breaking news
kathari srinivas
-
ఫొటోలతోనే నా పబ్లిసిటీ నడిచింది
‘తెలుగు సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్స్’ అసోసియేషన్ ఆధ్వర్యంలో 181వ ‘వరల్డ్ ఫొటోగ్రఫీ డే’ ఉత్సవాలు సోమవారం హైదరాబాద్లో జరిగాయి. తెలుగు సినిమా స్టిల్ ఫొటోగ్రాఫర్ల అధ్యక్షుడు కఠారి శ్రీను, జనరల్ సెక్రటరీ జి. శ్రీను, వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు .యస్, ట్రెజరర్ వీరభద్రమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మూడు తరాల స్టిల్ ఫొటోగ్రాఫర్లతో నాకు అనుబంధం ఉంది. వారు నాకు కుటుంబం లాంటివాళ్లు. ఒకప్పుడు ఫొటోలతోనే నా పబ్లిసిటీ నడిచింది. బి.ఎన్. రెడ్డిగారు, ఎన్టీఆర్గారు... ఇలా ఎంతో మంది లెజెండ్స్తో నాకు పరిచయం ఉంది. వారందరితో ఉన్న ఫొటోలు చూసుకుని ఆనాటి విషయాలను గుర్తు చేసుకుని ఆనందిస్తుంటాను’’ అన్నారు. సీనియర్ ఫొటోగ్రాఫర్లు శ్యామల్ రావు, శ్యామ్లను ఈ వేదికపై సత్కరించారు. హీరో ‘అల్లరి’ నరేష్, దర్శకుడు వీవీ వినాయక్, దర్శక–నిర్మాత వైవీయస్ చౌదరి, కెమెరామేన్, డైరెక్టర్ రసూల్ ఎల్లోర్, పలువురు సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
లోక్ సత్తా పార్టీలో వర్గ పోరు?
-
లోక్ సత్తా పార్టీలో వర్గ పోరు?
హైదరాబాద్:లోక్ సత్తా పార్టీలో మరోసారి విభేదాలు చోటు చేసుకున్నాయి. గతంలో చోటు చేసుకున్న వర్గ పోరు ఈసారి తారాస్థాయికి చేరింది. లోక్ సత్తా పార్టీ.. తమదంటే తమదని శ్రీవాత్సవ వర్గం వాదిస్తుండగా.. పార్టీకి విధివిధినాలను రూపొందించింది తామని కఠారి శ్రీనివాస్, వర్మ వర్గం అంటోంది. అసలు శ్రీవాత్సవ వర్గం పార్టీ నియమాలను ఉల్లంఘించదని ఆ పార్టీ అధ్యక్షుడు కఠారి శ్రీనివాస్ తెలిపారు. పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ్ ను ఆ వర్గం మబ్బుల్లో ఉంచుతున్నారని ఆయన విమర్శించారు. ఈనేపథ్యంలో జేపీ ఎటువైపు ఉన్నారో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని కఠారి తెలిపారు.