-
మంత్రి ఇచ్చిన హామీలు..
భగత్సింగ్ నగర్ కాలనీలో నివాసముంటున్న నిరుపేద కూలీలకు గతంలో ఇండ్ల పట్టాలు జారీ చేశారు. కానీ ఇండ్లకు ఇంటి నెంబర్లు లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. ఇంటి నెంబర్లు వెంటనే వేయించేలా రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారులకు ఆదేశాలు ఇస్తాం. పట్టాలు లేకుండా నివాసముంటున్న అర్హులైన నిరుపేదలకు పట్టాలు మంజూరు చేయిస్తాం. వెంటనే విద్యుత్ లైన్ నిర్మాణం ప్రారంభానికి కృషి చేస్తా. తాగునీటి సమస్య పరిష్కారానికి జూన్లో బోర్లు వేయిస్తాం. అర్హులైన నిరుపేదలందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ఎంతటి వ్య యానికైనా సిద్ధంగా ఉంది. జిన్నింగ్, భవన ని ర్మాణ కార్మికుల సమస్యలను పరి ష్కరించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. జోగు రామన్న : అమ్మా బాగున్నవా? నీ పేరేంది..? చంద్రకళ : బాగున్నాం.. నా పేరు చంద్రకళ సారూ.. జోగు రామన్న : ఏంపని చేస్తావు.? ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నరు..? చంద్రకళ : కూలీ పనిచేస్తా సారు.. ఎనిమిదేళ్లుగా ఉంటున్నం.. మా ఇండ్లకు పట్టాల్లేవు పట్టాలిప్పించండి. జోగు రామన్న : ఇక్కడ ఉండేటోళ్లకు పట్టాలివ్వాలని గ్రామ పంచాయతీ, రెవెన్యూ అధికారులకు చెబుతా. జోగు రామన్న : బాబు.. నువ్వేం పనిచేస్తావు..? భరత్ : జిన్నింగ్ మిల్లులో పనిచేస్తా సార్. జోగు రామన్న : ఏ జిన్నింగ్లా..? భరత్ : మమత జిన్నింగ్ల పనికి పోత సార్. మిల్లు బంద్ ఉన్నప్పుడు కూలీ పనికిపోతా. తాపీమేస్త్రీ చేతికింద పనిచేస్తా. ఇప్పుడు మిల్లు నడుస్తంది పని దొరుకుతుంది. కానీ.. కూలీ తక్కువ వస్తుంది. కష్టమైతంది. జోగు రామన్న : రోజుకు ఎంత వస్తుంది.? భరత్ : రోజుకు రెండు వందల వస్తాయి. బాబూ : మా ఇండ్లకు కరెంట్ లేదు. రాత్రి బయటకు పోవాలంటే పరేషాన్ అయితోంది. జైనాభీ ఫాతిమా : ఘర్మే సాంప్ ఆరైసాబ్.. కరెంట్ నైతో అందేరేమే రహేరై.. బహుత్ తక్లిబ్ హోరై. (ఇండ్లలోకి పాములు వస్తున్నై, కరెంట్ లేక చీకట్లో బతుకుతున్నం.) బిస్మిల్ల : మచ్ఛర కాట్రై సాబ్. (దోమలు కుడుతున్నాయి) జరాలస్తున్నై. జోగు రామన్న : తొందరలోనే కరెంట్ పెట్టిపిస్తం. జోగు రామన్న : ఏం కాకా.. నీ పేరేంది..? జ్ఞానోభ : పింఛన్ వస్తలేదు. ఇప్పియ్యండి సార్. మొన్న దరఖాస్తు వెట్టిన. ఇయ్యాలని సార్లకు చెప్పుండ్రి. గంగమ్మ : కొడుకు, కోడలు కూలిపని చేస్తరు. నేను కూడా కూలికి పోతుంటి కానీ, మనుమండ్ల కోసం ఇంటి కాడ ఉంటున్న పింఛను వస్తలేదు. జోగు రామన్న : వెయ్యి రూపాయలకు పెంచిన పింఛన్లు ఇచ్చుడు షురు చేసినం. వృద్ధులందరికీ పింఛన్లు వస్తాయి. అధికారులకు చెబుతాం.. జోగు రామన్న : బాబు మీ ఇల్లు ఏదీ? సయ్యద్ : అటు కిందికి ఉంటది. సార్లు వస్తున్నరని తెలిసి ఇక్కడికి వచ్చిన. మేస్త్రీ పనికి పోయినప్పుడు కాలుకు దెబ్బ తాకి విరిగింది. పింఛను ఇప్పించండి. జోగు రామన్న : చెప్పాను కదా.. అర్హులైన వారందరికీ పింఛన్లు వస్తాయి. డాక్టర్ సర్టిఫికేట్ కోసం డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు నాకు ఫోన్ చేయూ.. డాక్టర్తో మాట్లాడి సర్టిఫికేట్ ఇప్పిస్తా. ఎల్లమ్మ : పింఛన్ ఇప్పియ్యు సారు... జోగు రామన్న : నీకు 65 ఏళ్లు ఉంటాయా అమ్మా..? ఎల్లమ్మ : కాదు.. సార్ నా భర్త సచ్చిపోయి నాలుగేళ్లవుతోంది. జోగు రామన్న : భర్త చనిపోయినట్లు సర్టిఫికేట్ తీసుకున్నావా? పింఛన్ కోసం మొన్న దరఖాస్తు చేసుకోలేదా.. మరి? ఎల్లమ్మ : అప్పుడు సార్లు ఇచ్చిన కాగితం కూడా నా దగ్గర ఉంది. అవిపెట్టి దరఖాస్తు చేసుకున్న. కానీ పింఛన్ రావడంలేదు. చనిపోయినట్లు కాగితం ఉంది. జోగు రామన్న : సర్పంచ్కు చెబుతా, పింఛన్ ఇప్పిచ్చేట్లు చూస్తా. జోగు రామన్న : నీ పేరేమిటి. నువ్వు ఏం చేస్తావు..? విఠల్ : విఠల్. నేను పదేళ్లసంది ఇక్కడనే ఉంటున్నా.. జిన్నింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న. మా కాలనీలో రోడ్లు లేవు. మస్తు పరేషాన్ అవుతున్నం. జర చూడండి సారు. పోసాని : బోరింగ్ నుంచి నీళ్లు తీసుకుని వస్తున్నప్పుడు రోడ్డు సరిగ్గా లేక కింద పడి దెబ్బలు తాకుతున్నై. ఒకరి కాలు విరిగింది. జోగు రామన్న : రోడ్డు పనులు చేపిస్తాము. ఇప్పడిదాక పని చేయాలని వేరోల్ల వద్దకు పోతుంటిమి. తెలంగాణ వచ్చింది కదా. ఒక్కొక్కటిగా సమస్యలన్నీ మనమే పరిష్కరించుకుందాం. విష్ణు : సారు మా వాడలో తాగేందుకు సరిగ్గా నీరు దొరుకుతలేదు. ఇక్కడ అందరు మజూరి చేసి బతుకుతున్నరు. పనులకు వెళ్లకుండా బిందెలు పట్టుకొని బోరింగుల దగ్గర ఉంటున్నం. దేర్సె కామ్పె గయేతో కామ్ నహి మిల్హ్రాహై. జోగు రామన్న : ఇప్పుడు బోర్లు వేస్తే నీళ్లు సరిగ్గా పడవు. రెండు నెలల్లో బోర్లు వేయిస్తాం. మంచిదమ్మా.. వెళ్లొస్తా... -
జిన్నింగ్ మిల్లు గోదాంలో అగ్నిప్రమాదం
తల్లాడ, న్యూస్లైన్: భారీ అగ్నిప్రమాదం నుంచి 120మంది కూలీలు త్రుటిలో తప్పించుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అప్రమత్తత వీరి ప్రాణాలను నిలబెట్టింది. తల్లాడ మండలంలోని అన్నారుగూడెం ఇండస్ట్రియల్ పార్కులో నూతనంగా నిర్మించిన జిన్నింగ్ మిల్లు పత్తి గోదాంలో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదం కలవరం రేపింది. 2013 నవంబర్ నెలలో ఈ జిన్నింగ్ మిల్లును ప్రారంభించారు. మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించగా... అక్కడే ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ ఎల్లంకి నరసింహారావు కేకలు వేసి హెచ్చరించాడు. దీంతో అక్కడ పని చేస్తున్న 120 మంది కూలీలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు. మంటలు గోదాంలో వ్యాపించేలోగానే వారు సురక్షితంగా బయటకు వచ్చారు. ప్రమాదంలో రూ.50లక్షల విలువచేసే పత్తి దగ్ధమయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను ఆర్పివేశారు. అలాగే లోపల ఉన్న ట్రాక్టర్ను వెలుపలికి తీసుకువచ్చారు. ముందస్తు చర్యలు చేపట్టని యాజమాన్యం.. పత్తి నిల్వ చేసే గోదాంలో ప్రమాదాల నివారణకు జిన్నింగ్ మిల్లు యాజమాన్యం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మంటలు ఆర్పివేసేందుకు నీటిని నిల్వ చేయలేదు. షార్ట్ సర్క్యూట్, మంటల కారణంగా ఉన్న ఒక్క బోరుకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో మంటలు ఆర్పివేసేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు సమీపంలోని బావులు, బోర్ల నుంచి నీటిని తీసుకువచ్చి మంటలు ఆర్పివేసేందుకు యత్నించారు. అలాగే మిల్లు వద్ద ఏర్పాటు చేసిన ఫైర్ కంట్రోల్ సిస్టమ్ పట్ల సిబ్బందికి అవగాహన కూడా కల్పించలేదు. దీంతో ప్రమాదం జరిగినప్పుడు ఏం చేయాలో తెలియక సిబ్బంది, కూలీలు పరుగులు తీశారు. పెద్ద శబ్దం వచ్చింది విద్యుత్ షార్ట్ సర్య్కూట్ జరిగిన వెంటనే పెద్ద శబ్దం వచ్చింది. దీంతో ప్రమాదం జరిగిందనే విషయం గమనించి కూలీలను బయటకు వెళ్లాలని సూచించాను. దీంతో కూలీలు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. - ఎల్లంకి నరసింహారావు, ట్రాక్టర్ డ్రైవర్ బతికి బయటపడ్డాం పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాం. మేం బయటకు వచ్చిన వెంటనే మంటలు వ్యాపించాయి. బతుకుదెరువు కోసం వచ్చిన మమ్మల్ని ఆ దేవుడే కాపాడాడు. - తంబళ్ల రాణి,కూలీ భయంతో వణికి పోయాం విద్యుత్ షాట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి మంటలు వ్యాపించడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగు తీశాం. పత్తి రెల్లుతుండగా పెద్ద శబ్దం వినిపించింది. దీంతో ఎం జరిగిందో తెలియక అయోమయం నెలకొంది. - అరుణ,కూలీ
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement