-
గోరటి, సుద్దాలకు జాలాది పురస్కారం
9న విశాఖలో ప్రదానం ద్వారకానగర్ (విశాఖ దక్షిణం): సినీ కవి డాక్టర్ జాలాది పేరిట ఏటా ప్రదానం చేస్తున్న జాతీయ ప్రతిభా పురస్కారాలకు.. ఈ ఏడాది సుప్రసిద్ధ ప్రజాకవి, గాయకుడు గోరటి వెంకన్న, ప్రముఖ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్తేజను ఎంపిక చేసినట్లు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాలాది జయంతి ఉత్సవాలకు సంబంధించిన వాల్పోస్టర్ను మంత్రి గంటా ఆవిష్కరించారు. ఈ నెల 9న విశాఖలోని సిరిపురం ‘వుడా చిల్డ్రన్ ఎరీనా’లో నిర్వహించే జాలాది జయంతి ఉత్సవాల్లో ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. -
జానపద జాబిలి జాలాది
–నేడు 9న జాలాది జయంతి – శరత్బాబు, చంద్రబోస్కు సత్కారం ఎన్ఏడీ జంక్షన్ : జాలాది అంటే జానపదమే గుర్తుకు వస్తుంది. ‘ఏతమేసి తోడినా ఏరు ఎండదు... పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు’... ‘బండెల్లిపోతోంది సెల్లెలా.. బతుకు బండెల్లి పోతోంది సెల్లెలా’.. ఇలా ఎన్నో... ఎన్నెన్నో జానపదాలు ఆయన కలం నుంచి జాలువారాయి... జానపదమే కాకుండా పుణ్యభూమి నాదేశం నమోనమామీ... ధన్యభూమి నాదేశం సదా స్మరామి... అంటూ దేశభక్తిని చూపి ధన్యజీవి అయ్యారు మన జాలాది. ఆయనది ఆదర్శ జీవితం. తండ్రితరం నుంచి కులాంతర వివాహాలు చేసుకున్న సంప్రదాయం వారిది. ఇమ్మానియల్ (జాలాది నారాయణ చౌదరి), అమతమ్మ దంపతులకు ఐదో సంతానంగా జాలాది రాజారావు జన్మించారు. చిన్నప్పటి నుంచే కుల వివక్షకు గురై ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అందుకే ఆయన కలం నుంచి జాషువా శైలి తొంగిచూస్తుంటుంది. జాలాది తన పాటల ద్వారా సమాజంలో ఉన్న అసమానతలపై పోరాడారు. ఆగస్టు 9న ఆయన జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. బాల్యం, విద్యాభ్యాసం కృష్ణా జిల్లా గుడివాడ ప్రాథమిక పాఠశాలలో అక్షరాభ్యాసం చేశారు. ఇక్కడ ఆయనకు కులం అడ్డుగోడైంది, పాఠశాలలోకి రానివ్వకుండా బయట కూర్చొని ఇసుకలో అక్షరాలు దిద్దమనేవారు. ఇలా ఇబ్బందులతోనే ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. అప్పటికే ఆయన చిన్నచిన్న కవితలు రాయడం మొదలుపెట్టారు. ఉపాధ్యాయులు పండగలు, విశిష్టమైన రోజుల్లో మంచి పాట రాయరా రాజా అని అడిగేవారట. డ్రాయింగ్ మాస్టారుగా.. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం రాయివలసలో డ్రాయింగ్ మాస్టారుగా ఉద్యోగంలో చేరారు. అందరిచే రాయివలస మాస్టారుగా మన్ననలు పొందారు. ఇలా ఆయన ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. ఉద్యోగం చేస్తూనే వయోజన విద్య, నాటకాలు, నాటికలు రచనలు నిర్వహణ చేసేవారు. 1968లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. మరఫురాని పాటలు సినీరంగంలో ప్రవేశించిన ఆయన మరఫురాని పాటలను అందించారు. ప్రాణం ఖరీదు సినిమాలో ‘ఏతమేసి తోడినా ఏరు ఎండదు... పొగిలి పొగిలి ఏడ్చినా పొంతనిండదు’ పాటలో మనిషి జీవితంలో తారసపడే జీవిత సత్యాలు దొరుకుతాయి. పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా... పసుపు తాడు ముడులేస్తే ఆడదాయిరా... బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తెలుసుకో... గొడ్డుకాదు ఆడదనే గుణం తెలుసుకో... అందరూ నడిచొచ్చే తోవ ఒక్కటే... సీము నెత్తురు పారే తూము ఒక్కటే... కూతనేర్చి నోల్ల కులం కోకిలంటరా... ఆకలేసి అరిసినోల్లు కాకులంటరా... ఈ పాటలు ఈ నాటికీ జనం హదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ‘బండెల్లిపోతోంది సెల్లెలా.. బతుకు బండెల్లి పోతోంది సెల్లెలా’ పాట బతుకు చిత్రాన్ని చూపిస్తోంది. పుణ్యభూమి నాదేశం నమో నమామి.. ధన్యభూమి నాదేశం సదా స్మరామి పాట జాతీయ దినాల్లో ఏవేదికమీదైనా వినిపిస్తోంది. నేను రచయితని... నేను కవిని కాను రచయితని మాత్రమేనని చాలా వేదికల్లో జాలాది స్పష్టం చేశారు. వాస్తవాలకు దూరంగా ఊహాజనితంగా కవి రచనలు ఉంటాయి. రచయిత రాసినవి వాస్తవాలకు జీవితాలకు దగ్గరగా ఉంటాయన్నది ఆయన వాదన. ఈయన వాదంలో వాస్తవమున్నది. ఇందుకు ఆయన పాటలే ఉదాహరణగా నిలుస్తాయి. ఈయన సుమారు 280 సినిమాలకు 1200 పాటలు పాటలు రాశారు. ఎన్టీఆర్, మోహన్బాబు సినిమాలకు ఎక్కువ పనిచేశారు. చాలా పాటలకు నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఉత్తమ పాటల రచయితగా ప్రశంసలు పొందారు. నచ్చిన కవులు శ్రీశ్రీ రచనలంటే చాలా ఇష్టమంటారు ఆయన. కొసరాజువంటి కవుల్ని ఆయన ఆరాదించేవారు. అయితే వీరి ప్రభావం లేకుండా తనదైన శైలిలో రచనలు చేశారు. రచనలు జాలాది పలు కవితలు, నాటికలు, బుర్రకథలు రాశారు. అమర జీవి, తండ్రి సమాధి, కారుమేఘాలు, గాజుపలకలు, విశ్వమోహిని, వంటి పలు రచనలు చేశారు. తుది మజిలి జీవీఎంసీ 42వ వార్డు శాంతినగర్లో ఉన్న కుమారుడు శ్రీనివాసరావు వద్ద చివరి మజిలీ గడిచింది. 2011 అక్టోబర్ 14న తుదిశ్వాస విడిచారు. అప్పటినుంచి జాలాది చారిటబుల్ ట్రస్ట్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. కళాకారులను గౌరవిస్తూ కళారంగానికి సేవచేస్తున్నారు. నేడు జయంత్యుత్సవాలు కళాభారతి ఆడిటోరియంలో జాలాది జయంత్యుత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినీ నటుడు శరత్బాబు, పాటల రచయిత చంద్రబోస్కు ఈ సందర్భంగా సత్కరించనున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి జాలాది రాజారావు కుమార్తె జాలాది విజయ ఒక ప్రకటనలో తెలిపారు. -
శరత్ బాబు, చంద్రబోస్లకు జాలాది పురస్కారాలు
విశాఖ :సుప్రసిద్ధ సినీ గేయ రచయిత డాక్టర్ జాలాది పేరిట జాలాది చారిటబుల్ ట్రస్ట్ విశాఖపట్నంలో నెలకొల్పిన జాతీయ స్థాయి పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల 9 సాయంత్రం ఇక్కడి కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించనున్నట్టు ఆంధ్ర విశ్వకళా పరిషత్ రిజిస్ట్రార్ ఆచార్య వెలగపూడి ఉమామహేశ్వర రావు వెల్లడించారు. శనివారం ఆయన స్థానిక హోటల్లో విలేకర్లతో మాట్లాడారు. జాలాది 85వ జయంతి సందర్భంగా ఈ ఏడాది నుంచి కొత్తగా జాతీయ స్థాయి ప్రతిభకు కొలమానంగా ఏర్పాటు చేసిన ‘జాలాది జీవన సాఫల్య పురస్కారం–2016’కు విలక్షణ నటుడు శరత్ బాబును తమ నిపుణుల కమిటీ ఎంపిక చేసిందన్నారు. ప్రఖ్యాత సినీ గేయ రచయిత చంద్రబోస్ను జాలాది ఆత్మీయ పురస్కారానికి ఎంపిక చేశామని చెప్పారు. ఆ రోజు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాస రావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, పల్లె రఘునాథ రెడ్డి, శాసనమండలి సభ్యుడు ఎంవీవీఎస్ మూర్తి తదితరులు అతిథులుగా హాజరై పురస్కార ప్రదానం చేయనున్నట్టు రిజిస్ట్రార్ వివరించారు. జాలాది చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాలాది విజయ మాట్లాడుతూ కవి జాలాది వంశాంకురాలైన తామ తోబుట్టువుంతా కలసి ఏర్పాటు చేసుకున్న ఈ ట్రస్ట్ ద్వారా 2012 నుంచి తెలుగు రాష్ట్రాల పరిధిలో పురస్కార ప్రదానోత్సవాలతోపాటు, విభిన్న సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచి జాతీయ పురస్కారం కింద రూ. 50వేల నగదు, సన్మానం ఉంటుందని వివరించారు. లోగడ ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలందుకున్నవారిలో దర్శకులు పీసీ రెడ్డి, కళ్లు రఘు, స్టార్ మేకర్ లంక సత్యానంద్, గేయ రచయితలు భువనచంద్ర, రసరాజు, అదష్ట దీపక్, గురు చరణ్, సంభాషణ రచయితలు ఎంవీఎస్ హరనాథ రావు, కాశీ విశ్వనాథ్. నిరాత పోకూరి బాబూరావు, నటి అర్చన వంటి ప్రముఖులున్నారని వివరించారు. తమ తండ్రి ఆశయ సిద్ధి కోసం కంకణబద్ధులమై జాలాది ట్రస్ట్ ద్వారా బహుముఖ సేవలందించడంతోపాటు జాలాది విరచిత గీతాలతో సినీ సంగీత విభావరి నిర్వహించనున్నట్టు ఆమె పేర్కొన్నారు. తాము ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిర్వహించే ఈ కార్యక్రమాన్ని కళాప్రియులంతా ఉచితంగా ఆస్వాదింవచ్చని ఆమె సూచించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement