-
ఆరు నెలల్లో అంతా తేలిపోతుంది
కరీంనగర్ : ఆరు నెలల్లో ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందని డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం అన్నారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల స మావేశంలో మాట్లాడుతూ ఆచరణకు సా«ధ్యం కాని హమీలతో మభ్యపెట్టి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 10వ తేదీ వరకు జీతాలు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్ర భుత్వ ఆదాయం మద్యం, ఇసుక ద్వారానే స మకూరుతుందని, ప్రజలకు మద్యం తాగించేందుకు ప్రోత్సహిస్తోందని విమర్శించారు. గ్రామానికి ఒకటి, రెండు బెల్ట్షాప్లతో తాగుబోతులను తయారు చేస్తున్నారని అన్నారు. పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్కు సంబంధం ఉండ దని, రాహుల్,మోదీ మధ్యనే పోటీ ఉంటుం దన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలపై బీజేపీ ప్రభుత్వం పెనుభారం మోపిందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ ఇటు ఎంఐఎం, అటు బీజేపీకి దగ్గరగా ఉంటూ రెండు పడవలపై ప్రయా ణిస్తున్నారన్నారు. శుక్రవారం కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ లోక్సభ సమీక్షలకు పార్లమెంట్ సెగ్మెంట్ నాయకులు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చాడగోండ బుచ్చిరెడ్డి, చింతల కిషన్, జొన్నల రమేశ్ పాల్గొన్నారు. -
'పోలీస్ శాఖ అవినీతికి నిలయంగా మారింది'
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో పోలీసు డిపార్ట్మెంట్ అవినీతికి నిలయంగా మారిందని కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కె.మృత్యుంజయం ఆరోపించారు. మంగళవారం కరీంనగర్లో మృత్యుంజయం విలేకర్లతో మాట్లాడారు. ఏఎస్సై మోహన్రెడ్డి ఉదంతమే ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. మోహన్రెడ్డి అక్రమ దందాకు కారకులైన పోలీసు ఉన్నతాధికారులపై సూమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఈ అంశంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో ప్రత్యేక దర్యాప్తు సంస్థ ( సిట్ ) ఏర్పాటు చేసి సీబీఐతో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో జిల్లాలో మావోయిస్టులకు సహకరించిన వేలాది మందిపై అనేక కేసులు పెట్టి పోలీసులు వేధించారని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. అయితే అక్రమ వడ్డీ వ్యాపారం కేసులో పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరని కేసీఆర్ ప్రభుత్వాన్ని కె. మృత్యుంజయం ప్రశ్నించారు. -
కేసీఆర్ను అధికారులు చీటింగ్ చేస్తే...
కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ను అధికారులు చీటింగ్ చేస్తే... ప్రజలను కేసీఆర్ చీటింగ్ చేస్తున్నారని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె.మృత్యుంజయం ఆరోపించారు. గోదావరి పుష్కరాలు నేపథ్యంలో జిల్లాలోని ధర్మపురి, మంథని, కాళేశ్వరంలోని జరుగుతున్న పుష్కర పనులను మృత్యుంజయంతోపాటు కాంగ్రెస్ ప్రతినిధుల బృందం పరిశీలించింది. అనంతరం కె. మృత్యుంజయం కరీంనగర్లో మాట్లాడారు. ధర్మపురిలో పుష్కర పనులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మురుగునీటిలో స్నానాలు చేసేలా ఏర్పాటు చేయడం ఆయన విచారం వ్యక్తం చేశారు. అస్తవ్యస్థ పుష్కర ఏర్పాట్లపై గవర్నర్ను కలసి ఫిర్యాదు చేస్తామని కె.మృత్యుంజయం వెల్లడించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement