breaking news
lover dies
-
కాలేజీ నుంచే ప్రేమ, సహ జీవనం.. గోవాకు తీసుకెళ్లి..
బనశంకరి: కన్నడిగ ప్రేమ జంట గోవా టూర్లో విషాదాంతంగా ముగిసింది. ప్రియురాలిని ప్రియుడు హతమార్చాడు. ఈ షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దక్షిణ గోవా పోలీసులు ప్రతాప్నగర వద్ద దార్బందోరా అటవీ ప్రదేశంలో యువతి హత్య కేసులో ఆమె ప్రియున్ని అరెస్ట్ చేశారు. అనుమానం పెనుభూతంగా మారి హత్య చేసినట్లు తెలిసింది.గోవా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంజయ్ కెవిన్, రోష్ని గోవాలో పెళ్లి చేసుకుందామనుకున్నారు. సంజయ్ ఏ పనీ చేయకుండా తిరిగేవాడు, రోష్ని అతని ఇంటి దగ్గరే ఓ స్కూల్లో పనిచేసేది. వారికి కాలేజీ రోజుల్లోనే పరిచయమై ప్రేమగా మారింది. చాలా ఏళ్లుగా సహజీవనం సాగిస్తున్నారు. ఇక పెళ్లాడాలని గోవా ట్రిప్కు వెళ్లారు. శనివారం రాత్రి బస్సులో బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున దక్షిణ గోవా పరిధిలోని దార్బందోరా అనే ప్రాంతంలో దిగిపోయారు. ఇద్దరూ సమీప అడవిలోకి వెళ్లారు, అక్కడ సంజయ్ ఆమెను కిరాతకంగా కత్తితో పొడిచి చంపి, ఆమె ఫోన్ను తీసుకుని వెళ్లిపోయాడు. ట్యాక్సీలో హుబ్లీకి చేరుకున్నాడు.బస్సు టికెట్లే క్లూ..మంగళవారం ఈ హత్య విషయం బయటపడింది. వెంటనే స్థానిక పోలీసులు క్షుణ్ణంగా గాలించారు. రోష్ని శవం వద్ద పర్సులో బస్సు టికెట్లు దొరకడంతో ఓ క్లూ లభించింది. పలు బస్టాండ్లలో సీసీ కెమెరాల చిత్రాలను సేకరించి ఆ జంట చిత్రాలను సంపాదించారు. అలా నిందితుని ఆచూకీ కనిపెట్టి బుధవారం సాయంత్రం కల్లా అరెస్టు చేశారు. ఇక, బాధితురాలు స్వస్థలం హుబ్లీ అని సమాచారం.అనుమానంతో హత్య: ఎస్పీదక్షిణ గోవా ఎస్పీ తికమ్సింగ్ వర్మ మాట్లాడుతూ.. రోష్ని మరొకరితో సన్నిహితంగా ఉంటోందని సంజయ్ అనుమానం పెంచుకున్నాడని, హత్య చేయాలని ముందే నిర్ణయించుకుని కత్తి కూడా తీసుకున్నాడని తెలిపారు. మాయమాటలు చెప్పి ఆమెను గోవాకు తీసుకువచ్చాని చెప్పారు. ఎంతో క్లిష్టమైన కేసును ఛేదించామని తెలిపారు. నిందితున్ని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. రోష్నిని తానే చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు, తరువాత ఆత్మహత్య చేసుకోవాలనుకుని బెంగళూరుకు వెళ్లిపోయానని చెప్పినట్లు తెలిసింది. -
ప్రియుడి దాడిలో గాయపడిన ప్రియురాలు మృతి
గుత్తి : గుత్తిలో గత సోమవారం ప్రియుడు శివ దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మి (25) కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టు మార్టం అనంతరం గుత్తికి తరలించారు. ఈ ఘటనలో ప్రియుడు శివను ఇదివరకే పోలీసులు అరెస్టు చేసిన విషయం విదితమే. -
సాగర్ లోకి దూకిన ప్రేమజంట: ప్రియుడి మృతి
హైదరాబాద్: సమస్యలు పరిష్కరించుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతోన్న హైదరాబాద్ నగర వాసులకు హుస్సేన్ సాగర్ అడ్డాగామారిన నేపథ్యంలో లేక్ పోలీస్ వ్యవస్థను ఏర్పాటుచేసి ఆత్మహత్యలతోపాటు అసాంఘిక శక్తులకూ అడ్డుకట్టవేసే ప్రయత్నం జరిగింది. అయినాకూడా అక్కడ ఆత్మహత్యోదంతాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఈ రోజు(బుధవారం) ఉదయం కూడా ట్యాంక్ బండ్ పై నుంచి హుస్సేన్ సాగర్ లోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందో ప్రేమజంట. రామ్ గోపాల్ పేట పోలీసులు తెలిపిన వివరాలను బట్టి నగరానికే చెందిన నరేశ్(29) అనే వ్యక్తి తన ప్రేయసితో కలిసి బుధవారం ఉదయం హుస్సేన్ సాగర్ లోకి దూకాడు. ఇది గమనించిన లేక్ పోలీసులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే నరేశ్ ప్రాణాలు కోల్పోయాడు. అపస్మారక స్థితిలోఉన్న ప్రేమికురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వీరికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడంతోపాటు కుటుంబసభ్యులకు సమాచారం అందించేపనిలోపడ్డారు పోలీసులు. -
'అతను లేని జీవితం నాకొద్దు'
రేగోడ్: చదువుకుని వృద్ధిలోకి రావాల్సిన ఓ బంగారు తల్లి.. 'ఆ యువకుడు లేని జీవితాన్ని ఊహించుకోలేను' అంటూ అఘాయిత్యానికి పాల్పడింది. ప్రేమ అని తను నమ్మిన ఆ భావనే చివరికి ఒంటికి నిప్పంటించుకునేలా పురికొల్పిన ఈ సంఘటన మెదక్ జిల్లాలో చర్చనీయాంశమైంది. జిల్లాలోని రేగోడ్ మండలం మార్పల్లికి చెందిన 13 ఏళ్ల బాలికకు అదే గ్రామానికి చెందిన శివకుమార్ అనే యువకుడికి మధ్య చనువుపెరిగింది. మంచీచెడులు తెలుసుకోలేని వయసులో తనది ప్రేమేనని నమ్మిందా అమ్మాయి. కాగా, గతేడాది సెప్టెంబర్ లో శివకుమార్ పాముకాటుకు బలయ్యాడు. అతను చనిపోయిన దగ్గర్నుంచి దిగాలుగా ఉంటోన్న బాలిక ఈనెల 16న ఇంట్లో ఎవరూలేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా కాలిపోయిన ఆమెను కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సపొందుతూ సోమవారం చనిపోయిన ఆ బాలిక ఇచ్చిన మరణవాగ్మూలాన్ని రేగోడ్ ఎస్ఐ రాచకొండ రవీందర్ మీడియాకు తెలిపారు. 'శివకుమార్ ను తాను ప్రేమించానని, అతడు లేని జీవితం ఊహించలేనని, అందుకే ఆత్మహత్య చేసుకున్నా'అని బాలిక చెప్పినట్లు ఎస్సై వెల్లడించారు.