breaking news
khaja mohiddin
-
ఇంద్రా గాంధీకి ఐఎస్ నేత విడాకులు..
సాక్షి, న్యూఢిల్లీ : 2014లో ఉగ్ర దాడికి కుట్ర పన్ని ఢిల్లీ పోలీసులచే అరెస్ట్ అయిన ఖాజా మొహిదీన్ తన భార్య ఇంద్రా గాంధీకి విడాకులిచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది. మతపరమైన విభేదాలు తలెత్తడంతో మొహిదీన్ తన భార్యతో విడిపోయాడని ఢిల్లీ పోలీసుల దర్యాప్తు నివేదిక తెలిపింది. ఇంద్రా గాంధీని వివాహం చేసుకున్న ఐఎస్ నేత మొహిదీన్ ఆ తర్వాత ఐఎస్ భావజాలం ప్రభావంతో ఆమెకు విడాకులు ఇచ్చినట్టు నివేదిక తెలిపింది. 2014లో ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉగ్ర దాడులకు కుట్ర పన్నారనే అభియోగంతో మొహిదీన్ సహా పలువురు అతడి అనుచరులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు 2004లో తమిళనాడులోని కడలూరు జిల్లాలో కొందరు దళితులను మొహిదీన్ బలవంతంగా మతమార్పిడికి గురిచేశారని కూడా దర్యాప్తు నివేదిక తెలిపింది. ఉగ్ర కుట్రతో పాటు పలు నేరారోపణలు ఎదుర్కొంటున్న మొహిదీన్ను 2017లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. -
చిత్రావతి నదిలో ఆక్రమణలు తొలగించండి
అనంతపురం అర్బన్ : లోకాయుక్త ఆదేశాల మేరకు పుట్టపర్తి వద్ద చిత్రావతి నదిలోని ఆక్రమణలను తక్షణం తొలగించాలని సంబంధిత శాఖల అధికారులను జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్ధీన్ ఆదేశించారు. లోకాయుక్తకి నివేదికను సమర్పించాల్సి ఉన్నందున తక్షణం నివేదికలను కలెక్టరేట్కు పంపించాలన్నారు. ఆయన శనివారం తన చాంబర్లో అధికారులతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను జేసీ–2 వివరిస్తూ చిత్రావతి నదిలో ఆక్రమణలు తొలగించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ని లోకాయుక్త ఆదేశించిందన్నారు. ఆక్రమణలను గుర్తించి సోమవారం నాటికి నివేదిక అందజేయాలని ఆర్డీఓ వెంకటేశ్ను ఆదేశించారు. అలాగే ఆక్రమణ తొలగింపు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని చెప్పారు. చిత్రావతి నది తీరం, ఇరువైపుల అనధికారికంగా నిర్మించిన కట్టడాలను, అక్రమ సాగును తొలగించాలన్నారు. భవిష్యత్తులో నది స్థలం ఆక్రమణకు గురికాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కదిరి ఆర్డీఓ వెంకటేశ్, పుట్టపర్తి తహశీల్దారు సత్యానారాయణను ఆదేశించారు. అలాగే నదిని కాలుష్యం చేసేలా చెత్త చెదారం వేయకుండా చూడాలని ఇరిగేషన్ ఎస్ఈ సుబ్బారావు, నగర పంచాయతీ కమిషనర్ నరసింహమూర్తిని ఆదేశించారు. రక్షణ గోడ నిర్మించాలని చెప్పారు. చిత్రావతి నది సుందరీకరణ పనులను కూడా చేపట్టాలని మైనర్ ఇరిగేషన్, పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు.