breaking news
Luzhou
-
శివ కేశవన్కు 34వ స్థానం
తన వింటర్ ఒలింపిక్స్ కెరీర్ను భారత క్రీడాకారుడు శివ కేశవన్ నిరాశగా ముగించాడు. ల్యూజ్ క్రీడాంశంలో శివ 34వ స్థానంలో నిలిచాడు. 40 మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో ఆదివారం జరిగిన మూడో రేసును శివ 48.900 సెకన్లలో పూర్తి చేశాడు. టాప్–20లో నిలిచిన వారు ఫైనల్ రేసుకు అర్హత సాధించారు. వరుసగా ఆరు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న 36 ఏళ్ల శివ 2014 సోచి ఒలింపిక్స్లో 37వ స్థానంలో నిలిచాడు. -
వింత పందిని చూసేందుకు..
రెండు తలలు, మూడు కళ్లు, రెండు ముక్కులు, రెండు నోర్లతో తెల్లరంగులో ఎంతో ఆకర్షనీయంగా కనిపిస్తున్న పందిపిల్లను చూడడానికి జనాలు ఎగబడుతున్నారు. చైనాలోని లుజ్హోయూలో మూడు రోజుల కింద జోన్గ్ గువోయివాన్ అనే రైతు పెంచుకుంటున్న పంది ఈ రెండు తలల పంది పిల్లకు జన్మనిచ్చింది. స్థానిక మీడియాలో దీని గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో చూడడానికి వింతగా ఉన్న ఈ పందిని వీక్షించడానికి చుట్టు పక్కన గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి పోతున్నారు. దీన్ని తమతో ఉంచుకొంటే అదృష్టమని భావించిన కొందరు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి తమతో తీసుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. గత మూడేళ్ల నుంచి తల్లి పందిని పెంచుతున్నట్టు రైతు జోన్గ్ గువోయివాన్ తెలిపారు. రెండు తలల పందితో పాటూ మరిన్ని పిల్లలకు కూడా అదే కాన్పులో జన్మనిచ్చిందన్నారు. రెండు తలల పందిపిల్ల అంటే తన కుమారుడికి చాలా ఇష్టమని, తనతోనే దాన్ని ఉంచుకుంటున్నాడని పేర్కొన్నారు. పెద్దమొత్తంలో రెండు తలల పందిని అమ్మాల్సిందిగా ఆఫర్లు వచ్చినా, తిరస్కరించినట్టు జోన్గ్ గువోయివాన్ తెలిపారు.