-
నిర్భయ కేసు : లాయర్కు భారీ జరిమానా..!
న్యూఢిల్లీ : నిర్భయ కేసులో దోషిగా తేలిన పవన్కుమార్ గుప్తా తరపు న్యాయవాది ఏపీ సింగ్కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. తగిన ఆధారాలు సమర్పించకుండా కోర్టు సమయాన్ని వృధా చేశారని పేర్కొంటూ 25 వేల రూపాయల జరిమానా విధించింది. ఏపీ సింగ్పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ బార్ అసోసియేషన్కు ఆదేశాలు జారీ చేసింది. తన క్లైంట్ పవన్కుమార్ నిర్భయ ఘటన జరిగిన సమయంలో (2012, డిసెంబర్ 16) మైనారిటీ (జువైనల్) తీరలేదంటూ న్యాయవాది ఏపీ సింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పవన్కుమార్ను జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద విచారించాలని పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఏపీ సింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు చూపకుండా పిటిషన్ వేయడం.. విచారణ సమయంలో గైర్హాజరు కావవడంపై మండిపడింది. కోర్టుకు నివేదించిన సాక్ష్యాల ఆధారంగా ఘటన సమయంలో పవన్కుమార్ జువైనల్ కాదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. అదే విధంగా, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి జువైనల్ జస్టిస్ యాక్ట్ అంశం తమ పరిధిలోకి రాదని కోర్టు తేల్చిచెప్పింది. దోషి మరణ శిక్షను తప్పించాలనే ఉద్దేశంతోనే లాయర్ ఏపీ సింగ్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆక్షేపించింది. ఇక నిర్భయ కేసులో మరో దోషి అక్షయ్ కుమార్ సింగ్, తనకు విధించిన మరణ శిక్షను సమీక్షించాలంటూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేవేసిన విషయం తెలిసిందే. -
బాల నేరస్తులను సక్రమ మార్గంలో తీసుకెళ్లాలి
విజయనగరం క్రైం: జువైనల్ జడ్జిమెంటు చట్టంపై పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన పెంచుకుని బాల నేరస్తులను సక్రమ మార్గం వైపు మళ్లించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా జడ్జి ఎం.లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. లీగల్ సర్వీసెస్ భవనంలో పోలీసు అధికారులు, సిబ్బందికి శనివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల నేరస్తుల చట్టంపై 2007లో కొన్ని సవరణలు జరిగాయని, సవరణలపై పోలీసులకు పూర్తి అవగాహన ఉండాలన్నారు. ముఖ్యంగా బాల నేరస్తులను రెండురకాలుగా వర్గీకరించారన్నారు. చిన్నచిన్ననేరాలు చేసి పట్టుబడి శిక్షఅనుభవించే వారు ఒకరకమైతే, తల్లిదండ్రులు,ఎవరి సహా యం లేకుండా అనాథలుగా ఉన్నవారు కొందరన్నారు. వీరందరినీ సరైన మార్గంలో తీర్చిదిద్దడానికి చట్టాన్ని సమగ్రంగా రూపొందించారన్నారు. రెండవ రకానికి చెందిన పిల్లలను చేరదీసి చిల్డ్రన్ హోమ్లలో చేర్పించి వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాలన్నారు. అటువంటి వారి సమాచారాన్ని అందజేయడానికి 1098ఫోన్ నంబర్ కు, జిల్లా న్యాయ సేవా సంఘానికి తెలియపరచాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ నవదీప్సింగ్ గ్రేవాల్ మాట్లాడుతూ పోలీసుశాఖలో కింది స్థాయి అధికారులకు అందరితో సత్సంబంధాలుంటాయని,వారికి చట్టాన్ని చక్కగా అమలు చేసే అవకాశం కల్పించాలని సూచించారు. పిల్లల చెడు ప్రవర్తనకు మూలాలు అన్వేషించి మూలాలను సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా ఆరాచక శక్తులుగా మారడాన్ని, వ్యభిచార కూపాలకు తరలించడాన్ని నిరోధించాలని చెప్పారు. పిల్లలకు సామాజిక భద్రత కల్పిం చడం పోలీసు విధుల్లో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వెలమల నరేష్, ఫ్యామిలీకోర్టు జడ్జి బి.శ్రీనివాసరావు, జిల్లా ఎస్సీ,ఎస్టీ కోర్టు జడ్జి కె.వి.రమణరావు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement