ఆంధ్ర 179/4
జార్ఖండ్తో రంజీ మ్యాచ్
సాక్షి, విజయనగరం: ఆరంభంలో తడబడిన ఆంధ్ర జట్టును శ్రీరామ్ ఆదుకున్నాడు. దీంతో జార్ఖండ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో ఆంధ్ర ఆధిక్యం దిశగా సాగుతోంది. రెండో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 67 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. శ్రీరామ్ (111 బంతుల్లో 71, 12 ఫోర్లు) రాణించాడు. ప్రదీప్ (86 బంతుల్లో 39 బ్యాటింగ్, 6 ఫోర్లు), రికీ భుయ్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్లో 96.5 ఓవర్లలో 246 పరుగులు చేసి ఆలౌటైంది.
హైదరాబాద్ భారీస్కోరు
అగర్తలా: త్రిపురతో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ భారీస్కోరు సాధించింది. ఓపెనర్ అక్షత్రెడ్డి (265 బంతుల్లో 174, 25 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా... కెప్టెన్ రవితేజ (118 బంతుల్లో 96 బ్యాటింగ్, 8 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ ముంగిట నిలిచాడు. దీంతో ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 126 ఓవర్లలో 9 వికెట్లకు 487 పరుగులు చేసింది. విహారి (161 బంతుల్లో 70, 10 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.