-
25వ రోజూ హోరెత్తిన నిరసనలు
సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఉద్యమం వాడవాడలా ఉధృతంగా సాగుతోంది. జిల్లాలో వరుసగా 25వ రోజున పోరు హోరెత్తింది. గుడివాడ పట్టణంలోని కళాకారులు చిత్రవిచిత్ర వేషధారణలతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. వంటావార్పు చేసి తమ నిరసన తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద జరుగుతున్న రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నందివాడ మండలం జనార్థనపురంలో మానవహారం నిర్వహించి వంటావార్పు చేశారు. ఉద్యోగ సంఘాల కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. పామర్రులో, పెదపారుపూడి సెంటర్లో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. విస్సన్నపేటలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఏడోరోజు రిలేదీక్షలు కొనసాగాయి. ఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు 3వ రోజు చేరాయి. కొర్లమండలో గ్రామస్తులు రాస్తారోకో చేశారు. జయంతిపురంలో హతిరామ్ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ, మానవహారం కార్యక్రమాలు గ్రామస్తులతో కలిసి నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో కొవ్వొత్తుల ప్రదర్శన.. ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నూజివీడులో హౌసింగ్ అధికారులు బైక్ ర్యాలీ జరిపారు. జగన్ దీక్షలకు మద్దతుగా పార్టీ సమన్వయకర్త వాకా వాసుదేవరావు ఆధ్వర్యంలో పెడనలో రిలేదీక్షలు జరిగాయి. గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లో జేఏసీ నాయకులు చెవిలో పూలు పెట్టుకుని జాతీయ రహదారిపై మోకాళ్లపై నడుస్తూ వినూత్న ప్రదర్శన నిర్వహించారు. జగ్గయ్యపేటలో మహిళలు బోనాలతో నిరసన తెలిపారు. బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన రిలే దీక్షలను విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సందర్శించి మద్దతు తెలిపారు. పాత మున్సిపల్ సెంటర్లో సమైక్యాంధ్రవాదులు క్రికెట్, కర్రసాము, వెయిట్లిఫ్టింగ్, కబడ్డీ వంటి ఆటలు ఆడి నిరసన వ్యక్తం చేశారు. పెనుగంచిప్రోలులో యూత్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కలిదిండి సెంటరులో సమైక్యాంధ్రకు మద్దతుగా కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. వాగ్దేవి జూనియర్, డిగ్రీ మహిళా కళాశాల విద్యార్థినులు మున్సిపల్ కూడలిలో కుంటుతూ తమ నిరసన తెలిపారు. గుడివాడలో కూచిపూడి నృత్యకారుల ఆధ్వర్యంలో నెహ్రూచౌక్ వద్ద నత్యం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. బొబ్బర్లంక దళితవాడ యువకులు మండల పరిధిలోని కొక్కిలిగడ్డ వంతెన వద్ద కరకట్ట డబుల్లైన్ రహదారిపై ఆందోళన నిర్వహించి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. నూజివీడులో హౌసింగ్ అధికారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పామర్రు నాలుగు రోడ్ల కూడలిలో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహారదీక్షా శిబిరాన్ని రైతు నాయకుడు యెర్నేని నాగేంద్రనాధ్ సందర్శించారు. కోడూరు మండలం విశ్వనాథపల్లిలో పార్టీలకతీతంగా పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులు దీక్షలు జరిపారు. మోపిదేవి మండలం కె.కొత్తపాలెం, అవనిగడ్డ మండలం వేకనూరులో విద్యార్థులు ర్యాలీలు చేశారు. వీరులపాడు, అల్లూరు, జయంతి, జుజ్జూరు, కొణతాలపల్లి గ్రామాల్లో ఆదివారం సమైక్య నిరసనలు జరిగాయి. వినూత్న నిరసనలు.. కంచికచర్లలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కేవీఆర్ కళాశాల నుంచి ర్యాలీగా రైతుపేట వచ్చి 65వ నంబర్ జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రహదారిపై మోకాళ్లతో నడవటం, యోగాసనాలు, పలు ఆటలు ఆడి నిరసన తెలిపారు. మచిలీపట్నంలో జిల్లాకోర్టు ఉద్యోగులు, న్యాయవాదులు, కోర్టు గుమాస్తాల సంఘం ప్రతినిధులు మోకాళ్లపై నిలబడి, నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని నిరసన చేపట్టారు. కైకలూరులో ఎన్జీవోలు, ఉపాధ్యాయులు తాలుకాసెంటర్లోవద్ద పామర్రు - కత్తిపూడి జాతీయరహదారిపై సూర్య నమస్కారాలు చేశారు. కంకిపాడు, గన్నవరం రోడ్డు కూడళ్లలో రజకులు రోడ్డు పైనే చాకిరేవు ఏర్పాటు చేసి బట్టలు ఉతికి, ఆర వేసి తమ నిరసన తెలిపారు. ఉయ్యూరులో ఉద్యోగులు, సమైక్యాంధ్ర జేఏసీ ప్రతినిధులు ప్రధాన సెంటర్లోని రింగ్లో మొక్కలు నాటి, రోడ్డుపై వెళ్లే ఆటోల అద్దాలు తుడిచి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చల్లపల్లిలో టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 216 జాతీయరహదారిపై టైలర్లు దుస్తులు కుట్టి నిరసన తెలిపారు. విజయవాడలో భారీ ప్రదర్శనలు.. విజయవాడలో దుర్గగుడి ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టారు. ఆదివారం రిలేదీక్షలు ప్రారంభించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. తెలుగువారే కాకుండా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా సమైక్యం కోసం ఉద్యమిస్తున్నారు. లయోలా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలలో రాజస్తానీ మార్వాడీలు పాల్గొన్నారు. విజయవాడ సింధీ సమాజం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అకాడమీ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ సంగీత కళాశాలలో సమైక్యాంధ్రపై నిర్వహించిన చిత్ర కళా పోటీల్లో కార్టూనిస్టులు పాల్గొని పలు చిత్రాలను గీశారు. మున్సిపల్ ఉద్యోగులు రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. విద్యార్థులు రోడ్డుపైనే ఆల్పాహారం తీసుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఆటోనగర్లో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం కూడా కొనసాగాయి. ఈ దీక్షలకు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం కన్వీనర్ తాతినేని పద్మావతి సంఘీభావం ప్రకటించారు. అనంతరం సోనియా, దిగ్విజయ్సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. -
పండగ రోజూ...అదే హోరు
పండగరోజూ జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఉద్యమ జోరు.. హోరు కొనసాగింది. పదోరోజైన శుక్రవారం ఆందోళనలకు విరామం ఇవ్వాలని జేఏసీ నిర్ణయిం చినా స్వచ్ఛంద ఆందోళనలు వెల్లువెత్తాయి. రంజాన్ పవిత్ర పర్వదినాన్ని జరుపుకొనే తరుణంలోనూ ముస్లింలు ప్రత్యక్ష ఆందోళనల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాక్షి, విజయవాడ : రంజాన్ పండగ రోజు కావడంతో ప్రత్యక్ష ఆందోళనలకు విరామం ఇవ్వాలని జేఏసీ నిర్ణయించినా జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా ఆందోళనలు శుక్రవారం కూడా కొనసాగాయి. రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించినప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉన్న మంత్రి పార్థసారథి శుక్రవారం తన నియోజకవర్గంలో పర్యటించారు. సమైక్య ఆందోళనలకు మద్దతు ప్రకటించి, సమైక్యవాదినేనని చెప్పుకున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేలా కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నామని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి కేంద్ర మంత్రులను నిలదీస్తామని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తన అభిమతమని తెలిపారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, ప్రజల వాదనను ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని, తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. తన రాజీనామా విషయంపై మాత్రం నోరు మెదపలేదు. పెరుగుతున్న మద్దతు... ఏపీ ఎన్జీవోలు ప్రకటించిన సమ్మెకు మద్దతు పెరుగుతోంది. గ్రంథాలయ ఉద్యోగులు సంఘం సమైక్యాంధ్రకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. వారు కూడా 12 అర్ధరాత్రి నుంచి నిర్వహించ తలపెట్టిన నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కళ్లేపల్లి మధుసూదనరాజు తెలిపారు. జేఏసీ పిలుపు మేరకు సీమాంధ్రకు చెందిన 13 జిల్లాల ఎంపీడీఓలు 630 మంది నిరవధిక సమ్మెకు వెళుతున్నారని రాష్ట్ర ఎంపీడీఓల అసోసియేషన్ అధ్యక్షుడు వై హరిహరనాథ్ ప్రకటించారు. విజయవాడ చిట్టినగర్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరగా, గజల్ శ్రీనివాస్ వాటికి మద్దతు ప్రకటించారు. సమైక్యాంధ్ర ఉద్యమకారులు తమ నిరసన కార్యక్రమాలను చట్టాలకు లోబడే చేసుకోవాలని ఒకవేళ వాటిని అతిక్రమించి రైళ్ల రాకపోకలను అడ్డుకునేందుకు రైలు పట్టాలపైకి వెళ్తే నాన్బెయిలబుల్ కేసులు ఎదుర్కోవడంతో పాటు జైలుకు వెళ్లవలసి వస్తుందని విజయవాడ రైల్వే ఎస్పీ డాక్టర్ సీహెచ్ శ్యామ్ప్రసాద్ హెచ్చరించారు. రహదారిపై భజనలు.. పెనుగంచిప్రోలులో సమైక్యాంద్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వినూత్నంగా రహదారిపై కూర్చుని భజనలు చేశారు. భజనల్లో శ్రీఅయ్యప్ప, అమ్మవారు, శివ దీక్షా స్వాములు పాల్గొని మద్దతు తెలిపారు. తిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలేదీక్షలు ప్రారంభమయ్యాయి. సమైక్యాంధ్ర కోరుతూ పామర్రులో ముస్లింలు ధర్నా చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి ఎమ్మెల్యే డీవై దాసు మద్దతు తెలిపారు. మైలవరంలోనూ ముస్లీంలు భారీ ర్యాలీ నిర్వహించారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. కలిదిండి ప్రధాన సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో 20 మంది రిలే దీక్షలు చేపట్టారు. అవనిగడ్డలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్బాబు ఆధ్వర్యంలో అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన విషయంలో సోనియా మనసు మారాలని కోరుతూ ఉయ్యూరు శివాలయంలో యాగం నిర్వహించారు. ఉయ్యూరు సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో ఒంటికాలిపై నిరసన జపం చేశారు. కేసీపీ కార్మికులు, ఉయ్యూరు దళితవాడ వాసులు రిలేదీక్షల్లో పాల్గొని సమైక్యాంధ్ర పరిరక్షణకు ఉద్యమించారు. కంకిపాడు ఈద్గా నుంచి ముస్లిం సోదరులు ప్రదర్శనగా కంకిపాడు సెంటరుకు చేరుకుని మానవహారం నిర్వహించారు. ఈడుపుగల్లు-గోసాల సెంటరులో రైతులు, కూలీలు, ముస్లిం సోదరులు వరి నారు చేత బట్టి ఆందోళన జరిపారు. కంకిపాడులో శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నూజివీడు జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక చిన్నగాంధీబొమ్మ సెంటరులో రిలేనిరాహారదీక్షలు జరిగాయి. ట్యాక్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో కార్ల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విభజన అనేది కేవలం సోనియాగాంధీ తన కుమారుడిని ప్రధానమంత్రిని చేయాలన్న స్వార్థంతోనే జరుగుతోందని పేర్కొంటూ పట్టణంలోని కుమార్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన వీధినాటిక ప్రజలను ఆకట్టుకుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement