breaking news
malkajgiri railway station
-
మల్కాజిగిరి రైల్వే స్టేషన్ న్యూ లుక్ అదిరింది
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి రైల్వేస్టేషన్ (Malkajgiri railway station) పునరభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. నగరానికి తూర్పు వైపున చర్లపల్లి తర్వాత సకల సదుపాయాలతో మల్కాజిగిరి వినియోగంలోకి రానుంది. ప్రధాన ముఖద్వారంతో పాటు స్టేషన్ విస్తరణ, ప్రత్యేక విశ్రాంతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. అమృత్ భారత్ పథకం (amrut bharat scheme) కింద సుమారు రూ.27.61 కోట్లతో మల్కాజిగిరి అభివృద్ధి పనులను చేపట్టారు. ఇప్పటి వరకు 60 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మిగతా పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.సబర్బన్ రైళ్లతో పాటు పలు దూర ప్రాంత రైళ్లకు మల్కాజిగిరిలో హాల్టింగ్ సదుపాయం ఉంది. ప్రయాణికుల రాకపోకలకు ప్రధాన కేంద్రంగా ఉన్న మల్కాజిగిరి స్టేషన్లో పునరభివృద్ధి వల్ల విశాలమైన కాన్కోర్స్, విశ్రాంతి గదులు, ఫుడ్స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. అలాగే.. దివ్యాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, ర్యాంప్లను ఏర్పాటు చేస్తున్నారు. సబర్బన్ గ్రేడ్–3 కేటగిరీకి చెందిన మల్కాజిగిరి స్టేషన్ నుంచి ప్రతి రోజు 2500 మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. ఏటా రూ.5.48 కోట్ల ఆదాయం లభిస్తుంది. ప్రతి రోజు 27 జతల రైళ్లు మల్కాజిగిరిలో ఆగుతాయి.పునరభివృద్ధి పనులు ఇలా.. మల్కాజిగిరి రైల్వేస్టేషన్ భవనం ముఖద్వారం అభివృద్ధి ప్రయాణికుల సౌకర్యార్థం 12 మీటర్ల వెడల్పు గల పాదచారుల వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జి)తో పాటు 3 లిఫ్టులు మరో 3 ఎస్కలేటర్లు. పెరగనున్న ప్లాట్ఫామ్ ఉపరితలం ఎత్తు. ప్లాట్ఫామ్పై అదనపు పై కప్పు ఏర్పాటు. ఇప్పటి వరకు టాయిలెట్ బ్లాకుల నిర్మాణం పూర్తయింది. వెయిటింగ్ హాల్ అభివృద్ధి చేశారు. వాహనాల పార్కింగ్తో పాటు పచ్చదనం విస్తరణపై ప్రత్యేక దృష్టి. ప్రయాణికులను ఆకట్టుకొనేలా కళలు, సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు. రైలు సూచిక బోర్డులు, కోచ్ సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తారు. తెలంగాణలో 40 స్టేషన్లు. చదవండి: పూర్తి ఫీజు చెల్లిస్తేనే ఎల్ఆర్ఎస్ రాయితీ -
కష్టమే వచ్చిందో.. కర్కశత్వమో!
-
కష్టమే వచ్చిందో.. కర్కశత్వమో!
ఏం జరిగిందో తెలియదు. ఆ కుటుంబానికి కష్టమే వచ్చిందో.. లేదా ఎవరైనా కర్కశత్వం చూపారో గానీ, ఒక తల్లి, ఇద్దరు అభం శుభం ఎరుగని చిన్నారులు రైలు పట్టాల పక్కన మరణించి పడి ఉన్నారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం ఉదయం వెలుగుచూసింది. స్టేషన్ సమీపంలోని పట్టాలపై గుర్తుతెలియని మహిళతో పాటు ఇద్దరు చిన్నారుల మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పిల్లలిద్దరూ విశ్వభారతి నర్సింగ్ స్కూల్లో చదువుతున్నారు. పెద్ద అబ్బాయి నాగరాజు ఒకటో తరగతి చదువుతుండగా, చిన్నబ్బాయి సాయితేజ యూకేజీ చదువుతున్నాడు. వాళ్ల తల్లి గౌరమ్మ పుప్పాలగూడ లోని గ్రీన్ స్పేస్ సిగ్మా అపార్టుమెంట్లలో పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ ముగ్గురూ ఎలా, ఎందుకు మరణించారన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని మృతదేహం
హైదరాబాద్ క్రైం: మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ వెనుక భాగంలో ఒక గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం గుర్తించారు. రైల్వే స్టేషన్ కు సమీపంలో 25-30 సంవత్సరాల మధ్య వయసుగల ఎరుపురంగు టీషర్ట్ వేసుకొని ఉన్న ఒక యువకుని మృతదేహం ఉందని స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.