breaking news
Jessica Pegula
-
అల్కరాజ్కు ఊహించని షాక్.. సెమీస్ చేరకుండానే అవుట్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) ప్రస్థానం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. అమెరికా నంబర్వన్ ప్లేయర్, ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ అసాధారణ ఆటతీరు కనబరిచి అల్కరాజ్ను బోల్తా కొట్టించాడు. నాలుగు గంటల 28 నిమిషాలపాటు హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ షెల్టన్ 6–7 (5/7), 6–1, 6–3, 1–6, 7–6 (10/7)తో ‘సూపర్ టైబ్రేక్’లో ప్రపంచ మూడో ర్యాంకర్ అల్కరాజ్ను ఓడించి ఈ టోర్నీలో రెండోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు.కాగా 2023లో తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్న షెల్టన్... సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. గతంలో అల్కరాజ్తో జరిగిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిపోయిన షెల్టన్ నాలుగో ప్రయత్నంలో తొలి విజయం రుచి చూశాడు. షెల్టన్ తన కెరీర్లో టాప్–3 ర్యాంకర్పై గెలుపొందడం కూడా ఇదే తొలిసారి. అల్కరాజ్తో జరిగిన మ్యాచ్లో షెల్టన్ తొలి సెట్ను టైబ్రేక్లో కోల్పోయాడు. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని వరుసగా రెండు సెట్లు గెలిచాడు.అనంతరం అల్కరాజ్ తేరుకొని నాలుగో సెట్ను దక్కించుకున్నాడు. నిర్ణాయక ఐదో సెట్లో ఇద్దరూ ప్రతి పాయింట్కు నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. స్కోరు 6–6తో సమం కావడంతో ‘సూపర్ టైబ్రేక్’ అనివార్యమైంది. కీలకమైన సూపర్ టైబ్రేకర్లో షెల్టన్ తొలుత పది పాయింట్లు సాధించి చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. షెల్టన్, అల్కరాజ్ మ్యాచ్ యూఎస్ ఓపెన్ చరిత్రలో ఆలస్యంగా ముగిసిన మ్యాచ్గా గుర్తింపు పొందింది. అమెరికా కాలమానం ప్రకారం షెల్టన్, అల్కరాజ్ మ్యాచ్ మంగళవారం రాత్రి గం. 11:05 నిమిషాలకు మొదలై బుధవారం తెల్లవారుజామున గం 3:33 నిమిషాలకు ముగిసింది.అంతకుముందు 2022లో అల్కరాజ్, యానిక్ సినెర్ (ఇటలీ) క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబరు 7న బుధవారం రాత్రి గం. 9:35కు మొదలై సెప్టెంబరు 8న గురువారం తెల్లవారుజామున గం. 2:50 నిమిషాలకు ముగిసింది. టియాఫో మూడోసారి... సెమీఫైనల్లో అమెరికాకే చెందిన ప్రపంచ 12వ ర్యాంకర్ ఫ్రాన్సెస్ టియాఫోతో షెల్టన్ ఆడనున్నాడు. దాంతో ఒక అమెరికా ప్లేయర్ యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఆడటం ఖాయమైంది. అమెరికాకే చెందిన ప్రపంచ 46వ ర్యాంకర్ అలెక్స్ మిచెల్సన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో టియాఫో 5–7, 3–6, 7–5, 6–3, 7–6 (10/6)తో గెలుపొంది మూడోసారి ఈ టోర్నీలో సెమీఫైనల్కు చేరాడు. 4 గంటల 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో టియాఫో తొలి రెండు సెట్లను కోల్పోయి... ఆ తర్వాత వరుసగా మూడు సెట్లను సొంతం చేసుకోవడం విశేషం. 2022 సెమీఫైనల్లో అల్కరాజ్ చేతిలో, 2024 సెమీఫైనల్లో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) చేతిలో ఓడిపోయిన టియాఫో ఈసారి షెల్టన్పై గెలుస్తాడా లేదా వేచి చూడాలి. షెల్టన్, టియాఫోలలో ఎవరు గెలిచినా వారి కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ టోర్నీ ఫైనల్ అవుతుంది. కొత్త వరల్డ్ నంబర్వన్ రిబాకినా.. సెమీస్లో పెగులామహిళల సింగిల్స్లో రిబాకినా (కజకిస్తాన్) సెమీఫైనల్ చేరుకొని తొలిసారి వరల్డ్ నంబర్వన్ ర్యాంక్ అందుకుంది. క్వార్టర్ ఫైనల్లో రిబాకినా 3–6, 6–1, 6–4తో కిన్వెన్ జెంగ్ (చైనా)పై నెగ్గింది. మరో క్వార్టర్ ఫైనల్లో పెగూలా (అమెరికా) 3–6, 6–4, 6–3తో ఎమ్మా నవారో (అమెరికా)పై గెలిచింది. -
పెగూలా శుభారంభం
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీ మహిళలసింగిల్స్ విభాగంలో 2024 రన్నరప్, ప్రపంచ మూడో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా) శుభారంభం చేసింది. ఎలీనా గాబ్రియేలా రూసె (రొమేనియా)తో ఆదివారం జరిగిన తొలి రౌండ్లో పెగూలా 6–3, 6–2తో గెలిచింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో పెగూలా నాలుగు ఏస్లు సంధించింది. 26 విన్నర్స్ కొట్టిన పెగూలా ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ప్రపంచ 29వ ర్యాంకర్, రెండు గ్రాండ్స్లామ్ టైటిల్స్ విజేత క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. క్రెజికోవా 6–7 (4/7), 2–6తో కమీలా రఖిమోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయింది. -
సెమీస్కు దూసుకెళ్లిన గాఫ్.. పిన్న వయస్కురాలిగా చరిత్ర
వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో అమెరికా నల్లకలువ కోకో గాఫ్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్లో భాగంగా మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో గాఫ్ 4-6, 6-3, 6-3తో తన దేశానికే చెందిన జెస్సికా పెగులాను చిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో గాఫ్ తొలిసారి సెమీస్లో అడుగుపెట్టింది. అంతేకాదు టెన్నిస్లో నాలుగు మేజర్ గ్రాండ్స్లామ్ టోర్నీల్లో సెమీస్ చేరిన రెండో అతి పిన్న వయస్కురాలిగా గాఫ్ (22 ఏళ్లు) చరిత్ర సృష్టించింది. గతంలో మారియా షరపోవా 2007 ఫ్రెంచ్ ఓపెన్లో (19 ఏళ్లు) ఈ ఫీట్ సాధించింది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్ జానిక్ సిన్నర్ (ఇటలీ) 7-5, 7-6 (7-4), 6-3తో జర్మనీకి చెందిన అన్సీడెడ్ జేఎల్ స్ట్రఫ్ను మట్టికరిపించి సెమీస్లో అడుగుపెట్టాడు.ఇక సెమీస్లో గాఫ్.. నవోమి ఒసాకా, ముచోవా మధ్య విజేతతో తలపడనుంది. రేపు జరగబోయే మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నొస్కోవా, మెర్టెన్స్ తలపడనుండగా, మరో క్వార్టర్స్లో మరియా కొత్య్సూక్, జాస్మిన్ పవోలిని తలపడనున్నారు.చదవండి: వివాదంలో ఎంబాపె.. ‘క్షమాపణ చెప్పకపోతే కోర్టుకీడుస్తా!’ -
డిఫెండింగ్ చాంపియన్కు భారీ షాక్!
మెల్బోర్న్: అమెరికా స్టార్, డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్ ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రిక్వార్టర్స్లోనే నిష్క్రమించింది. మహిళల సింగిల్స్లో అమెకు సహచర క్రీడాకారిణి జెస్సికా పెగులా షాక్ ఇచ్చింది. ఈ విభాగంలో టాప్ సీడ్, పోలాండ్ స్టార్ స్వియాటెక్, నాలుగో సీడ్ అనిసిమోవ, ఐదో సీడ్ రిబాకినా క్వార్టర్స్లోకి అడుగుపెట్టారు.పురుషుల సింగిల్స్లో రెండో సీడ్ డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినెర్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అతనితో పాటు ఐదో సీడ్ ముసెట్టి, ఎనిమిదో సీడ్ షెల్టన్లు కూడా క్వార్టర్స్ చేరాడు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఆరో సీడ్ పెగులా (అమెరికా) 6–3, 6–4తో తన దేశానికే చెందిన డిఫెండింగ్ చాంపియన్, తొమ్మిదో సీడ్ మాడిసన్ కీస్ను కంగుతినిపించింది.స్వియాటెక్ గెలుపుగత సెమీఫైనలిస్ట్ ఇగా స్వియాటెక్ 6–0, 6–3తో స్థానిక క్వాలిఫయర్ మాడిసన్ ఇన్గ్లిస్ (ఆసీస్)పై అలవోక విజయం సాధించగా, 2023 రన్నరప్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) 6–1, 6–3తో ఎలీస్ మెర్టన్స్ (బెల్జియం)ను ఓడించింది. అమెరికాకు చెందిన నాలుగో సీడ్ అమెండా అనిసిమోవ 7–6 (7/4), 6–4,తో జిన్యూ వాంగ్ (చైనా)పై గెలిచి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్లో క్వార్టర్ ఫైనల్ చేరింది. అమెండా గతంలో మూడుసార్లు (2019, 2022, 2024) ప్రిక్వార్టర్స్తోనే సరిపెట్టుకుంది. సినెర్ జోరు పురుషుల సింగిల్స్లో యానిక్ సినెర్ ఆరంభ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నీలో ‘హ్యాట్రిక్’ లక్ష్యంగా దూసుకెళుతున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్లో గత రెండేళ్లు టైటిల్ సాధించిన ఈ డిఫెండింగ్ చాంపియన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రిక్వార్టర్స్లో రెండో సీడ్ ఇటాలియన్ స్టార్ 6–1, 6–3, 7–6 (7/2)తో తన దేశానికే చెందిన 22వ సీడ్ ల్యూసియానో డర్డెరిపై గెలుపొందాడు.గతేడాది సెమీఫైనలిస్ట్, ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా) 3–6, 6–4, 6–3, 6–4తో నార్వేకు చెందిన 12వ సీడ్ కాస్పర్ రూడ్పై చెమటోడ్చి నెగ్గాడు. ఐదో సీడ్ లారెంజో ముసెట్టి (ఇటలీ) 6–2, 7–5, 6–4తో తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)ను ఓడించి తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు.పురుషుల డబుల్స్లో భారత డబుల్స్ ప్లేయర్ యూకీ బాంబ్రీ పోరాటం మూడో రౌండ్లోనే ముగిసింది. స్వీడెన్కు చెందిన ఆండ్రీ గొరాన్సన్తో కలిసి పదో సీడ్గా బరిలోకి దిగిన యూకీ బాంబ్రీ మూడో రౌండ్లో 6–7 (7/9), 3–6తో బ్రెజిల్ ద్వయం ఒర్లాండో లుజ్–రాఫెల్ మాటొస్ చేతిలో ఓడారు.


