లో ఫెస్టివల్స్ బాగానే జరుపుకుంటాం. ఈ టైమ్లో పెద్ద పెద్ద ముగ్గులు వేయిస్తాను. నేను డైలీ పూజ చేస్తాను. పండగ రోజు ఇంకొంచెం ఎక్కువసేపు చేస్తుంటాను. సంక్రాంతి రోజు ముఖ్యంగా వినాయకుడు, శివుడికి పూజ చేస్తాను. చిన్నప్పుడు మీ బ్రదర్స్ (అన్నయ్య రమేశ్బాబు, తమ్ముడు మహేశ్బాబు)తో కలసి గాలిపటాలు ఎగరేసేవారా? మేం ముగ్గురు సిస్టర్స్ చూడటంవరకే. రమేశ్ అన్నయ్య, మహేశ్కి గాలిపటాలంటే పిచ్చి. సంక్రాంతి టైమ్ అంటే చాలు.. రోజూ గాలిపటాలు ఎగరేయాల్సిందే. ఇద్దరూ ఇంట్లోనే ‘మాంజా’ తయారు చేసేవాళ్లు. పోటీలు పడి ఎగరేసేవాళ్లు. నాన్న చూస్తూ కూర్చునేవారు. ఇప్పుడు మీ భర్త, పాప (సంజయ్, జాన్వీ) కైట్స్ ఎగరేస్తారా? లాస్ట్ ఇయర్ ట్రై చేశారు. ఇద్దరికీ కుదరలేదు (నవ్వుతూ). బేసిక్గా సంజయ్కి గాలిపటాలు ఎగరేయడం తెలీదు. ఈసారి అయినా కుదురుతుందో లేదో చూడాలి. సంక్రాంతి షాపింగ్ కంప్లీట్ అయిందా? ‘మనసుకు నచ్చింది’ సినిమా డైరెక్షన్ చేస్తున్న విషయం మీకు తెలుసు. షూటింగ్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్తో ఫుల్ బిజీ. అయినా పండగ రోజు కొత్త బట్టలు వేసుకుంటేనే బాగుంటుంది. మా అమ్మాయి వెస్ట్రన్ డ్రెస్సులకు అలవాటుపడింది. పండగల సమయంలో అయినా ట్రెడిషనల్ వేర్ అయితే బాగుంటుంది కదా. అందుకే తనకు అలాంటి డ్రెస్ తీసుకున్నా. మామూలుగా పండగలకి మీ బ్రదర్స్, సిస్టర్స్ కలుస్తుంటారా? ప్లాన్ చేసుకుని కలిసింది లేదు. అయితే ఇకనుంచి ప్లాన్ చేయాలని ఉంది. మిగతా రోజుల్లో ఎవరి పనులతో వాళ్లం బిజీగా ఉన్నా పండగలకి మాత్రం అందరం ఒకచోట కలిస్తే బాగుంటుందని ఈ ఏడాదే అనిపించింది. అమ్మానాన్న, బ్రదర్స్, సిస్టర్స్ ఫ్యామిలీస్ని కలిసేలా నేనే ఇకనుంచి ప్లాన్ చేయాలనుకుంటున్నా. ఈ ఇయర్ డైరెక్టర్గా మీ పేరుని స్క్రీన్ మీద చూడబోతున్నారు. ఎలా ఉంది? డైరెక్షన్ అనేది పెద్ద బాధ్యత. బాగానే చేశాననే నమ్మకం ఉంది. దర్శకురాలిగా నాకు మొదటి సినిమా, నటిగా మా అమ్మాయికి ఇది మొదటి సినిమా. మంచి క్యారెక్టర్ చేసింది. నాకు నచ్చిన కథతో, నాకు నచ్చినట్లుగా పూర్తి సంతృప్తితో చేసిన సినిమా ఇది. డైరెక్షన్ చేస్తానన్నప్పుడు నాన్నగారు చాలా ఎంకరేజ్ చేశారు. త్వరలో రిలీజ్ అనుకుంటున్నాం. పండగ రోజు కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేద్దామనుకున్నా కానీ, అందరూ సెలవు తీసుకుంటామన్నారు. అందుకని నేనూ రిలాక్స్ అవుతున్నా (నవ్వుతూ). ఫైనల్లీ సంక్రాంతి స్పెషల్ ఏంటి? పర్సనల్గా ఫుల్ సెలబ్రేషన్. ప్రొఫెషనల్గా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ కాబోతున్నాను. దేవుడు ఇచ్చిన మంచి గిఫ్ట్లా భావిస్తున్నాను. మంచి లవ్స్టోరీతో ‘మనసుకు నచ్చింది’ తీశాను. సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది. అమ్మమ్మతో కలసి గాలిపటాలు ఎగరేసేవాణ్ణి – సందీప్ కిషన్ చిన్నప్పుడు సంక్రాంతి పండగ అంటే సినిమాలు చూస్తూ గడిపేసేవాణ్ణి. పండగకి రిలీజయ్యే సినిమాలన్నీ చూడాల్సిందే. అవి పూర్తయ్యాక టీవీల్లో వచ్చే స్పెషల్ షోస్, సినిమాలు చూస్తూ కూర్చునేవాణ్ణి. ఏదైనా సినిమా చుట్టూనే. గాలిపటాలూ ఎగరేసేవాణ్ణి. అది కూడా మా అమ్మమ్మతో. మేడ మీదకు నాతో పాటు వచ్చి తను కూడా సరదాగా ఎగరేసేది. పెద్దయ్యాక ఫ్రెండ్స్ పెరిగాక వాళ్లతో కైట్స్ ఎగరేయడం అలవాటైంది. సంక్రాంతి అంటే నాకు సికింద్రాబాద్ గుర్తొస్తుంది. నా ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. ఎక్కువమంది మార్వాడీ స్నేహితులే. మనలానే వాళ్లు కూడా సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేస్తారు. ఫెస్టివల్ టైమ్లో మేమంతా కలుస్తాం’’ అంటున్న సందీప్తో ‘‘కోడి పందాలు ఎప్పుడైనా చూశారా?’’ అనడిగితే – ‘‘లేదు. కానీ, ‘గుండెల్లో గోదారి’ సినిమా కోసం చూశాను. ఆ సినిమా షూటింగ్ రాజమండ్రిలో చేశాం. కోడి పందాల సీన్ ఉంది. అంతకుముందు ఎప్పుడూ చూడలేదు కాబట్టి, డైరెక్ట్గా కోడి పందాలు చూశాను’’ అన్నారు. ‘‘ఈ సంవత్సరం ఎక్కువ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. అలాగే, మంజులగారి డైరెక్షన్లో చేసిన ‘మనసుకు నచ్చింది’ రిలీజ్కి రెడీ అవుతోంది. నేను చేసిన ఫస్ట్ ప్యూర్ లవ్స్టోరీ ఇది. ఇంకా ఈ సంవత్సరం మంచి మంచి పాత్రలు చేస్తున్నాను’’ అని సందీప్ కిషన్ అన్నారు. -
పెళ్లికూతురే పెళ్లికొడుకును లేపుకెళితే..
‘పెళ్లికూతురే పెళ్లికొడుకును లేపుకెళ్లడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా’... కమెడియన్ ప్రియదర్శి.‘పెళ్లే కదా ఆగిపోయింది. వాళ్లు ఆగిపోలేదు కదా’.. నటుడు నాజర్ ‘మన హార్ట్తో మనం కనెక్ట్ అయితే మనకేమొస్తదే.. నువ్వు ఒక అబ్బాయితో కనెక్ట్ అవ్వాలి.. నేను బోలెడంత మంది అమ్మాయిలతో కనెక్ట్ అవ్వాలి’.. హీరోయిన్ అమైరా దస్తూర్తో హీరో సందీప్ కిషన్. సూపర్స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన తొలిచిత్రం ‘మనసుకు నచ్చింది’లోని డైలాగ్స్ ఇవి. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్–ఇందిరా ప్రొడక్షన్స్ పతాకాలపై సంజయ్ స్వరూప్. పి.కిరణ్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ను హీరో మహేశ్బాబు విడుదల చేశారు. ట్రైలర్లోని డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ డ్రామాగా రూపొందిన చిత్రమిది. ట్రైలర్కి విశేషమైన స్పందన లభించింది. రాధన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో ప్రీ–రిలీజ్ వేడుక నిర్వహించబోతున్నాం. ఈ నెల 26న సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి యాదవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా. -
నిజంగానే ‘మనసుకు నచ్చింది’
సినీ రంగంలో సాంకేతికనిపుణులుగా మహిళలు అరుదుగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా దర్శకత్వ శాఖలో గుర్తింపు తెచ్చుకున్న మహిళలను వేళ్లమీద లెక్కపెట్టోచ్చు. తాజాగా ఈ జాబితాలో ఓ స్టార్ వారసురాలు చేరిపోయారు. నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్ కూతురు మంజుల మనసుకు నచ్చింది సినిమాతో దర్శకురాలిగా మారారు. ఫస్ట్ లుక్, టీజర్లతో ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. సందీప్ కిషన్, అమైరా దస్తర్ లు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో మంజుల కూతురు జాన్వీ వెండితెరకు పరిచయం అవుతోంది. రథన్ స్వరపరచిన ఈ సినిమా పాటలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మూడో సాంగ్ టీజర్ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘రేయ్ ఇదే ని జాగా’ అంటూ సాగే ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. -
‘మనసుకు నచ్చింది’ ఫస్ట్ లుక్