-
ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ప్రేక్షకులు 'ఆదిపురుష్' నామం జపిస్తున్నారు. ఎవరినీ పలకరించినా జై శ్రీరామ్ అనే పదమే వినిపిస్తోంది. ఎందుకంటే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రామాయణం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి రాముడిగా నటించడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే స్థాయిలో చిత్రబృందం సైతం ప్రమోషన్లలో భాగంగా భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగులో రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు గతంలో చాలానే వచ్చాయి. కానీ అప్పటి స్టార్ హీరోలు సైతం రాముడి పాత్రలో కనిపించారు. వెండితెరపై రాముడిగా మెప్పించినవారిలో నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్తో పాటు అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, శోభన్బాబు సైతం రాముడి పాత్ర పోషించారు. మరీ రాముడి పాత్రలో ఎవరు చక్కగా ఒదిగిపోయారు? రాముడి వేషధారణలో అచ్చం రాముడే అనిపించేలా ఎవరు మెప్పించారు? అలా వెండితెరపై మొదటిసారి రాముడిగా ఎవరు కనిపించారు? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి. (ఇది చదవండి: విడాకులు తీసుకున్న నటి.. నేను సరైన పనే చేస్తున్నా) తొలిసారి రాముడిగా ఆయనే.. సినీరంగంలో చాలామంది అగ్రనటులు రాముడిగా కనిపించినా.. తొలిసారి తెరపై రాముడిగా కనిపించింది మాత్రం నటుడు యడవల్లి సూర్యనారాయణనే. 1932లో విడుదలైన పాదుకా పట్టాభిషేకం చిత్రంలో రాముడిగా కనిపించారు. బాదామి సర్వోత్తం దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండో తెలుగు చిత్రంగా తెరకెక్కింది. ఆ తర్వాత ఇదే పేరుతో 1945లో విడుదలైన చిత్రంలో సీఎస్ఆర్ ఆంజనేయులు రాముడిగా కనిపించారు. తొలి చిత్రంలోనే రాముడిగా అక్కినేని శ్రీ సీతారామ జననం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు రాముడిగా కనిపించారు. 1944లో వచ్చిన ఈ సినిమాలో ఆయన పూర్తిస్థాయి కథానాయకుడిగా నటించారు. తొలి సినిమా అయినా వెండితెరపై రాముడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా ఘంటసాలకు కూడా ఇది తొలిచిత్రం కావడం విశేషం. రాముడంటే ఆయనే అనేలా.. తెలుగు సినిమాల్లో రాముడు అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఆయనదే. ఆయనే నట విశ్వరూపం నందమూరి తారకరామారావు. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణంలో తొలిసారి రాముడిగా కనిపించారు. ఆ తర్వాత లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రాల్లోనూ రాముడి పాత్ర పోషించారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన శ్రీరామ పట్టాభిషేకం సినిమాలోనూ రాముడి పాత్రలో కనిపించారు. ఎన్టీఆర్ను రాముడిలా తెరపై కనిపిస్తే ప్రేక్షకులు థియేటర్లలో స్క్రీన్కే హారతులు ఇచ్చారంటే ఆయన ఎంతలా ఒదిగిపోయాడో తెలుస్తోంది. రావణుడిగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘సీతారామ కల్యాణం’ సినిమాలో నటుడు హరనాథ్ రాముడి పాత్ర పోషించారు. 1961లో విడుదలైన ఈ మూవీలో రావణుడిగా రామారావు నటించారు. ఆ తర్వాత 1968లో విడుదలైన ‘శ్రీరామకథ’ సినిమాలోనూ హరనాథ్ రాముడిగా కనిపించారు. ఒక్కసారైనా ఒదిగిపోయారు.. తెలుగు సినీరంగంలో అందగాడైన హీరో శోభన్బాబు ఓ చిత్రంలో రాముడిగా కనిపించారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంపూర్ణ రామాయణంలో రాముడి పాత్ర పోషించారు. 1971లో వచ్చిన ఈ సినిమాలో రావణుడి పాత్రలో ఎస్వీ రంగారావు ఆకట్టుకున్నారు. 1968లో వచ్చిన వీరాంజనేయ చిత్రంలో కాంతారావు రాముడిగా కనిపించారు. 1976లో బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సీతా కల్యాణం సినిమాలో నటుడు రవికుమార్ రాముడిగా ఒదిగిపోయారు. (ఇది చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్కు షాక్.. ఆ థియేటర్లలో ఆదిపురుష్ రిలీజ్ లేనట్లేనా?) బాల రాముడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్ మనవడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో మెప్పించారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాల రామాయణం’లో జూనియర్ నటించారు. 1997లో వచ్చిన ఈ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు, రెండు నంది అవార్డులను దక్కించుకుంది. రామదాసులో సుమన్.. దేవుళ్లులో శ్రీకాంత్.. శ్రీ రామరాజ్యంలో బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు కూడా రాముడి పాత్ర పోషించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ రామదాసు’లో సుమన్ రాముడిగా ఆకట్టుకున్నారు. అలాగే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవుళ్లు’ చిత్రంలోని ఓపాటలో శ్రీకాంత్ రాముడిగా కనిపించారు. నందమూరి బాలకృష్ణ సైతం ఓ చిత్రంలో రాముడిగా కనిపించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీ రామరాజ్యంలో మెప్పించారు. 2011లో వచ్చిన మూవీలో సీతగా నయనతార ఆకట్టుకుంది. ఆదిపురుష్లో ప్రభాస్ అయితే ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో రాముడి పాత్రలో అలనాటి హీరోలు అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే అప్పటి రామాయణానికి.. ఇప్పుడు తెరకెక్కిన రామాయణానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే అప్పట్లో ఇంతలా సాంకేతికపరమైన టెక్నాలజీ లేదు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణానికి ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు. ఈ చిత్రాన్ని గ్రాఫిక్స్, సరికొత్త హంగులతో తీర్చిదిద్దారు. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఆదిపురుష్లో ప్రభాస్ రూపంలో ఉన్న రాముడు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో తెలియాలంటే తెరపై చూడాల్సిందే. రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించనుండగా.. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న ఆదిపురుష్ థియేటర్లలో సందడి చేయనుంది. -పిన్నాపురం మధుసూదన్ -
జై శ్రీరామ్.. జై శ్రీరామ్
‘నీ సాయం సదా మేమున్నాం.. సిద్ధం సర్వ సైన్యం.. సహచరులై పదా వస్తున్నాం. సఫలం స్వామి కార్యం’ అంటూ ‘జై శ్రీరామ్’ నామం ప్రతిధ్వనించేలా ‘ఆదిపురుష్’ చిత్రం నుంచి ఓ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రభాస్ టైటిల్ రోల్లో ఓం రౌత్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆదిపురుష్’. శనివారం ఈ చిత్రం నుంచి 60 సెకన్ల ‘జై శ్రీరామ్’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. అజయ్–అతుల్ స్వరపరిచిన ఈ గీతాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేశారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి రాశారు. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 16న రిలీజ్ కానుంది. -
జై శ్రీరాం నినాదాలపై ఐపీఎస్ అధికారి వ్యాఖ్యలు
తిరువనంతపురం : జై శ్రీరాం అంటూ ప్రజలు గట్టిగా నినదించాలని సస్పెండ్ అయిన కేరళ డీజీపీ జాకబ్ థామస్ అన్నారు. మనం జై శ్రీరాం అని గట్టిగా నినదించలేని పరిస్థితికి వచ్చామా అని ఆయన వ్యాఖ్యానించారు. జై శ్రీరాం నినాదాన్ని మరింత గట్టిగా నినదించాల్సిన సమయం ఇదేనని అన్నారు. త్రిసూర్లో జరిగిన రామాయణ ఫెస్ట్ కార్యక్రమంలోథామస్ మాట్లాడుతూ రాముడిని కీర్తించలేని పరిస్థితులకు మనం చేరామా అని అన్నారు. రాముడిని కీర్తించలేని స్ధితికి మన మనసులు చేరాయంటే అవి ఎంత కలుషితమయ్యాయో ఆలోచించాలని ఆయన చెప్పుకొచ్చారు దేశవ్యాప్తంగా పలుచోట్ల జై శ్రీరాం నినాదాలు చేయనందుకు దాడులు జరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో థామస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ఓఖి తుపాన్ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలను విమర్శించడంతో థామస్పై 2017 డిసెంబర్లో కేరళ ప్రభుత్వం వేటువేసింది. మరోవైపు ఏడాదిన్నరగా సస్పెన్షల్లో ఉన్న థామస్ను ఆయనకు తగిన పదవిలో తిరిగి నియమించాలని సెంట్రల్ అడ్మినిస్ర్టేటివ్ ట్రిబ్యునల్ ఎర్నాకుళం బ్రాంచ్ ఉత్తర్వులు జారీ చేసింది -
జై శ్రీరాం అనలేదని 15 ఏళ్ల బాలుడికి నిప్పు
లక్నో : జై శ్రీరాం అంటూ నినదించలేదని ఓ 15 ఏళ్ల ముస్లిం బాలుడికి నలుగురు వ్యక్తులు నిప్పంటించిన ఘటన యూపీలోని చందౌలీ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనలో 60 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న బాలుడిని కబీర్ చౌరా ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. జై శ్రీరాం అని నినదించేందుకు నిరాకరించడంతోనే తనకు నిప్పంటించారని బాలుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆస్పత్రి కెమెరాలో రికార్డయింది. మరోవైపు పోలీసులు చెబుతున్నవివరాలు బాలుడి స్టేట్మెంట్కు విరుద్ధంగా ఉన్నాయి. దుధారి బ్రిడ్జ్పై తాను వెళుతుండగా నలుగురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేశాడని, వారిలో ఇద్దరు తన చేతులను కట్టివేయగా..మరో వ్యక్తి తనపై కిరోసిన్పోసి నిప్పటించాడని, అనంతరం వారు పారిపోయారని బాధిత బాలుడు పేర్కొన్నాడు. కాగా, బాలుడు ఇంటికి చేరే సమయానికే కాలిన గాయాలయ్యాయని పోలీసులు చెబుతూ దీన్ని అనుమానిత కేసుగా పరిగణిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. -
ప్రతిపక్షాన్ని హేళన చేసిన బీజేపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘ప్రతిపక్షానికి పార్లమెంట్లో ఎంత మంది ఉన్నారన్నది ఇక్కడ ముఖ్యం కాదు. పార్లమెంట్ కార్యకలాపాల్లో ప్రతిపక్షాలు క్రియాశీలక పాత్ర వహించాలని కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో అది అత్యవసరం. కలిసికట్టుగా ముందుకు సాగి దేశాభివద్ధికి కషి చేయాలన్నది నా అభిమతం’ అని పార్లమెంట్ సమావేశాల తొలిరోజైన సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ లోపల, బయట విపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన స్ఫూర్తి విపక్షాలకు ఎంత అర్థమైందో తెలియదుగానీ పాలకపక్ష బీజేపీ ఎంపీలకు అస్సలు అర్థం కాలేదు. తెలంగాణ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణం చేయడానికి వెళుతుంటే బీజేపీ ఎంపీలు ‘జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, వందేమాతరం’ అంటూ నినాదాలు చేశారు. ప్రొటెమ్ స్పీకర్ వీరేంద్ర కుమార్ కూడా వారిని వారించలేక పోయారు. నినాదాల మధ్య మౌనంగా నడుచుకుంటూ వెళ్లిన ఒవైసీ ప్రమాణ స్వీకారం అనంతరం ‘జై భీమ్, అల్లాహు అక్బర్’ అంటూ ప్రతిగా నినాదాలు చేశారు. జై భీమ్ అంటూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరిట నినాదాలు చేయడం బీజేపీ సభ్యులను కాస్త ఇరుకున పెట్టింది. ఒవైసీ ఒక్కరి పట్లనే బీజేపీ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించలేదు. ప్రతిపక్ష సభ్యుల అందరి విషయంలో వారు అలాగే వ్యవహరించారు. సమాజ్వాది పార్టీకి చెందిన ఎంపీ షఫీకర్ రహమాన్ బార్క్ ప్రమాణ స్వీకారానికి వెళుతున్నప్పుడు కూడా బీజేపీ ఎంపీలు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. అందుకు ఆయన ప్రతిగా ‘కానిస్టిట్యూషన్ జిందాబాద్’ అంటూ నినదించారు. అదే పార్టీకి చెందిన హెచ్టీ హాసన్కు అదే అనుభవం ఎదురవ్వగా ఆయన ‘హిందుస్థాన్ జిందాబాద్’ నినదించారు. అలాగే పశ్చిమ బెంగాల్కు చెందిన తణమూల్ ఎంపీలు, తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీలు ప్రమాణం చేసినప్పుడు, అందులోనూ ప్రధాని స్ఫూర్తిదాయక వాఖ్యలు చేసిన సోమవారం నాడే బీజేపీ ఎంపీలు అనుచితంగా వ్యవహరించారు. కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ ప్రమాణం చేసిన తర్వాత హిందీలో ప్రమాణం చేసినందుకు ఆమెకు కతజ్ఞతలు తెలిపారు. అక్కడ కూడా ఆమె ఇటలీకి చెందిన వనిత అని గుర్తు చేయడమే! 543 లోక్సభ స్థానాలకు 303 స్థానాలు గెలుచుకోవడంతో పార్లమెంట్ నియమ నిబంధనలకు తాము అతీతులమని బీజేపీ ఎంపీలు భావిస్తున్నట్లు ఉంది. వారు ప్రతిపక్షం పట్ల సమభావం చూపకపోతే తమ నాయకుడు మోదీ చేసిన వ్యాఖ్యల్లో స్ఫూర్తిని వారే పాతరేసినట్లువుతుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: నేను ఏమాత్రం సంతోషంగా లేను: ప్రీతి జింటా ట్వీట్ వైరల్
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
మళ్ళీ బీజేపీదే విజయం: యూపీ డిప్యూటీ సీఎం
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement