-
అమ్మాయి నవ్వింది!
హుస్నాబాద్రూరల్: ఆడ పిల్ల పెళ్లా...! అబ్బో.. అనుకునే సామాన్య కుటుంబాలు ఆడపిల్ల పుట్టిదంటే కష్టాలు మొదలవుతాయని ఉహించుకొంటారు. అలాంటి వివక్షను రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టి ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలబడుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఎంబీసీ కుటుంబాలకు చెందిన 3 లక్షల కు పైగా కుటుంబాలకు ఆర్థిక సహా యం అందించింది. వచ్చే ఏప్రిల్ నుంచి పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.75,116 నుంచి రూ.1,00,116Sకు పెంచనుంది. జిల్లాలో 58,165 మంది కిశోర బాలికలు ఉండగా ఇందులో 50 వేల మందికి ఆరేళ్లలో ప్రయోజనం చే కూరనుంది. 4 వేల వరకు 18 ఏళ్లు దా టిన బాలికలకు తక్షణ లబ్ధి కలగనుంది.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్ల క్రితం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలకు చెందిన అడపిల్లల పెళ్లిలకు 51వేల ఆర్థిక సహాయం అందజేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని బీసీలు, ఓసీలలోని పేద కుటుంబాలకు వర్తింపజేస్తూ పథకం నగదు ప్రోత్సాహకాన్ని రూ.75,116లకు పెంచింది. ఆడబిడ్డలను కన్నవారిలో ఆనందం ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ కింద ఇచ్చే ప్రోత్సాహకాలను లక్షకు పెంచడంతో ఆడబిడ్డలను తల్లిదండ్రుల్లో కాస్త ఊరట కనిపిస్తోంది. ప్రభుత్వ సహాయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 7వేల మంది కిశోర బాలికలు, 2వేల మంది పెళ్లి వయస్సు వచ్చిన యువతులు ఉండగా జిల్లాలో దాదాపు 40వేల మంది కిశోర బాలికలు, 12వేల వరకు పెళ్లి వయస్సు వచ్చిన ఆడపడచులకు ప్రయోజనం చేకూరనుంది. -
బీసీలకూ 3 ఎకరాల భూమి
* బీసీ సంఘాల విస్తృత సమావేశం డిమాండ్ * రూ. 20 వేలకోట్లతో సబ్ప్లాన్ ఏర్పాటు చెయ్యాలి * కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలి * డిమాండ్ల సాధనకోసం పార్టీలకు అతీతంగా ఒక్కటవ్వాలి: ఆర్.కృష్ణయ్య పిలుపు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వెనుకబడిన తరగతులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని, రూ.20 వేల కోట్లతో సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని, కల్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని బీసీ సంక్షేమ, ఉద్యోగ, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల విస్తృత భేటీ డిమాండ్ చేసింది. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్చేస్తూ ఈ సమావేశం తీర్మానాలను ఆమోదించింది. శుక్రవారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఓ హోటల్లో తెలంగాణలోని పది జిల్లాలకు చెందిన బీసీ సంఘాల విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ బీసీలకు కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేయాలని, రూ.20వేల కోట్లతో సబ్ప్లాన్ను ఏర్పాటు చేయాలని, బడ్జెట్ కేటాయింపులను రూ.2వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయపార్టీలకు అతీతంగా బీసీ నాయకులు ఏకమై డిమాండ్ల సాధనకు పోరాడాలని, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ముందుకు రావాలని ఆయన అన్ని పార్టీల నాయకులకు విజ్ఞప్తిచేశారు. దేశంలోని బీసీలను పాలకపార్టీలు అణచివేస్తున్నాయన్నారు. దేశజనాభాలో 56 శాతమున్న బీసీలకు వారి జనాభాప్రాతిపదికన ఉద్యోగాలు, ప్రమోషన్లు, చట్టసభల్లో ప్రవేశంలో న్యాయం జరగడం లేదన్నారు. ప్రస్తుతం భర్తీచేయాల్సిన కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 14 లక్షల ఉద్యోగాలు, తెలంగాణలోని 2 లక్షల ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్లోని 1.5లక్షల ఉద్యోగాల్లో బీసీలకు తగిన రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్చేశారు. ఎస్సీ, ఎస్టీ, మహిళ, వికలాంగుల రిజర్వేషన్లకు లేని క్రీమీలేయర్ను రాజ్యంగ లక్ష్యాలకు భిన్నంగా బీసీలకు మాత్రమే అమలుచేయడం సరికాదన్నారు. క్రీమీలేయర్ నిబంధనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించాలని ఆయన డిమాండ్చేశారు. పార్లమెంట్లో బిల్లుపెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను అమలుచేయాలన్నారు. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధతను కల్పించాలని, కేంద్రంలో రూ.50 వేల కోట్లతో బీసీ సబ్ప్లాన్ను ఏర్పాటుచేయాలని, కులవృత్తుల్లో సాంకేతికను పెంచుకుని ఆధునికంగా ఎదిగేందుకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణాలు ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్చేశారు. ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లాలి: జాజుల చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని రాష్ట్ర బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్చేశారు. అసెంబ్లీలో చెప్పిన మేరకు సీఎం కేసీఆర్ వెంటనే బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సమావేశాన్ని ఏర్పాటుచేయాలన్నారు. ఈ నెల 10న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో క్రీమీలేయర్ను తొలగించాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు విన తిపత్రాలు సమర్పించడం, 14న అన్ని కులసంఘాలతో సమావేశం, 18న కళ్యాణలక్ష్మిని వర్తింపజేయాలన్న డిమాండ్పై హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద, అలాగే జిల్లా కేంద్రాల్లో నిరాహారదీక్షలు చేపడుతున్నామన్నారు. జనవరి మొదటివారంలో సభ్యత్వనమోదు, ఫిబ్రవరి మొదటివారంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీలను చైతన్యపరిచేందుకు ‘మేలుకొలుపు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా నిరంజన్ (ఆర్టీసీ ఉద్యోగులసంఘం), బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర వర్కింగ్ప్రెసిడెంట్గా దారుట్ల కృష్ణుడు (ఆదిలాబాద్), బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా సాయికిరణ్లను ఎన్నుకున్నట్లు ఈ సమావేశంలో ప్రకటించారు.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్
T20 WC 2024 IND VS PAK: రోహిత్ శర్మ సూపర్ సిక్సర్.. వైరల్ వీడియో
ప్రధాని మోదీకి వైఎస్ జగన్ అభినందనలు
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన క్రిస్ గేల్
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుడ్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
Advertisement