-
‘కంది’ పోతోంది..
సాక్షి, రెబ్బెన(ఆసిఫాబాద్): ఆరుగాలం కష్టించి పంటలు పండించే అన్నదాతలను ప్రతికూల వాతావరణ పరిస్థితులు కుంగదీస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో పంటల్లో ఆశించిన స్థాయిలో దిగుబడి రాక రైతన్నలు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. విత్తనం నాటిన నుంచి పంట చేతికి అందే వరకు దేవుడిపై భారం వేస్తున్నారు. ఈసారి ఖరీఫ్ ప్రారంభం నుంచే వర్షాలు అధికంగా కురవటంతో పంటల్లో ఎదుగుదల లేక నష్టపోగా ఖరీఫ్ చివరి కాలంలో వర్షాలు పూర్తిగా ముఖం చాటేయటంతో పంటలు ఆశాజనకంగా లేవు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పత్తిలో దిగుబడి తగ్గి దెబ్బతీయగా కందిపై పెట్టుకున్న ఆశలు సైతం సన్నగిల్లుతున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కంది పంట పూత దశలో ఉండగా వర్షాలు లేక ఎదుగుదల పూర్తిగా మందగించి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది. దెబ్బతీసిన అధిక వర్షాలు ఖరీఫ్ ప్రారంభంలో జిల్లాలో కురిసిన అధిక వర్షాలు పత్తితోపాటు కంది పంటలను సైతం తీవ్రంగా దెబ్బతీశాయి. భూమిలో తేమశాతం అధికంగా మారటంతో పంటల్లో ఎదుగుదల పూర్తిగా లోపించింది. దాని ప్రభావం ఇప్పటికే పత్తి పంటలపై చూపగా ప్రస్తుతం కందిపై ప్రభావం పడింది. ప్రారంభంలో అధిక వర్షాలతో పంటల్లో పెరుగుదల లోపించగా ఖరీఫ్ చివరి కాలం నాటికి వర్షాలు పూర్తిగా ముఖం చాటేశాయి. దాంతో పంటలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలను ప్రతికూల వాతావరణ పరిస్థితులు అడియాసలు చేశాయి. జిల్లా వ్యాప్తంగా ఈసారి ఖరీఫ్లో 12,495 హెక్టార్లలో రైతులు కంది పంటలను సాగు చేశారు. చాలా మంది రైతులు అధిక శాతం పత్తికి అంతర పంటలుగా కందిని సాగు చేయగా మిగిలిన వారు నేరుగా సాగు చేశారు. ప్రస్తుతం కంది పంటలన్ని పూతదశకు చేరుకోగా పంటల్లో పెరుగుదల లేకపోవటంతో కనీసం పెట్టుబడి సైతం దక్కేలా కనిపించటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఈసారి సుమారు 1,56,188 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి సగానికి సగం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు బావిస్తున్నారు. పంటల్లో పెరుగుదల లేక ఆశించిన స్థాయిలో పూత కనిపించటం లేదు. ముందుంది తెగుళ్ల కాలం.. జిల్లాలో ఇప్పుడిప్పుడే పూత పడుతున్న కంది పంటను పచ్చపురుగు, లద్దెపురుగు, మచ్చల పురుగు ఉధృతంగా ఆశిస్తుండడం రైతులను కలవర పెడుతోంది. పూత దశలోనే పురుగు ఉధృతి అధికంగా మారటంతో రైతులను ఇబ్బందులను గురిచేస్తోంది. దానికి తోడూ రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పంటలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. దాంతో కందికి పూతలు సరిగా రాకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక వాతావరణం మబ్బు పడితే కందిపై పురుగుల బెడద మరింత అధికమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత, పిందె రాలిపోయి మరింత నష్టపోవాల్సి వస్తుంది. ఆ దశలో వాతావరణం అనుకూలిస్తే తప్పా కనీసం పెట్టుబడులు సైతం రాబట్టుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ అధికారుల నుంచి సలహాలు, సూచనలు అందకపోవటంతో రైతులు తమకు తోచిన మందులు పిచికారి చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలో కంది సాగు మండలం హెక్టార్లు సిర్పూర్(యు) 1,179 జైనూర్ 739 కెరమెరి 1,606 లింగాపూర్ 691 ఆసిఫాబాద్ 1,310 రెబ్బెన 480 వాంకిడి 1,198 తిర్యాణి 1,208 కాగజ్నగర్ 742 సిర్పూర్(టి) 894 కౌటాల 830 బెజ్జూర్ 462 దహెగాం 161 చింతలమానెపల్లి 722 పెంచికల్పేట్ 273 మొత్తం 12,495 -
నాలుగేళ్లుగా సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది
-
నాలుగేళ్లుగా సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత నాలుగేళ్ల నుంచి ఖరీఫ్లో సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. వరుసగా సాగు విస్తీర్ణం తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు నీరు–ప్రగతి పేరుతో భూగర్భ జలాలను పెంచుతున్నామని, తద్వారా అదనపు ఆయకట్టు వచ్చిందని ప్రభుత్వం చెబుతుండగా అదే సర్కారు జిల్లా కలెక్టర్ల సదస్సుకు రూపొందించిన నివేదిక మాత్రం 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఖరీఫ్ వరకు సాగు విస్తీర్ణం తగ్గిపోయినట్లు స్పష్టం చేసింది. నీరు–ప్రగతి కింద చెరువుల్లో పూడిక తీయడం, చెక్డ్యామ్ల నిర్మాణం, ఫాం పాండ్స్, ఇతర నీటి నిల్వ నిర్మాణాలు, చెరువుల సామర్థ్యం పెంపు పేరుతో గత మూడేళ్లలో అంటే 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు మొత్తం రూ.9,906.88 కోట్లు వ్యయం చేశారు. ఇందులో జలవనరుల శాఖ రూ.2009.92 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖ రూ.7896.96 కోట్లు వ్యయం చేసినట్లు జిల్లా కలెక్టర్ల సదస్సు నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు 2014–15 ఆర్థిక సంవత్సం ఖరీఫ్, రబీ కలిపి 155.24 లక్షల ఎకరాలు సాగు విస్తీర్ణం ఉండగా 2015–16 ఆర్థిక సంవత్సరంలో 7.69 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. అలాగే 2016–17 ఆర్థిక సంవత్సరంలో 2.93 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. గత ఖరీఫ్తో పోల్చి చూస్తే ప్రస్తుత ఖరీఫ్లో సాగు విస్తీర్ణం ఏకంగా 16.51 లక్షల ఎకరాలు తగ్గిపోవడం గమనార్హం. నీరు–ప్రగతి పేరుతో దోపిడీ నీరు–ప్రగతి పేరుతో ప్రభుత్వం గత మూడేళ్లలో చేసిన వ్యయం చూస్తుంటే కళ్లు తిరుగుతున్నాయని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కొత్తగా ఆయకట్టును సాగులోకి తీసుకొస్తుంటే సాగు విస్తీర్ణం ఎందుకు తగ్గిపోతోందో పాలకులు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ల్యాండ్ రెవెన్యూ వసూళ్లు తగ్గిపోవడానికి కూడా గత మూడేళ్లుగా సాగు విస్తీర్ణం తగ్గిపోవడమే కారణమని అధికారులు పేర్కొంటున్నారు. నాగార్జున సాగర్ కింద కూడా గత మూడేళ్లుగా ఆయకట్టు తగ్గిపోయిందని, దీంతో ల్యాండ్ రెవెన్యూపై ప్రభావం పడిందని రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. నీరు–ప్రగతి పేరుతో పనులన్నీ కూడా నామినేషన్పై చేశారని, అంటే ఈ మొత్తం నిధులన్నీ దుర్వినియోగం అయినట్లేనని సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. నీరు–ప్రగతికి చేసిన వ్యయం ఒక పెద్ద సాగునీటి ప్రాజెక్టుకు వ్యయం చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తయ్యేదని, లేదా ఆ మొత్తం నిధులను రాజధానిలో పరిపాలన భవనాల నిర్మాణాలు, రహదారుల నిర్మాణాలకు వ్యయం చేస్తే ఆ నిధులు సద్వినియోగం అయ్యేవని ఆ అధికారి వ్యాఖ్యానించారు. నీరు–ప్రగతి పనుల పేరుతో నిధులను అధికారికంగా ఖజానా నుంచి దోచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
లక్ష ఎకరాలు ఔట్
సమగ్ర సర్వే నుంచి రియల్ ఎస్టేట్, ఇతరత్రా బదిలీ అయిన భూముల తొలగింపు ► సర్వేలో 1.24 కోట్ల ఎకరాల భూమి నమోదు ► ఈ నెల చివరికి తుది నివేదిక ► వచ్చే ఖరీఫ్ నుంచే రైతులకు పెట్టుబడి పథకం ► సీఎం భూములకూ ఎకరాకు రూ.4 వేల చొప్పున రూ.3.40 లక్షలు సాక్షి, హైదరాబాద్ : రైతు సమగ్ర సర్వేలో నమోదైన భూముల జాబితా నుంచి దాదాపు లక్ష ఎకరాలను తొలగించారు. రైతుల వద్ద పట్టాదారు పాసు పుస్తకాలున్నా ఆ భూమి రియల్ ఎస్టేట్కు మళ్లడం, వివిధ ప్రభుత్వ పథకాల కింద భూసేకరణలో వెళ్లిపోవడం తదితర కారణాలతో ఆ భూములను జాబితా నుంచి తొలగించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే కొన్నిచోట్ల రైతులు స్థానికంగా లేకున్నా, కొందరు చనిపోయినా, మరికొందరు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నా వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) రెవెన్యూ రికార్డులను ముందేసుకొని ఆయా భూముల వివరాలు సమగ్ర సర్వేలో నమోదు చేశారు. ఇలా గుర్తించిన భూమిని కూడా జాబితా నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. అదనపు భూమి వచ్చి చేరితే వచ్చే ఏడాది నుంచి ప్రతీ రైతుకు ఎకరానికి రూ.4 వేల చొప్పున అందించే పథకం బడ్జెట్ మరింత పెరగనుంది. రైతుల వద్దకు వెళ్లకుండా ఇలా రికార్డులు చూసి భూముల వివరాలు నమోదు చేయడంపై మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి లక్ష ఎకరాల వరకు భూ వివరాలను సమగ్ర సర్వే జాబితా నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. ఈ నెల 28 లేదా 29 నాటికి రైతు సమగ్ర సర్వేపై స్పష్టత రానుంది. ఆ రోజు జిల్లాల నుంచి తుది నివేదిక వస్తుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. వచ్చే ఖరీఫ్కల్లా రైతులకు రూ.4,981 కోట్లు ప్రభుత్వం ప్రకటించినట్టుగా వచ్చే ఖరీఫ్ నుంచి పెట్టుబడి పథకం కింద రైతులందరికీ ఎకరాకు రూ.4 వేల చొప్పున అందించనున్నారు. పేద, ధనిక తేడా లేకుండా నగదు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ప్రస్తుత లెక్కల ప్రకారం వచ్చే ఖరీఫ్లో రూ.4,981.32 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. సీఎం కేసీఆర్కూ ఎర్రవల్లిలో 85 ఎకరాల భూమి ఉంది. ఆయన భూ వివరాలను కూడా సమగ్ర సర్వేలో నమోదు చేశారు. ప్రస్తుతం ఆ భూమిలో బొప్పాయి, వరి పంటలు సాగులో ఉన్నాయి. నిబంధనల ప్రకారం సీఎంకూ వచ్చే ఖరీఫ్లో రూ.3.40 లక్షలు ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఉన్నతస్థాయి వర్గాలకు చెందిన వ్యవసాయ భూములకు కూడా పెట్టుబడి పథకం కింద సొమ్ము జమ చేస్తామన్నారు. అయితే పెట్టుబడి పథకం తమకు వద్దంటూ ఎవరైనా విజ్ఞప్తి చేస్తే అప్పుడు ఆలోచిస్తామని అంటున్నారు. ఎవరి నుంచి కూడా తమకు అలాంటి విన్నపాలు రాలేదని అధికారులు తెలిపారు. సగానికి తగ్గిన ఉద్యాన పంటలు సీఎంకు వ్యవసాయశాఖ పంపిన నివేదిక ప్రకారం 45.55 లక్షల మంది రైతుల చేతుల్లో 1,24,53,308 ఎకరాల పంట భూమి ఉన్నట్లు సమగ్ర సర్వేలో నమోదు చేశారు. అందులో 51.30 లక్షల ఎకరాలు నీటిపారుదల వనరుల కింద ఉండగా.. 69.40 లక్షల ఎకరాలు వర్షాధార భూములు. ఉద్యానశాఖ పరిధిలో ఇప్పటివరకు 8 లక్షల ఎకరాల పండ్లు, కూరగాయల తోటలున్నట్లు భావించారు. కానీ సమగ్ర సర్వేలో కేవలం 3.59 లక్షల ఎకరాలే ఉన్నట్లు తేలింది. అందులో మామిడి తోటలు 2.25 లక్షల ఎకరాలు, నిమ్మ, బత్తాయి తోటలు 67,544 ఎకరాలు, జామ తోటలు 4,766 ఎకరాలు, ఇతర పండ్లు, కూరగాయల తోటలు 61,884 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు నిర్ధారించారు. ఉద్యాన పంటలకు సరైన ప్రోత్సాహకం లేకపోవడం వల్లే రైతులు ఆయా పంటల నుంచి వైదొలుగుతున్నట్టు ఉద్యానశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
అదును దాటుతున్న ఖరీఫ్
- మృగశిరలో అందని నీరు - ఆరుద్ర రాకతో మరింత ఆలస్యం - ఇప్పుడు నాట్లు వేస్తేనే తుపాన్ల సమయంలో చేతికి వచ్చేది - శివారులో పునర్వసులోనే నారుమడులు అమలాపురం : ఆరుద్ర... డెల్టాలో ఏరువాకకు పెద్ద గుదిబండ. ఈ కాలంలో నారుమడులు వేస్తే.. పంట తుపాన్లు సమయంలో చేతికి వచ్చే అవకాశముంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు నారువేయడమంటే గాలిలో దీపం పెట్టడమే. అయితే ముందస్తుగా మృగశిర.. లేదా తుపాన్లు దాటిన తరువాత పంట చేతికి వచ్చేలా పునర్వసులో నారుమడులు వేయడం జిల్లాలో డెల్టాలో ఖరీఫ్ రైతులకు పరిపాటి. ఈసారి కూడా మృగశిరలో నీరందించకపోవడంతో ఎప్పటిలానే పునర్వసులో నారువేసేందుకు ఖరీఫ్ రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ ఏడాడి కూడా ఖరీఫ్ ఆలస్యం కానుంది. గోదావరి డెల్టాలో ఖరీఫ్ ఆదునుదాటుతోంది. ముందస్తు ఖరీఫ్కు షెడ్యూలుకంటే ముందే నీరంటూ రైతులను ఊరించిన ప్రభుత్వ పెద్దలు ఎప్పటిలానే సాగునీరు పొలాలకు ఆలస్యంగా విడుదల చేయడంతో సాగులో జాప్యం చోటుచేసుకుంటోంది. జూన్ ఒకటిన సాగునీరు విడుదల చేసినా..ఆధునికీకరణ, నీరు–చెట్టు అంటూ కాలువలకు అడ్డుకట్టు వేస్తూ 20వ తేదీ వరకు పొలాలకు అందకుండా చేశారు. ఈ కారణంగా డెల్టాలో నారుమడులు ఆలస్యమవుతున్నాయి. తూర్పు, మధ్య డెల్టాల్లో 4.80 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని అధికారుల లెక్కలు కాగా ఇప్పటి వరకు 60 శాతం పొలాల్లో కూడా నారుమడులు వేయలేదు. మృగశిర ఈ నెల 21 వరకు ఉన్నా ఆ సమయంలో నీరందక రైతులు నారుమడులు ఆలస్యం చేశారు. 22 నుంచి ఆరుద్ర మొదౖలై జూలై ఏడు వరకూ ఉంది. ఐదు నెలల పంట కాలం కావడం వల్ల ఈ సమయంలో నారు మడులు వేస్తే అక్టోబరు నెలఖారు నుంచి నవంబరు 15 మధ్య చేతికి వచ్చే అవకాశముంది. ఈ సమయంలోనే ఈశాన్య రుతుపవనాల వల్ల భారీ వర్షాలు కురవడం, తరువాత తుపాన్లు కారణంగా పంట నష్టపోవడం డెల్టాలో శివారు రైతులకు పరిపాటిగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పునర్వసు మొదలైన తరువాత అంటే జూలై మొదటి వారం తరువాత నారుమడులు వేయనున్నారు. అదే జరిగితే జూలై నెలాఖరు, ఆగస్టు మొదటి వారంలో కూడా ఖరీఫ్ నాట్లు వేసే అవకాశం ముంది. ఇదే జరిగితే రబీ ఆలస్యం కావడం, మూడో పంట అపరాలు లేకుండా పోనుంది. ఎగువున కొంతవేగం... – తూర్పుడెల్టాలో అనపర్తి సబ్ డివిజన్ పరిధిలో 48 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇప్పుడిప్పుడే నాట్లు ఆరంభించారు. అది కూడా మొత్తం ఆయకట్టులో మూడుశాతమే. ఇక్కడ సుమారు 80 శాతం నారుమడులు పడ్డాయి. బోర్ల వద్ద నారు వేసిన రైతులు మాత్రమే నాట్లు వేస్తున్నారు. – ఆలమూరు సబ్ డివిజన్ పరిధిలో 38 వేల ఎకరాలు కాగా, ఇక్కడ కూడా 80 శాతం నారుమడులు పడగా, నాట్లు పది శాతం మాత్రమే అయ్యాయి. – మధ్య డెల్టాలో కొత్తపేట సబ్ డివిజన్లో సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇక్కడ ఆత్రేయపురం మండలంలో మాత్రమే కొంత వరకు నాట్లు పడుతున్నాయి. మొత్తం నియోజకవర్గంలో ఐదు శాతం నాట్లు పడలేదని అంచనా కాగా, కేవలం 30 శాతం మాత్రమే నారుమడులు పడ్డాయి. శివారులో మరింత ఆలస్యం... – తూర్పుడెల్టా పరిధిలో రామచంద్రపురం నియోజకవర్గం 58 వేల ఎకరాలు కాగా, 20 శాతం మాత్రమే నారుమడులు వేశారు. ఇక్కడ జూలై నెలాఖరు, ఆగస్టులో నాట్లు పడే అవకాశముంది. – సామర్లకోట గోదావరి కాలువ మీద సామర్లకోట మండలంలో 20 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, పది శాతం మాత్రమే నారుమడులు పోశారు. – కరప, కాకినాడ మండలాల్లో 28,700 ఎకరాలు ఆయకట్టు ఉండగా, ఇక్కడ నాట్లు ఆరంభం కాలేదు. ఇక్కడ సుమారు 40 శాతం ఆయకట్టులో మాత్రమే నారుమడులు వేశారు. – మధ్యడెల్టాలోని సబ్ డివిజన్ల వారీగా చూస్తే పి.గన్నవరం 14,900 ఎకరాలకుగాను, 70 శాతం, అమలాపురం 42 వేల ఎకరాలకుగాను 30 శాతం, ముమ్మిడివరం 23,500 ఎకరాలకు గాను 25 శాతంచ రాజోలు 17 వేల ఎకరాలకుగాను 10 శాతం కూడా నారుమడులు వేయలేదు. రాజోలు సబ్ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తారనే నమ్మకం కలగడం లేదు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో రెండు రోజులు వానలు
గుడ్ మార్నింగ్.. ఏలూరు
13,103 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్
పోలింగ్ నిర్వహణకు పటిష్ట ప్రణాళిక
వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రచార జోరు
కబ్జాపర్వం.. దందాలే సర్వం
పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
జగనన్న ఇచ్చిన వరం సొంతిల్లు
మద్యం దుకాణం సిబ్బందిపై కేసు నమోదు
అల్లూరితో మన్యంలో విప్లవ చైతన్యం
తప్పక చదవండి
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement