-
అబార్షన్ చట్టాల రద్దుకే ఐర్లాండ్ ఓటు!
లండన్: ఆరేళ్ల క్రితం భారత సంతతి వివాహిత సవితా హాలప్పనవర్(31) మృతితో ఐర్లాండ్లో అబార్షన్ వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని మొదలైన ఉద్యమం ఎట్టకేలకు ఫలించింది. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన రిఫరెండంలో ఆ కఠిన చట్టాల్ని రద్దు చేయాలని సుమారు 66.4 శాతం మంది ఓటేసినట్లు మీడియా తెలిపింది. 33.6 శాతం మంది వ్యతిరేకించారు. గర్భస్థ శిశువు, తల్లికి సమాన హక్కులు కల్పిస్తున్న 8వ రాజ్యాంగ సవరణను రద్దు చేయాలని కోరుతూ ప్రజాభిప్రాయం సేకరించారు. ప్రజా తీర్పును ప్రధాని వారద్కర్ స్వాగతించారు. గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న నిశ్శబ్ద విప్లవం ముగింపు దశకు చేరుకుందని వ్యాఖ్యానించారు. ఆయన మొదటి నుంచి అబార్షన్ వ్యతిరేక చట్టాల రద్దుకు మద్దతు పలుకుతున్నారు. -
ప్రజల బాగోగులకే చట్టాలు
సివిల్, డబ్బు కేసుల్లో పోలీసుల ప్రమేయం ఉండరాదు ఖమ్మం మూడో అదనపు ప్రథమ శ్రేణి జడ్జి పంచాక్షరి తనికెళ్ల (కొణిజర్ల) : ప్రజల బాగోగులకు, కలతలు లేని సమాజ స్థాపనకు చట్టాలు వచ్చాయని, అలాంటి చట్టాలను అతిక్రమించి కోర్టులకు వస్తున్నారని జిల్లా 3వ అదనపు ప్రథమ శ్రేణి సివిల్ జడ్జి సీహెచ్ పంచాక్షరి పేర్కొన్నారు. మండలంలోని తనికెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. 18 ఏళ్లు నిండని బాల బాలికలను ఎటువంటి పనుల్లో పెట్టుకోరాదని, అటువంటివారు శిక్షార్హులు అవుతారన్నారు. బాలికలకు చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల వారు మానసికంగా, శారీరకంగా నష్టపోతున్నారన్నారు. ఎటువంటి వాహనం కొన్నా తక్షణమే రిజిస్ట్రేషన్ చేయంచాలన్నారు. 18 ఏళ్లు నిండని వారికి వాహనాలు ఇవ్వకూడదన్నారు. భూములు కొనేటప్పుడు, వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా పూర్తి డాక్యుమెంట్లు రాసిన తర్వాతే డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం చేయాలన్నారు. చేతి కాగితాల మీద భూములు కొనుగోలు చేస్తే అవి చెత్త కాగితాలతో సమానమన్నారు. భూ సంబంధ కేసులను, వడ్డీ వ్యాపారుల కేసులను పోలీసులకు విచారించే హక్కు లేదన్నారు. అవి పూర్తిగా కోర్టు పరిధిలోనే ఉంటాయన్నారు. న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేని ఎస్సీ, ఎస్టీ, నిరుపేద వర్గాల వారు న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చన్నారు. అనంతరం పాఠశాలలో ఆయన విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో తహసీల్దార్ గంటా శ్రీలత, ఎంపీడీఓ పి. శ్రీనివాసరావు, ఎంఈఓ యం.శ్యాంసన్, సర్పంచ్ తేజావత్ వనిత, ఎంపీటీసీ సభ్యుడు గాజుల కష్ణమూర్తి, ఎస్ఐ రాసూరి కష్ణ, న్యాయవాది బీశ రమేష్, హెచ్ఎం మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైభవంగా త్రిశూల చక్ర స్నానం
రాజంపేట సెంటిమెంట్ ఎవరికో !
ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్
నృసింహుడికి ప్రత్యేక పూజలు
లెక్కలతో కుస్తీ
జరిమానాలతోనే సరి.. కల్తీ యథావిధి
అప్రమత్తతో తప్పిన ముప్పు
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
గ్రీన్లో ట్రేడవుతున్న స్టాక్మార్కెట్లు
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement