breaking news
lorry hits car
-
ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురి మృతి
సాక్షి, నల్గొండ: మిర్యాలగూడ వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును గుర్తు తెలియని లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, మహిళ ఉన్నారు. నార్కట్పల్లి–అద్దంకి హైవేపై మిర్యాలగూడ పట్టణ పరిధిలోని కృష్ణానగర్ కాలనీ వద్ద అర్ధరాత్రి 12.10 నిమిషాల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. తీర్థయాత్రలకు వెళ్లి వస్తుండగా.. మిర్యాలగూడ మండలం నందిపాడుకు చెందిన చెరుపల్లి చెరుపల్లి మహేష్ హైదరాబాద్లోని వనస్థలిపురంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటూ ఫొటోగ్రాఫర్గా పని చేస్తున్నాడు. మూడురోజుల క్రితం అతని కుటుంబంతో పాటు బంధువులు కొందరు కలిసి కారులో తీర్థయాత్రలకు వెళ్లారు. యాత్ర ముగించుకుని ఆదివారం రాత్రి గుంటూరు వైపు నుంచి ఇంటికి తిరిగి వస్తూ మరో ఐదు నిమిషాల్లో ఇల్లు చేరతారనగా ప్రమాదం చోటు చేసుకుంది. నిద్రమత్తులో ఉండి డ్రైవింగ్ చేస్తుండగా కారు డివైడర్ దాటి రావడంతో అటుగా వస్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ (32), అతని భార్య చెరుపల్లి జ్యోతి (30), కుమార్తె రిషిక (6), మహేష్ షడ్డకుడు బొమ్మ మహేందర్ (38), అతని కుమారుడు లియాన్‡్ష (2) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మహేందర్ భార్య మాధవిని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మహేందర్ది యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నేపల్లి అని తెలిసింది. మృతదేహాలను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
అతివేగానికి ఐదుగురు బలి
జోగిపేట (అందోల్)/ కొల్చారం(నర్సాపూర్): అతివేగం ఐదుగురి ప్రాణాలను బలి తీసుకుంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. సంగారెడ్డి నుంచి వస్తున్న కారు.. ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న మెదక్ జిల్లా రంగంపేటకు చెందిన పాస్టర్ లూకా (46), ఆయన భార్య దీవెన (44), అదే జిల్లా సంగాయిపేటకు చెందిన అంబదాస్ (45), ఆయన భార్య పద్మ (30), వారి కుమారుడు వివేక్ (5) అక్కడిక్కడే మృతి చెందారు. అపెండిసైటిస్తో బాధపడుతున్న వివేక్కు నాలుగు రోజుల కింద సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగింది. శుక్రవారం డిశ్చార్జి కావడంతో పాస్టర్ లూకాకు చెందిన కారులో వారంతా తిరుగుపయనమయ్యారు. ఇంతలోనే వారిని మృత్యువు కబళించింది. కారు అతివేగంగా నడిపిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని డీఎస్పీ బాలాజీ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చర్చిలో ఇరు కుటుంబాలకు స్నేహం అంబదాస్ కుటుంబం ప్రతి ఆదివారం రంగంపేటలోని చర్చిలో ప్రార్థనలకు వస్తుండేది. ఈ క్రమంలో ఆ చర్చిలోని పాస్టర్ లూకా, అంబదాస్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. సంగారెడ్డి ఆసుపత్రి నుంచి తమ కుమారుడి డిశ్చార్జికి వెళ్లాలని చెప్పగా పాస్టర్ లూకా తన కారు తీసుకొచ్చాడు. రెండు కుటుంబాల్లో విషాదం అంబదాస్–పద్మ దంపతులకు వినయ్, వివేక్ ఇద్దరు కుమారులు. ప్రమాదంలో అంబదాస్, పద్మ, వివేక్ చనిపోవడంతో వినయ్ అనాథగా మిగిలాడు. పాస్టర్ లూకా–దీవెన దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. తల్లిదండ్రుల మృతితో ఆ నలుగురికీ పెద్ద దిక్కు లేకుండా పోయింది. సీటు బెల్ట్ ధరించి ఉంటే.. ముందు సీటులో కూర్చున్న పాస్టర్ దంపతులు సీటు బెల్టు ధరించలేదు. సీటు బెల్టు ధరించి ఉంటే ప్రాణాలు కోల్పోకపోయేవారని అంటున్నారు. సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లే ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోలేదని, ఒకవేళ అవి తెరుచుకుని ఉం టే ప్రమాద తీవ్రత ఇంతగా ఉండేది కాద ని స్థానికులు చెబుతున్నారు. కాగా, లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృత్యు రహదారి సంగారెడ్డి–నాందేడ్–అకోలా హైవేకు మృత్యు రహదారి అనే పేరుంది. చౌటకూరు నుంచి శివ్వంపేట వరకు ఈ ఏడాదిలోనే ఇప్పటి వరకు యాభైకి పైగా ప్రమాదాలు జరిగాయి. రహదారి విస్తరణ పనులు మొదలుకాక ముందు డబుల్ రోడ్డుగా ఉండేది. అప్పుడు తరచుగా ప్రమాదాలు జరిగేవి. ఇదీ లూకా నేపథ్యం పాస్టర్ లూకాది సంగారెడ్డి జిల్లా శివంపేట మండలం గూడూరు. 20 ఏళ్ల కింద రంగంపేటకు వచ్చి స్థిరపడ్డాడు. తొలుత చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని చర్చి ప్రారంభించాడు. ఆ తర్వాత సొంతంగా స్థలం తీసుకొని చర్చి నిర్మించాడు. చర్చికి వచ్చేవారికి దీవెనయ్యగా సుపరిచితుడు. డివైడర్లు ఉంటే.. ప్రాణాలు దక్కేవి నాందేడ్–అకోలా జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో ఇంకా డివైడర్ల ఏర్పాటు చేయలేదు. పనులు కూడా పూర్తికాలేదు. దీంతో అన్ని వాహనాలు ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి. ప్రమాదస్థలి వద్ద రోడ్డు వెడల్పుగానే ఉంది. లారీ ఎడమవైపు వస్తుండగా, కుడివైపున కారు ఢీకొంది. ఎడమవైపు వెళ్లాల్సిన కారు కుడి వైపు ఎందుకు వెళ్లిందో..? అతి వేగంగా వెళ్లడమా..? లేదా ఏదైనా వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతే ఈ ఘటన జరిగిందా..? అన్న ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు. ‘భయంగా ఉందిరా..’ అంబదాస్ ఆటోడ్రైవర్ కాగా, భార్య పద్మ కూలి పనులకు వెళ్తుంటుంది. చుట్టుపక్కల వారిని తల్లో నాలుకగా ఉంటారు. శుక్రవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో కొడుకు వినయ్కు ఫోన్చేసి తనకు భయం అవుతోందని, సంగారెడ్డికి రమ్మని చెప్పగా.. జోగిపేట వరకు వస్తానని, అక్కడ కారు దిగితే బస్సులో వెళ్దాం అని తన తండ్రితో వినయ్ చెప్పాడు. అయితే జోగిపేట రాకముందే దారుణమైన ప్రమాదం జరిగింది. -
లారీని ఢీకొన్న కారు,ముగ్గురు మృతి
-
లోయలో పడిన కారు: ఐదుగురికి తీవ్రగాయాలు
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుపల్లి మండలం సున్నంపాడు వద్ద ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కారును లారీ ఢీకొట్టడంతో కారు వెళ్లి లోయల పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కారు లారీ ఢీ,12 మందికి గాయాలు