-
కేడర్లో ఉత్తేజాన్ని నింపిన కొప్పన చేరిక
సాక్షి ప్రతినిధి, కాకినాడ : మాజీ మంత్రి కొప్పన మోహనరావు చేరికతో పిఠాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. హైదరాబాద్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగ¯ŒSమోహ¯ŒS రెడ్డి సమక్షంలో కొప్పన పార్టీలో చేరారు.ఈయనతోపాటు పిఠాపురం నియోజకవర్గం నుంచి మాజీ సర్పంచులు, స్థానిక సంస్థల మాజీ ప్రతినిధులు 60 మంది వైఎస్సార్ సీపీలో చేరారు. కొప్పన పిఠాపురం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోట్ల విజయభాస్కర రెడ్డి కేబినెట్లో అటవీ శాఖా మంత్రిగా, అటవీ అభివృద్ధి కార్పొరేష¯ŒS చైర్మ¯ŒSగా పని చేశారు. పీసీసీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరారు. పిఠాపురంలో మంచి పట్టున్న నేతగా ప్రజా సమస్యలపై పోరాడే నేతగా కొప్పనకు మంచి పేరుంది. జగ¯ŒS పోరాటాలే ఆకర్షించాయి... పార్టీలో చేరిన సందర్భంగా కొప్పన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా జగ¯ŒS మోహ¯ŒS రెడ్డి రాష్ట్రంలో ప్రజల పక్షాన అలుపెరగని పోరాటం ఆకర్షించిందని అన్నారు. చంద్రబాబు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బుట్టదాఖలు చేసి సాగిస్తున్న పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకుందన్నారు. పిఠాపురంలో పార్టీ అభ్యున్నతికి కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు నాయకత్వంలో కలిసి పని చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ కో ఆర్డినేర్ చలమలశెట్టి సునీల్, పిఠాపురం కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ప్రత్తిపాడు, పి.గన్నవరం కో ఆర్డినేటర్లు పర్వత ప్రసాద్, కొండేటి చిట్టిబాబు, రాష్ర కార్యదర్శులు మిండగుదిటి మోహన్, రావు చిన్నారావు, తాడి విజయభాస్కరరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్, పిఠాపురం ఫ్లోర్లీడర్ గండేపల్లి బాబి, పార్టీ యువజన విభాగం నాయకుడు మాదిరెడ్డి దొరబాబు తదితరులున్నారు. -
కాంగ్రెస్, టీడీపీల నుంచి వైఎస్సార్సీపీలోకి...
జగన్ సమక్షంలో పలువురిచేరిక దివాన్చెరువు (రాజానగరం) : మండలంలోని కాంగ్రెస్, టీడీపీలకు చెందిన కొందరు నాయకులు వారి అనుచరులతో వైఎస్సార్సీపీలో చేరారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించడంతో ఆ పార్టీల ద్వారా వచ్చిన పదవులను త్యజించి గురువారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్ జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దేశాల శ్రీను, ఎస్సీ సెల్ కార్యదర్శి కుంచే వీర్రాజు, నాయకులు కోలపాటి పండు, సప్పిడి బూరయ్య పార్టీలో చేరారు. మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా సేవలందించిన శ్రీను రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ సరైన రీతిలో నిర్ణయం తీసుకోకపోవడం వల్లలనే నేడు ప్రత్యేక హోదా విషయంలో కూడా మోసపోయామన్నారు. ఈ తరుణంలో ఇంకా ఆ పార్టీలో ఉండటం సరి కాదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కాగా కొత్తతుంగపాడు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కోలపాటి సుబ్బారావు తన అనుచరులతో వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ ఆవిర్భావం నుంచి విశేష సేవలందిస్తూ వస్తూ మండల స్థాయిలో కూడా పలు పార్టీ పదవులు నిర్వహించారు. ప్రస్తుతం పార్టీలో పనిచేసే వారికి సరైన గుర్తింపు లేదని, గ్రామంలో నిరంకుశ ధోరణిలో షాడో సర్పంచ్ పాలన చేస్తున్నా పెద్దలు పట్టించుకోవడం లేదని సుబ్బారావు అన్నారు. పార్టీకి ఆవిర్భావం నుంచి విశేషంగా సేవలందిన తన తండ్రి సూర్యారావు హఠాన్మరణం పొందితే పార్టీ వారెవరూ రాకపోవడం కూడా మనస్తాపాన్ని కలిగించిందన్నారు. గ్రామ మాజీ సర్పంచ్ కోలపాటి వెంకన్న, స్థానిక నాయకుడు కోలపాటి విష్ణుల ద్వారా వైఎస్సార్సీపీలో చేరారన్నారు. రెండు పార్టీల నుంచి వచ్చిన వారికి జగన్ వైఎస్సార్సీపీ పార్టీ కండువాలు మెడలో వేసి స్వాగతం పలికారు. మండల కన్వీనర్ మందారపు వీర్రాజు, అడబాల చినబాబు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement