breaking news
khaleel
-
మహమ్మద్ ఖలీల్కు విముక్తి
జెనా: అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల నిరసన కార్యక్రమాలు చేపట్టినందుకు అరెస్టయిన సామాజిక కార్యకర్త, గ్రాడ్యుయేట్ విద్యార్థి మహమ్మద్ ఖలీల్(30)కు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆయనను విడుదల చేయాలని యూఎస్ జిల్లా జడ్జి మైఖేల్ ఫార్బియార్జ్ ఆదేశించడంతో శుక్రవారం లూసియానాలో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ నిర్బంధం నుంచి బయటకు వచ్చారు. వలసదారుల విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఈ పరిణామంతో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. విద్యాసంస్థల్లో నిరసన వ్యక్తం చేస్తే అదుపులోకి తీసుకోవడం, బలవంతంగా దేశం నుంచి బయటకు వెళ్లగొట్టాలని చూడడం చట్టవిరుద్ధమని సాక్షాత్తూ న్యాయస్థానమే తేల్చిచెప్పింది. మహమ్మద్ ఖలీల్ న్యూయార్క్లోని తన కుటుంబం వద్దకు వెళ్లనున్నారు. అమెరికా పౌరసత్వం కలిగిన తన భార్యతోపాటు ఇటీవలే జన్మించిన తన బిడ్డను చూడబోతున్నారు. ‘‘చివరకు న్యాయమే గెలిచింది. కానీ, అందుకు చాలా సమయం పట్టింది’’అని ఖలీల్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, ఖలీల కేసు విచారణ సమయంలో న్యాయమూర్తి మైఖేల్ ఫార్బియార్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చట్టబద్ధంగా అమెరికాలో ఉంటున్న విద్యార్థిని ఇలా నిర్బంధించడం అసాధారణం. హింసకు పాల్పడినట్లు ఖలీల్పై ఎలాంటి ఆరోపణలు లేవు. అతడు పారిపోయే అవకాశం లేదు. అయినా ఎందుకు నిర్బంధించారు? అతడి వల్ల అమెరికా సమాజానికి వచ్చిన ముప్పేమీ లేదు. ఒక వ్యక్తిని నిర్బంధించే విషయంలో అమల్లో ఉన్న ప్రమాణాలను ప్రభుత్వం పాటించలేదు. ఖలీల్ను వెంటనే విడుదల చేయండి’’అని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఖలీల్ను విడుదల చేస్తూ శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. నిబంధలన ప్రకారం.. ఖలీల్ తన పాస్పోర్టును ప్రభుత్వానికి సమరి్పంచాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లడానికి వీల్లేదు. అమెరికాలో పరిమితంగానే సంచరించవచ్చు. ఎవరీ మహమ్మద్ ఖలీల్? డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత విదేశీ విద్యార్థులపై దృష్టి పెట్టారు. వారిని బయటకు పంపించడమే లక్ష్యంగా పావులు కదిపారు. ఇందుకోసం లేనిపోని నిబంధనలు తీసుకొచ్చారు. చట్టాలు ఉల్లంఘించినా, విద్యాసంస్థల్లో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నా స్వదేశాలకు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు. చాలామంది బలవంతంగా బయటకు వెళ్లగొట్టారు. అమెరికాలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనల్లో పాల్గొన్నందుకు అరెస్టయిన మొట్టమొదటి విదేశీ విద్యార్థి మహమ్మద్ ఖలీల్. ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు ఈ ఏడాది మార్చి 8న అతడిని అదుపులోకి తీసుకున్నారు. లూసియాలోని మారమూల ప్రాంతమైన జెనాలో అతడిని నిర్బంధించారు. దాంతో ఖలీల్ న్యాయపోరాటం ప్రారంభించాడు. తనను విడుదల చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. న్యాయస్థానం అతడి వాదనను సమర్థించడంతో 104 రోజుల తర్వాత విడుదలయ్యాడు. ఖలీల్ అరెస్టు వ్యవహారం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విదేశీయులపై ట్రంప్ దాషీ్టకానికి ఈ ఘటన ఒక ప్రతీకగా నిలిచింది. ఖలీల్ 1995లో సిరియాలోని డెమాస్్కలో శరణార్థి శిబిరంలో పాలస్తీనా దంపతులకు జన్మించాడు. -
నెరవేరిన సీఎం హామీ.. దివ్యాంగుడికి రూ.90,000 విలువైన..
సాక్షి, చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరుకు చెందిన ఖలీల్ అనే దివ్యాంగుడికి సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ నెరవేరింది. ఈ ఏడాది జూలైలో వరద ప్రాంతాల పర్యటనలో భాగంగా చింతూరు వచ్చిన ముఖ్యమంత్రిని ఖలీల్ కలిసి తనకు మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనం మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రమిచ్చాడు. దీంతో అతనికి రూ.90,000 విలువైన ఎలక్ట్రిక్ వాహనం మంజూరు చేస్తూ కలెక్టర్ సుమిత్కుమార్ ఇటీవల ఉత్తర్వులిచ్చారు. సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో ఫర్మాన్ అహ్మద్ఖాన్ ఆదేశాల మేరకు గురువారం స్థానిక ఐటీడీఏ కార్యాలయం వద్ద ఏవో రాజ్కుమార్ ఆ వాహనాన్ని ఖలీల్కు అందజేశారు. తనకు ఎలక్ట్రిక్ వాహనం మంజూరయ్యేలా చర్యలు తీసుకున్న ముఖ్యమంత్రికి ఖలీల్ కృతజ్ఞతలు తెలిపాడు. చదవండి: (నెరవేరనున్న నాలుగు దశాబ్దాల మెట్ట ప్రాంతీయుల కల) -
వాగులో పడి ఇద్దరు చిన్నారుల మృతి
మందమర్రి: అదిలాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. జిల్లాలోని మందమర్రి మండలం తిమ్మాపూర్ కి చెందిన నరేష్, ఖలీల్ అనే ఇద్దరు చిన్నారులు గ్రామ సమీపంలోని పాలవాగులో మృత దేహాలై కనిపించారు. స్థానికులు గుర్తించి చిన్నారుల మృత దేహాలను వెలికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ బోల్తాపడి ఒకరి మృతి
నేరేడుచర్ల: అదుపుతప్పి ఓ బైక్ బోల్తా పడగా, ద్విచక్రవాహనదారుడి తలపై నుంచి లారీ వెళ్లిపోవడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నల్లగొండ జిల్లా నేరేడుచర్ల మండలం రామగిరి వద్ద మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మిర్యాలగూడ సీతారామపురంకు చెందిన ఖలీల్ నేరేడుచర్లలో పని పూర్తి చేసుకుని బైక్పై తిరుగు ప్రయాణం అయ్యాడు. రామగిరి వద్దకు వచ్చేసరికి బైక్ అదుపుతప్పడంతో బండితోపాటు ఖలీల్ కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బోర్వెల్ లారీ ఖలీల్ తలపై నుంచి ముందుకు వెళ్లింది. తల ఛిద్రమై ఖలీల్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.