-
ప్యాసింజర్ దిగుతుండగా కదిలిన బస్.. ‘ఆర్టీసీ’కి రూ.1.30లక్షల ఫైన్
బెంగళూరు: ప్రయాణికురాలికి గాయాలయ్యేందుకు బస్సు కారణమైందంటూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ)కి రూ.1.30 లక్షల జరిమానా విధించింది కర్ణాటక హైకోర్టు. అధికారులు అశ్రద్ధతో డొక్కు బస్సులను తిప్పుతున్నారనే విషయాన్ని గ్రహించి ఈ మేరకు ఆర్టీసీకి షాక్ ఇచ్చింది కోర్టు. ప్రయాణికులు దిగుతుండగానే బస్ను ముందుకు కదిలించి గాయాలయ్యేందుకు కారణమైనట్లు తెల్చింది. 2021, ఆగస్టులో బస్ వల్ల మహిళకు గాయాలయ్యాయి. మైసూరుకు చెందిన 30 ఏళ్ల చంద్రప్రభ అనే ప్రభుత్వ పాఠశాల టీచర్ తన విధులు ముగించుకుని కేఎస్ఆర్టీసీలో ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలోనే ఇంజిన్లో మంటలు అంటుకున్నాయి. ప్రయాణికులు కిందకు దిగుతున్నప్పటికీ డ్రైవర్ బస్ను ముందుకుపోనిచ్చాడు. దీంతో చంద్రప్రభ కింద పడిపోయి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. 12 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఆర్టీసీపై కేసు వేసింది ఉపాధ్యాయురాలు. కానీ, ఆమె ఫిర్యాదును 2018లో తిరస్కరించింది మోటారు వాహనాల ప్రమాదాల ట్రైబ్యునల్. ఆమె దిగెప్పుడు బస్సు ఆగి ఉందని ఆర్టీసీ అధికారులు సైతం వాధించారు. ట్రైబ్యునల్ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు టీచర్. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు ఆమెకు పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు వెలువరించింది. ‘బాధితురాలికి రూ.1,30,000 పరిహారం చెల్లించాల్సిందే. దాంతో పాటు ఏడాదికి 6 శాతం చొప్పున వడ్డీ ఇవ్వాలి. ’ అని స్పష్టం చేసింది హైకోర్టు. ఇదీ చదవండి: విద్యార్థిని బాల్కనీలోంచి తోసేసిన టీచర్.. ప్రశ్నించిన తల్లిపైనా దాడి -
వలస కుటుంబంలో విషాదం
– కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడి మృతి వలస కుటుంబంలో బస్సు ప్రమాదం విషాదం నింపింది. అంతవరకూ తమ ముందే ఆడుకుంటున్న ఏడేళ్ల పిల్లాడు అంగడికి వెళుతూ రోడ్డు దాటుతుండగా కేఎస్ఆర్టీసీ బస్సు ఢీ కొంది. ప్రమాదంలో పిల్లాడు అక్కడికక్కడే మృతిచెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. బెళుగుప్ప : మండలంలోని నారింజగుండ్లపల్లి గ్రామం చెక్పోస్టు సమీపంలో గురువారం రోడ్డు దాటుతున్న సాయినాథ్(7)అనే బాలుడిని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఏఎస్ఐ విజయనాయక్ తెలిపిన వివరాల మేరకు.. గుంతకల్లు పట్టణానికి చెందిన మారెన్న, గంగమ్మల కుటుంబం చిన్న పిల్లల దుస్తులు విక్రయిస్తూ సంచార జీవనం సాగించేవారు. అందులో భాగంగా గురువారం ఉదయమే గుండ్లపల్లికి వచ్చి ప్రధాన రహదారికి కొంతదూరంలో గుడిసె వేసుకున్నారు. వారి రెండవ కుమారుడు సాయినాథ్ ప్రదాన రహదారి అటువైపు వున్న కిరాణాకొట్టులో తినే వస్తువులను కొనుక్కోవడానికి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్ మండలం ఎర్రగుంట గ్రామం నుంచి బెంగళూరులో ఓ వివాహవేడుకకు గుండ్లపల్లి మీదుగా వెళ్తూ కర్ణాటకకు చెంది ఆర్టీసీ బస్సు అతివేగంగా బాలుడిని ఢీకొంది. ముందుచక్రం కింద పడ్డ బాలుడిని కొన్ని అడుగులు ఈడ్చుకుంటూ వెళ్లిది. దీంతో బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. వారికి మరో నలుగురు పిల్లలున్నారు. బస్సు డ్రైవర్ పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించి దర్యాప్తు చేపట్టామని ఏఎస్ఐ విజయనాయక్ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యాదాద్రీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
ఉరివేసుకొని యువకుడి బలవన్మరణం
తెలంగాణను పాలించే హక్కు కాంగ్రెస్కే ఉంది
ద్వంద్వ పౌరసత్వం కల్పించేందుకు కృషి
అరచేతిలో ఎన్నికల సమాచారం
ఈవీఎంల కమిషనింగ్ పరిశీలన
సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్పై రాయితో దాడి
టీ20 ప్రపంచకప్కు ఉగ్ర ముప్పు
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- రవీంద్రజాలం... జడేజా ఆల్రౌండ్ షో
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement