breaking news
Jayaprakash Narayanan
-
జేపీ.. టీడీపీ భజనపరుడు
గట్టు రామచంద్రరావు ధ్వజం హైదరాబాద్ : ఏసీ రూముల్లో పడుకునే లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణకు పేదల కష్టాలు ఏం తెలుస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. కడుపు నిండిన జేపీకి కడుపు ఎండినవారి గురించి ఆలోచించే సమయం ఉండదని, అందుకే వైఎస్సార్సీపీ ప్రకటించిన ‘అమ్మ ఒడి’ అర్థం కాలేనట్లుందని విమర్శించారు. ఆయన మంగళవారమిక్కడి పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘ఏ తల్లికి అయినా తన బిడ్డను చదివించుకోవాలనే తపన కచ్చితంగా ఉంటుంది. కానీ బిడ్డ తనతోపాటు పనిచేస్తే ఒక పూట గడుస్తుందనే ఆశతో పిల్లల్ని పనిలో పెడుతున్నారే తప్ప బడికి పంపకూడదని కాదు. అందుకే అలాంటి తల్లులకు భరోసానిస్తూ పిల్లల్ని పెద్ద చదువులు చదించేందుకు అమ్మ ఒడి పథకానికి జగన్ రూపకల్పన చేశారు’’ అని వివరించారు. పేదవారి గుండె చప్పుడు నుంచి రూపొందించిన మేనిఫెస్టో కూడా జేపీకి అర్థం కాలేదంటే పేదవాళ్లకు ఆయన ఎంత దూరంగా ఉంటున్నారో అర్థమవుతోందని పేర్కొన్నారు. తనకు తాను గొప్ప మేధావినంటూ సొంత డబ్బా కొట్టుకుంటూ తెలుగుదేశం పార్టీకి భజనపరుడిగా మారారని ధ్వజమెత్తారు. -
జేపీ ఉగ్రవాది కంటే ప్రమాదకారి: టీ.లోక్సత్తా
హైదరాబాద్: లోక్సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఉగ్రవాది కంటే చాలా ప్రమాదకారుడని తెలంగాణ లోక్సత్తా అధినేత కంచర్ల ధర్మారెడ్డి దుయ్యబట్టారు. ఆర్థిక నేరాలలో ఆరితేరిన జేపీ యువతను మాయ మాటలతో తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఒక ఛానల్ స్టింగ్ ఆపరేషన్లో ఢిల్లీ లోక్సత్తా అధ్యక్షుడు అనురాగ్ కేజ్రీవాల్ సంభాషణల ఆధారంగా ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ధర్మారెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జేపీ మంచివ్యక్తి అనే ముసుగులో దాగి ఉన్న ఒక గజదొంగ అని ఆయన ఆరోపించారు. లోక్సత్తా అనే గజదొంగల పార్టీకి తెర ముందు జేపీ కనిపించినా...తెరవెనుక నడిపించేది మొత్తం ‘ఈనాడు’ అధినేత రామోజీరావు అని ఆయన పేర్కొన్నారు. తమ సామాజికి వర్గానికి చెందిన చంద్రబాబు ఫెయిల్ అయితే జేపీని తెరపైకి తెచ్చి ఫోకస్ చేయడానికే ఇదంతా రామోజీరావు చేస్తున్న డ్రామా అని ఆయన వివరించారు. విద్యార్థులు, యువత జేపీ మాయ మాటలకు మోసపోవద్దని కంచర్ల విజ్ఞప్తి చేశారు. -
తెలుగుతేజం యాత్ర వాయిదా వేసుకున్న జేపీ
లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ చేపట్టిన తెలుగుతేజం యాత్రకు అనంతపురంలో సమైక్యసెగ తగిలింది. నగరంలోని ఓ ప్రైవేటు కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన రౌండ్టేబుల్ సమావేశానికి హాజరైన జేపీని సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సమైక్యవాదులను చెదరగొట్టారు. రెచ్చిపోయిన సమైక్యవాదులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. చివరకు భారీ పోలీస్ బందోబస్తు మధ్య జేపీ సమావేశానికి హాజరయ్యారు. సమైక్యవాదులు మాత్రం అక్కడే భైఠాయించి నిరసన తెలిపారు. సమైక్యాంధ్ర అన్న తర్వాతే ఈ ప్రాంతంలో సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో జయప్రకాష్ నారాయణ యాత్రను వాయిదా వేసుకున్నారు. -
భాషా సామరస్య సదస్సులో జయప్రకాష్ నారాయణ్
వ్యవస్థలో మార్పుతోనే హక్కుల పరిరక్షణ సాధ్యమని లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ అన్నారు. సంక్షోభంలో ఉన్న తెలుగుజాతిని సమన్వయపరిచే రీతిలో పరిష్కార మార్గాన్ని అన్వేషించాల్సి ఉందన్నారు. విద్యార్థుల అభిరుచుల మేరకు భాషల ఎంపికను వదిలి పెట్టాలని సూచించారు. జేపీ ప్రసంగి స్తున్న సమయంలో సమైక్యవాదులు నినాదాలు హోరెత్తించారు. సాక్షి, చెన్నై: సేవ సంస్థ నేతృత్వంలో భాషా సామరస్యం - భారత ప్రజాస్వామ్యం అనే అంశంపై జాతీయ సదస్సు చెన్నైలోని ఆస్కా ఆవరణలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ్ ప్రసంగించారు. భాష పుట్టుక, అభివృద్ధి, చీలికలు, టెక్నాలజీ ప్రభావంతో వస్తున్న మార్పులను విశదీకరించారు. దేశంలో 122 భాషలు ఉన్నాయని, వీటిలో 22 ప్రాముఖ్యం పొందాయని తెలిపారు. ఒక భాష ఆ ప్రాంత సంస్కృతి, హక్కులను ఎలుగెత్తి చాటుతుందని పేర్కొన్నారు. అయితే అనేక భాషలు కనుమరుగు అవుతుండడం ఆవేదన కలిగి స్తోందన్నారు. సంస్కృతి సంపద్రాయాల్ని గౌరవించడంలో, భాషా సామరస్యాన్ని చాట డం లో తమిళులు ముందు వరుసలో ఉంటారని కితాబిచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో అల్ప సంఖ్యాక భాషలకు ఉన్న హక్కుల్ని ఈ సందర్భంగా వివరించారు. విద్యా పరంగా భాషల ఎంపిక బాధ్యతను విద్యార్థులకే వదిలి పెట్టాలని సూచించారు. అప్పుడే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్నారు. తరిమి కొడదాం కులం, మతం, వెనుకబాటుతనం, మూడ నమ్మకాల జెంజాటం నుంచి ఈ సమాజం బయటపడాలని జేపీ సూచించారు. సుపరిపాలన చూడాలన్నా, అన్ని రకాల హక్కులకు రక్షణ కావాలన్నా వ్యవస్థల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా భారత ఎన్నికల వ్యవస్థలో మార్పు తప్పనిసరని పేర్కొన్నారు. పక్షపాత, అవకాశవాద రాజకీయాలకు చరమ గీతం పాడే రీతిలో ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. గౌరవిద్దాం ఒకరి భాషను మరొకరు గౌరవించాల్సిన అవసరం ఉందని జేపీ తెలిపారు. ఓ ప్రాంతంలో ఉన్న మెజారిటీ భాషకు ఎలాంటి నష్టమూ కలగకుండా కాపాడాల్సిన అవసరం ఉందని సూచించారు. తమిళనాడులోని తెలుగువారు ఇక్కడి భాషకు నష్టం కలగకుండా తమ మాతృ భాషను పరిరక్షించుకునే రీతిలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలుగుజాతి సంక్షోభంలో ఉందని, అందరినీ సమన్వయ పరిచే విధంగా పరిష్కారాల్ని అన్వేషించాలని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న దురభిమానం భాష మీద అభిమానం కన్నా దురభిమానం ప్రస్తుతం పెరుగుతోందని అఖిల భారత అల్ప సంఖ్యాక భాషల ఫోరం అధ్యక్షుడు సీఎంకే రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిర్బంధ విద్యా విధానం అల్ప సంఖ్యాక భాషలపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా గతంలో తీసుకున్న నిర్ణయాల సవరణకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. రాజకీయ గంజాయి వనంలో తులసి మొక్కలాంటి వారు జేపీ అని కితాబిచ్చారు. సమైక్య సెగ జయప్రకాష్ నారాయణ్ ప్రసంగిస్తున్న సమయంలో సమైక్యవాదుల నుంచి నిరసన ఎదుర్కొన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా జేపీ నినదించాలంటూ కొందరు పట్టుబట్టారు. ఆస్కా ట్రస్టీ శ్రీనివాసులు రెడ్డి, ఐటీఏ అధ్యక్షుడు నగేష్, వైఎస్ఆర్సీపీ అభిమాని కె.రవీం ద్రనాథ్రెడ్డి తదితరులు ప్లకార్డు చేతబట్టి నిరసన తెలిపారు. జేపీ స్పందిస్తూ తెలంగాణ ఇవ్వాలన్న ఆలోచనే దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి లేదన్నారు. తెలంగాణలో కన్నా సీమాంధ్రలోనే అత్యధిక సీట్లు వస్తాయన్న విషయం ఆయనకు తెలుసునన్నారు. అందుకే తెలంగాణ ఇవ్వాలన్న ఆలోచనే ఆయనకు లేదని వివరించారు. ప్రత్యేక రాష్ట్రాలతో అద్భుతాలు సృష్టించలేమని, దీని వల్ల పెద్ద ప్రమాదమూ లేదని అన్నారు. తెలంగాణ వస్తే పదో తరగతి చదువుకున్నోడికీ ఉద్యోగాలు వస్తాయనడం దేవుడికే ఎరుకా అంటూ చమత్కరించారు. అగ్గి పెట్టెల్ని తయారు చేసినంత సులువుగా హైదరాబాద్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తామని చెబుతున్నారన్నారు. హైదరాబాద్ ప్రరుువేటు ఆస్తి కాదని, అందరి సొత్తు అన్నది గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సేవ అధ్యక్షుడు డి.సత్యనారాయణ, సేవ విద్యా కమిటీ చైర్మన్ అనిల్కుమార్రెడ్డి, సేవ ప్రతినిధులు తంగుటూరి రామకృష్ణ, ఆదిశేషయ్య, పుట్టా జయరాం, విజయేంద్ర రావు, సీనియర్ జర్నలిస్టు ఎస్.వి.సూర్యప్రకాష్రావు తదితరులు పాల్గొన్నారు.