breaking news
Lawn bowls
-
గోళీలాట మాదిరే లాన్ బౌల్స్.. కాని చిన్న ట్విస్ట్!
ప్రపంచంలో మనకు తెలియని ఆటలు ఎన్నో ఉన్నాయి. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, వాలీబాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్.. ఇవన్నీ ప్రపంచ క్రీడలుగా విశిష్టతను పొందాయి. కానీ ఒలింపిక్స్ లేదా కామన్వెల్త్ గేమ్స్ జరిగినప్పుడు మాత్రం మనకు తెలియని కొత్త గేమ్స్ కూడా పరిచయమవుతాయి. అలా పరిచయం అయిందే లాన్ బౌల్స్ క్రీడ. 2022 కామన్వెల్త్ గేమ్స్లో లాన్ బౌల్స్లో భారత్ ఒక స్వర్ణంతో పాటు మరో రజతం గెలవడం ద్వారా మన దేశంలో ఈ ఆట తొలిసారి వెలుగులోకి వచ్చింది. ఈ ఆట చూడ్డానికి చిన్నప్పుడు మనం ఆడే గోళీలాట మాదిరే ఉంటుంది. కానీ గోళీలాటకు కాస్త భిన్నంగా లాన్ బౌల్స్ ఆట ఉంటుంది.లాన్ బౌల్స్ అనేది ఇంచుమించుగా బౌలింగ్ క్రీడ మాదిరి ఉంటుంది. ఒక ఎండ్ నుంచి రౌండ్ గా ఉన్న బంతులను మరో ఎండ్ లో ఉన్న టార్గెట్ మీదకు వదలాలి. ఎవరిదైతే టార్గెట్ కు దగ్గరగా చేరుకుంటుందో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇక్కడ టార్గెట్ ను జాక్ గా పిలుస్తారు. ఉదాహరణకు ’బి‘ టీం కంటే కూాడా ’ఎ‘ టీమ్ టార్గెట్ కు సమీపంగా రెండు బాల్స్ ను విసిరితే అప్పుడు ఎ టీంకు రెండు పాయింట్లు లభిస్తాయి. అంటే టార్గెట్ కు ఏ టీంవి ఎక్కువ దగ్గరగా ఉంటే అన్ని పాయింట్స్ ఇస్తారన్నమాట. రూల్స్ ఇలా..ఈ ఆటను సింగిల్స్, డబుల్స్ తో పాటు ముగ్గురు/ నలుగురితో కూడిన జట్టుగానూ ఆడొచ్చు. టీమ్ ఈవెంట్లలో తొలుత బంతిని విసిరే బౌలర్ ను 'లీడ్' అని పిలుస్తారు. ఇక చివర్లో రోల్ చేసే ప్లేయర్ను 'స్కిప్' అంటారు. ఇరు జట్లు లేదా ఇద్దరు ప్లేయర్లు తమ బౌల్స్ను రోల్ చేయడం పూర్తయిన తర్వాత.. పాయింట్లను లెక్కిస్తారు. జాక్ కు బౌల్ దగ్గరగా వెళ్లడం లేదా తాకడమే ఈ ఆట లక్ష్యం. సింగిల్స్ విభాగంలో ఎవరైతే తొలుత 21 పాయింట్లకు చేరుతారో వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇక టీమ్ ఈవెంట్స్లో మాత్రం రౌండ్లన్నీ పూర్తయ్యాకనే విజేత ఎవరనేది తేలుస్తారు. జాకు బంతి తగిలిందా? ఎంత దూరంలో నిలిచింది అనేదే ఇక్కడ ప్రధానం. దాని ఆధారంగానే పాయింట్లను నిర్ణయిస్తారు.ఇక లాన్ బౌల్స్ గేమ్లో భారత్ శుభారంభం చేసింది. లాన్ బౌల్స్ మహిళల పెయిర్స్ ఈవెంట్లో భారత్ తొలి రౌండ్లో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో భారత జోడీ రూపా రాణి–పింకీ ‘టైబ్రేక్’లో మాల్టాను ఓడించింది. పురుషుల సింగిల్స్లో భారత ప్లేయర్ పుతుల్ సోనోవాల్ 5–4, 3–7, 1–0తో ‘టైబ్రేక్’లో 2023 ప్రపంచ చాంపియన్ రియాన్ బెస్టెర్ (కెనడా)పై సంచలన విజయం సాధించాడు. Winning Start for Team India at CWG 2026!🇮🇳🔥Pinki Singh & Rupa Rani Tirkey defeated Malta in a thrilling tie-breaker in the women's pairs lawn bowls event.pic.twitter.com/EiffSZLrXn— Sports Apna 🇮🇳 (@sportsapna1) July 23, 2026Read: విద్యార్థుల నిరసన.. నాన్న మాటలు గుర్తు చేసుకున్న సచిన్ -
కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం.. లాన్ బౌల్స్లో భారత్ శుభారంభం
గ్లాస్కో వేదికగా కామన్వెల్త్ గేమ్స్ గురువారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భారత్ తరఫున వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను, లవ్లీనా బొర్గొహైన్ ఫ్లాగ్ బేరర్స్గా వ్యవహరించారు. మువ్వన్నెల జెండాను చేతపట్టి వీరిద్దరు ముందు నడవగా, వారిని భారత జట్టు అనుసరించింది. ఇక గేమ్స్ ప్రారంభానికి ముందే బాక్సర్ లవ్లీనా భారత్కు పతకం ఖాయం చేయగా, లాన్ బౌల్స్ గేమ్లో భారత్ శుభారంభం చేసింది.లాన్ బౌల్స్ మహిళల పెయిర్స్ ఈవెంట్లో భారత్ తొలి రౌండ్లో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో భారత జోడీ రూపా రాణి–పింకీ ‘టైబ్రేక్’లో మాల్టాను ఓడించింది. తొలి సెట్ను భారత్ 7–1, రెండో సెట్ను మాల్టా 4–3తో గెలుచుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. చివరి బౌల్లో రాణించి పింకీ జట్టును గెలిపించింది. పురుషుల సింగిల్స్లో భారత ప్లేయర్ పుతుల్ సోనోవాల్ 5–4, 3–7, 1–0తో ‘టైబ్రేక్’లో 2023 ప్రపంచ చాంపియన్ రియాన్ బెస్టెర్ (కెనడా)పై సంచలన విజయం సాధించాడు. డోపింగ్లో పట్టుబడిన భారత ప్లేయర్లు డోపింగ్లో పట్టుబడటంతో భారత జూడో క్రీడాకారుడు అరుణ్ కుమార్ కామన్వెల్త్ క్రీడలకు దూరమయ్యాడు. 73 కేజీల విభాగంలో అతను బరిలోకి దిగాల్సి ఉంది. అయితే ఇటీవల నిర్వహించిన డోపింగ్ పరీక్షలో అతను నిషేధిత ఉత్రే్పరకం వాడాడని తేలడంతో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అరుణ్పై తాత్కాలిక నిషేధం విధించింది. దాంతో గ్లాస్గోకు వెళ్లాల్సిన భారత టీమ్ నుంచి అతడిని తప్పించారు. ఇక వెయిట్లిఫ్టింగ్లో పలువురు ఆటగాళ్లు డోపింగ్ నిబంధనలు ఉల్లఘించడంతో భారత్కు కేటాయించిన కోటాను 16 నుంచి 11కు తగ్గిస్తూ కామన్వెల్త్ క్రీడల నిర్వాహక మండలి నిర్ణయం తీసుకుంది. అజిత్ (71 కేజీలు), సాయిరాజ్ పరదేశి (88 కేజీలు), హర్చరణ్ సింగ్ (110 కేజీలు), వంశితా వర్మ (86 కేజీలు) డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. A proud moment for India! Led by Flag Bearer Mirabai Chanu and Ceremonial Baton Bearer Lovlina Borgohain, #TeamIndia proudly marches into the Opening Ceremony as the Commonwealth Games 2026 officially begin. Pic credit: @PTUshaOfficial#Cheer4Bharat #CWG2026… pic.twitter.com/w41GmdsmB2— Doordarshan Sports (@ddsportschannel) July 24, 2026 -
అచ్చొచ్చిన గేమ్స్ తొలగింపు.. కామన్వెల్త్లో భారత్ షెడ్యూల్ ఇదే
రెండు నెలల పాటు సాగిన ఫిఫా ప్రపంచకప్ యావత్ క్రీడాభిమానులను ఉర్రూతలూగించింది. అయితే ఫిఫా టోర్నీ అలా ముగిసిందో లేదో మరో ప్రపంచ క్రీడా వేడుకకు సమయం ఆసన్నమైంది. మినీ ఒలింపిక్స్గా భావించే కామన్వెల్త్ గేమ్స్కు నేటి నుంచే తెరలేవనుంది. ఈసారి కామన్వెల్త్ గేమ్స్కు గ్లాస్కో ఆతిథ్యమిస్తోంది. ఇక కామన్వెల్త్ గేమ్స్లో భారత్ గురువారం నుంచి తమ ఆటను ప్రారంభించనుంది. జూలై 23 నుంచి ఆగస్టు 11 వరకు సాగనున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఏ విభాగాల్లో పోటీ పడుతుందనేది ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా మూడు విభాగాల్లో భారత్కు ఈసారి అధిక పతకాలు వచ్చే అవకాశాలున్నాయి. అథ్లెటిక్స్, బాక్సింగ్తో పాటు వెయిట్లిఫ్టింగ్ ఇందులో ఉన్నాయి. వ్యక్తిగత విభాగాల్లో నీరజ్ చోప్రా మరోసారి ఫెవరెట్గా బరిలోకి దిగుతుండగా, లాంగ్జంపర్ మురళీ శ్రీశంకర్, ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్, రన్నర్ గుల్వీర్ సింగ్పై కూడా భారీ ఆశలు ఉన్నాయి. ఇక వెయిట్లిఫ్టింగ్లో మహిళల 48 కేజీల విభాగంలో పోటీ పడుతున్న మీరాబాయి చానుపై భారీ అంచనాలున్నాయి. ఈసారి ఆమె స్వర్ణం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మీరాబాయితో పాటు బింద్యారాని దేవి, గ్యానేశ్వరీ యాదవ్ల నుంచి కూడా పతకాలు ఆశించొచ్చు. ఇక బాక్సింగ్ విభాగంలో లవ్లీనా బొర్గొహైన్, వరల్డ్ చాంపియన్ జాన్మిన్ లంబోరియాతో పాటు సాక్షి చౌదరీ, ప్రీతి పవార్లపై భారీ అంచనాలున్నాయి. జూడోలో తులికామన్తో పాటు లాన్బౌల్స్లో బరిలోకి దిగుతున్న జట్టుపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. 2022 కామన్వెల్త్ గేమ్స్లో లాన్బౌల్స్లో భారత్కు ఒక స్వర్ణం, వెండి పతకం లభించింది. ఈసారి భారత్ లాన్స్బౌల్తోనే కామన్వెల్త్ గేమ్స్ను ఆరంభించనుంది.👉2018 గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో ఇప్పటివరకు భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ సీజన్లో భారత్ 66 పతకాలు (26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలు) సాధించింది. 2022 బర్మింగ్హమ్ గేమ్స్లోనూ భారత్ 61 పతకాలతో సత్తా చాటింది. ఇందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్యాలున్నాయి.👉 భారత్కు అచ్చొచ్చిన రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, స్క్వాష్, మహిళల టీ20 క్రికెట్, ట్రయాథ్లాన్ వంటి క్రీడలను గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నుంచి తొలగించారు. ఇది భారత స్వర్ణ పతకాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. గత ఎడిషన్లో భారత్ గెలిచిన 22 స్వర్ణాలలో 13 స్వర్ణాలు ఈ తొలగించిన క్రీడల నుంచే వచ్చాయి.కామన్వెల్త్ గేమ్స్లో భారత్ షెడ్యూల్గురువారం, 23 జూలైలాన్ బౌల్స్: పురుషుల, మహిళల సింగిల్స్ గ్రూప్ దశ (మధ్యాహ్నం 2:00 గంటలకు)శుక్రవారం, 24 జూలైలాన్ బౌల్స్: పురుషుల సింగిల్స్ & మహిళల పెయిర్స్ గ్రూప్ దశ (మధ్యాహ్నం 1 గంటకు)బాక్సింగ్: మధ్యాహ్నం 3:30 గంటలకు - ప్రిలిమినరీ బౌట్స్ (రౌండ్ ఆఫ్ 32 / రౌండ్ ఆఫ్ 16)ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: సాయంత్రం 4:30 గంటలకు - పురుషుల టీమ్ ఫైనల్ & వ్యక్తిగత క్వాలిఫికేషన్పారా పవర్లిఫ్టింగ్: పురుషుల & మహిళల లైట్వెయిట్ ఫైనల్స్ (సాయంత్రం 5:30 గంటలకు), పురుషుల & మహిళల హెవీవెయిట్ ఫైనల్స్ (రాత్రి 10:30 గంటలకు)స్విమ్మింగ్ / పారా స్విమ్మింగ్: పురుషుల S13 100మీ ఫ్రీస్టైల్ ఫైనల్ & 4x100మీ ఫ్రీస్టైల్ రిలే ఫైనల్ (రాత్రి 11:30 గంటలకు )శనివారం, 25 జూలైలాన్ బౌల్స్: గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు (మధ్యాహ్నం 1:00 గంటకు)బాక్సింగ్: మొదటి రౌండ్ / రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు (మధ్యాహ్నం 3:30 గంటలకు) ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: మహిళల టీమ్ ఫైనల్ & వ్యక్తిగత క్వాలిఫికేషన్ (సాయంత్రం 4:30 గంటలకు) 3x3 వీల్చైర్ బాస్కెట్బాల్: భారత మహిళలు వర్సెస్ స్కాట్లాండ్ (గ్రూప్ స్టేజ్-రాత్రి 9:30 గంటలకు)స్విమ్మింగ్: పురుషుల S14 200మీ ఫ్రీస్టైల్ ఫైనల్ & 50మీ బ్యాక్స్ట్రోక్ ఫైనల్ (రాత్రి 11:30 గంటలకు)ఆదివారం, 26 జూలైలాన్ బౌల్స్: గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు (మధ్యాహ్నం 1:00 గంటకు)వెయిట్ లిఫ్టింగ్: పురుషుల 60 కేజీల ఫైనల్ (మధ్యాహ్నం 2:00 గంటలకు), మహిళల 48 కేజీల ఫైనల్ (సాయంత్రం 6.30 గంటలకు), పురుషుల 65 కేజీల ఫైనల్ (రాత్రి 11.00 గంటలకు)బాక్సింగ్: రెండవ రౌండ్ మ్యాచ్లు (మధ్యాహ్నం 3:30 గంటలకు)ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్: పురుషుల వ్యక్తిగత 'ఆల్-రౌండ్' ఫైనల్ (సాయంత్రం 4:30 గంటలకు), మహిళల వ్యక్తిగత 'ఆల్-అరౌండ్' ఫైనల్ (రాత్రి 10:30 గంటలకు)సోమవారం, 27 జూలైలాన్ బౌల్స్: గ్రూప్ దశ (మధ్యాహ్నం 1:00 గంటకు); సెమీ-ఫైనల్స్ (రాత్రి 8:30 గంటలకు)అథ్లెటిక్స్ & పారా అథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు - పురుషుల 400మీ హర్డిల్స్ (రౌండ్ 1), లాంగ్ జంప్ (క్వాలిఫైయింగ్), పురుషుల 110మీ హర్డిల్స్ (రౌండ్ 1), రాత్రి 11:00 గంటలకు - పురుషుల హై జంప్ ఫైనల్, 110మీ హర్డిల్స్ ఫైనల్, మహిళల షాట్ పుట్ F57 ఫైనల్స్విమ్మింగ్: మధ్యాహ్నం 3:00 గంటలకు - పురుషుల 200మీ బటర్ఫ్లై హీట్స్; రాత్రి 11:30 గంటలకు - ఫైనల్వెయిట్లిఫ్టింగ్: సాయంత్రం 5:30 గంటలకు - మహిళల 53కిలోల & 58కిలోల విభాగాల ఫైనల్స్, పురుషుల 79కిలోల విభాగం ఫైనల్ (అర్ధరాత్రి 12:30)3x3 వీల్చైర్ బాస్కెట్బాల్: రాత్రి 9:30 గంటలకు - భారత్ మహిళల జట్టు vs నైజీరియా (గ్రూప్ దశ)మంగళవారం, 28 జూలైలాన్ బౌల్స్: మధ్యాహ్నం 1:00 గంటకు - పతక పోరు మ్యాచ్లు (పురుషుల సింగిల్స్ & మహిళల పెయిర్స్), సాయంత్రం 7:30 గంటలకు- పురుషుల పెయిర్స్ & మహిళల సింగిల్స్ గ్రూప్ దశఅథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు - పురుషుల 400మీ రౌండ్ 1, రాత్రి 11:00 గంటలకు - మహిళల హై జంప్ ఫైనల్, పురుషుల 100మీ సెమీ-ఫైనల్స్ & ఫైనల్స్వెయిట్లిఫ్టింగ్: సాయంత్రం 6:30 గంటలకు- మహిళల 63కిలోల విభాగం ఫైనల్; రాత్రి 11:00 గంటలకు - మహిళల 69 కేజీల ఫైనల్బుధవారం, 29 జూలైలాన్ బౌల్స్: మధ్యాహ్నం 1:00 గంటలకు - పురుషుల జంటలు & మహిళల సింగిల్స్ గ్రూప్ దశవెయిట్లిఫ్టింగ్: మధ్యాహ్నం 2:00 గంటలకు - మహిళల 77 కేజీల ఫైనల్; సాయంత్రం 6:30 గంటలకు - పురుషుల 94 కేజీల ఫైనల్అథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు - పురుషుల షాట్పుట్ క్వాలిఫైయింగ్, పురుషుల 200 మీటర్ల రౌండ్ 1, రాత్రి 11:00 గంటలకు- పురుషుల లాంగ్ జంప్ ఫైనల్, మహిళల 3000 మీటర్ల స్టీపుల్చేజ్ ఫైనల్గురువారం, 30 జూలైలాన్ బౌల్స్: మధ్యాహ్నం 1:00 గంటలకు - పురుషుల పెయిర్స్ & మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ ట్రాక్ సైక్లింగ్: మధ్యాహ్నం 2:30 గంటలకు - క్వాలిఫైయింగ్ రౌండ్లు; రాత్రి 8:30 గంటలకు- టీమ్ పర్స్యూట్ & టీమ్ స్ప్రింట్ ఫైనల్స్అథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు - పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫైయింగ్, పురుషుల ట్రిపుల్ జంప్ క్వాలిఫైయింగ్, పురుషుల డెకాథ్లాన్, రాత్రి 11:00 గంటలకు - మహిళల డిస్కస్ త్రో ఫైనల్, మహిళల 5000మీ ఫైనల్, పురుషుల షాట్ పుట్ ఫైనల్వెయిట్లిఫ్టింగ్: సాయంత్రం 6:30 గంటలకు - మహిళల +86 కేజీల ఫైనల్; రాత్రి 11:00 గంటలకు- పురుషుల +110 కేజీల ఫైనల్శుక్రవారం, 31 జూలైజూడో: మధ్యాహ్నం 3:30 గంటలకు - ప్రిలిమినరీ రౌండ్లు; రాత్రి 8:30 గంటలకు- ఫైనల్బాక్సింగ్: మధ్యాహ్నం 3:00 గంటలకు - సెమీ-ఫైనల్ బౌట్లుఅథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు - మిక్స్డ్ 4x400మీ రిలే హీట్స్, రాత్రి 11:00 గంటలకు- పురుషుల జావెలిన్ త్రో ఫైనల్, పురుషుల 400మీ హర్డిల్స్ ఫైనల్, పురుషుల 200మీ ఫైనల్శనివారం, 1 ఆగస్టులాన్ బౌల్స్: మధ్యాహ్నం 1:00 గంటలకు - గ్రూప్ స్టేజ్ ; రాత్రి 9:00 గంటలకు-సెమీ-ఫైనల్స్అథ్లెటిక్స్ & పారా అథ్లెటిక్స్: మధ్యాహ్నం 2:30 గంటలకు- పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్, మహిళల 10,000 మీటర్ల రేస్ వాక్ ఫైనల్, పురుషుల 400 మీటర్ల ఫైనల్, రాత్రి 11:00 గంటలకు- పురుషుల పోల్ వాల్ట్ ఫైనల్, పురుషుల 5000 మీటర్ల ఫైనల్, మిక్స్డ్ 4x400 మీటర్ల రిలే ఫైనల్బాక్సింగ్: మధ్యాహ్నం 3:00 గంటలకు& రాత్రి 9:00 గంటలకు - గోల్డ్ మెడల్ ఫైనల్స్ట్రాక్ సైక్లింగ్: రాత్రి 7:30 గంటలకు- వ్యక్తిగత స్ప్రింట్ ఫైనల్ & 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేస్ ఫైనల్ఆదివారం, 2 ఆగస్టుట్రాక్ సైక్లింగ్: మధ్యాహ్నం 1:30 గంటలకు - 1000 మీటర్ల టైమ్ ట్రయల్ ఫైనల్ & 40 కిలోమీటర్ల పాయింట్స్ రేస్జూడో: మధ్యాహ్నం 2:30 గంటలకు- హెవీవెయిట్ ప్రిలిమినరీ రౌండ్స్; సాయంత్రం 7:30 గంటలకు - పతకాల మ్యాచ్లుముగింపు వేడుకలు-రాత్రి 10.30 గంటల నుంచి👉 భారత్లో కామన్వెల్త్ గేమ్స్కు సంబంధించిన మ్యాచ్లన్నీ సోనీ నెట్వర్క్తో పాటు సోనిలివ్, దూరదర్శన్, డీడీలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.2030లో భారత్ వేదికగా 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్ ఆతిథ్యమివ్వ నుంది. ఈ నేపథ్యంలో ఈసారి గ్లాస్గో పోటీల చివరి రోజు తదుపరి గేమ్స్ పతాకాన్ని భారత్కు అందిస్తారు. ఈ సందర్భంగా 20 నిమి షాలపాటు సంగీతం, నృత్యంతో పాటు సంప్రదాయక ప్రదర్శనల ద్వారా మన దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి భారత్ చాటి చెప్పనుంది. దీంట్లో భాగంగా జరిగే కార్యక్రమంలో రష్మిక, మహదేవన్ పాల్గొంటారు. 2030 కామన్వెల్త్ గేమ్స్ గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న సంగతి తెలిసిందే. -
పతకాల వేటలో దూసుకుపోతున్న భారత్.. లాన్బౌల్స్లో మరో పతకం
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణించి, స్వదేశంలో అంతగా ఆదరణ లేని క్రీడల్లో సైతం పతకాలు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెటిక్స్ (4 పతకాలు), లాన్బౌల్స్ (1), జూడో (3), స్క్వాష్ (1) వంటి క్రీడల్లో ఇప్పటికే 8 పతకాలు సాధించిన భారత అథ్లెట్లు.. తాజాగా లాన్బౌల్స్లో మరో పతకం సాధించారు. పురుషుల టీమ్ ఈవెంట్లో సునీల్ బహదూర్, నవ్నీత్ సింగ్, చందన్ కుమార్ సింగ్, దినేశ్ కుమార్లతో కూడిన భారత జట్టు ఫైనల్లో నార్త్రన్ ఐర్లాండ్ చేతిలో 5-18 తేడాతో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకుంది. తద్వారా లాన్బౌల్స్లో రెండో మెడల్, ఓవరాల్గా 29వ మెడల్ (9 స్వర్ణాలు, 11 రజతాలు, 9 కాంస్యాలు) భారత్ ఖాతాలో చేరాయి. మహిళల లాన్బౌల్స్ టీమ్ ఈవెంట్లో భారత్ ఇదివరకే స్వర్ణం నెగ్గి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. లవ్లీ చౌబే, పింకి, నయన్మోని సైకియా, రూపా రాణితో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికా టీమ్పై 17-10 తేడాతో విజయం సాధించి స్వర్ణం సాధించింది. కాగా, కామన్వెల్త్ క్రీడల తొమ్మిదో రోజు (రాత్రి 7 గంటల వరకు) భారత్ ఖాతాలో మొత్తం మూడు పతకాలు చేరాయి. అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో రెండు, లాన్బౌల్స్లో ఓ పతకాన్ని భారత్ సొంతం చేసుకుంది. మహిళల 10000 మీటర్ల రేస్ వాక్ విభాగంలో ప్రియాంక గోస్వామి సిల్వర్ మెడల్తో బోణీ కొట్టగా.. ఆతర్వాత పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో అవినాష్ సాబ్లే రజతంతో మెరిశాడు. తాజాగా పురుషుల లాన్బౌల్స్ టీమ్ కూడా రజతం సాధించింది. భారత్ ఇవాళ సాధించిన మూడు పతకాలు రజతాలే కావడం విశేషం. చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. క్రికెట్లో తొలి పతకం ఖరారు -
కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో స్వర్ణం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా
స్కాట్లాండ్కు చెందిన జార్జ్ మిల్లర్ ‘లేట్ వయసు’లో గ్రేట్ అనిపించుకున్నాడు. 75 ఏళ్ల 8 నెలల జార్జ్ ‘లాన్ బౌల్స్’ మిక్స్డ్ పెయిర్లో బంగారు పతకం సాధించాడు. మెలనీ ఇన్నెస్తో కలిసి విజేతగా నిలిచాడు. తద్వారా కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో పసిడి పతకం నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. క్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్ బ్యాడ్మింటన్ ఈవెంట్లో మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు (భారత్) 21–10, 21–9తో కొబుగెబ్ (ఉగాండా)పై... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ (భారత్) 21–9, 21–12తో దిమిందు అబెవిక్రమ (శ్రీలంక)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ (భారత్) జంట 21–2, 21–4తో జెమీమా –గనెసా ముంగ్రా (మారిషస్) జోడీని ఓడించింది. 4X400 రిలే ఫైనల్లో భారత్: అథ్లెటిక్స్ పురుషుల 4్ఠ400 మీటర్ల రిలే విభాగంలో అనస్, నోవా నిర్మల్, అజ్మల్, అమోజ్ జేకబ్లతో కూడిన భారత బృందం ఫైనల్ చేరింది. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యెర్రాజీ 13.18 సెకన్లలో లక్ష్యానికి చేరి ఓవరాల్గా పదో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత పొందలేకపోయింది. సెమీస్లో శ్రీజ: టేబుల్ టెన్నిస్ (టీటీ) మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ–ఆచంట శరత్ కమల్ (భారత్) ద్వయం క్వార్టర్ ఫైనల్లో 11–7, 8–11, 11–8, 11–13, 11–9తో ఫిచ్ఫోర్డ్–హో టిన్టిన్ (ఇంగ్లండ్) జంటపై నెగ్గి సెమీఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీజ 9–11, 11–4, 6–11, 9–11, 11–5, 11–4, 11–8తో మో జాంగ్ (కెనడా)పై గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. -
Lan Bowls: ఊహించని ఫలితం.. ‘ఆనందం నాలుగింతలు’
సాధారణంగానైతే కామన్వెల్త్ క్రీడల్లో పతకం... అదీ స్వర్ణం సాధించిన వారి గురించి ఇలాంటి పరిచయ కార్యక్రమం అవసరం ఉండదు. కానీ లాన్ బౌల్స్ ఆట గురించే అరుదుగా తెలిసిన దేశంలో అందులోని క్రీడాకారుల గురించి అంతకంటే ఎక్కువగా తెలిసే అవకాశం లేదు. అసలు ప్రాచుర్యం పొందని ఆటను ఎంచుకోవడంలోనే ఒక సాహసం ఉంటే ఇప్పుడు అదే క్రీడలో కామన్వెల్త్ క్రీడల పసిడి గెలుచుకోవడం అసాధారణం. కానీ పై నలుగురు మహిళలు దానిని చేసి చూపించారు. ఒక్కసారిగా అందరి దృష్టీ తమపై పడేలా చేశారు. సగటు క్రీడాభిమాని భాషలో... ‘ఆట గురించైతే పూర్తిగా తెలీయదు, కానీ ఫలితం చూస్తే ఆనందం మాత్రం వేసింది’ అనడం సరిగ్గా సరిపోతుందేమో! –సాక్షి క్రీడా విభాగం లాన్ బౌల్స్ స్వర్ణం గెలిచిన నలుగురికీ క్రీడాకారులుగా ఇది రెండో ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. గాయాల కారణంగా లవ్లీ, నయన్మోని కెరీర్లు అర్ధాంతరంగా ఆగిపోతే క్రీడల్లో కొనసాగాలనే ఆసక్తితో మరో కొత్త ఆటను ఎంచుకోవాల్సి వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీ తరఫున క్రికెట్ ఆడిన పింకీ పని చేస్తున్న పాఠశాల ఒకసారి నేషనల్ లాన్ బౌల్స్కు వేదికైంది. ఆ సమయంలో ఆటను చూసిన ఆమె కొద్ది రోజుల్లోనే దానిని నేర్చుకోవడంతో పాటు జాతీయ శిబిరానికి అర్హత సాధించింది. టీమ్ గేమ్ కాకుండా వ్యక్తిగత క్రీడకు మారాలనుకున్న రూప అనుకోకుండా బౌల్స్ వైపు వచ్చింది. జాతీయ చాంపియన్షిప్లో కాంస్యం గెలిచినప్పుడు జార్ఖండ్ ప్రభుత్వం అందించిన నగదు పురస్కారం కబడ్డీకంటే ఎక్కువగా ఉండటంతో ఇక్కడే కొనసాగింది. మన దేశంలో లాన్ బౌల్స్ ఆడేందుకు తగిన సౌకర్యాలు కనిపించవు. ప్రమాణాలకు అనుగుణంగా లాన్స్ లేకపోవడంతో పాటు బౌల్స్ కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ల నుంచి తెప్పించాల్సి ఉంటుంది. ఇలాంటి స్థితిలో వీరు ప్రతికూలతలను దాటి ఇలాంటి విజయం సాధించడం గొప్ప ఘనతగా చెప్పవచ్చు. మాజీ క్రికెట్ అంపైర్ అయిన మధుకాంత్ పాఠక్ వీరందరికీ కోచింగ్ ఇచ్చారు. 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలకు ముందు భారత ఆటగాళ్లు సింథటిక్ గ్రాస్పై ప్రాక్టీస్ చేయగా... అక్కడికి వెళ్లాక సహజమైన పచ్చిక ఎదురైంది. దాంతో వారి ఆటలో గందరగోళం కనిపించింది. సహజ పచ్చికపై బౌల్ చేసేందుకు ఎక్కువగా భుజ బలం అవసరం. అక్కడ దెబ్బతిన్న వీరు ఆ తర్వాత సాధనను మార్చారు. ప్రైవేట్ రిసార్ట్లలో మాత్రమే ఉండే సౌకర్యాలను సొంత ఖర్చులతో ఉపయోగించుకున్నారు. వేర్వేరు పోటీల ద్వారా పరిచయమైన ఈ నలుగురు దాదాపు పదేళ్లుగా కలిసి ఆడుతున్నారు. 2010 కామన్వెల్త్ క్రీడల్లో పెయిర్స్ విభాగంలో రూప, పింకీ కాంస్యానికి చేరువగా వచ్చి పతకం కోల్పోయారు. వీరిద్దరితో పాటు 2014, 2018లో లవ్లీతో కలిసి ‘ట్రిపుల్స్’ ఆడగా క్వార్టర్ ఫైనల్కే పరిమితమయ్యారు. ఇప్పుడు నయన్మోని కలిసి రాగా నలుగురి బృందం ‘ఫోర్స్’లో గోల్డ్వైపు సాగిపోయింది. గత ఓటముల బాధ తాజా విజయపు ఆనందాన్ని రెట్టింపు చేసిందనడంలో సందేహం లేదు. గెలుపు ఖరారైన క్షణాన, పతకాలు అందుకునేటప్పుడు వారి సంబరాల్లో అది స్పష్టంగా కనిపించింది. నలుగురితో పాటు దశాబ్దకాలంగా జట్టు మేనేజర్గా ఉన్న అంజు లుత్రా పాత్ర కూడా ఇందులో చాలా ఉంది. తన కుమార్తెలవంటి వీరితో సుదీర్ఘ కాలంగా సాగించిన ప్రయాణం తర్వాత దక్కిన ఈ పతకం ఆమెనూ భావోద్వేగానికి గురి చేసింది. ఒక రకంగా వీరందరికీ కామన్వెల్త్ క్రీడలు చావో, రేవోగా మారాయి. ఎవరూ పట్టించుకోని ఆటలో ఇంకో పరాజయం అంటే ఇక కెరీర్లు ముగిసినట్లే అని భావించారు. ఇప్పటి వరకు ఎంతో కొంత సహకారం అందించివారు కూడా సహజంగానే వెనక్కి తగ్గుతారు. ఇలాంటి స్థితిలో దక్కిన విజయం కచ్చితంగా వారితో పాటు ఆటను కూడా ఒక మెట్టు ఎక్కిస్తుందనడంలో సందేహం లేదు. లవ్లీ చౌబే: వయసు 42 ఏళ్లు, మాజీ స్ప్రింటర్, పోలీస్ కానిస్టేబుల్, జార్ఖండ్ పింకీ: 41 ఏళ్లు, మాజీ క్రికెటర్, పీఈటీ, ఢిల్లీ రూపా రాణి టిర్కీ: 34 ఏళ్లు, మాజీ కబడ్డీ క్రీడాకారిణి, జిల్లా క్రీడాధికారి, జార్ఖండ్ నయన్మోని సైకియా: 33 ఏళ్లు, మాజీ వెయిట్లిఫ్టర్, అటవీ అధికారి, అసోం HISTORY CREATED 🥳 1st Ever 🏅 in Lawn Bowls at #CommonwealthGames Women's Fours team win 🇮🇳 it's 1st CWG medal, the prestigious 🥇 in #LawnBowls by defeating South Africa, 17-10 Congratulations ladies for taking the sport to a new level🔝 Let's #Cheer4India#India4CWG2022 pic.twitter.com/uRa9MVxfRs — SAI Media (@Media_SAI) August 2, 2022 చదవండి: Commonwealth Games 2022: బౌల్స్లో బంగారం... టీటీలో పసిడి Emma McKeon: కామన్వెల్త్ క్రీడల్లో సంచలనం.. 12 స్వర్ణాలు సాధించిన ఆసీస్ స్విమ్మర్ -
CWG 2022: చరిత్ర సృష్టించిన భారత్.. స్వర్ణం నెగ్గిన వుమెన్స్ టీమ్
బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్లో భారత మహిళల లాన్ బౌల్స్ జట్టు చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారి లాన్ బౌల్స్ క్రీడలో పతకాన్ని సాధించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వుమెన్స్ టీమ్.. ఫైనల్లో మూడు సార్లు ఛాంపియన్ సౌతాఫ్రికాని 17-10 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్స్లో భారత్ పటిష్టమైన ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఆట ఆరంభంలో టీమిండియాను తక్కువ అంచనా వేసిన సఫారీ టీమ్.. ఆ తర్వాత తేరుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక దశలో దక్షిణాఫ్రికా 10-10తో స్కోర్ను సమం చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత టీమిండియా రెచ్చిపోయి ప్రత్యర్ధిని అదే స్కోర్ వద్ద ఉంచి ఘన విజయం సాధించింది. భారత జట్టులో రూపా దేవి ట్రికీ, నయన్మోనీ సైకియా, లవ్లీ చౌబీ, పింకీ సింగ్ అద్భుతంగా రాణించారు. సెమీస్లో భారత్.. న్యూజిలాండ్ను 16-13 తేడాతో మట్టికరిపించి ఫైనల్కు చేరింది. ఇదిలా ఉంటే, లాన్ బౌల్స్లో స్వర్ణంతో భారత్ పతకాల సంఖ్య పదికి (4 స్వర్ణాలు, 3 రజతాలు, మూడు కాంస్యాలు) చేరింది. చదవండి: కామన్వెల్త్ క్రీడల్లో సంచలనం.. 12 స్వర్ణాలు సాధించిన ఆసీస్ స్విమ్మర్ -
స్వర్ణంపై భారత్ గురి.. అసలు లాన్ బౌల్స్ అంటే ఏమిటి?
బర్మింగ్హామ్: లాన్ బౌల్స్... కామన్వెల్త్ క్రీడలు ప్రారంభమైన నాటినుంచి ఒక్కసారి మినహా ప్రతీసారి ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉంది. 2010 నుంచి మాత్రమే పాల్గొంటున్న భారత్ అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు మన మహిళలు కొత్త చరిత్రను సృష్టించారు. లాన్ బౌల్స్ ‘ఫోర్స్’ ఫార్మాట్లో ఫైనల్కు చేరి పతకం ఖాయం చేశారు. లవ్లీ చౌబే, రూపా రాణి టిర్కీ, పింకీ, నయన్మోని సైకియా సభ్యులుగా ఉన్న భారత బృందం సెమీఫైనల్లో 16–13 పాయింట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. నేడు దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్లో విజయం సాధిస్తే భారత్కు స్వర్ణ పతకం దక్కుతుంది. ఓడితే రజతం లభిస్తుంది. భారత పురుషుల జట్టు మాత్రం 8–26 తేడాతో నార్తర్న్ ఐర్లాండ్ చేతిలో ఓడి క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. ‘లాన్ బౌల్స్’ ఎలా ఆడతారంటే... సింగిల్స్, డబుల్స్లతో పాటు టీమ్లో నలుగురు ఉండే ‘ఫోర్స్’ ఫార్మాట్లు ఇందులో ఉన్నాయి. పచ్చిక మైదానంలో ఆడే ఈ ఆటలో ‘బౌల్స్’గా పిలిచే రెండు పెద్ద సైజు బంతులతో పాటు ‘ది జాక్’ అని చిన్న బంతి కూడా ఉంటుంది. టాస్ వేసి ముందుగా ఎవరు బౌల్ చేస్తారో, ఎవరు జాక్ను విసురుతారో తేలుస్తారు. ముందుగా ఒకరు ‘జాక్’ను అండర్ ఆర్మ్ త్రో తో విసురుతారు. ఆపై మరో జట్టు సభ్యులకు బౌల్స్ విసిరే అవకాశం లభిస్తుంది. ‘ఫోర్స్’ ఫార్మాట్లో ఒక్కో జట్టు ఒక్కో రౌండ్ (ఎండ్)లో ఎనిమిది త్రోలు విసరవచ్చు. ఇలా 18 రౌండ్లు ఉంటాయి. ‘జాక్’కు సాధ్యమైనంత దగ్గరగా బౌల్ చేయడమే ఫలితాన్ని నిర్దేసిస్తుంది. ప్రత్యర్థికంటే ఎన్ని తక్కువ ప్రయత్నాల్లో జాక్కు దగ్గరగా బౌల్ చేయగలరో అన్ని పాయింట్లు జట్టు ఖాతాలో చేరతాయి. చివర్లో ఈ పాయింట్లను లెక్కకట్టి విజేతను నిర్ణయిస్తారు. 🇮🇳 Creates History at @birminghamcg22 🔥 India's #LawnBowl Women's Four team creates history by becoming the 1st Indian Team to reach the Finals of #CommonwealthGames India 🇮🇳 16- 13 🇳🇿 New Zealand (SF) They will now take on South Africa in the Finals on 2nd Aug#Cheer4India pic.twitter.com/tu64FSoi8R — SAI Media (@Media_SAI) August 1, 2022 చదవండి: Commonwealth Games 2022: సుశీలకు చేజారిన స్వర్ణం -
గోలీలాట గుర్తొస్తుంది..!
గ్లాస్గోలో ఇటీవల ముగిసిన కామన్వెల్త్ గేమ్స్లో ఓ క్రీడ చాలా మంది భారతీయులకు ఆశ్చర్యం కలిగించింది. ఇదేదో.. మన పల్లెల్లో పిల్లలు ఆడే గోలీల ఆటలా ఉందే అనుకున్నారు. పరీక్షించి చూస్తే.. పచ్చని మైదానం.. చుట్టూ గట్టు కట్టినట్లుగా ఏర్పాటు. మైదానానికి ఓ వైపున ఆటగాళ్లు నిలుచుని మరోవైపున గల ఓ చిన్న బంతిని లక్ష్యంగా చేసుకొని బంతుల్ని దొర్లిస్తున్నారు. ఈ బంతులు కొన్ని అవతలి వైపున గల బంతికి తగులుతుండగా, మరికొన్ని దాని సమీపంలోకి వెళ్తున్నాయి. చివరికి దీన్ని ‘లాన్ బౌల్స్’ అంటారని, మనవాళ్లూ ఇందులో ఆడుతున్నారని అర్థమైంది. ఇంతకీ ఏంటీ లాన్ బౌల్స్..! క్రీడలంటేనే శరీర దారుఢ్యం, ఫిట్నెస్లపై ఆధారపడివుంటాయి. కానీ, క్రీడాకారులకు ఉండాల్సిన ఫిట్నెస్ లేకపోయినా, శరీర పరిమాణం ఏ స్థాయిలో ఉన్నా, అంగవైకల్యం ఉన్నవారైనా.. వయసులో తేడాలున్నా.. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడగలిగే క్రీడ లాన్ బౌల్స్. లాన్ (మైదానం)లో నిలుచున్న స్థానం నుంచి బంతిని లక్ష్యానికి దగ్గరగా బౌల్ (దొర్లించడం) చేయడమే ఈ ఆట. అటు జాక్.. ఇటు బాల్ చతురస్రాకారంలో ఉన్న, చుట్టూ తక్కువ ఎత్తులో గోడ నిర్మించిన మైదానంలో లాన్ బౌల్స్ క్రీడను ఆడతారు. మైదానం మధ్యలో బంతిని దొర్లించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని ‘రింక్’ అని, లక్ష్యంగా పేర్కొంటూ మరో వైపున ఉంచే బంతిని ‘జాక్’ అని పిలుస్తారు. ఆటగాడు మైదానం గోడ అంచున ప్లాస్టిక్ మ్యాట్పై నిలబడి జాక్ దిశగా బంతిని దొర్లిస్తాడు. అది సింగిల్స్ మ్యాచ్ అయితే ఇద్దరు ఆటగాళ్లు నాలుగు చొప్పున బంతుల్ని బౌల్ చేస్తారు. తొలి ఆటగాడు నాలుగు బంతుల్ని బౌల్ చేశాక ప్రతి బంతికి, జాక్కు మధ్య దూరాన్ని కొలుస్తారు. ఆ తరువాత రెండో ఆటగాడు తన బంతుల్ని దొర్లిస్తాడు. జాక్తో అతని బంతులకు మధ్య గల దూరాన్ని కొలిచాక.. మొత్తంగా ఎవరు జాక్కు అతి సమీపంగా బౌల్ చేయగలిగారో, వారే విజేత అవుతారు. ఇందులో సింగిల్స్తోపాటు డబుల్స్, ట్రిపుల్స్, నలుగురు ఆటగాళ్లు తలపడే కేటగిరీలు ఉంటాయి. ఆయా కేటగిరీలను బట్టి ఆటగాళ్లు బౌల్ చేసే బంతుల సంఖ్య ఉంటుంది. ఓస్.. ఇంతేనా! అనుకుంటే కుదరదు. ఇందులో ఉపయోగించే బంతులు క్రికెట్ బంతుల్లా అంత తేలిగ్గా దొర్లుకుంటూ వెళ్లవు. బంతులకు రింగులు... లాన్పై బౌల్ చేసే బంతులు ప్రత్యేకంగా తయారవుతాయి. బంతికి రెండు వైపుల రెండు రింగుల్ని ఏర్పాటు చేస్తారు. ఒకవైపు రింగు పెద్ద సైజులో ఉంటే, మరోవైపు చిన్నసైజు రింగు ఉంటుంది. దీంతో బంతిని బౌల్ చేసినప్పుడు అది నేరుగా దొర్లకుండా.. వక్రమార్గంలో వెళ్తుంది. అందుకే జాక్ను గురిచూసి బంతిని దొర్లించినా.. సమీపంలోకి వెళ్లడమన్నది అంత తేలిగ్గా జరగదు. బంతిపైనా, అది ప్రయాణించే మార్గంపైనా నియంత్రణతో బౌల్ చేయడమే ఈ క్రీడలోని అసలు నైపుణ్యం. 14వ శతాబ్దంలో వెలుగులోకి.. ప్రపంచంలోని ప్రాచీన క్రీడల్లో లాన్ బౌల్స్ కూడా ఒకటి. ఈజిప్టులో వేల సంవత్సరాల క్రితమే ఈ క్రీడను ఆడినట్లుగా చెబుతారు. అయితే ఇది వెలుగులోకి వచ్చింది మాత్రం 14వ శతాబ్దంలో. అయితే అంతకుముందే 1299లో ఇంగ్లండ్లోని సౌతాంప్టన్లో ఈ క్రీడ పేరిట క్లబ్ ఏర్పాటైంది. 1588లో ఇంగ్లండ్ నావికుడు సర్ ఫ్రాన్సిస్ డ్రేక్ తొలిసారిగా ఈ క్రీడను నిర్వహించాడు. ఆ తరువాత బ్రిటిష్ పాలిత దేశాల్లో ఇది వ్యాప్తి చెంది.. ప్రపంచ బౌల్స్ సమాఖ్య ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ సమాఖ్యలో 51 సభ్యదేశాలు, 55 బౌల్స్ అథారిటీలు ఉన్నాయి. లాన్బౌల్స్ను 1930లో కామన్వెల్త్ క్రీడల్లో చేర్చగా.. 84 ఏళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది. భారత్లో పరిస్థితి... పేరుకు లాన్ బౌల్స్ అయినా.. ఇలాంటి తరహా ఆటలు మన పల్లెల్లో పురాతన కాలం నుంచీ ఆడుతూ వస్తున్నవే. అయితే అంత ర్జాతీయ స్థాయిలో లాన్ బౌల్స్లో మనవాళ్లు ఇప్పుడిప్పుడే ప్రవేశిస్తున్నారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో ఆడినా.. పతకం దాకా అయితే రాలేకపోయారు. ఇక ఇటీవల గ్లాస్గోలో మెన్స్ ఫోర్ కేటగిరీలో పోటీపడి సెమీఫైనల్కు చేరుకున్నారు. కానీ, సెమీస్లో ఓడడంతోపాటు కాంస్య పతక పోరులో కొద్ది తేడాతో ఓడిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో మున్ముందు పతకాలు సాధిస్తే లాన్ బౌల్స్.. భారత్లోనూ ప్రాచుర్యం పొం దే అవకాశం ఉంది. - శ్యామ్ కంచర్ల -
లాన్ బౌల్స్లో చేజారిన కాంస్యం
కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో లాన్బౌల్స్లో తొలిసారి పతకం సాధించే సువర్ణావకాశం కొద్దిలో భారత్ చేజారింది. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన నలుగురు సభ్యుల పురుషుల కాంస్య పతక పోరులో భారత్ 14-15తో ఓటమిపాలైంది. కమల్కుమార్ శర్మ, చందన్కుమార్సింగ్, సమిత్ మల్హోత్రా, దినేశ్కుమార్లతో కూడిన భారతజట్టు ఎనిమిదో ఎండ్ ముగిసేటప్పటికి 11-5తో తిరుగులేని ఆధిక్యం కనబరిచింది. అయితే చివరి ఎండ్లో ఒత్తిడికి లోనై మ్యాచ్ను, కాంస్య పతకాన్ని చేజార్చుకుంది.


