breaking news
karthi keya
-
నిట్తోనే నాకు గుర్తింపు
సాక్షి, కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో విద్యనభ్యసించడం ద్వారానే సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు లభించిందని ఆర్ఎక్స్ –100 హీరో కార్తి్కేయ తెలిపారు. నిట్లో నిర్వహిస్తున్న టెక్నోజియాన్–19 నోవస్ ముగింపు సందర్భంగా ఆదివారం గెస్ట్లెక్చర్లో భాగంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ‘సాక్షి’తో తన సినీరంగ ప్రవేశం, నిట్ జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయన స్ఫూర్తితో యాక్టింగ్ తనను సినీరంగంలోకి అడుగుపెట్టేందుకు దోహదపడిందన్నారు. నిట్తోనే హీరోగా ఎదిగే అవకాశం మాది హైదరాబాద్ విఠల్రెడ్డి, రజితలు నా తల్లిదండ్రులు. నాన్న అమ్మా నాగార్జున గ్రుప్ ఆఫ్ స్కూల్స్ను నిర్వహిస్తున్నారు. నన్ను మా అమ్మ ఎంతో ఇష్టపడి, నన్ను కష్టపెట్టి నిట్ వరంగల్లో సీటు సాధించే విధంగా చదివించింది. కానీ నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. మా సీనియర్ మణికాంత్ తాను తీసే షార్ ఫిల్మ్స్లో నేను నటించేవాడిని. డ్యాన్స్ చేసే వాడిని నా తొలి డైరెక్టర్, అభిమాని తానే. నిట్ వరంగల్లో 2010 బ్యాచ్లో కెమికల్ ఇంజనీరింగ్లో చేరాను. టెక్నోజియాన్, స్ప్రీంగ్స్ప్రీలలో ఆడీనైట్లో నా డ్యాన్స్తో మైమరపించేవాడ్ని, గుడ్ డ్యాన్సర్ అంటూ అమ్మాయిలు మెసేజ్ పెట్టేవారు. నాలుగు సంవత్సరాల నిట్ విద్యాభ్యాసంలో నాలుగు వేల మందిని అలరించడంతో ధైర్యం వచ్చింది. నిట్లో చదువుకుంటున్న సమయంలో రామప్ప, వెయ్యిస్తంభాల గుడి, లక్నవరాన్ని సందర్శించేవాడ్ని. ప్రతి సినిమాను భవానీ టాకీస్లో చూసేవాడ్నీ. క్యాంపస్ ఇంటర్వ్యూలు వదిలేశా.. చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలనేదే నా ఆశయం. దీంతో నిట్లో ఉన్న నాలుగు సంవత్సరాలు యాక్టింగ్పైనే దృష్టి పెట్టాను. కళాశాలలో ప్రతి ఒక్క విద్యార్థి, ప్రొఫెసర్లు నన్ను యాక్టర్ అవుతావని ఎంకరేజ్ చేశారు. యాక్టర్ కావాలనే సంకల్పంతో నిట్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా వదులుకున్నాను. నిట్లో చదువుకునే అవకాశం రావడం అదృష్టం. నిట్లో నుంచి బయటకు వెళ్లే సమయం ఫైనల్ ఇయర్లోనే కెరీర్ ఫైనల్ కావాలి. ఆర్ఎక్స్–100తో హీరోగా గుర్తింపు... నిట్ నుంచి 2014 బీటెక్ పూర్తి చేసి బయటకు వెళ్లిన తర్వాత సుబ్బారావు నేషనల్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సులో చేరాను. 2018లో డైరెక్టర్ అజయ్ ఆర్ఎక్స్–100కు హీరోగా సెలెక్ట్ చేశారు. ఆర్ఎక్స్–100 నన్ను యాక్టర్గా, హీరోగా నిలబెట్టి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. గ్యాంగ్ లీడర్లో నాని హీరోగా మంచి హీరోయిజంతో కూడిన విలన్ పాత్రను డైరెక్టర్ గుణ æవివరించగా ఒప్పుకున్నాను. త్వరలో 90 ఎంఎల్ సినిమాతో మీ ముందుకు వస్తున్నాను. నేను చదువుకున్న నిట్ వరంగల్కు నేను హీరోగా మారి అతిథిగా రావడం ఆనందంగా ఉంది. నాడు నేను చదువుకున్న తరగతులు, నేను డ్యాన్స్ చేసిన, నన్ను యాక్టర్గా తీర్చిదిద్దిన ఆడిటోరియాన్ని మరువలేను. -
బాగా లేదంటే డబ్బు వాపస్
కార్తికేయ, పాయల్ రాజపుత్ జంటగా రూపొందిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. ‘యాన్ ఇన్క్రెడిబుల్ లవ్ స్టోరీ’ అన్నది ఉపశీర్షిక. దర్శకుడు రామ్గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు. చైతన్ భరద్వాజ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత రాజ్ కందుకూరి, హీరో హవీశ్ విడుదల చేశారు. నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడుతూ –‘‘నా భార్య నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ‘ఆర్ ఎక్స్ 100’ బైక్. అజయ్గారు కథ చెప్పినప్పుడు షాకయ్యాను. తర్వాత గ్రేట్గా ఫీలయ్యాను. ట్రైలర్ విడుదలయ్యాక అందరూ మా సినిమా గురించి మాట్లాడుతుండటం గర్వంగా ఉంది. ‘7/జి బృందావన కాలనీ, సైరాట్, ప్రేమిస్తే’ సినిమాల్లో ఎంత కంటెంట్ ఉందో దానికి మించిన కంటెంట్ మా సినిమాలో ఉంటుంది. ఈనెల 12న సినిమా రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘నేను స్క్రిప్ట్ పట్టుకుని తిరుగుతున్న రోజుల్లో నాపై నమ్మకంతో నన్ను కలిసిన తొలి వ్యక్తి చైతన్ భరద్వాజ్. తర్వాత క్రమంగా ‘ఆర్ ఎక్స్ 100’ టీమ్ ఏర్పడింది. చాలా హానెస్ట్గా చేసిన సినిమా ఇది’’ అన్నారు డైరెక్టర్ అజయ్ భూపతి. ‘‘మా సినిమాలో మంచి కంటెంట్ ఉంది. సినిమా చూశాక పెట్టిన డబ్బులు వేస్ట్ అయ్యాయని ప్రేక్షకులు అంటే వారికి నేను డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా’’ అన్నారు కార్తికేయ. -
థ్రిల్లర్ కార్తికేయ...
‘‘ఈ ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఏదీ ఉండదు. ఒక వేళ సమధానం దొరకలేదూ అంటే ఆ లోపం ప్రశ్నది కాదు... ప్రయత్నానిదే అని నమ్మే ఓ యువకునికి ఎదురైన సంఘటనల సమాహారంగా రూపొందుతోన్న చిత్రం ‘కార్తికేయ’. ‘స్వామి రారా’ చిత్రంతో యువతరాన్ని ఆకట్టుకున్న జంట నిఖిల్, స్వాతి ఈ చిత్రంతో రెండోసారి జతకట్టారు. చందు మొండేటి దర్శకుడు. వెంకట శ్రీనివాస్ బొగ్గారం నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ -‘‘తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మా తొలి ప్రయత్నమే ద్విభాషా చిత్రం కావడం ఆనందంగా ఉంది. నిఖిల్ కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా. జనవరిలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఇందులో హీరోహీరోయిన్లు వైద్య విద్యార్థులుగా కనిపిస్తారని, థ్రిల్లింగ్గా సాగే వినోదాత్మక చిత్రం ఇదని దర్శకుడు చెప్పారు. తనికెళ్ల భరణి, నాజర్, రావురమేష్, జోగినాయుడు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్, సంగీతం: శేఖర్చంద్ర, పాటలు: కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: గునకల మల్లికార్జున.