breaking news
makhdoom mohiuddin
-
పీడితుల కోసమే జీవితం అంకితం
తెలుగు నేలపై జన్మించి ప్రజలకొరకు జీవితాన్ని అర్పించిన అరుదైన కమ్యూనిస్ట్ నేత కామ్రేడ్ మఖ్దూమ్. సింగరేణిలో ఆయన చాలా కాలం ఏఐటీయూసీ బాధ్యుడు. అయన కుమా రుడు కూడా ఉద్యోగం చేసేవాడు. సింగరేణితో అయన అనుబంధం విడ దీయరానిది. బొగ్గు బావుల్లో దిగి కార్మికుల సమస్యలను అయన తెలుసుకునే వారు. ఆయన కవితలు ఇక్కడ ఇప్పటికీ పలు కార్యక్రమాల్లో వినిపిస్తుంటాయి. ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూ కవి, హైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడైన ఆయన మెదక్ జిల్లా ఆందోల్లో 1908, ఫిబ్రవరి 4 న జన్మించాడు. మఖ్దూమ్ పూర్తిపేరు అబూ సయీద్ మహ్మద్ మఖ్దూమ్ మొహియుద్దీన్ ఖాద్రి. వీరి పూర్వీకులు ఉత్తర ప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి స్థిరపడ్డారు. తండ్రి గౌస్ మొహియుద్దీన్ నిజాం ప్రభుత్వంలో సూపరింటెండెంటుగా పనిచేసేవాడు. మఖ్దూమ్ చిన్నతనంలోనే (నాలుగేళ్ళయినా రాకముందే) తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్ళి చేసుకోవడంతో ఆయన తన బాబాయి బషీరుద్దీన్ వద్ద పెరిగాడు. 1929లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో చేరాడు. బతకడానికి పెయింటింగ్స్, సినిమా తారల ఫొటోలు అమ్మాడు. ట్యూషన్లు చెప్పాడు, పత్రికల్లో పనిచేశాడు. ఆయన రాసిన ‘గోథే ప్రేమ లేఖల’ను ‘మక్తబా’ అనే స్థానిక ఉర్దూ పత్రిక అచ్చేసింది. మఖ్దూమ్ కవిగా, నాటక రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడయ్యాడు. 1934లో బెర్నార్డ్ షా నాటకానికి ‘హోష్ కె నా ఖూన్’ అనే ఉర్దూ అనుసరణ రాసి హైద్రాబాద్లో రవీంద్రనాథ్ ఠాగూర్ సమక్షంలో ప్రదర్శించాడు. గురుదేవులు ఆ నాటకం చూసి ఆనందం పట్టలేక, నాటక ప్రదర్శన అయి పోగానే స్టేజిపైకి వెళ్ళి మఖ్దూమ్ని అభినందించి, తన శాంతినికేతన్కు వచ్చి చదువుకోవాల్సిందిగా ఆహ్వానించాడు. హైకోర్టు పక్కన గల సిటీ కాలేజీలో అధ్యాపకుడిగా ఉద్యోగం దొరికింది. కమ్యూనిస్టు రహస్య పత్రిక ‘నేషనల్ ఫ్రంట్’ సంపాదించి చదివేవాడు. నాగపూర్ కామ్రేడ్ల సహాయంతో 1930–40లలో హైదరాబాదులో ‘స్టూడెంట్స్ యూనియన్’ ప్రారంభించాడు. 1940లో తన సహచరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. చండ్ర రాజేశ్వరరావు, గులావ్ు హైదర్, రాజ బహు దూర్ గౌర్, హమీదలీ ఖాద్రీ లాంటి నాయకులతో కలిసి పనిచేస్తుండేవాడు. ‘రైతుకు రొట్టె నివ్వని పొలమెందుకు, కాల్చేయండి ప్రతి గోధుమ కంకిని!’ అనే ఇక్బాల్ కవితను నినదించేవాడు. అక్తర్ హుస్సేన్ రాయ్పురి, సిబ్తె హసన్లతో కలిసి హైద్రాబాదులో ‘అభ్యుదయ రచయితల సంఘం’ స్థాపించాడు. చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, బట్టల గిర్నీ, ఆల్విన్, షాబాద్ సిమెంట్ వంటి అనేక కంపెనీల్లోని కార్మిక సంఘాలకు మఖ్దూమ్ అధ్యక్షుడయ్యాడు. అహోరాత్రులూ వారి సంక్షేమం కోసం కృషి చేశాడు. స్టేట్ అసెంబ్లీలో మాట్లాడినా, బయట కార్మిక సంఘాలలో మాట్లాడినా ఆయన వాగ్ధాటికి ఎదురుండేది కాదు. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957లో మెదక్ నుండి పార్లమెంట్కు పోటీ చేసి ఓడిపోయాడు. శాసనమండలికి ఎన్నికై 1969లో కన్నుమూసే దాకా కమ్యూనిస్టు నేతగా ఆ పదవిలో కొనసాగాడు. మఖ్దూమ్ బాల్యమంతా మతవిశ్వాసాలకు అనుగుణంగానూ, కష్టాల కడలిగానూ సాగింది. మజీద్ను శుభ్రంచేయడం, నీళ్ళు పట్టడం, క్రమం తప్పకుండా ఐదుసార్లు నమాజు చేయడం ఆయన దినచర్యల్లో భాగాలయ్యాయి. మఖ్దూమ్ ప్రతీ ఉదయం ఒక్క పైసాతో తందూరీ రొట్టె తిని సాయంత్రం వరకు గడిపేవాడు. ఆయన మతాన్నీ, మత విశ్వాసాలనూ గౌరవించాడు. మత దురహంకారాన్ని నిరసించాడు. తన చిన్ననాటి కష్టాలను గుర్తుంచుకొని ఆ బాధలు మరెవరికీ రాకూడదనీ, శ్రమజీవుల రాజ్యంతోనే అది సఫలమౌతుందనీ భావించాడు. అందరూ కలిసి భోజనం చేసే ‘దస్తర్ఖాన్’ల గురించి కల గన్నాడు. హైదరాబాదు రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ శాఖకు తొలి కార్యదర్శి ఆయన. నిజావ్ు పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రపంచ ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్రధారి. సాయుధ పోరా టానికి ముందు కారాగార శిక్షలు, పోరాటం తర్వాత అజ్ఞాత వాసం అనుభవించాడు. 1969 ఆగష్టు 25వ తేదీన గుండెపోటుతో ఢిల్లీలో తుది శ్వాస విడిచాడు. హైదరాబాదు లోని సి.పి.ఐ. తెలంగాణ రాష్ట్ర కార్యాలయానికి ‘మఖ్దూమ్ భవన్’ అంటూ ఆయన పేరే పెట్టారు. సింగరేణిలో ఏఐటీయూసీ అనుబంధంగా యూని యన్ నిర్మించడంలో మఖ్దూమ్ కీలకంగా వ్యవహారించాడు. మరో యోధుడు దేవూరి శేషగిరి, రాజ్ బహద్దూర్ గౌర్ తదితరులతో కలిసి ‘ఎర్రజెండా యూనియన్’ నిర్మించాడు. మఖ్దూమ్ సేవలు చిరస్మరణీయం. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ ‘ 99518 65223 (నేడు మఖ్దూమ్ జయంతి) -
విఠల్రావ్ను ‘స్మృతి’ద్దాం!
అందరి కోసం కనులు నవ్వు తాయి/నాకోసం కాటుక ఏడుస్తుంది (సబ్ కె లియె ఆంఖే హస్ తీ హై/ మేరే లియే కాజ ల్ రోతా హై) తాను తరచూ ఆలపించే గజల్ చరణం పండిట్ విఠల్ రావ్ శివ్పుర్కార్కు వర్తించడం ఎంత విషాదం! ‘సుకవి జీవించు ప్రజల నాల్కల మీద’ అన్నట్లుగా హైద్రాబాద్ స్టేట్ కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు మగ్దుం మొహియుద్దీన్ రచన ‘ఏక్ చమేలీ కె తలే’ను విఠల్రావు గాత్రంలో వినని గజల్ ప్రియులు లేరు! మే 29న షిర్డీలో విఠల్రావు తప్పిపోయారు. మరు సటి రోజు రాష్ట్రప్రభుత్వం వివిధరంగాల ప్రముఖులకు తెలంగాణ అవార్డులను ప్రకటించింది. జూన్ 2న పెరేడ్ గ్రౌండ్స్లో అవార్డు స్వీకరించేందుకు విఠల్రావూ వస్తారని అందరూ ఎదురు చూశారు. రాలేదు! ఎందుకు? అప్పుడు తెలిసింది... విస్మృత వ్యాధి! ఆయన అల్జీమర్స్ డిసీజ్(ఎడి)కు గురైనారని, తప్పిపో యారని! జూన్ 27న విఠల్రావు అనామకుడిగా ‘గాంధీ’ మార్చురీకి చేరారు! తాను జీవించి ఉండగా ప్రకటితమైన అవార్డును కుటుంబసభ్యులు వేద నాశ్రువులతో స్వీకరిం చారు! అవాంఛిత ప్రొటీన్లు మెదడులో గడ్డకట్టడం వలన అరవయ్యేళ్లు దాటిన వారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవ కాశం ఉంది. వస్తువులు ఎక్కడ పెట్టిందీ గుర్తుండక పోవడంతో మొదలై స్నేహితులను, కుటుంబ సభ్యులను, స్థలాన్ని, కాలాన్ని, తనను, భాషనూ మరచిపోయే స్మృతి హీనతకు దారితీస్తుంది! ప్రాచీనస్మృతులు తప్ప వర్తమానం గుర్తుండదు! ప్రతి పది మంది వృద్ధుల్లో ఒకరికి, వయసు పెరిగే కొద్ది ప్రతి నలుగురిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధికి నిర్దుష్టమైన వైద్య చికిత్స లేదు. ఈ వయసులో ఇది సహజమే అనుకుంటూ కుటుంబ సభ్యులే సంరక్షిస్తారు. ఫలితంగా పాశ్చాత్య ప్రపంచంలో వలె మన ప్రభుత్వ వైద్యశాఖ రికార్డుల్లో అల్జిమీర్స్ వ్యాధిగ్రస్తుల గణాంకాలు ఖచ్చితంగా ఉండవు. చివరి నిజాం ఆస్థాన గాయకుడు, నిజాంకు ఆయన షహజాదీ (కుమార్తె)కి, వివిధ సంస్థానాధీశులకు గజల్స్ వినిపించిన విఠల్రావుకు ఆ వ్యాధి ఉందని ఆయన కుటుంబ సభ్యులకు, కొందరు సన్నిహితులకు తప్ప ఇతరు లకు తెలియదు. శిష్యులకూ తెలీదు. కెనడా దేశపు అత్యు న్నత గాయనిగా జునొ అవార్డు పొందిన విఠల్రావు శిష్యు రాలు కిరణ్ అహ్లువాలియాకూ తెలీదు. విఠల్రావు శిష్యరి కం చేసిన హరిహరన్కూ తెలీదు! తెలిసినా చేయగలిగిందే మైనా ఉందా? పోలీసులకు ఫిర్యాదు చేయడం, తెలిసిన వారికి చెప్పడం, కళ్లుకాయలు కాసేలా కుటుంబసభ్యులు ఎదురుచూడడం తప్ప! సంస్థలు ఏర్పడాలి! తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపు 50 లక్షల మం ది వృద్ధులు వివిధ దశల అల్జిమర్స్ బాధితులని విఠల్రావు ఉదంతం వెలుగులో మనం గుర్తించాల్సి ఉంది. గుర్తిస్తేనే... అభివృద్ధి చెందిన దేశాల్లో వలె మనకూ అల్జి మర్స్ అసోసియేషన్స్, ఫౌండేషన్స్, ఆదు కునే యంత్రాంగం ఏర్పడతాయి. ఆయా దేశాల్లో వ్యాధికి గురైన వ్యక్తులకు తేలికగా తీసుకునేందుకు వీలుకాని కడియాలు, లాకెట్స్ అమర్చవచ్చు. అవి, సంబంధితుల ఫోన్ కాల్స్కు స్పందిస్తాయి. వ్యాధిగ్రస్తుడు ఎక్కడ ఉన్నదీ తెలుస్తుంది. శబ్దమూ, వెలుతురు ద్వారా పౌరసమాజం గుర్తిస్తుం ది. ఆ పరికరాల్లోని మెడికల్ రికార్డు, వైద్యు లకు ఉపకరిస్తుంది. లోకం చుట్టిన గాయకుడు... అమెరికాతో సహా అనేక యూరోప్ దేశాలు, మధ్యప్రా చ్య దేశాలు పర్యటించిన విఠల్రావును ఆయా దేశాల్లో స్థిరప డమని ప్రముఖులు కోరారు. తాను ఘోషామహల్ వీడ నని ఒక గజల్ (సారే ఫలక్ కీ సైర్ కియా...) ద్వారా చెప్పారు! లోకం చుట్టిన గాయకుడు అల్జీమర్స్ కారణంగా తన గూటికి చేరుకోలేకపోయారు! ‘రాత్రి నిశ్శబ్దంగా వెళ్లిపోయిందని ఒక పిచ్చివాడు ఏడ్చాడు’ అనే చరణాన్ని అభిమానులకు మిగిల్చి! ఆ సాంస్కృతిక రాయబారి పేరుతో 108 తరహాలో ఒక ‘స్మృతి’దాయక వైద్యవ్యవ స్థను ఏర్పాటు చేయడం ప్రజలందరూ హర్షించే నివాళి కాగలదు! (వ్యాసకర్త, ఇండిపెండెంట్ జర్నలిస్ట్) మొబైల్: 7680950863 - పున్నా కృష్ణమూర్తి