-
టాలీవుడ్లో విషాదం.. గుండెపోటుతో దర్శకుడు మృతి
ప్రముఖ జర్నలిస్ట్, సినీ దర్శకుడు కె. జయదేవ్ సోమవారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్లో మృతి చెందారు. పలు షార్ట్ ఫిలింస్కి దర్శకత్వం వహించిన జయదేవ్ ‘కోరంగి నుంచి’ (2022) అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎఫ్డీసీ) నిర్మించింది. మంచి చిత్రాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎన్ఎఫ్డీసీ ప్రతి ఏడాది కొన్ని చిత్రాలకు ఫండింగ్ ఇస్తుంది. అందులో భాగంగా ‘కోరంగి నుంచి’కి కోటి రూపాయల ఫండింగ్ ఇచ్చారు. 25 ఏళ్ల తర్వాత నటి అర్చన ఈ సినిమాలో నటించటం విశేషం. ఈ చిత్రం పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ప్రముఖ దర్శకుడు, జర్నలిస్టు కేఎన్టీ శాస్త్రికి జయదేవ్ చిన్న కుమారుడు. గతంలో ఎన్ఎఫ్డీసీ నిర్మించిన ‘తిలదానం’ చిత్రదర్శకుడు కేఎన్టీ శాస్త్రి అనే సంగతి తెలిసిందే. జయదేవ్కు భార్య యశోద, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
చిత్తూరులో రూ.250 కోట్లతో.. అమరరాజా కొత్త ప్లాంట్
సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా తేనిపల్లి వద్ద రూ.250 కోట్లతో కొత్త తయారీ యూనిట్ను ఏర్పాటుచేస్తున్నట్లు అమరరాజా గ్రూపు ప్రకటించింది. అమరరాజా గ్రూపునకు చెందిన మంగళం ఇండస్ట్రీస్ 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటో బ్యాటరీ విడిభాగాల తయారీ యూనిట్ను ఏర్పాటుచేస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ యూనిట్ ద్వారా దేశంలోని ప్రముఖ కంపెనీలకు సరఫరా చేసేలా ఆటో విడిభాగాలు, మెటల్ ఫాబ్రికేషన్, బ్యాటరీ విడిభాగాలను డిజైన్ చేసి సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. ఇక ఈ ప్రాంతంలో తమ వ్యాపార విస్తరణకు కట్టుబడి ఉన్నట్లు కూడా అమరరాజా గ్రూపు సహ వ్యవస్థాపకుడు జయదేవ్ గల్లా ఆ ప్రకటనలో స్పష్టంచేశారు. స్థానికులకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని, రానున్న కాలంలో ఈ కొత్త యూనిట్ ఏర్పాటు ద్వారా మరో 1,000 మంది స్థానికులకు ఉపాధి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. అమరరాజా గ్రూపు 15,000 మందికి ఉపాధి కల్పిస్తుండగా అందులో మంగళం గ్రూపు 3,000 మందికి ఉపాధి కల్పిస్తోందన్నారు. ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టి మరోవైపు.. సుస్థిర ఇంధన అవకాశాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని, ఇందులో భాగంగా సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన పరికరాల ఉత్పత్తిపై దృష్టిసారిస్తున్నట్లు మంగళం ఇండస్ట్రీస్ డైరెక్టర్ హర్షవర్థన్ గోగినేని కూడా ఆ ప్రకటనలో తెలిపారు. ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. (చదవండి: రాష్ట్రంలో తొలి టెన్నిస్ అకాడమీ) -
యాక్షన్ థ్రిల్లర్గా ‘నరేంద్ర’
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి టాప్ స్టార్లను డైరెక్ట్ చేసిన స్టైలిష్ డైరెక్టర్ జయంత్ సీ పరాన్జీ. కమర్షియల్ ఎంటర్టైనర్లతో ఆకట్టుకున్న జయంత్ కొంత కాలంగా సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. చివరగా గంటా రవితేజను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన జయదేవ్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు జయంత్. మరోసారి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన నిలేష్ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు జయంత్. ‘నరేంద్ర’ అనే టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈషన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతోంది. -
మనసుల్ని కదిలించే సినిమా!
‘‘నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఓ పోలీసాఫీసర్ కథే ‘జయదేవ్’. సినిమా చూసిన ప్రేక్షకులు ‘మనసుల్ని కదిలించే సినిమా తీశారు’ అంటుంటే హ్యాపీగా ఉంది’’ అన్నారు నిర్మాత కె. అశోక్కుమార్. గంటా రవి హీరోగా జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘జయదేవ్’ శుక్రవారం విడుదలైంది. అశోక్కుమార్ మాట్లాడుతూ – ‘‘మౌత్ టాక్ బలంగా ఉండడంతో షో షోకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. విధి నిర్వహణలో పోలీసులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు కుటుంబాల పరిస్థితి ఏంటి? అనే అంశాలతో పాటు పోలీస్ త్యాగాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిన్మాకు మంచి స్పందన లభిస్తోంది. డ్రగ్స్ కారణంగా యువతకు ఎంత చేటు జరుగుతోంది? ఈ సమస్యను మానవత్వ కోణంలో జయదేవ్ ఎలా పరిష్కరించాడు? అనేది ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది. త్వరలో పోలీసులకు స్పెషల్ షో వేయనున్నాం’’ అన్నారు. ‘‘కథలో మంచి మెసేజ్, ఎమోషన్ ఉండటంవల్లే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు’’ అన్నారు గంటా రవి. -
జయదేవ్ సినిమా పోస్టర్ల చించివేత
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement