-
మిస్టర్ కూల్
సాక్షి, కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఎక్కడైనా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి మెజార్టీలో ముందుంటే తీవ్ర హైరానా పడిపోతారు. ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతారు. అయితే కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్ఖాన్ మాత్రం గురువారం నిర్వహించిన ఎన్నికల కౌం టింగ్లో ప్రత్యర్థి అభ్యర్థి టీజీ భరత్ ము ందంజలో ఉన్నా గెలుపు తననే వరిస్తుందన్న ధీమా కనబర్చడం ఆశ్చర్య పరిచింది. ఇండియా క్రికెట్ టీంలో మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనిలాగా తన గెలుపుపై ఏ మాత్రం ఆందోళన చెందకుండా చివరకు మూడు రౌండ్లు ఉండగానే విజయాన్ని అందుకున్నారు. తీవ్ర ఉత్కంఠగా సాగిన లెక్కింపు... కర్నూలు అసెంబ్లీ బరిలో వైఎస్ఆర్సీపీ నుంచి హఫీజ్ఖాన్, టీడీపీ నుంచి టీజీ భరత్ బరిలో ఉన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు భిన్నంగా ఇక్కడ రెండు పార్టీలు పోటాపోటీగా తలపడ్డాయి. ప్రతి రౌండు ఫలితం తీవ్ర ఉత్కంఠకు తెరలేపింది. మొదట్లో పోస్టల్ బ్యాలెట్లో టీజీ భరత్ ఆధిక్యాన్ని కనబరిచారు. తరువాత కొన్ని రౌండ్లలో హఫీజ్ఖాన్, మరికొన్ని రౌండ్లలో టీజీ భరత్ అధిక్యాలను కనబరచారు. ఇలా మొత్తం 27 రౌండ్లలో 8వ రౌండ్ వరకు టీడీపీ 271 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉండేది. తరువాత 11వ రౌండ్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి 157 ఓట్ల ఆధిక్యం వచ్చింది. చివరకు 16వ రౌండ్ వరకు టీడీపీనే ఆధిక్యంలో ఉండడంతో కొన్ని టీవీ చానళ్లు టీజీ భరత్ విజయం సాధించినట్లు బ్రేకింగ్లు ఇచ్చారు. అయితే 17వ రౌండ్ వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. వైఎస్ఆర్సీపీకి 3,248 ఓట్ల ఆధిక్యం వచ్చింది. తరువాత నుంచి ఆ మెజార్టీ తగ్గలేదు. మరో మూడు రౌండ్లు మిగిలి ఉండగానే వైఎస్ఆర్సీపీ విజయం ఖాయం కావడంతో టీజీ భరత్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. హఫీజ్ఖాన్ కర్నూలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆది నుంచి విజయంపై ధీమా కర్నూలు అసెంబ్లీలో 27 రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉంది. ఇందులో 16 రౌండ్ల వరకు టీడీపీ స్వల్ప అధిక్యం సాధిస్తూ వచ్చింది. దీంతో టీడీపీనే గెలుస్తుందని అందరూ భావించారు. అయితే, హఫీజ్ఖాన్ ఏ మాత్రం హైరానా పడలేదు. రోజాలో ఉన్నా ముఖంలో కళ తగ్గలేదు. ప్రార్థనలు చేస్తూ విజయం తనకే వరిస్తుందని..కౌంటింగ్ ప్రక్రియ ఒక్కసారిగా తనకు అనుకూలంగా మారుతుందని సహచరులకు చెప్పగా వారేవరూ నమ్మలేదు. ఆయన అన్నట్టుగానే 17 రౌండ్ నుంచి ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. వైఎస్ఆర్సీపీకి 3,248 ఓట్ల అధిక్యం వచ్చింది. అప్పటి నుంచి ఆయన మెజార్టీ పెరగడమే కానీ తగ్గలేదు. మూడు రౌండ్లు మిగిలి ఉండగానే విజయం సాధించారు. -
కర్నూలు అసెంబ్లీ బరిలో అత్యధిక మంది పోటీ
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన అనంతరం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.111 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో భన్వర్ లాల్ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్రలో 25 లోక్సభ స్థానాలకు 333 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 175 అసెంబ్లీ స్థానాలకు 2,243 అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో కర్నూలు అసెంబ్లీ స్థానానికి అత్యధికంగా 36 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. మొదటి దశ ఎన్నికల ప్రచారం ఈ నెల 28 సాయంత్రం 6.00 గంటలకు ముగుస్తుందన్నారు. ఆ తర్వాత ఎవరూ ప్రచారం చేయకూడదని ఆయన ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు సూచించారు. అలాగే పార్టీలు, అభ్యర్థులు గుర్తులపై ఓటర్ స్లిప్పులను పంపిణి చేయకూడదని చెప్పారు. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను హెచ్చరించారు. మాజీ మంత్రులు అధికారిక నివాసాల్లో ఉంటూ ఎన్నికలకు సంబంధించిన పనులు చేపడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల కోసం 7 హెలికాప్టర్లు, 2 ఎయిర్ అంబులెన్స్లు వినియోగిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 71,222 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement