breaking news
Jaypee Cement
-
జేపీ సిమెంట్ గుజరాత్ యూనిట్ అల్ట్రాటెక్ పరం
న్యూఢిల్లీ: సిమెంట్ దిగ్గజాలు జేపీ, అల్ట్రాటెక్ల మధ్య ఏడాదికిపైగా జరిగిన చర్చలు ఎట్టకేలకు ఫలవంతం అయ్యాయి. ఫలితంగా జేపీ సిమెంట్ కార్పొరేషన్కు గుజరాత్లోగల సిమెంట్ ప్లాంట్ అల్ట్రాటెక్ సొంతం కానుంది. ఇందుకు జేపీ సిమెంట్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ తెలిపింది. డీల్ విలువ రూ. 3,800 కోట్లుగా వెల్లడించింది. డీల్లో భాగంగా సేవాగ్రామ్లో గల సిమెంట్ యూనిట్తోపాటు, వాంక్బోరీలోగల గ్రైండింగ్ యూనిట్ కూడా తమ సొంతం కానున్నట్లు పేర్కొంది. రెండు ప్లాంట్లు సంయుక్తంగా ఏడాదికి 4.8 మిలియన్ టన్నుల సిమెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వీటితోపాటు 57.5 మెగా వాట్ల బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి ప్లాంట్, 90ఏళ్లకు సరిపడే సున్నపురాయి నిల్వలు సైతం అల్ట్రాటెక్ సొంతంకానున్నాయి. తాజా కొనుగోలుతో అల్ట్రాటెక్ సిమెంట్ సామర్థ్యం 59 మిలియన్ టన్నులకు చేరనుంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్లతో కలిపి 2015కల్లా సిమెంట్ తయారీ సామర్థ్యం 70 మిలియన్లకు పెరగనున్నట్లు కంపెనీ చైర్మన్ కుమార మంగళం బిర్లా చెప్పారు. గుజరాత్ యూనిట్ కొనుగోలుకి ఈక్విటీ ద్వారా రూ. 150 కోట్లు, రుణాల ద్వారా రూ. 2,000 కోట్లను, అంతర్గత వనరుల ద్వారా మరో 1,650 కోట్లను సమకూర్చుకోనున్నట్లు బిర్లా వివరించారు. సిమెంట్ యూనిట్ విక్రయం ద్వారా లభించనున్న నిధులను రుణాల చెల్లింపునకు వినియోగించనున్నట్లు జేపీ గ్రూప్ వెల్లడించింది. జేపీ సిమెంట్ వాటాదారులకు రూ. 150 కోట్ల విలువైన అల్ట్రాటెక్ షేర్లను జారీ చేయనున్నట్లు బిర్లా తెలిపారు. కాగా, జేపీ సిమెంట్ రూ. 350 కోట్లమేర నష్టాలను నమోదు చేసుకుంది. డీల్ నేపథ్యంలో బీఎస్ఈలో అల్ట్రాటెక్ షేరు 1.6% పుంజుకుని రూ. 1,733కు చేరగా, జేపీ అసోసియేట్స్ 6.2% ఎగసి రూ. 43.40 వద్ద ముగిసింది. -
అల్ట్రాటెక్ చేతికి జేపీ సిమెంట్ ప్లాంట్
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం అల్ట్రాటెక్ సిమెంట్ జేపీ సిమెంట్ కార్పొరేషన్కు చెందిన గుజరాత్ ప్లాంట్లో 51% వాటాను కొనుగోలు చేయనుంది. 5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంగల గుజరాత్ సిమెంట్ ప్లాంట్లో జేపీకి గల 51% వాటాను కొనుగోలు చేసేందుకు అల్ట్రాటెక్ నిర్వహిస్తున్న చర్చలు తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. వాటా విలువను రూ. 4,000 కోట్లుగా అంచనా వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 10-15 రోజుల్లోగా డీల్ కుదరవచ్చునని వెల్లడించాయి. అయితే ఈ విషయంపై స్పందించేందుకు రెండు కంపెనీల వర్గాలు నిరాకరించాయి. జేపీ గ్రూప్ రియల్టీ, సిమెంట్, ఆతిథ్య రంగాలలో కార్యకలాపాలను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. కంపెనీ ఏడాదికి 33.5 మిలియన్ టన్నుల సిమెంట్ తయారీ సామర్థ్యాని కలిగి ఉంది. అజైల్లో పూర్తి వాటా విక్రయించిన హెచ్బీఎల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అనుబంధ కంపెనీ అయిన అజైల్ ఎలక్ట్రిక్ సబ్ అసెంబ్లీ ప్రైవేట్ లిమిటెడ్లో తమకున్న మొత్తం వాటాను హెచ్బీఎల్ పవర్ సిస్టమ్స్ విక్రయించింది. హెచ్బీఎల్తోపాటు ఇతర షేర్హోల్డర్లకు చెందిన వాటాలు, ఫ్రెష్ సబ్స్క్రిప్షన్ ద్వారా అజైల్ ఎలక్ట్రిక్ను బ్లాక్స్టోన్ గ్రూప్ కైవసం చేసుకుంది. మొత్తంగా బ్లాక్స్టోన్ రూ.400 కోట్లు వెచ్చించినట్టు సమాచారం. వాటా అమ్మడం ద్వారా వచ్చిన మొత్తాన్ని వ్యాపార విస్తరణకు హెచ్బీఎల్ వినియోగించనుంది. అజైల్ ఎలక్ట్రిక్ వాహన విడిభాగాల తయారీలో ఉంది. ఏటా 4 కోట్ల విడిభాగాలు తయారీ సామర్థ్యం ఈ కంపెనీ సొంతం.