breaking news
lightest
-
ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం సృష్టించిన భారత కంపెనీ..!
ప్రపంచవ్యాప్తంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. అగ్రదేశాలతో పాటుగా భారత్కు చెందిన కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సిద్దమయ్యాయి. అత్యంత తేలికైన ఎలక్ట్రిక్ కార్..! తాజాగా ముంబైకు చెందిన వజీరానీ ఆటోమోటివ్ ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం సృష్టించింది. వజీరానీ ఆటోమోటివ్ సోమవారం రోజున అత్యంత వేగవంతమైన, ప్రపంచంలో తేలికైన ఎలక్ట్రిక్ వాహనం ఎకోంక్ (హైపర్ కారు) లాంచ్ చేసింది. ఎకోంక్ అత్యంత వేగంగా వెళ్లే ఎలక్ట్రిక్ కారుగా నిలుస్తోందని కంపెనీ వెల్లడించింది . ఇండోర్లోని నాక్స్ట్రాక్స్ హై స్పీడ్ ట్రాక్లో ఎకోంక్ సుమారు 309కేఎమ్పీహెచ్ గరిష్ట వేగాన్ని సాధించిందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ కారు 0 నుంచి 100 కెఎమ్పీహెచ్ స్పీడ్ను కేవలం 2.54 సెకండ్లలో అందుకుంటుంది. రోల్స్ రాయిస్ నుంచి..! 2015లో వజిరానీ ఆటోమోటివ్ను ముంబైకు చెందిన చంకీ వజీరానీ స్థాపించారు. చంకీ గతంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్, జాగ్వార్ లాంటి ఆటోమొబైల్ కంపెనీల్లో పనిచేశారు. సూపర్ఫాస్ట్ కార్ల తయారీలో భారత్ను ప్రపంచపటంతో నిలపాలనే లక్ష్యంతో కంపెనీ స్థాపించాడు. ఫోర్స్ ఇండియా ఫార్ములా 1, మిచిలిన్ కంపెనీల భాగస్వామ్యంతో భారత తొలి హైబ్రిడ్ ఇంజిన్ కార్ను 2018 గుడ్వుడ్ ఫెస్టివల్లో ఎకోంక్ సూపర్ కారును తయారుచేశారు. ఎకోంక్ కార్ ఫీచర్స్..! ఎకోంక్ సింగిల్ సీటర్ ఏరోడైనమిక్ హైపర్ కార్. ఈ కారులో కొత్త బ్యాటరీ సెటప్ను అమర్చారు. ఇది సుమారు 738 కిలోల బరువును కల్గి ఉంది. ఎకోంక్ గరిష్టంగా 722 హెచ్పీ పవర్ను ఉత్పత్తి చేస్తోంది. కారు బాడీని పూర్తిగా కర్బన్ ఫైబర్తో తయారుచేశారు. దీంతో అత్యంత తేలికైన కారుగా ఎకోంక్ నిలుస్తోంది. చదవండి: మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ బైక్.. అదిరిపోయే స్పీడ్, రేంజ్ -
ఆపిల్ కొత్త మ్యాక్బుక్లు వచ్చేశాయ్!
-
ఆపిల్ కొత్త మ్యాక్బుక్లు వచ్చేశాయ్!
శాన్ ఫ్రాన్సిస్కో: ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం ఆపిల్ ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్టులను మార్కెట్లోకి విడుదలచేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. మ్యాక్ బుక్, ఐ ఫోన్లు తదితర ఉత్పత్తులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన ఆపిల్ తాజాగా కొత్తరకం ల్యాప్ టాప్ లను విడుదల చేసింది. 13,15 ఇంచుల సైజ్ కలిగిన రెటీనా డిస్ప్లే మ్యాక్బుక్ మోడల్స్ను మార్కెట్లో ప్రవేశపెట్టింది కుపెర్టినో ఆధారిత అతి తేలికైన, పలుచనిమ్యాక్ బుక్ ప్రో ను లాంచ్ చేసింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 12ఇంచుల మ్యాక్బుక్ లాగే కొత్త మ్యాక్బుక్ లను కొత్తగా డిజైన్ చేసి మూడు వేరియంట్లలో అందిస్తోంది. త్వరలోనే ఇవి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ వెల్లడించింది. సాధారణ కీబోర్డులకు స్వస్తి చెపుతూ టచ్ బార్ (రెటీనా క్వాలిటీ మల్టీ డచ్ డిస్ ప్లే) అనే కొత్త టెక్నాలజీని ఆవిష్కరించింది. సాధారణ కీ బోర్డు ఉన్న13 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో 1,499 డాలర్లకు, హై ఎండ్ మోడల్ 13 అంగుళాల మ్యాక్ బుక్ ప్రో 1,799 డాలర్లకు 15అంగుళాల మ్యాక్ బుక్ ప్రో 2,399డాలర్లు ప్రారంభ ధరలుగా ఆపిల్ వెల్లడించింది. ఈవారంలో జరగనున్న యాపిల్ నోట్ బుక్ 25 వార్షికోత్సవం గుర్తుగా వీటిని పరిచయం చేస్తున్నట్టు యాపిల్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ఫిలిప్ స్కిల్లర్ తెలిపారు. ఇన్ని సంవత్సరాలుగా వినియోగదారులకు ఎల్లప్పుడూ ఉత్తమమైన, నాణ్యమైన ఉత్పత్తులతో కొత్త ఆవిష్కరణలకు నాంది పలికిన తాము మ్యాక్ బుక్ ప్రో లాంచింగ్ ఒక పెద్ద ముందడుగు అని ప్రకటించారు. 13 అంగుళాల మాక్ బుక్ ప్రో 6 వ తరం క్వాడ్ డ్యూయల్ -కోర్ ప్రాసెసర్లు 2.0 గిగాహెడ్జ్ డ్యూయల్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ 3.1గిగాహెడ్జ్ స్పీడ్, సూపర్ ఫాస్ట్ ఎస్ఎస్డీ టర్బో బూస్ట్ , 5-అంగుళాల డిస్ ప్లే 1.83 కిలోల బరువు 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 15 అంగుళాల మాక్ బుక్ ప్రో 15.5 మి.మీ, 1.83 కిలోల బరువు గతంకంటే 14 శాతం సన్నగా, 20శాతం వాల్యూమ్ ఎక్కువగా టచ్ బార్ అండ్ టచ్ ఐడీ, టర్బో బూస్ట్ 2.6గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ఇంటెల్ కోర్, ఐ7 ప్రాసెసర్ 3.5గిగాహెడ్జ్ స్పీడ్ 16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్