breaking news
Jangalu bubble
-
చెప్పింది చేసే ఏకైక సీఎం జగన్
భవానీపురం (విజయవాడ పశ్చిమ): చెప్పింది చేసే ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఇచ్చి న మాట ప్రకారం బేడ (బుడ్గ) జంగాలను ఎస్సీ కులాల జాబితాలో చేరుస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం సాహసోపేతమైన నిర్ణయం అని బేడ (బుడ్గ) జంగాల నేతలు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీఎం వైఎస్ జగన్కు బేడ (బుడ్గ) జంగాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. సామాజిక సాధికారత కోసం ఆలోచన చేసే ఏకైక సీఎం జగన్ అన్నారు. సంచార జాతులైన బేడ (బుడ్గ) జంగం కులాలకు గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మంచి చేశారని, తరువాత వచ్చి న ప్రభుత్వాలు వారిని నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. మళ్లీ సీఎం జగన్ వారికి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. పెత్తందార్ల వ్యవస్థను చంద్రబాబు ప్రోత్సహిస్తే.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలందరూ నావాళ్లే అనుకునే నాయకుడు సీఎం జగన్ అన్నారు. పేదలు ఏ కులంలో ఉన్నా వారికి మేలు చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. మా కళను గుర్తించాలి ఏపీ రాష్ట్ర బేడ (బుడ్గ) జంగం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఎలమర్తి మధు మాట్లాడుతూ.. ఎస్సీల్లో చేర్చే అంశంపై పార్లమెంట్లో కూడా తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ కులాల్లోని కళను గుర్తించి గుమ్మెట తంబూర కళాకారులకు పింఛన్ మంజూరు చేయాలని, శ్రీశైలంలో తమ సామాజికవర్గీయుల అన్నదాన సత్రానికి స్థలం కేటాయించాలని కోరారు. పేదల పక్షాన ఈ ప్రభుత్వం: సజ్జల సభకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గడిచిన నాలుగేళ్లలో ఆర్థిక, సామాజిక, రాజకీయంగా వెనుకబడిన అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం మేలు చేసిందని చెప్పారు. ఓట్ల కోసం రాజకీయం చేసే వ్యక్తి చంద్రబాబు అయితే.. అట్టడుగు వర్గాల ప్రజల కోసమే రాజకీయం అన్న వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అన్నారు. తండ్రి బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారని, ఆయన వద్ద చేయిచాచాల్సిన పని లేదని, హక్కుగా ఆయన దగ్గరకు రావచ్చన్నారు. గతంలో సంపన్న వర్గాలకు మాత్రమే ఫ్యామిలీ డాక్టర్ ఉండేవారని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ ఉండేలా ఏర్పాటు చేశారని అన్నారు. రోగాల పేరుతో జైలు నుంచి తాత్కాలిక బెయిల్పై విడుదలైన చంద్రబాబు వెనుక పెత్తందార్లు తప్ప బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు మాట్లాడారు. బీజెహెచ్పీఎస్ వ్యవస్థాపకులు సిరిగిరి మన్యం అధ్యక్షత వహించిన ఈ సభలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చి న బేడ, బుడ్గ, జంగం కులాల నాయకులు పాల్గొన్నారు. -
సీమాంధ్ర బుడగ జంగాలకు ఎస్సీ హోదా ఇవ్వాలి
భారతదేశ సంస్కృతిని భావితరాలకు అందిస్తూ పురాణ గాథలను కళారూపాల్లో ప్రదర్శిస్తూ జీవనం సాగించే జాతిలో ‘బుడగ జంగం’ కులం ఒకటి. ఢిమికీ, తంబూర, అందెల సహాయంతో వీరు ఊరూరా తిరుగుతూ కథలు చెబుతారు. పూర్వం నుంచి కళను ఉపాధిగా చేసుకుని బతికే వీరు నేడు వాటికి ఆదరణ తగ్గిపోవడంతో భిక్షాటన చేస్తూ పొట్ట పోషించుకుంటున్నారు. గ్రామాల్లో ఉపాధి లేక పట్టణ ప్రాంతాలకు వలసపోతున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లు అవుతున్నా చట్ట సభల్లో ఇప్పటికీ వీరికి ప్రాతినిధ్యం లేదు. నిజాం స్టేట్లో షెడ్యూలు కులంగా గుర్తింపు పొందిన బుడగ జంగాలను 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా ఎస్సీలుగా ధ్రువీకరిం చింది. అప్పటికీ బుడగ జంగాలు కేవలం తెలంగాణ ప్రాంతానికి పరిమితమయ్యారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన సమయం లో కూడా బుడగ జంగం కులస్తులు తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువ గా ఉన్నందున ఇక్కడ వీరిని ఎస్సీలుగా గుర్తించింది. అనంతరం బుడగ జంగాలు పెద్ద సంఖ్యలో ఆంధ్ర, రాయలసీమ జిల్లాలకు వలసపోయారు. సంచార జీవితం గడిపే వీరు పక్క రాష్ట్రాలకు కూడా వలసపోయారు. ఈ నేపథ్యంలో 1976లో రాష్ట్ర ప్రభుత్వం 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు సవరణ జరిపి ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా బుడగ జంగాలు ఉన్నారని, వారికి కూడా తెలంగాణలో మాదిరి గా ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. నాటి నుంచి 2008 వరకు అంటే 32 ఏళ్లపాటు ఆంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలో బుడగ జంగాలు ఎస్సీలుగానే పరిగణించబడ్డారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఇతర కులస్తులు కొందరు అక్రమంగా బుడగ జంగం కుల ధ్రువీకరణ పత్రాలు సంపాదించి ప్రభు త్వ ఉద్యోగాలు పొందిన విషయం వెలుగుచూసింది. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు మాల రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులు కుట్రతో ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బుడగ జంగాలు లేరని అక్కడ కులధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దని ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా 2008లో ప్రభుత్వం జీవో 144ను వెలువరించి బుడగ జంగాలకు తెలంగాణలోని 10 జిల్లాల పరిధిలోనే కుల ధ్రువీ కరణ పత్రాలు ఇవ్వాలని, ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో జారీ చేయకూ డదని ఉత్తర్వులిచ్చింది. దీంతో ఇప్పుడిప్పుడే చదువుల బాట పట్టిన బుడగ జంగం విద్యార్థులు ఎస్సీ రిజర్వేషన్కు దూరమయ్యారు. అక్రమార్కులను కనిపెట్టి వారిని శిక్షించి, చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఎవరో ఆరోపించారని ఏకంగా ఒక కులం మొత్తాన్ని శిక్షిం చడం గర్హనీయం. ఇప్పటికైనా తమకు న్యాయం జరగాలని ఆంధ్రప్రదేశ్ లోని బుడగ జంగాలు కోరుకుంటున్నారు. - తూర్పాటి జె శ్రీధర్ అఖిల భారత బేడబుడగ జంగం సమాఖ్య